ఓంశాంతి
దూరదేశమని దేనినంటారు అనేది పిల్లలకు తెలుసు. దీని గురించి ప్రపంచములోని మనుష్యుల్లో
ఒక్కరికి కూడా తెలియదు. ఎంత గొప్ప విద్వాంసులైనా, పండితులైనా కాని దీని అర్థం
తెలియదు. పిల్లలైన మీరు ఇది అర్థం చేసుకుంటారు. ఏ తండ్రినైతే మనుష్యమాత్రులందరూ - ఓ
భగవంతుడా... అని గుర్తు చేసుకుంటారో, వారు తప్పకుండా పైన మూలవతనములో ఉన్నారు,
ఇతరులెవ్వరికీ ఇది తెలియదు. ఈ డ్రామా రహస్యాన్ని కూడా ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం
చేసుకుంటారు. ప్రారంభము నుండి మొదలుకొని ఇప్పటివరకు ఏదైతే జరిగిందో, ఏదైతే
జరగనున్నదో, అదంతా బుద్ధిలో ఉంది. ఈ సృష్టి చక్రమెలా తిరుగుతుంది అనేది బుద్ధిలో
ఉండాలి కదా. పిల్లలైన మీలో కూడా నంబరువారుగా అర్థం చేసుకుంటారు. విచార సాగర మంథనము
చెయ్యరు, అందుకే సంతోషపు పాదరసము కూడా పైకి ఎక్కదు. కూర్చుంటూ, లేస్తూ - మేము
స్వదర్శన చక్రధారులమని బుద్ధిలో ఉండాలి. ఆత్మనైన నాకు ఆది నుండి అంతిమము వరకు మొత్తం
సృష్టి చక్రము గురించి తెలుసు. మీరు ఇక్కడ కూర్చుని ఉన్నా, బుద్ధిలో మూలవతనము
గుర్తుకొస్తుంది. అది స్వీట్ సైలెన్స్ హోమ్, నిర్వాణధామము, సైలెన్స్ ధామము, అక్కడ
ఆత్మలు ఉంటారు. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలోకి వెంటనే వచ్చేస్తాయి, ఇతరులెవ్వరికీ
వీటి గురించి తెలియదు. శాస్త్రాలు మొదలైనవి ఎన్ని చదువుతూ, వింటూ ఉన్నా కానీ లాభమేమీ
లేదు. వారందరూ దిగే కళలో ఉన్నారు. మీరు ఇప్పుడు ఎక్కుతున్నారు. తిరిగి వెళ్ళేందుకు
మీరు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ పాత వస్త్రాన్ని వదిలి మనము ఇంటికి వెళ్ళాలి.
సంతోషము ఉంటుంది కదా! ఇంటికి వెళ్ళేందుకని అర్ధకల్పము భక్తి చేశాము, మెట్లు కిందికి
దిగుతూనే వచ్చాము. ఇప్పుడు బాబా మనకు సహజముగా అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మీకు
సంతోషముండాలి. భగవంతుడైన బాబా మనల్ని చదివిస్తున్నారు - ఈ సంతోషము చాలా ఉండాలి.
తండ్రి సమ్ముఖముగా చదివిస్తున్నారు. బాబా అందరికీ తండ్రి, వారు మనల్ని మళ్ళీ
చదివిస్తున్నారు. వారు అనేక సార్లు చదివించారు. మీరు చక్రములో తిరిగి పూర్తి
చేసినప్పుడు తండ్రి మళ్ళీ వస్తారు. ఈ సమయములో మీరు స్వదర్శన చక్రధారులు. మీరు
విష్ణుపురి యొక్క దేవతలుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. ప్రపంచములో
ఇతరులెవ్వరూ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. శివబాబా మనల్ని చదివిస్తున్నారు, ఈ సంతోషము
ఎంతగా ఉండాలి. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవని, ఇవి సద్గతి
కోసము కాదని పిల్లలకు తెలుసు. భక్తి మార్గపు సామాగ్రి కూడా కావాలి కదా. ఎంతో
సామాగ్రి ఉంది. తండ్రి అంటారు, దీనితో మీరు పడిపోతూనే వచ్చారు. ప్రతి ముంగిట ఎంతగా
భ్రమించారు. ఇప్పుడు మీరు శాంతిగా అయి కూర్చున్నారు. మీరు ఎదురుదెబ్బలు తినడము
మొదలైనదంతా ఇప్పుడు సమాప్తమైపోయింది. ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉందని మీకు తెలుసు,
ఆత్మను పవిత్రముగా తయారుచేయడానికి తండ్రి ఇదే మార్గాన్ని తెలియజేస్తున్నారు. తండ్రి
అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయిపోతారు,
ఆ తర్వాత సతోప్రధాన ప్రపంచములోకి వచ్చి రాజ్యము చేస్తారు. ఈ మార్గాన్ని కల్ప-కల్పము
అనేక సార్లు తండ్రి తెలియజేశారు. తమ అవస్థను కూడా చూసుకోవాలి, విద్యార్థులు
పురుషార్థము చేసి తమను తాము తెలివైనవారిగా చేసుకుంటారు కదా. చదువు యొక్క రిజిస్టర్
కూడా ఉంటుంది మరియు నడవడిక యొక్క రిజిస్టర్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు కూడా దైవీ
గుణాలను ధారణ చెయ్యాలి. ఈ రోజంతా ఎటువంటి ఆసురీ కర్మలు చేయలేదు కదా అని ప్రతిరోజూ
మీ లెక్కాపత్రాన్ని పెట్టుకున్నట్లయితే చాలా ఉన్నతి జరుగుతుంది. మనమైతే దేవతలుగా
అవ్వాలి. లక్ష్మీ-నారాయణుల చిత్రము ఎదురుగా పెట్టారు. ఇది ఎంత సింపుల్ చిత్రము. పైన
శివబాబా ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మా ద్వారా ఈ వారసత్వాన్ని ఇస్తున్నారంటే తప్పకుండా
సంగమయుగములో బ్రాహ్మణ, బ్రాహ్మణీలు ఉంటారు కదా. దేవతలు సత్యయుగములో ఉంటారు.
బ్రాహ్మణులు సంగమయుగములో ఉన్నారు. కలియుగములో శూద్ర వర్ణము వారు ఉన్నారు. విరాట
రూపాన్ని కూడా బుద్ధిలో ధారణ చెయ్యండి. మనము ఇప్పుడు బ్రాహ్మణులము, పిలక స్థానములోని
వారము, ఆ తర్వాత దేవతలుగా అవుతాము. తండ్రి బ్రాహ్మణులను చదివిస్తున్నారు, దేవతలుగా
తయారుచేయడానికి చదివిస్తున్నారు, కావున దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి, అంత
మధురముగా తయారవ్వాలి. ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు. ఏ విధముగానైతే శరీర నిర్వహణ కోసం
ఏదో ఒక పని చేయడము జరుగుతుందో, అలాగే ఇక్కడ కూడా యజ్ఞ సేవను చెయ్యాలి. ఎవరైనా
అనారోగ్యముగా ఉంటే, సేవ చేయలేకపోతే, వారి సేవ కూడా చేయవలసి ఉంటుంది. ఎవరైనా
అనారోగ్యము చెంది శరీరాన్ని వదిలేస్తే మీరు దుఃఖపడవలసిన లేక ఏడవవలసిన విషయము లేదు.
మీరైతే పూర్తిగా శాంతిగా బాబా స్మృతిలో ఉండాలి. ఎటువంటి శబ్దము ఉండకూడదు. వారైతే
శ్మశానానికి తీసుకువెళ్ళినప్పుడు రామ నామము కలవారు తోడుగా ఉన్నారు అని పలుకుతూ
వెళ్తారు. మీరైతే ఏమీ పలకవలసిన అవసరము లేదు. మీరు సైలెన్స్ ద్వారా విశ్వముపై విజయము
పొందుతారు. వారిది సైన్స్, మీది సైలెన్స్.
పిల్లలైన మీకు జ్ఞానము మరియు విజ్ఞానము యొక్క యథార్థమైన అర్థము కూడా తెలుసు.
జ్ఞానమంటే వివేకము మరియు విజ్ఞానమంటే అంతా మర్చిపోవడము, అది జ్ఞానము కన్నా అతీతమైనది.
కావున జ్ఞానము కూడా ఉంది, విజ్ఞానము కూడా ఉంది. నేను శాంతిధామ నివాసిని అని ఆత్మకు
తెలుసు. ఇంకా జ్ఞానము కూడా ఉంది. రూప్ మరియు బసంత్ (యోగ స్వరూపులు మరియు జ్ఞాన
స్వరూపులు). బాబా కూడా రూప్-బసంత్ కదా. వారు రూప్ కూడా మరియు వారిలో మొత్తం సృష్టి
చక్రము యొక్క జ్ఞానము కూడా ఉంది. వాళ్ళు విజ్ఞాన భవనమని పేరు పెట్టారు కానీ దాని
అర్థాన్ని ఏమీ అర్థం చేసుకోరు. ఈ సమయములో సైన్స్ వలన దుఃఖము కూడా ఉంది మరియు సుఖము
కూడా ఉందని పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. అక్కడ సుఖమే సుఖముంటుంది. ఇక్కడ
అల్పకాలికమైన సుఖము ఉంటుంది, మిగిలినదంతా దుఃఖమే దుఃఖము. ఇంట్లో మనుష్యులు ఎంత
దుఃఖితులుగా ఉంటారు. దీని కంటే చనిపోతే ఈ దుఃఖపు ప్రపంచము నుండి విముక్తులమైపోతాము
కదా అని భావిస్తారు. బాబా మనల్ని స్వర్గవాసులుగా చేయడానికి వచ్చి ఉన్నారని పిల్లలైన
మీకు తెలుసు. మరి ఎంతగా ఆనందముతో పులకరింపు కలగాలి. కల్ప-కల్పమూ బాబా మనల్ని
స్వర్గవాసులుగా చేయడానికి వస్తారు, మరి ఇటువంటి తండ్రి మతముపై నడవాలి కదా.
తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకండి. గృహస్థ
వ్యవహారములో ఉంటూ పవిత్రముగా అవ్వండి. మనము సోదరీ-సోదరులము, ఇది ప్రేమ యొక్క సంబంధము.
వేరే ఏ దృష్టి కలగడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరి రోగము ఎవరిది వారిదే, దాని
అనుసారముగా సలహా కూడా ఇస్తూ ఉంటారు. బాబా, ఇలాంటి, ఇలాంటి పరిస్థితి వస్తూ ఉంటుంది,
ఈ పరిస్థితిలో ఏమి చేయాలి అని అడుగుతుంటారు. బాబా అర్థం చేయిస్తారు, సోదరీ-సోదరుల
దృష్టి అశుద్ధముగా ఉండకూడదు. ఎటువంటి గొడవలు ఉండకూడదు. నేను ఆత్మలైన మీకు తండ్రిని
కదా. శివబాబా బ్రహ్మా తనువు ద్వారా మాట్లాడుతున్నారు. ప్రజాపిత బ్రహ్మా శివబాబాకు
కుమారుడు, వారు సాధారణ తనువులోనే వస్తారు కదా. విష్ణువైతే సత్యయుగానికి చెందినవారు.
తండ్రి అంటారు, నేను వీరిలో ప్రవేశించి కొత్త ప్రపంచాన్ని రచించడానికి వచ్చాను. బాబా
అడుగుతుంటారు - మీరు విశ్వ మహారాజా, మహారాణిగా అవుతారా? అవును బాబా, ఎందుకు అవ్వము
అని అంటారు. అయితే, ఇందులో పవిత్రముగా ఉండవలసి ఉంటుంది. ఇది కష్టము. అరే, మిమ్మల్ని
విశ్వానికి యజమానులుగా తయారుచేస్తాను, మీరు పవిత్రముగా ఉండలేరా? సిగ్గుగా అనిపించడము
లేదా? లౌకిక తండ్రి కూడా - అశుద్ధమైన పనులు చేయవద్దని అర్థం చేయిస్తుంటారు కదా. ఈ
వికారాల విషయము వలనే విఘ్నాలు కలుగుతాయి. ప్రారంభము నుండి మొదలుకొని ఈ విషయములో
గొడవలు జరుగుతూ వచ్చాయి. తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, దీనిపై విజయము పొందాలి.
నేను పవిత్రముగా తయారుచేయడానికి వచ్చాను. పిల్లలైన మీకు రైట్-రాంగ్, మంచి-చెడుల
గురించి ఆలోచించే బుద్ధి లభించింది. ఈ లక్ష్మీ-నారాయణులు మీ లక్ష్యము-ఉద్దేశ్యము.
స్వర్గవాసులలో దైవీ గుణాలు ఉన్నాయి, నరకవాసులలో అవగుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది రావణ
రాజ్యము, ఇది కూడా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. రావణుడిని ప్రతి సంవత్సరము
కాలుస్తుంటారు. అతను శత్రువు కదా. కాలుస్తూనే వస్తారు కానీ అతడెవరు అన్నది అర్థం
చేసుకోరు. మనమంతా రావణ రాజ్యానికి చెందినవారము కదా కావున తప్పకుండా మనము అసురులుగా
ఉన్నాము. కానీ స్వయాన్ని ఎవ్వరూ అసురులుగా భావించరు. ఇది రాక్షస రాజ్యమని చాలామంది
అంటుంటారు కూడా. యథా రాజా రాణి తథా ప్రజ. కానీ ఈ మాత్రము కూడా వివేకము లేదు. తండ్రి
కూర్చుని అర్థం చేయిస్తున్నారు - రామ రాజ్యము వేరుగా ఉంటుంది, రావణ రాజ్యము వేరుగా
ఉంటుంది. ఇప్పుడు మీరు సర్వగుణ సంపన్నులుగా అవుతున్నారు. తండ్రి అంటారు, మందిరాలకు
వెళ్ళి దేవతలను పూజించే నా భక్తులకు జ్ఞానము వినిపించండి. అంతేకానీ, రకరకాల
వ్యక్తుల వెనుక తల బాదుకోకండి. మందిరాలలో మీకు చాలామంది భక్తులు లభిస్తారు. నాడి
కూడా చూడవలసి ఉంటుంది. డాక్టర్లు చూడగానే ఫలానావారికి ఏం రోగము ఉంది అన్నది
చెప్పేస్తారు. ఢిల్లీలో అజ్మల్ ఖాన్ అనే ఒక ప్రసిద్ధమైన వైద్యుడు ఉండేవారు. తండ్రి
అయితే మిమ్మల్ని 21 జన్మల కోసం సదా ఆరోగ్యవంతులుగా, ధనవంతులుగా తయారుచేస్తారు.
ఇక్కడైతే అందరూ రోగులుగా, అనారోగ్యులుగా ఉన్నారు. అక్కడైతే ఎప్పుడూ రోగాలు ఉండవు.
మీరు సదా ఆరోగ్యవంతులుగా, సదా ధనవంతులుగా అవుతారు. మీరు మీ యోగబలముతో
కర్మేంద్రియాలపై విజయము పొందుతారు. మిమ్మల్ని ఈ కర్మేంద్రియాలు ఎప్పుడూ మోసము
చేయలేవు. బాబా అర్థం చేయించారు, మంచి రీతిలో స్మృతిలో ఉన్నట్లయితే, దేహీ-అభిమానులుగా
ఉన్నట్లయితే కర్మేంద్రియాలు మోసము చెయ్యవు. ఇక్కడే మీరు వికారాలపై విజయము పొందుతారు.
అక్కడ చెడు దృష్టి ఉండదు, అసలు రావణ రాజ్యమే ఉండదు. అది ఉన్నదే అహింసాయుతమైన
దేవీ-దేవతా ధర్మము. యుద్ధము మొదలైనవాటి విషయమేమీ ఉండదు. ఈ యుద్ధము కూడా అంతిమములో
జరగవలసి ఉంది. దీని ద్వారా స్వర్గ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఇక ఆ తర్వాత ఎప్పుడూ
యుద్ధాలు జరగనే జరగవు. యజ్ఞము కూడా ఇదే చివరిది. ఆ తర్వాత అర్ధకల్పము ఎటువంటి యజ్ఞము
ఉండదు. ఇందులో మొత్తము చెత్త అంతా స్వాహా అయిపోతుంది. ఈ యజ్ఞము ద్వారానే వినాశ
జ్వాల వెలువడింది, మొత్తం శుభ్రమైపోతుంది. పిల్లలైన మీకు సాక్షాత్కారాలు కూడా
చేయించడము జరిగింది, అక్కడి శూబీరసము మొదలైనవి కూడా చాలా రుచికరముగా, ఫస్ట్ క్లాస్
గా ఉంటాయి. ఆ రాజ్యాన్ని ఇప్పుడు మీరు స్థాపన చేస్తున్నారంటే ఎంత సంతోషముండాలి.
మీ పేరే శివశక్తి భారతమాతలు. కేవలం స్మృతి ద్వారానే శివుడి నుండి మీరు శక్తిని
తీసుకుంటారు. ఇందులో ఎదురుదెబ్బలు తినే విషయమేమీ లేదు. ఎవరైతే భక్తి చెయ్యరో, వారు
నాస్తికులని అక్కడ భావిస్తారు. మీరు అంటారు, ఎవరికైతే తండ్రి గురించి మరియు రచన
గురించి తెలియదో, వారు నాస్తికులు. మీరు ఇప్పుడు ఆస్తికులుగా అయ్యారు.
త్రికాలదర్శులుగా కూడా అయ్యారు. మూడు లోకాల గురించి, మూడు కాలాల గురించి
తెలుసుకున్నారు. ఈ లక్ష్మీ-నారాయణులకు తండ్రి నుండి ఈ వారసత్వము లభించింది. ఇప్పుడు
మీరు అలా తయారవుతారు. ఈ విషయాలన్నింటినీ తండ్రియే అర్థం చేయిస్తారు. శివబాబా
స్వయముగా అంటారు - నేను వీరిలో ప్రవేశించి అర్థం చేయిస్తాను, లేకపోతే నిరాకారుడినైన
నేను ఎలా అర్థం చేయించగలను. ప్రేరణ ద్వారా చదువు సాధ్యమవుతుందా? చదివించేందుకైతే
నోరు కావాలి కదా. గోముఖము వీరు కదా. వీరు పెద్ద తల్లి కదా, వీరు హ్యూమన్ మాత (మానవ
తల్లి). తండ్రి అంటారు, నేను వీరి ద్వారా పిల్లలైన మీకు సృష్టి ఆదిమధ్యాంతాల
రహస్యాన్ని అర్థం చేయిస్తాను, యుక్తులు తెలియజేస్తాను. ఇందులో ఆశీర్వాదాల విషయమేమీ
లేదు. డైరెక్షన్లపై నడుచుకోవాలి. శ్రీమతము లభిస్తుంది. కృప యొక్క విషయము కాదు. బాబా,
పదే-పదే మర్చిపోతున్నాము, కృప చూపించండి అని అంటారు. అరే, స్మృతి చేయడమనేది మీ పని,
నేనేమీ కృప చూపిస్తాను. నాకైతే అందరూ పిల్లలే. కృప చూపిస్తే అందరూ సింహాసనముపై
కూర్చుంటారు. పదవిని చదువు అనుసారముగానే పొందుతారు. చదవాల్సింది మీరే కదా.
పురుషార్థము చేస్తూ ఉండండి. అతి ప్రియమైన తండ్రిని స్మృతి చేయాలి. పతితాత్మలు తిరిగి
వెళ్ళలేరు. తండ్రి అంటారు, ఎంతగా మీరు స్మృతి చేస్తారో, అంతగా స్మృతి చేస్తూ-చేస్తూ
పావనముగా అయిపోతారు. పావనాత్మలు ఇక్కడ ఉండలేరు. పవిత్రముగా అయినట్లయితే శరీరము
కొత్తది కావాలి. పవిత్రాత్మకు అపవిత్ర శరీరము లభించడమనేది నియమము కాదు. సన్యాసులు
కూడా వికారాలతోనే జన్మ తీసుకుంటారు కదా. ఈ దేవతలు వికారాల ద్వారా జన్మ తీసుకోరు
కావున వీరు మళ్ళీ సన్యాసము చేయవలసిన అవసరము ఉండదు. వీరు ఉన్నతమైనవారు కదా. సదా
సంపూర్ణ నిర్వికారులుగా ఉండే వీరే సత్యాతి-సత్యమైన మహాత్ములు. అక్కడ రావణ రాజ్యము
ఉండదు. అది ఉన్నదే సతోప్రధాన రామ రాజ్యము. వాస్తవానికి రామ అని కూడా అనకూడదు. వారు
శివబాబా కదా. దీనిని రాజస్వ అశ్వమేధ అవినాశీ రుద్ర జ్ఞాన యజ్ఞమని అంటారు. రుద్రుడు
అన్నా లేక శివుడు అన్నా ఒక్కరే. శ్రీకృష్ణుడి పేరు లేదు. శివబాబా వచ్చి జ్ఞానాన్ని
వినిపిస్తారు, వారు మళ్ళీ రుద్ర యజ్ఞాన్ని రచించినప్పుడు మట్టి లింగాన్ని మరియు
సాలిగ్రామాలను తయారుచేస్తారు. వాటిని పూజించి మళ్ళీ పగలగొట్టేస్తారు. బాబా దేవీల
ఉదాహరణను ఇస్తారు కదా. ఎలాగైతే దేవీలను అలంకరించి, తినిపించి, తాగించి, పూజించి
మళ్ళీ ముంచేస్తారో, అలాగే శివబాబాను మరియు సాలిగ్రామాలను చాలా ప్రేమతో మరియు
శుద్ధితో పూజించి మళ్ళీ సమాప్తము చేసేస్తారు. ఇదంతా భక్తి యొక్క విస్తారము. ఇప్పుడు
తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఎంతగా తండ్రి స్మృతిలో ఉంటారో, అంతగా
సంతోషముగా ఉంటారు. ప్రతిరోజు రాత్రి మీ లెక్కాపత్రాన్ని చూసుకోవాలి - ఏ తప్పు
చేయలేదు కదా? బాబా, ఈ రోజు నా ద్వారా ఈ తప్పు జరిగింది, క్షమించండి అని మీ చెవులు
పట్టుకోవాలి. బాబా అంటారు, సత్యము వ్రాసినట్లయితే సగము పాపం తొలగిపోతుంది. బాబా
అయితే కూర్చుని ఉన్నారు కదా. మీ కళ్యాణము చేసుకోవాలనుకుంటే శ్రీమతముపై నడవండి.
లెక్కాపత్రము పెట్టుకున్నట్లయితే చాలా ఉన్నతి జరుగుతుంది. ఇందులో ఖర్చు అయితే ఏమీ
లేదు. ఉన్నత పదవిని పొందాలంటే మనసా-వాచా-కర్మణా ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు.
ఎవరైనా ఏమైనా అంటే వినీ విననట్లుగా ఉండాలి. ఈ కృషి చేయాలి. పిల్లలైన మీ దుఃఖాలను
దూరము చేసి సదా కొరకు సుఖాన్ని ఇచ్చేందుకే తండ్రి వస్తారు కావున పిల్లలు కూడా అలా
తయారవ్వాలి. మందిరాలలో అన్నింటికన్నా మంచి సేవ జరుగుతుంది. అక్కడ ధార్మిక మనస్కులు
మీకు చాలామంది కలుస్తారు. ప్రదర్శనీలలో చాలామంది వస్తారు. ప్రొజెక్టర్ కంటే కూడా
ప్రదర్శనీలలో, మేళాలలో సేవ బాగా జరుగుతుంది. మేళాలలో ఖర్చవుతుంది అంటే మరి తప్పకుండా
లాభము కూడా ఉంటుంది కదా. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.