ఓంశాంతి
ఎవరైతే జ్ఞాన సాగరునితో పాటు ఉన్నారో, వారి కొరకు జ్ఞాన వర్షము కురుస్తుంది. మీరు
తండ్రితో పాటు ఉన్నారు కదా. మీరు విదేశాలలో ఉన్నా లేక ఇంకెక్కడైనా ఉన్నా కానీ
తోడుగానే ఉన్నారు. వారిని స్మృతిలో పెట్టుకుంటారు కదా. ఏ పిల్లలైతే స్మృతిలో ఉంటారో,
వారు సదా తోడుగా ఉన్నట్లే. స్మృతిలో ఉన్నట్లయితే తోడుగా ఉంటారు మరియు వికర్మలు
వినాశనమవుతాయి, ఇక ఆ తర్వాత వికర్మాజీతుని కాలము ప్రారంభమవుతుంది. మళ్ళీ ఎప్పుడైతే
రావణ రాజ్యము మొదలవుతుందో, అప్పుడు రాజా విక్రముని కాలము అని అంటారు. వారు
వికర్మాజీతులు, ఆ తర్వాత వికర్మలు చేసేవారు. ఇప్పుడు మీరు వికర్మాజీతులుగా అవుతూ
ఉన్నారు, తర్వాత మీరు వికర్మలు చేసేవారిగా అవుతారు. ఈ సమయములో అందరూ అతి వికర్మలు
చేసేవారిగా ఉన్నారు. ఎవరికీ కూడా తమ ధర్మము గురించి తెలియదు. ఈ రోజు బాబా ఒక చిన్న
ప్రశ్న అడుగుతున్నారు - సత్యయుగములో దేవతలకు మేము ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి
చెందినవారము అన్నది తెలిసి ఉంటుందా? ఉదాహరణకు మీరు - మేము హిందూ ధర్మానికి
చెందినవారము అని భావిస్తారు, అలాగే కొందరు మేము క్రిస్టియన్ ధర్మానికి చెందినవారము
అని అంటారు. అదే విధంగా అక్కడ దేవతలు తమను తాము దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా
భావిస్తారా? ఇది ఆలోచించవలసిన విషయము కదా. మేము ఫలానా ధర్మానికి చెందినవారము అని
భావించడానికి అక్కడ వేరే ధర్మమంటూ ఏదీ లేదు. ఇక్కడ ఎన్నో ధర్మాలు ఉన్నాయి, కావున
గుర్తించడానికని చెప్పి వేరు-వేరు పేర్లు పెట్టారు. అక్కడ ఉన్నదే ఒక ధర్మము, అందుకే
- మేము ఈ ధర్మానికి చెందినవారము అని చెప్పవలసిన అవసరముండదు. వారికి అసలు ధర్మాలు
అనేవి ఉంటాయి అనేదే తెలియదు ఎందుకంటే అక్కడ కేవలం వారి రాజ్యమే ఉంటుంది. ఇప్పుడు
మీకు తెలుసు - మేము ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారము అని. దేవీ-దేవతలు
అని ఇంకెవ్వరినీ అనలేము. పతితముగా అయిన కారణముగా స్వయాన్ని దేవతలుగా పిలుచుకోలేరు.
పవిత్రమైనవారినే దేవతలు అని అంటారు. అక్కడ ఇటువంటి విషయమేదీ ఉండదు. వారిని ఎవరితోనూ
పోల్చలేము. ఇప్పుడు మీరు సంగమయుగములో ఉన్నారు, ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము మళ్ళీ
స్థాపన అవుతోంది అని మీకు తెలుసు. అక్కడైతే ధర్మము యొక్క విషయమే ఉండదు. అక్కడ ఉన్నదే
ఒక ధర్మము. మహాప్రళయం జరుగుతుంది అని అంటారు కదా అనగా ఇక ఏమీ మిగలదు అని అంటారు కదా,
అది కూడా రాంగ్ అని పిల్లలకు అర్థం చేయించారు. రైట్ ఏమిటి అనేది తండ్రి కూర్చుని
అర్థం చేయిస్తారు. శాస్త్రాలలోనైతే జలమయమైనట్లుగా చూపించారు. తండ్రి అర్థం
చేయిస్తున్నారు - భారత్ తప్ప మిగిలినదంతా జలమయమైపోతుంది. ఇంత పెద్ద సృష్టిని ఏం
చేసుకుంటారు. ఒక్క భారత్ లోనే చూడండి, ఎన్ని గ్రామాలున్నాయి. మొదట అడవిలా ఉంటుంది,
ఆ తర్వాత దాని నుండి వృద్ధి జరుగుతూ ఉంటుంది. అక్కడైతే కేవలం ఆది సనాతన దేవీ-దేవతా
ధర్మానికి చెందిన మీరు మాత్రమే ఉంటారు. ఈ విషయాన్ని బ్రాహ్మణులైన మీ బుద్ధిలో బాబా
ధారణ చేయిస్తున్నారు. ఇప్పుడు మీకు తెలుసు - ఉన్నతోన్నతమైన శివబాబా ఎవరు? వారిని
ఎందుకు పూజించడం జరుగుతుంది? జిల్లేడు మొదలైన పుష్పాలను వారికి ఎందుకు అర్పిస్తారు?
వారైతే నిరాకారుడు కదా. నామ-రూపాలకు అతీతమైనవారు అని అంటారు, కానీ నామ-రూపాలకు
అతీతమైన వస్తువంటూ ఏదీ ఉండదు, మరి ఎవరికి పుష్పాలు మొదలైనవి అర్పిస్తున్నట్లు?
మొట్టమొదటి పూజ వారికి జరుగుతుంది, మందిరాలు కూడా వారివే తయారవుతాయి, ఎందుకంటే వారు
భారత్ మరియు మొత్తం ప్రపంచములోని పిల్లలందరి సేవను చేస్తారు. మనుష్యులకే సేవ చేయడం
జరుగుతుంది కదా. ఈ సమయములో మీరు స్వయాన్ని దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా
పిలుచుకోలేరు. అసలు ఒకప్పుడు మేము దేవీ-దేవతలుగా ఉండేవారము, ఇప్పుడు మళ్లీ అలా
తయారవుతున్నాము అన్నది మీకు తెలియను కూడా తెలియదు. ఇప్పుడు తండ్రి అర్థం
చేయిస్తున్నారు కావున - ఈ జ్ఞానాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు అన్నది అర్థం
చేయించాలి. వారినే జ్ఞానసాగరుడు, నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. రచయిత మరియు రచన గురించి
ఋషులు, మునులు మొదలైనవారెవ్వరికీ కూడా తెలియదు అని అంటూ ఉంటారు. వారు తెలియదు,
తెలియదు అనే అంటూ వచ్చారు. ఇప్పుడు చిన్న పిల్లలకు ఏమైనా జ్ఞానము ఉంటుందా?
పెద్దవారిగా అయ్యే కొద్దీ బుద్ధి తెరుచుకుంటూ ఉంటుంది. విదేశాలు ఎక్కడ ఉన్నాయి, ఇవి
ఎక్కడ ఉన్నాయి అనేది బుద్ధిలోకి వస్తూ ఉంటుంది. పిల్లలైన మీకు కూడా ఇంతకుముందు ఈ
అనంతమైన జ్ఞానము గురించి ఏమీ తెలిసేది కాదు. బ్రహ్మాబాబా కూడా అంటారు - నేను
శాస్త్రాలు మొదలైనవి చదివేవాడిని కానీ ఏమీ అర్థం చేసుకోలేదు. మనుష్యులే ఈ డ్రామాలోని
పాత్రధారులు కదా.
మొత్తం నాటకమంతా రెండు విషయాలపై తయారుచేయబడి ఉంది. భారత్ యొక్క ఓటమి మరియు భారత్
యొక్క గెలుపు. భారత్ లో సత్యయుగ ఆది సమయములో పవిత్ర ధర్మము ఉండేది, ఈ సమయములో
అపవిత్ర ధర్మము ఉంది. అపవిత్రత కారణముగా స్వయాన్ని దేవతలుగా పిలుచుకోలేరు, అయినా
కానీ శ్రీ శ్రీ అన్న పేరు పెట్టించుకుంటారు. కానీ శ్రీ అనగా శ్రేష్ఠమైనవారు.
శ్రేష్ఠమైనవారు అని పవిత్రమైన దేవతలనే అంటారు. శ్రీమత్ భగవానువాచ అని అంటారు కదా.
ఇప్పుడు మరి శ్రీ అనగా శ్రేష్ఠమైనవారు ఎవరు? ఎవరైతే తండ్రి సమ్ముఖములో వింటూ శ్రీ
గా తయారవుతారో వారా, లేక ఎవరైతే తమను తాము శ్రీ శ్రీ అని పిలుచుకున్నారో వారా?
తండ్రి చేసిన కర్తవ్యము ఆధారముగా తండ్రికి ఏ పేర్లు అయితే పెట్టబడతాయో, ఆ పెర్లను
కూడా స్వయానికి పెట్టించేసుకున్నారు. ఇవన్నీ విస్తారమైన విషయాలు. అయినా తండ్రి
అంటారు - పిల్లలూ, ఒక్క తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఇదే వశీకరణ మంత్రము. మీరు
రావణుడిపై విజయము పొంది జగజ్జీతులుగా అవుతారు. ఘడియ-ఘడియ స్వయాన్ని ఆత్మగా భావించండి.
ఈ శరీరమైతే ఇక్కడ 5 తత్వాలతో తయారుచేయబడి ఉంది. ఇది తయారవుతుంది, మళ్ళీ పోతుంది,
మళ్ళీ తయారవుతుంది. కానీ ఆత్మ అయితే అవినాశీ. అవినాశీ ఆత్మలను ఇప్పుడు సంగమయుగములో
అవినాశీ తండ్రి చదివిస్తున్నారు. విఘ్నాలు మొదలైనవి ఎన్ని అయినా రావచ్చు, మాయ
తుఫానులు కూడా వస్తాయి, కానీ మీరు తండ్రి స్మృతిలో ఉండండి. మేమే సతోప్రధానముగా
ఉండేవారము, మళ్ళీ తమోప్రధానముగా అయ్యాము అని మీరు అర్థం చేసుకుంటారు. మీలో కూడా
నంబరువారుగా తెలుసుకున్నారు. మేమే మొట్టమొదట భక్తి చేసాము అని పిల్లలైన మీ బుద్ధిలో
ఉంది. తప్పకుండా ఎవరైతే మొట్టమొదట భక్తి చేసారో, వారే శివుని మందిరాన్ని తయారుచేసారు
ఎందుకంటే ధనవంతులుగా కూడా వారే ఉంటారు కదా. పెద్ద రాజును చూసి ఇతర రాజులు మరియు
ప్రజలు కూడా చేస్తారు. ఇవన్నీ విస్తారమైన విషయాలు. ఒక్క క్షణములో జీవన్ముక్తి అని
అనడం జరుగుతుంది. కానీ అర్థం చేయించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది. జ్ఞానమైతే
సహజమైనది. స్మృతియాత్రకు పట్టినంత సమయము జ్ఞానానికి పట్టదు. బాబా రండి, వచ్చి
మమ్మల్ని పతితము నుండి పావనముగా తయారుచేయండి అని పిలుస్తారు కూడా. కానీ బాబా,
మమ్మల్ని విశ్వాధిపతులుగా తయారుచేయండి అని అనరు. అందరూ - పతితము నుండి పావనముగా
తయారుచేయండి అని అంటారు. పావన ప్రపంచము అని సత్యయుగాన్ని అంటారు, దీనిని పతిత
ప్రపంచము అని అంటారు, పతిత ప్రపంచము అని అంటున్నప్పటికి స్వయాన్ని అలా భావించరు.
స్వయముపై ద్వేషము ఉండదు. మీరు ఎవరి చేతి వంట తినరు, కావున మేము ఏమైనా అంటరానివారమా?
అని వాళ్ళు అడుగుతారు. అరే, మీరు స్వయం కూడా ఈ మాట అంటారు కదా. అందరూ పతితులే కదా.
మేము పతితులము, ఈ దేవతలు పావనులు అని మీరు అంటారు కూడా, మరి పతితులను ఏమంటారు.
అమృతాన్ని వదిలి విషము ఎందుకు తాగాలి అన్న గాయనము ఉంది కదా. విషమనేది అశుద్ధమైనది
కదా. తండ్రి అంటారు, ఈ విషము మీకు ఆదిమధ్యాంతాలు దుఃఖము ఇస్తుంది, కానీ దీనిని
విషముగా భావించరు. ఉదాహరణకు వ్యసనపరుడు ఆ వ్యసనము లేకుండా ఉండలేడు, మద్యం సేవించే
అలవాటు ఉన్నవారు మద్యం లేకుండా ఉండలేరు. యుద్ధ సమయములో వారికి మద్యం తాగించి నషా
ఎక్కించి యుద్ధానికి పంపిస్తారు. నషా ఎక్కింది అంటే ఇక అంతే, మేము ఇలా చేయాలి అని
భావిస్తారు. వాళ్ళకు మరణము అంటే భయముండదు. ఎక్కడికైనా సరే బాంబులు తీసుకువెళ్ళి ఆ
బాంబుల సహితంగా పడిపోతారు. మిసైల్స్ యుద్ధము జరిగింది అని అంటూ ఉంటారు కూడా. యథార్థ
విషయాన్ని ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా చూస్తున్నారు. ఇంతకుముందు అయితే, కడుపు నుండి
ముసలం వెలువడిందని, ఆ తర్వాత ఇలా చేసారు అని కేవలం చదివేవారు. ఇప్పుడు పాండవులు ఎవరు
మరియు కౌరవులు ఎవరు అన్నది మీరు అర్థం చేసుకుంటారు. స్వర్గవాసులుగా అయ్యేందుకు
పాండవులు జీవిస్తూనే దేహాభిమానాన్ని కరిగించే పురుషార్థము చేసారు. మీరు ఇప్పుడు ఈ
పాత చెప్పును వదిలే పురుషార్థము చేస్తారు. పాత చెప్పును వదిలి కొత్తదానిని
తీసుకోవాలి అని అంటారు కదా. తండ్రి పిల్లలకే అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు, నేను
కల్ప-కల్పము వస్తాను. నా పేరు శివ. శివజయంతిని కూడా జరుపుకుంటారు. భక్తి మార్గము
కోసం ఎన్ని మందిరాలు మొదలైనవాటిని తయారుచేస్తారు. పేర్లు కూడా ఎన్నో పెట్టేసారు.
దేవతలకు కూడా అటువంటి పేర్లు పెడతారు. ఈ సమయములో మీ పూజ జరుగుతోంది. మేము ఎవరినైతే
పూజించేవారిమో వారు మమ్మల్ని చదివిస్తున్నారు అన్నది కూడా పిల్లలైన మీకే తెలుసు. ఏ
లక్ష్మీ-నారాయణులకైతే మేము పూజారులుగా ఉండేవారమో, వారిలా ఇప్పుడు స్వయం మేము
తయారవుతున్నాము. ఈ జ్ఞానము బుద్ధిలో ఉంది. స్మరిస్తూ ఉండండి, మళ్ళీ ఇతరులకు కూడా
వినిపించండి. ధారణ చేయలేనివారు ఎంతోమంది ఉన్నారు. బాబా అంటారు, ఎక్కువేమీ ధారణ
చేయలేకపోతే పర్వాలేదు. స్మృతి యొక్క ధారణ అయితే ఉంది కదా. తండ్రినే స్మృతి చేస్తూ
ఉండండి. ఎవరి అయితే మురళీ నడిపించలేరో, వారు ఇక్కడ కూర్చుని స్మరణ చేయండి. ఇక్కడ
ఎటువంటి బంధనాలు, జంజాటాలు మొదలైనవి లేదు. ఇంట్లో పిల్లలు మొదలైనవారి వాతావరణం చూసి
ఆ నషా మాయమైపోతుంది. ఇక్కడ చిత్రాలు కూడా ఉంచారు. ఎవరికైనా అర్థం చేయించడం చాలా
సహజము. వారైతే గీత మొదలైనవాటిని పూర్తిగా కంఠస్థము చేస్తారు. సిక్కు ధర్మము వారికి
కూడా గ్రంథ్ కంఠస్థమై ఉంటుంది. మీరు ఏం కంఠస్థము చేయాలి? తండ్రిని. బాబా, ఇది
పూర్తిగా కొత్త విషయము అని మీరు అంటారు కూడా. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఒక్క
తండ్రిని స్మృతి చేయవలసిన సమయము ఇదొక్కటే. 5000 సంవత్సరాల క్రితం కూడా నేర్పించారు,
ఇలా అర్థం చేయించగలిగే శక్తి ఇంకెవ్వరికీ లేదు. జ్ఞానసాగరుడు తండ్రి ఒక్కరే,
ఇంకెవ్వరూ కారు. జ్ఞానసాగరుడైన తండ్రే మీకు అర్థం చేయిస్తారు. ఈ రోజుల్లో - మేము
అవతారం తీసుకున్నాము అని చెప్పేవారు కూడా ఎంతోమంది వెలువడ్డారు, అందుకే సత్యము
యొక్క స్థాపనలో ఎన్నో విఘ్నాలు కలుగుతాయి, కానీ సత్యము అనే నావ కదులుతుంది,
ఊగిసలాడుతుంది కానీ మునిగిపోదు అని అంటూ ఉంటారు.
ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి వద్దకు వస్తారు కావున మీ హృదయములో ఎంతటి సంతోషము
ఉండాలి. ఇంతకుముందు యాత్రలకు వెళ్ళేటప్పుడు, మనసులో ఏం అనిపించేది? ఇప్పుడు
ఇళ్ళు-వాకిళ్ళను వదిలి ఇక్కడకు వచ్చినప్పుడు ఏం ఆలోచనలు వస్తాయి? మేము బాప్ దాదా
వద్దకు వెళ్తున్నాము. తండ్రి ఈ విషయం కూడా అర్థం చేయించారు - నన్ను కేవలం శివబాబా
అని అంటారు, నేను ఎవరిలోనైతే ప్రవేశించానో, వారు బ్రహ్మా. వంశావళులు ఉంటాయి కదా.
మొట్టమొదటి వంశావళి బ్రాహ్మణులది, ఆ తర్వాత దేవతల వంశావళి ఉంటుంది. ఇప్పుడు దూరదేశి
అయిన తండ్రి పిల్లలను దూరదృష్టి కలవారిగా తయారుచేస్తారు. ఆత్మ ఏ విధంగా చక్రమంతటిలో
భిన్న-భిన్న వర్ణాలలోకి వచ్చింది అనేది మీకు తెలుసు, ఈ జ్ఞానాన్ని దూరదృష్టి గల
తండ్రే ఇస్తారు. మీరు ఇలా ఆలోచిస్తారు - ఇప్పుడు మేము బ్రాహ్మణ వర్ణానికి
చెందినవారము, దీనికన్నా ముందు జ్ఞానము లేనప్పుడు శూద్ర వర్ణానికి చెందినవారిగా
ఉండేవారము. వారు మన గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. గ్రేట్ శూద్రులుగా, గ్రేట్
వైశ్యులుగా, గ్రేట్ క్షత్రియులుగా... దానికంటే ముందు గ్రేట్ బ్రాహ్మణులుగా ఉండేవారు.
ఇప్పుడు ఈ విషయాలను తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. దీనిని దూరదృష్టి గల
జ్ఞానము అని అంటారు. దూరదేశములో నివసించే తండ్రి వచ్చి దూరదేశము యొక్క జ్ఞానమంతటినీ
పిల్లలకు ఇస్తారు. మన బాబా దూరదేశము నుండి వీరిలోకి వస్తారని మీకు తెలుసు. ఇది పరాయి
దేశము, పరాయి రాజ్యము. శివబాబాకు తమదంటూ శరీరము లేదు మరియు వారు జ్ఞానసాగరుడు,
స్వర్గ రాజ్యాన్ని కూడా వారే ఇవ్వాలి. శ్రీకృష్ణుడు ఇవ్వరు కదా. శివబాబాయే ఇస్తారు.
శ్రీకృష్ణుడిని బాబా అని అనరు. తండ్రి రాజ్యాన్ని ఇస్తారు, తండ్రి నుండే వారసత్వము
లభిస్తుంది. ఇప్పుడు హద్దు వారసత్వాలన్నీ పూర్తవుతాయి. మేము సంగమములో 21 జన్మల
వారసత్వాన్ని తీసుకున్నాము అన్న విషయము సత్యయుగములో మీకు తెలియదు. మేము 21 జన్మల
వారసత్వాన్ని అర్ధకల్పము కొరకు తీసుకుంటున్నాము అన్నది ఇప్పుడే తెలుసు. 21 తరాలు
అనగా పూర్ణ ఆయుష్షు. ఎప్పుడైతే శరీరము వృద్ధాప్యానికి చేరుకుంటుందో, అప్పుడు సరైన
సమయానికి శరీరాన్ని విడిచిపెడతారు. ఉదాహరణకు సర్పము పాత కుబుసాన్ని వదిలి కొత్తది
తీసుకుంటుంది. మన విషయములో కూడా పాత్రను అభినయిస్తూ, అభినయిస్తూ ఈ వస్త్రము పాతదిగా
అయిపోయింది.
మీరు సత్యాతి-సత్యమైన బ్రాహ్మణులు. మిమ్మల్నే భ్రమరము అని అంటారు. మీరు పురుగులను
మీ సమానముగా బ్రాహ్మణులుగా తయారుచేస్తారు. పురుగులను తీసుకుని వచ్చి కూర్చుని భూ-భూ
చేయండి అని మీకు చెప్పడం జరుగుతుంది. భ్రమరము కూడా భూ-భూ చేస్తుంది, అప్పుడు కొన్ని
పురుగులకు రెక్కలు వస్తాయి, మరికొన్ని మరణిస్తాయి. ఈ ఉదాహరణలన్నీ ఈ సమయానికి
చెందినవే. మీరు ప్రియమైన పిల్లలు, పిల్లలను ప్రకాశ రత్నాలు అని అంటారు. తండ్రి
ప్రకాశ రత్నాలు అని అంటారు. మిమ్మల్ని నా వారిగా చేసుకున్నాను కావున మీరు కూడా నా
వారు అయినట్లే కదా. ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా పాపాలు
సమాప్తమైపోతాయి. ఇంకెవరిని స్మృతి చేసినా సరే పాపాలు సమాప్తమవ్వవు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.