04-12-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీకు ఇప్పుడు తండ్రి ద్వారా
దివ్యదృష్టి లభించింది, ఆ దివ్యదృష్టి ద్వారానే మీరు ఆత్మను మరియు పరమాత్మను
చూడగలుగుతారు’’
ప్రశ్న:-
డ్రామాలోని ఏ రహస్యాన్ని అర్థం చేసుకున్నవారు ఏ సలహాను ఎవ్వరికీ ఇవ్వరు?
జవాబు:-
డ్రామాలో ఏదైతే
గతించిపోయిందో, అది మళ్ళీ ఏక్యురేట్ గా రిపీట్ అవుతుంది అని ఎవరైతే అర్థం
చేసుకుంటారో, వారు ఎప్పుడూ ఎవ్వరికీ - భక్తిని వదిలిపెట్టమని సలహా ఇవ్వరు. ఎప్పుడైతే
వారి బుద్ధిలో జ్ఞానము బాగా కూర్చుంటుందో, అప్పుడు నేను ఆత్మను, నేను అనంతమైన తండ్రి
నుండి వారసత్వము తీసుకోవాలి అని అర్థం చేసుకుంటారు. ఎప్పుడైతే అనంతమైన తండ్రిని
గుర్తిస్తారో, అప్పుడు హద్దు విషయాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి.
ఓంశాంతి
మీ ఆత్మిక స్వధర్మములో కూర్చున్నారా? ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతున్నారు
ఎందుకంటే అనంతమైన తండ్రి ఒక్కరినే ఆత్మ అని అంటారని పిల్లలకు తెలుసు. కాకపోతే వారిని
సుప్రీమ్ అని అంటారు. సుప్రీమ్ ఆత్మ లేక పరమ ఆత్మ అని అంటారు. పరమాత్మ తప్పకుండా
ఉన్నారు, పరమాత్మ లేనే లేరని అనరు. పరమ ఆత్మ అనగా పరమాత్మ. ఇది కూడా అర్థం చేయించడము
జరిగింది, ఇందులో తికమకపడకూడదు ఎందుకంటే 5 వేల సంవత్సరాల క్రితము కూడా ఈ జ్ఞానాన్ని
మీరు విన్నారు. ఆత్మయే వింటుంది కదా. ఆత్మ చాలా చిన్ననిది, సూక్ష్మమైనది. అది ఎంత
చిన్నదంటే దానిని ఈ కనులతో చూడలేము. ఆత్మను ఈ కనులతో చూసిన మనుష్యులు ఎవ్వరూ ఉండి
ఉండరు. ఆత్మ కనిపిస్తుంది కానీ దివ్యదృష్టితో కనిపిస్తుంది. అది కూడా డ్రామా ప్లాన్
అనుసారముగా జరుగుతుంది. అచ్ఛా, ఎవరికైనా ఆత్మ సాక్షాత్కారము జరిగిందనుకోండి, అప్పుడు
ఇతర వస్తువులు ఎలా కనిపిస్తాయో, ఆత్మ కూడా అలాగే కనిపిస్తుంది. భక్తి మార్గములో కూడా
ఏదైనా సాక్షాత్కారము జరిగితే, అది కూడా ఈ కనుల ద్వారానే జరుగుతుంది. దివ్యదృష్టి
లభిస్తుంది కావున చైతన్యములో చూస్తారు. ఆత్మకు జ్ఞాన చక్షువు లభిస్తుంది, దాని
ద్వారా చూడగలరు, కానీ ధ్యానములో చూస్తారు. భక్తి మార్గములో చాలా భక్తి చేస్తే
అప్పుడు సాక్షాత్కారము జరుగుతుంది. ఉదాహరణకు మీరాకు సాక్షాత్కారము జరిగింది, ఆమె
నాట్యము చేసేవారు, ఆ సమయములో వైకుంఠమైతే లేదు. మీరా 5-6 వందల సంవత్సరాల క్రితము
ఉండేవారు, ఆ సమయములో వైకుంఠము లేదు. ఏదైతే గతించిపోయిందో, దానిని దివ్యదృష్టితో
చూడటము జరుగుతుంది. చాలా భక్తి చేస్తూ-చేస్తూ పూర్తిగా భక్తిమయమైపోయినప్పుడు
సాక్షాత్కారమవుతుంది, కానీ దాని ద్వారా ముక్తి లభించదు. ముక్తి-జీవన్ముక్తుల మార్గము
భక్తి మార్గానికి పూర్తిగా అతీతమైనది. భారత్ లో ఎన్ని మందిరాలు ఉన్నాయి.
శివలింగాన్ని పెడతారు. పెద్ద లింగాన్ని కూడా పెడతారు, చిన్నదానిని కూడా పెడతారు.
ఆత్మ ఎలా ఉంటుందో, పరమపిత పరమాత్మ కూడా అలాగే ఉంటారని ఇదైతే ఇప్పుడు పిల్లలకు తెలుసు.
అందరి సైజ్ ఒకటే. తండ్రి ఎలా ఉంటారో, పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఆత్మలందరూ
పరస్పరములో సోదరులు. ఆత్మలు ఈ శరీరాలలోకి పాత్రను అభినయించేందుకు వస్తారు, ఇవి అర్థం
చేసుకోవలసిన విషయాలు. ఇవి భక్తి మార్గపు కట్టుకథలేమీ కాదు. జ్ఞాన మార్గపు విషయాలను
కేవలం ఒక్క తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. మొట్టమొదట అర్థం చేయించేవారు అనంతమైన
తండ్రి అయిన నిరాకారుడే, వారి గురించి పూర్తిగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. వారు
సర్వవ్యాపి అని అంటారు. ఇది రైట్ కాదు. తండ్రిని పిలుస్తారు, చాలా ప్రేమగా
పిలుస్తారు. ఏమంటారంటే - బాబా, మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మీపై మేము
బలిహారమవుతాము, నాకైతే మీరు తప్ప మరెవ్వరూ లేరు. కావున తప్పకుండా వారిని స్మృతి
చేయవలసి ఉంటుంది. వారు స్వయం కూడా - ఓ పిల్లలూ అని అంటారు. వారు ఆత్మలతోనే
మాట్లాడుతారు. దీనిని ఆత్మిక జ్ఞానమని అంటారు. ఆత్మ మరియు పరమాత్మ చాలా కాలము వేరుగా
ఉన్నారు... అని అంటూ ఉంటారు కూడా. ఈ లెక్కను కూడా తెలియజేశారు. చాలా కాలము నుండి
ఆత్మలైన మీరు వేరుగా ఉన్నారు, మీరే మళ్ళీ ఈ సమయములో తండ్రి వద్దకు వచ్చారు, మళ్ళీ
మీ రాజయోగాన్ని నేర్చుకునేందుకు. ఈ టీచర్ సేవకుడు. టీచర్ ఎల్లప్పుడూ విధేయత గల
సేవకునిగా ఉంటారు. తండ్రి కూడా అంటారు, నేనైతే పిల్లలందరికీ సేవకుడిని. ఓ పతిత-పావనా,
మీరు వచ్చి మమ్మల్ని పావనముగా చేయండి అని మీరు ఎంత అధికారముతో పిలుస్తారు. అందరూ
భక్తురాళ్ళే. ఏమంటారంటే - ఓ భగవంతుడా రండి, మమ్మల్ని మళ్ళీ పావనముగా చేయండి. పావన
ప్రపంచమని స్వర్గాన్ని, పతిత ప్రపంచమని నరకాన్ని అంటారు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన
విషయాలు. ఇది కాలేజ్ లేక గాడ్ ఫాదర్లీ వరల్డ్ యూనివర్సిటీ. ఇక్కడ
లక్ష్యము-ఉద్దేశ్యము మనుష్యుల నుండి దేవతలుగా తయారవ్వడము. మేము ఇలా తయారవ్వాలి అని
పిల్లలు నిశ్చయము ఏర్పరచుకుంటారు. ఎవరికైతే నిశ్చయమే ఉండదో, వారు స్కూల్లో
కూర్చుంటారా? లక్ష్యము-ఉద్దేశ్యము అయితే బుద్ధిలో ఉంది. మనము బ్యారిస్టరుగా లేక
డాక్టరుగా అవ్వటానికి చదువుకుంటాము కదా. నిశ్చయము లేకపోతే రానే రారు. మేము మనుష్యుల
నుండి దేవతలుగా, నరుని నుండి నారాయణునిగా అవుతామని మీకు నిశ్చయముంది. ఇది నరుని
నుండి సత్యనారాయణునిగా అయ్యే సత్యాతి-సత్యమైన కథ. వాస్తవానికి ఇది చదువు, కానీ
దీనిని కథ అని ఎందుకంటారు? ఎందుకంటే 5 వేల సంవత్సరాల క్రితము కూడా దీనిని విన్నారు.
ఇది గతించిపోయింది. గతించినదానిని కథ అని అంటారు. ఇది నరుని నుండి నారాయణునిగా
తయారయ్యే శిక్షణ. కొత్త ప్రపంచములో దేవతలు, పాత ప్రపంచములో మనుష్యులు ఉంటారని
పిల్లలు మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటారు. దేవతలలో ఏవైతే గుణాలు ఉన్నాయో, అవి
మనుష్యులలో లేవు, అందుకే వారిని దేవతలని అంటారు. మనుష్యులు దేవతల ఎదురుగా
నమస్కరిస్తారు. మీరు సర్వగుణ సంపన్నులు... అని అంటూ స్వయాన్ని మళ్ళీ మేము పాపులము,
నీచులము అని అనుకుంటారు. మనుష్యులే అనుకుంటారు, దేవతలను ఇలా అనరు. దేవతలు
సత్యయుగములో ఉండేవారు, వారు కలియుగములో ఉండరు. కానీ ఈ రోజుల్లోనైతే అందరినీ శ్రీ
శ్రీ అని అంటూ ఉంటారు. శ్రీ అనగా శ్రేష్ఠమైనవారు అని అర్థము. సర్వ శ్రేష్ఠముగానైతే
భగవంతుడే తయారుచేయగలరు. శ్రేష్ఠమైన దేవతలు సత్యయుగములో ఉండేవారు, ఈ సమయములో
మనుష్యులెవ్వరూ శ్రేష్ఠముగా లేరు. పిల్లలైన మీరు ఇప్పుడు అనంతమైన సన్యాసము చేస్తారు.
ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది అని మీకు తెలుసు, అందుకే వీటన్నిటిపైనా మీకు
వైరాగ్యము ఉంది. వారు హఠయోగీ సన్యాసులు. ఇళ్ళు-వాకిళ్ళను వదిలి వెళ్ళి, మళ్ళీ వచ్చి
మహళ్ళలో కూర్చున్నారు. వాస్తవానికి కుటీరానికి ఖర్చు ఏమైనా అవుతుందా, ఏమీ అవ్వదు.
ఏకాంతము కోసం కుటీరాలలో కూర్చోవలసి ఉంటుంది, అంతేకానీ మహళ్ళలో కాదు. బాబాకు కూడా
కుటీరము తయారై ఉంది. కుటీరములో అన్ని సుఖాలు ఉన్నాయి. ఇప్పుడు పిల్లలైన మీరు
పురుషార్థము చేసి మనుష్యుల నుండి దేవతలుగా తయారవ్వాలి. డ్రామాలో ఏదైతే గతించిపోయిందో,
అది మళ్ళీ ఏక్యురేట్ గా రిపీట్ అవుతుందని మీకు తెలుసు, అందుకే ఎవ్వరికీ కూడా - భక్తి
వదిలేయమని సలహా ఇవ్వకూడదు. ఎప్పుడైతే జ్ఞానము బుద్ధిలోకి వస్తుందో, అప్పుడు - నేను
ఆత్మను, నేను ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అని అర్థం
చేసుకుంటారు. అనంతమైన తండ్రిని గుర్తించినప్పుడు హద్దు విషయాలు సమాప్తమైపోతాయి.
తండ్రి అంటారు, గృహస్థ వ్యవహారములో ఉంటూ కేవలం బుద్ధియోగాన్ని తండ్రితో జోడించాలి.
శరీర నిర్వహణ కోసం కర్మలు కూడా చేయాలి. భక్తిలో కూడా కొంతమంది ఎంతో నవ విధ భక్తిని
చేస్తారు. నియమబద్ధముగా రోజూ వెళ్ళి దర్శనము చేసుకుంటారు. దేహధారుల వద్దకు
వెళ్ళడమంటే, అవన్నీ దైహిక యాత్రలు. భక్తి మార్గములో ఎన్ని ఎదురుదెబ్బలు తినవలసి
ఉంటుంది. ఇక్కడ ఎటువంటి ఎదురుదెబ్బలు తినవలసింది ఉండదు. ఎవరైనా వస్తే వారికి అర్థం
చేయించేందుకని కూర్చోబెట్టడము జరుగుతుంది. అంతేకానీ, స్మృతి కోసం ఏదైనా ఒక్క
స్థానములోనే కూర్చుండిపోవలసిన అవసరము లేదు. భక్తి మార్గములో శ్రీకృష్ణుని
భక్తులెవరైనా ఉంటే, వారు నడుస్తూ-తిరుగుతూ శ్రీకృష్ణుడిని స్మృతి చేయలేరు అని కాదు.
అందుకే చదువుకున్నవారు ఏమంటూ ఉంటారంటే, శ్రీకృష్ణుని చిత్రము ఇంట్లోనే ఉంది కదా,
మళ్ళీ మీరు మందిరాలకు ఎందుకు వెళ్తున్నారు, శ్రీకృష్ణుని చిత్రానికి మీరు ఎక్కడైనా
పూజ చేయవచ్చు కదా, అచ్ఛా, చిత్రము పెట్టుకోకపోయినా, స్మృతి చేస్తూ ఉండండి, ఒక్కసారి
దేనినైనా చూస్తే అది గుర్తుంటుంది. మీకు కూడా ఇదే చెప్తున్నారు - శివబాబాను మీరు
ఇంట్లో కూర్చుని స్మృతి చేయలేరా? ఇది కొత్త విషయము. శివబాబా గురించి ఎవ్వరికీ
తెలియదు. వారి నామ, రూప, దేశ, కాలాల గురించి తెలియనే తెలియదు, అందుకే సర్వవ్యాపి
అనేస్తారు. ఆత్మను పరమాత్మ అనైతే అనరు. ఆత్మకు తండ్రి స్మృతి కలుగుతుంది. కానీ
తండ్రి గురించి తెలియదు కావున 7 రోజులు అర్థం చేయించవలసి ఉంటుంది. ఆ తర్వాత
విస్తారమైన పాయింట్లు కూడా అర్థం చేయించడము జరుగుతుంది. తండ్రి జ్ఞానసాగరుడు కదా.
ఎంత సమయము నుండి వింటూ వచ్చారు ఎందుకంటే ఇది జ్ఞానము కదా. మాకు మనుష్యుల నుండి
దేవతలుగా తయారయ్యే జ్ఞానము లభిస్తుందని మీరు భావిస్తారు. తండ్రి అంటారు, మీకు
కొత్త-కొత్త గుహ్యమైన విషయాలను వినిపిస్తాను. మీకు మురళీ లభించకపోతే మీరు ఎంతగా
అలమటిస్తారు. తండ్రి అంటారు, మీరు తండ్రిని స్మృతి అయితే చేయండి. మురళీని చదువుతారు,
మళ్ళీ మర్చిపోతారు. మొట్టమొదటైతే ఇది గుర్తుంచుకోవాలి - నేను ఆత్మను, ఇంత చిన్న
బిందువును. ఆత్మను కూడా తెలుసుకోవాలి. వీరి ఆత్మ బయటకు వచ్చి మరొకరిలో
ప్రవేశించిందని అంటారు. ఆత్మ అయిన మనమే జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ ఇప్పుడు పతితముగా,
అపవిత్రముగా అయిపోయాము. మొదట మీరు పవిత్రమైన గృహస్థ ధర్మానికి చెందినవారిగా ఉండేవారు.
లక్ష్మీ-నారాయణులు ఇరువురూ పవిత్రముగా ఉండేవారు. మళ్ళీ ఇరువురూ అపవిత్రముగా అయ్యారు,
మళ్ళీ ఇరువురూ పవిత్రముగా అవుతారు, మరి వారు అపవిత్రుల నుండి పవిత్రులుగా అయ్యారా
లేక పవిత్ర జన్మ తీసుకున్నారా? మీరు ఏ విధముగా పవిత్రముగా ఉండేవారు, ఆ తర్వాత వామ
మార్గములోకి వెళ్ళడముతో ఏ విధముగా అపవిత్రముగా అయ్యారు అన్నది తండ్రి కూర్చుని అర్థం
చేయిస్తున్నారు. పూజారులను అపవిత్రులని, పూజ్యులను పవిత్రులని అంటారు. మొత్తము
ప్రపంచమంతటి చరిత్ర-భౌగోళికాలు మీ బుద్ధిలో ఉన్నాయి. ఎవరెవరు రాజ్యము చేసేవారు, ఎలా
వారికి రాజ్యము లభించింది అనేది మీకు తెలుసు, ఇది తెలిసినవారు మరెవ్వరూ లేరు. మీ
వద్ద కూడా ఇంతకుముందు ఈ రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము లేదు, అనగా
నాస్తికులుగా ఉండేవారు. ఇంతకుముందు తెలియదు. నాస్తికులుగా అవ్వడము వలన ఎంత
దుఃఖితులుగా అయిపోతారు. ఇప్పుడు మీరు ఈ విధముగా దేవతలుగా అయ్యేందుకు ఇక్కడకు వచ్చారు.
అక్కడ ఎన్ని సుఖాలు ఉంటాయి. దైవీ గుణాలను కూడా ఇక్కడే ధారణ చేయాలి. ప్రజాపిత బ్రహ్మా
యొక్క సంతానము సోదరీ-సోదరులు అవుతారు కదా. వికారీ దృష్టి కలగకూడదు, ఇందులోనే శ్రమ
ఉంది. కనులు చాలా అశుద్ధముగా ఉన్నాయి. అన్ని ఇంద్రియాల కన్నా అశుద్ధమైనవి కనులు.
అర్ధకల్పము అశుద్ధముగా, అర్ధకల్పము శుద్ధముగా ఉంటాయి. సత్యయుగములో అశుద్ధముగా ఉండవు.
కనులు అశుద్ధముగా ఉన్నట్లయితే అసురులుగా పిలవబడతారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు -
నేను పతిత ప్రపంచములోకి వస్తాను. ఎవరైతే పతితముగా అయ్యారో, వారే పావనముగా అవ్వాలి.
వీరు తనను తాను భగవంతుడిగా చెప్పుకుంటున్నారని మనుష్యులు అంటారు. వృక్షములో చూడండి,
పూర్తిగా తమోప్రధాన ప్రపంచము యొక్క అంతిమములో నిలబడి ఉన్నారు, వారే మళ్ళీ తపస్య
చేస్తున్నారు. సత్యయుగము నుండి లక్ష్మీ-నారాయణుల వంశావళి కొనసాగుతుంది. కాలము కూడా
ఈ లక్ష్మీ-నారాయణుల నుండే లెక్కించబడుతుంది, అందుకే బాబా అంటారు, లక్ష్మీ-నారాయణుల
రాజ్యాన్ని చూపించినప్పుడు, దానికి 1250 సంవత్సరాల తర్వాత త్రేతాయుగము వస్తుందని
వ్రాయండి. శాస్త్రాలలో లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా
ఉంది కదా. బ్రహ్మా యొక్క రాత్రి అర్ధకల్పము, బ్రహ్మా యొక్క పగలు అర్ధకల్పము - ఈ
విషయాలను తండ్రియే అర్థం చేయిస్తారు. అయినా బాబా అంటారు - మధురమైన పిల్లలూ,
స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి. వారిని స్మృతి చేస్తూ-చేస్తూ
మీరు పావనముగా అయిపోతారు, అప్పుడు అంతిమ స్థితిని బట్టి మరుసటి జన్మ ఉంటుంది. బాబా
ఏమీ ఇక్కడే కూర్చుండిపోండి అని చెప్పరు. సర్వీసబుల్ పిల్లలనైతే కూర్చోబెట్టరు.
సెంటర్లు, మ్యూజియంలు మొదలైనవి తెరుస్తూ ఉంటారు. మీరు వచ్చి దైవీ జన్మసిద్ధ
అధికారమైన విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకోండి అని ఎంతమందికి ఆహ్వానాలు పంచుతూ ఉంటారు.
మీరు తండ్రికి పిల్లలు. తండ్రి స్వర్గ రచయిత కావున మీకు కూడా స్వర్గ వారసత్వము
ఉండాలి. తండ్రి అంటారు, నేను ఒక్కసారి మాత్రమే స్వర్గ స్థాపన చేయడానికి వస్తాను.
ప్రపంచము ఒక్కటే, దాని చక్రమే తిరుగుతూ ఉంటుంది. మనుష్యులకైతే అనేక మతాలు, అనేక
విషయాలు ఉన్నాయి. ఎన్ని మత-మతాంతరాలు ఉన్నాయి. దీనిని అద్వైత మతమని అంటారు. వృక్షము
ఎంత పెద్దది. ఎన్ని కొమ్మలు-రెమ్మలు వెలువడుతాయి. ఎన్ని ధర్మాలు వ్యాపిస్తున్నాయి,
మొదటైతే ఒకే మతము, ఒకే రాజ్యము ఉండేది. మొత్తము విశ్వమంతటిపైనా వీరి రాజ్యము ఉండేది.
ఇది కూడా మీకు ఇప్పుడు తెలిసింది. మనమే మొత్తము విశ్వమంతటికీ యజమానులుగా ఉండేవారము.
ఆ తర్వాత 84 జన్మలు అనుభవించి నిరుపేదలుగా అయ్యాము. ఇప్పుడు మీరు కాలుడిపై విజయము
పొందుతారు, అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువు ఉండదు. ఇక్కడైతే చూడండి, కూర్చుని-కూర్చునే
అకాల మృత్యువులు జరుగుతూ ఉంటాయి. నలువైపులా మృత్యువే మృత్యువు ఉంది. అక్కడ ఇలా ఉండదు,
జీవితములో పూర్ణాయుష్షు ఉంటుంది. భారత్ లో పవిత్రత, శాంతి, సంపద ఉండేవి. సగటున 150
సంవత్సరాల ఆయుష్షు ఉండేది, ఇప్పుడు ఎంత ఆయుష్షు ఉంటుంది?
ఈశ్వరుడు మీకు యోగాన్ని నేర్పించారు కావున మిమ్మల్ని యోగేశ్వరులు అని అంటారు.
అక్కడ అలా అనరు. ఈ సమయములో మీరు యోగేశ్వరులు, మీకు ఈశ్వరుడు రాజయోగాన్ని
నేర్పిస్తున్నారు. ఆ తర్వాత రాజ-రాజేశ్వరులుగా అవ్వాలి. ఇప్పుడు మీరు జ్ఞానేశ్వరులు,
ఆ తర్వాత రాజేశ్వరులుగా అనగా రాజులకే రాజులుగా అవుతారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. కనులను శుద్ధముగా తయారుచేసుకునేందుకు కృషి చేయాలి. సదా బుద్ధిలో ఉండాలి - మేము
ప్రజాపిత బ్రహ్మాకు పిల్లలము, పరస్పరములో సోదరీ-సోదరులము, అశుద్ధమైన దృష్టిని
ఉంచుకోకూడదు.
2. శరీర నిర్వహణార్థము కర్మలు చేస్తూ బుద్ధి యోగాన్ని ఒక్క తండ్రితో జోడించాలి,
హద్దులోని విషయాలన్నింటినీ వదిలి అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. అనంతమైన
సన్యాసులుగా అవ్వాలి.
వరదానము:-
బాబా అనే పదము యొక్క స్మృతి ద్వారా కారణాన్ని నివారణలోకి
పరివర్తన చేసే సదా అచలముగా, స్థిరముగా కండి
ఏ పరిస్థితి అయినా, అది అలజడి కలిగించేదిగా ఉన్నా, బాబా
అని అనగానే అచలముగా అయిపోతారు. ఎప్పుడైతే పరిస్థితుల చింతనలోకి వెళ్ళిపోతారో,
అప్పుడు కష్టము అనేది అనుభవమవుతుంది. ఒకవేళ కారణానికి బదులుగా నివారణలోకి
వెళ్ళిపోయినట్లయితే ఆ కారణమే నివారణగా అయిపోతుంది ఎందుకంటే మాస్టర్
సర్వశక్తివంతులైన బ్రాహ్మణుల ఎదురుగా పరిస్థితులు చీమ సమానమైనవి కూడా కావు. కేవలం -
ఏమి జరిగింది, ఎందుకు జరిగింది అని ఆలోచించేందుకు బదులుగా ఏది జరిగినా అందులో
కళ్యాణము నిండి ఉంది, సేవ నిండి ఉంది... అని భావించాలి. రూపము పరిస్థితిదే అయినా
కానీ అందులో ఇమిడి ఉన్నది సేవ అని ఆ రూపముతో దానిని చూసినట్లయితే సదా అచలముగా,
స్థిరముగా ఉంటారు.
స్లోగన్:-
ఒక్క
తండ్రి ప్రభావములో ఉండేవారు ఏ ఆత్మ ప్రభావములోకి రాలేరు.
అవ్యక్త ప్రేరణలు -
ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి
కర్మాతీత స్థితిని
ప్రాప్తి చేసుకునేందుకు సదా సాక్షీగా అయ్యి కార్యము చెయ్యండి. సాక్షీ అనగా సదా
అతీతమైన మరియు ప్రియమైన స్థితిలో ఉంటూ కర్మను చేసే అలౌకిక ఆత్మను, అలౌకిక అనుభూతిని
చేసే, అలౌకిక జీవితము కల, శ్రేష్ఠ జీవితము కల ఆత్మను - ఈ నషా ఉండాలి. కర్మలు చేస్తూ
ఈ అభ్యాసాన్నే పెంచుకుంటూ ఉండండి, అప్పుడు కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకుంటారు.
| | | |