05-06-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - అనంతమైన సుఖాల కొరకు మీకు అనంతమైన
జ్ఞానము లభిస్తుంది, మీరు మళ్ళీ రాజయోగ శిక్షణ ద్వారా రాజ్యాన్ని తీసుకుంటున్నారు’’
ప్రశ్న:-
మీ
ఈశ్వరీయ కుటుంబము ఏ విషయములో పూర్తిగా అతీతమైనది?
జవాబు:-
ఈ ఈశ్వరీయ
కుటుంబములో కొందరు ఒక్క రోజు పిల్లలు ఉన్నారు, కొందరు ఎనిమిది రోజుల పిల్లలు ఉన్నారు,
కానీ అందరూ చదువుకుంటున్నారు. తండ్రియే టీచరుగా అయి తమ పిల్లలను చదివిస్తున్నారు.
ఇది అతీతమైన విషయము. ఆత్మ చదువుకుంటుంది. ఆత్మ ‘బాబా’ అని అంటుంది మరియు బాబా
పిల్లలకు 84 జన్మల కథను వినిపిస్తారు.
పాట:-
దూరదేశ నివాసి...
ఓంశాంతి
వృక్షపతి వారము, దీనికి బృహస్పతి వారము అన్న పేరును పెట్టారు. ఈ పండుగలు
మొదలైనవాటినైతే ప్రతి సంవత్సరము జరుపుకుంటారు. మీరు ప్రతి వారము బృహస్పతి రోజును
జరుపుకుంటారు. వృక్షపతి అనగా ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజరూపుడు, వారు
చైతన్యమైనవారు, వారికే ఈ వృక్షము యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలుసు, ఇక మిగిలిన
వృక్షాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జడమైనవి. ఇది చైతన్యమైనది, దీనిని కల్పవృక్షము అని
అంటారు. దీని ఆయువు 5000 సంవత్సరాలు మరియు ఈ వృక్షము నాలుగు భాగాలలో ఉంది. ప్రతి
వస్తువు నాలుగు భాగాలలో ఉంటుంది. ఈ ప్రపంచము కూడా నాలుగు భాగాలలో ఉంది. ఇప్పుడు ఇది
ఈ పాత ప్రపంచము యొక్క అంతిమము. ప్రపంచము ఎంత పెద్దది, ఈ జ్ఞానము మనుష్యమాత్రులెవ్వరి
బుద్ధిలోనూ లేదు. ఇది కొత్త ప్రపంచము కోసం కొత్త శిక్షణ. అలాగే కొత్త ప్రపంచము
యొక్క రాజులుగా అయ్యేందుకు అనగా ఆది సనాతన దేవీ-దేవతలుగా అయ్యేందుకు శిక్షణ కూడా
కొత్తదే. భాష అయితే హిందీయే. బాబా అర్థం చేయించారు, ఎప్పుడైతే వేరే రాజ్యము స్థాపన
అవుతుందో, అప్పుడు వారి భాష వేరుగా ఉంటుంది. సత్యయుగములో ఏ భాష ఉంటుంది? అది
పిల్లలకు కొద్ది-కొద్దిగా తెలుసు. పూర్వము కుమార్తెలు ధ్యానములోకి వెళ్ళి
చెప్తుండేవారు. అక్కడ సంస్కృతం ఏమీ ఉండదు. సంస్కృతం అయితే ఇక్కడ ఉంది కదా. ఏదైతే
ఇక్కడ ఉంటుందో, అది అక్కడ ఉండదు. వీరు వృక్షపతి అని పిల్లలకు తెలుసు. వారిని తండ్రి
మరియు వృక్ష రచయిత అని కూడా అంటారు. వీరు చైతన్య బీజరూపుడు. అవన్నీ జడమైన బీజాలు.
పిల్లలు సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల గురించి కూడా తెలుసుకోవాలి కదా. ఈ సమయములో
జ్ఞానము లేని కారణముగా మనుష్యులకు సుఖము లేదు. ఇది అనంతమైన జ్ఞానము, దీని ద్వారా
అనంతమైన సుఖము లభిస్తుంది. హద్దు జ్ఞానము ద్వారా కాకిరెట్టతో సమానమైన సుఖము
లభిస్తుంది. మనము అనంతమైన సుఖము కోసం ఇప్పుడు మళ్ళీ పురుషార్థము చేస్తున్నామని మీకు
తెలుసు. ఈ ‘మళ్ళీ’ అన్న పదాన్ని కేవలం మీరే వింటారు. మీరే మళ్ళీ మనుష్యుల నుండి
దేవతలుగా అయ్యేందుకు ఈ రాజయోగ శిక్షణను ప్రాప్తి చేసుకుంటున్నారు. జ్ఞానసాగరుడైన
తండ్రి నిరాకారుడు అన్నది కూడా మీకు తెలుసు. పిల్లలైన ఆత్మలు కూడా నిరాకారియే, కానీ
అందరికీ తమ-తమ శరీరాలు ఉన్నాయి. వీరిది అలౌకిక జన్మ అని అంటారు. వీరి వంటి జన్మను
ఇతర మనుష్యులెవ్వరూ తీసుకోలేరు. ఇతని యొక్క వానప్రస్థావస్థలో ప్రవేశిస్తారు.
పిల్లలకు (ఆత్మలకు) సమ్ముఖములో కూర్చుని అర్థం చేయిస్తారు, ఇంకెవ్వరూ ఆత్మలను
పిల్లలు-పిల్లలు అని పిలవలేరు. ఏ ధర్మము వారికైనా, శివబాబా ఆత్మలైన మనకు తండ్రి అని
తెలుసు. వారు తప్పకుండా పిల్లలు-పిల్లలు అనే పిలుస్తారు. మిగిలిన
మనుష్యాత్మలెవ్వరినీ ఈశ్వరుడు అని అనలేరు, బాబా (తండ్రి) అని అనలేరు. వాస్తవానికి
గాంధీని కూడా బాపూ అని పిలిచేవారు. మున్సిపాలిటీ మేయర్ ను కూడా ఫాదర్ అని అంటారు.
కానీ ఆ తండ్రులందరూ దేహధారులు. ఆత్మలైన మన తండ్రి మనల్ని చదివిస్తున్నారని మీకు
తెలుసు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి ఘడియ-ఘడియ చెప్తారు. ఆ తండ్రి వచ్చి
చదివించేది కూడా ఆత్మలనే. ఇది ఈశ్వరీయ కుటుంబము. తండ్రికి ఇంతమంది పిల్లలు ఉన్నారు.
బాబా, మేము మీకు చెందినవారము అని మీరు కూడా అంటారు. కావున మీరు పిల్లలు అయ్యారు.
బాబా, నేను ఒక్క రోజు బిడ్డను, నేను ఎనిమిది రోజుల బిడ్డను, నేను ఒక నెల బిడ్డను అని
అంటారు. మొదట తప్పకుండా చిన్నగానే ఉంటారు. రెండు, నాలుగు రోజుల బిడ్డ అయినా సరే,
ఇంద్రియాలైతే పెద్దవే కదా, అందుకే పెద్ద పిల్లలందరికీ చదువు అవసరము. ఎవరైతే వస్తారో
వారందరినీ తండ్రి చదివిస్తారు. మీరు కూడా చదువుకుంటారు. తండ్రికి పిల్లలుగా అయ్యాక,
మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారు అనేది తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు,
నేను కూడా అనేక జన్మల అంతిమములో ఇతనిలోకి ప్రవేశిస్తాను మరియు మళ్ళీ చదివిస్తాను.
ఇక్కడ మనము అత్యంత గొప్ప టీచరు వద్దకు వచ్చామని పిల్లలకు తెలుసు. వారి నుండే ఈ
టీచర్లు వెలువడ్డారు, వీరిని పండాలు (మార్గదర్శకులు) అని అంటారు. వీరు కూడా అందరినీ
చదివిస్తూ ఉంటారు. ఎవరెవరు తెలుసుకుంటూ ఉంటారో, వారు చదివిస్తూ ఉంటారు.
మొట్టమొదట అర్థం చేయించాల్సిన విషయమేమిటంటే - ఇద్దరు తండ్రులు ఉన్నారు కదా. ఒకరు
లౌకిక తండ్రి మరియు ఇంకొకరు పారలౌకిక తండ్రి. వారిలో పెద్దవారైతే తప్పకుండా
పారలౌకిక తండ్రియే, వారిని భగవంతుడు అని అంటారు. ఇప్పుడు మనకు పారలౌకిక తండ్రి
లభించారని మీకు తెలుసు, ఈ విషయము ఇంకెవ్వరికీ తెలియదు. మెల్ల-మెల్లగా తెలుసుకుంటూ
ఉంటారు. ఆత్మలైన మనకు బాబా చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మలైన మనమే ఒక
శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాము. ఉన్నతోన్నతమైన దేవతలుగా అవుతాము.
ఉన్నతోన్నతమైనవారిగా అయ్యేందుకే వచ్చారు. చాలామంది పిల్లలు నడుస్తూ-నడుస్తూ
ఉన్నతోన్నతమైన చదువును వదిలేస్తారు, ఏదో ఒక విషయములో సంశయము వచ్చేస్తుంది లేదా మాయ
తీసుకువచ్చే ఏదైనా తుఫానును సహించలేకపోతారు, కామమనే మహాశత్రువుతో ఓడిపోతారు, ఈ
కారణాల వలనే చదువును వదిలేస్తారు. కామమనే మహాశత్రువు కారణముగానే పిల్లలు ఎంతగానో
సహించవలసి వస్తుంది. తండ్రి అంటారు, కల్ప-కల్పమూ అబలలు, మాతలైన మీరే పిలుస్తారు.
బాబా, మమ్మల్ని వివస్త్రముగా అవ్వడము నుండి రక్షించండి అని అంటారు. తండ్రి అంటారు,
స్మృతి తప్ప వేరే మార్గమేమీ లేదు. స్మృతి ద్వారానే బలం లభిస్తూ ఉంటుంది. బలశాలి
అయిన మాయ యొక్క శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఇక మీరు విముక్తులైపోతారు. ఇలా ఎంతోమంది
బంధనాల నుండి విముక్తులై వస్తారు. ఇక ఆ తర్వాత అత్యాచారాలు జరగడం ఆగిపోతుంది,
అప్పుడు వచ్చి బ్రహ్మా ద్వారా శివబాబాతో మాట్లాడుతారు. ఇది కూడా అలవాటైపోవాలి. మనము
శివబాబా వద్దకు వెళ్తున్నామని బుద్ధిలో ఉండాలి. వారు ఈ బ్రహ్మా తనువులోకి వస్తారు.
మనము శివబాబా ఎదురుగా కూర్చున్నాము. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి.
స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. ఇదే శిక్షణ లభిస్తుంది. తండ్రిని
కలుసుకోవడానికి వచ్చినప్పుడు కూడా స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మాభిమానీ భవ. ఈ
జ్ఞానము కూడా మీకు ఇప్పుడే లభిస్తుంది. ఇదే శ్రమ. ఆ భక్తి మార్గములోనైతే ఎన్ని
వేద-శాస్త్రాలు మొదలైనవి చదువుతారు. ఇక్కడైతే కేవలం ఒకటే శ్రమ ఉంది - కేవలం స్మృతి
చేసే శ్రమ. ఇది ఎంతో సహజాతి సహజము కూడా, అలాగే అతి కష్టతరమైనది కూడా. తండ్రిని
స్మృతి చేయడము - దీని కన్నా సహజమైన విషయము ఇంకేదీ ఉండదు. కొడుకు జన్మించగానే నోటి
నుండి బాబా-బాబా అని వెలువడుతుంది. కూతురి నోటి నుండి అమ్మా అని వెలువడుతుంది. ఆత్మ
స్త్రీ శరీరాన్ని ధారణ చేసింది. స్త్రీ తల్లి దగ్గరకే వెళ్తుంది. కొడుకు చాలా వరకు
తండ్రిని గుర్తు చేస్తాడు ఎందుకంటే వారసత్వము లభిస్తుంది. ఇప్పుడు ఆత్మలైన మీరందరూ
అయితే కొడుకులు. మీకు వారసత్వము తండ్రి నుండి లభిస్తుంది. స్మృతి చేయడం ద్వారా
ఆత్మకు తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. దేహాభిమానులుగా ఉన్నట్లయితే వారసత్వము
పొందడము కష్టమవుతుంది. తండ్రి అంటారు, నేను పిల్లలనే చదివిస్తాను. పిల్లలైన మమ్మల్ని
తండ్రి చదివిస్తున్నారని పిల్లలకు కూడా తెలుసు. ఈ విషయాలను తండ్రి తప్ప ఇంకెవ్వరూ
తెలియజేయలేరు. భక్తి మార్గములో మీకు వారి పట్లే ప్రేమ ఉండేది. ఆ ప్రియునికి మీరందరూ
ప్రేయసులుగా ఉండేవారు. మొత్తము ప్రపంచమంతా ఆ ఒక్క ప్రియునికే ప్రేయసులు. పరమాత్మను
అందరూ పరమపిత అని కూడా అంటారు. తండ్రిని ప్రేయసి అని అనరు. తండ్రి అర్థం
చేయిస్తున్నారు, మీరు భక్తి మార్గములో ప్రేయసులుగా ఉండేవారు. ఇప్పటికీ కూడా ఎంతోమంది
ప్రేయసులు ఉన్నారు, కానీ పరమాత్మ అని ఎవరిని అంటారు, ఈ విషయములో చాలా తికమకపడతారు.
గణేషుడు, హనుమంతుడు మొదలైనవారిని కూడా పరమాత్మ అని అంటూ దారము పూర్తిగా చిక్కు
ముడులు పడేలా చేసేసారు. వారొక్కరు తప్ప ఇంకెవ్వరూ ఈ విషయాన్ని సరిదిద్దలేరు. ఎవరికీ
అంతటి శక్తి లేదు. తండ్రియే వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలు మళ్ళీ
నంబరువారు పురుషార్థానుసారముగా అర్థం చేసుకుంటారు మరియు అర్థం చేయించేందుకు
యోగ్యులుగా అవుతారు. రాజధాని స్థాపన అవుతోంది. కల్ప పూర్వము వలె యథావిధిగా మీరు
ఇక్కడ చదువుకుంటారు. ఆ తర్వాత ప్రారబ్ధాన్ని కొత్త ప్రపంచములో పొందుతారు, దానిని
అమరలోకము అని అంటారు. మీరు కాలుడిపై విజయము పొందుతారు. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువు
జరగదు. దాని పేరే స్వర్గము. పిల్లలైన మీకు ఈ చదువులో ఎంతో సంతోషము ఉండాలి. తండ్రి
గుర్తు రావడముతో తండ్రి ఇచ్చే ఆస్తి కూడా గుర్తుకువస్తుంది. క్షణములో మొత్తము డ్రామా
యొక్క జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము, 84
జన్మల చక్రము, అంతే, ఈ నాటకమంతా భారత్ పైనే తయారై ఉంది. మిగిలినవన్నీ ఉపకథలు. తండ్రి
జ్ఞానాన్ని కూడా మీకే వినిపిస్తారు. మీరే ఉన్నతోన్నతమైనవారిగా అయ్యారు, మళ్ళీ
కనిష్టమైనవారిగా అయ్యారు. డబుల్ కిరీటధారులైన రాజులే మళ్ళీ పూర్తిగా నిరుపేదలుగా
అయ్యారు. ఇప్పుడు భారత్ నిరుపేదగా, బికారిగా ఉంది. ప్రజలపై ప్రజల రాజ్యము ఉంది.
సత్యయుగములో డబుల్ కిరీటధారులైన మహారాజు-మహారాణుల రాజ్యము ఉండేది. ఆదిదేవ్ అయిన
బ్రహ్మాకు ఎన్నో పేర్లను పెట్టారు అని అందరూ అంగీకరిస్తారు. మహావీర్ అని కూడా వారినే
అంటారు, అలాగే మహావీర్ అని హనుమంతుడిని కూడా అంటారు. వాస్తవానికి పిల్లలైన మీరే
సత్యాతి-సత్యమైన మహావీర హనుమానులు, ఎందుకంటే మీరు యోగములో ఎంతగా ఉంటారంటే, మాయ
తుఫానులు ఎన్ని వచ్చినా కానీ అవి మిమ్మల్ని కదిలించలేవు. మహావీరుని పిల్లలైన మీరు
మహావీరులుగా అయ్యారు, ఎందుకంటే మీరు మాయపై విజయము పొందుతారు. 5 వికారాల రూపీ
రావణునిపై ప్రతి ఒక్కరూ విజయము పొందుతారు. ఇది ఒక్క మనిషికి సంబంధించిన విషయము కాదు.
మీలోని ప్రతి ఒక్కరూ ధనస్సును విరచాలి అనగా మాయపై విజయము పొందాలి. ఇందులో యుద్ధము
మొదలైనవాటి విషయమేదీ లేదు. యూరప్ వాసులు ఎలా కొట్లాడుకుంటారు. భారత్ లో కౌరవులకు
మరియు యాదవులకు మధ్యన యుద్ధము జరుగుతుంది. రక్తపు నదులు ప్రవహిస్తాయని అంటూ ఉంటారు,
అలాగే పాల నదులు కూడా ప్రవహిస్తాయి. విష్ణువును క్షీర సాగరములో చూపిస్తారు,
లక్ష్మీ-నారాయణులు పారసనాథులు. వారికి నేపాల్ వైపు పశుపతి అన్న పేరు పెట్టారు. ఒక్క
విష్ణువుకే రెండు రూపాలు ఉన్నాయి, పారసనాథుడు, పారసనాథిని. వారు పశుపతినాథ పతి,
పశుపతినాథ పత్ని. అందులో విష్ణువు చిత్రాన్ని తయారుచేస్తారు. చిన్న కొలను కూడా
తయారుచేస్తారు. మరి ఇప్పుడు ఆ కొలనులోకి పాలు ఎక్కడి నుండి వచ్చాయి. ముఖ్యమైన రోజున
ఆ కొలనులో పాలు వేస్తారు, వేసి క్షీరసాగరములో విష్ణువు చారబడినట్లుగా చూపిస్తారు.
దాని అర్థమేమీ లేదు. 4 భుజాలు గల మనుష్యులెవ్వరూ ఉండరు.
ఇప్పుడు పిల్లలైన మీరు సమాజ సేవకులు. మీరు ఆత్మిక తండ్రికి పిల్లలు కదా. తండ్రి
అన్ని విషయాలను అర్థం చేయిస్తారు, ఇందులో ఎటువంటి సంశయము రాకూడదు. సంశయము అనగా మాయ
తుఫాను. ఓ పతిత-పావనా రండి, వచ్చి మమ్మల్ని పావనముగా తయారుచేయండి అని మీరు నన్ను
పిలుస్తారు. తండ్రి అంటారు - నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా
అయిపోతారు. 84 జన్మల చక్రాన్ని కూడా స్మృతి చేయాలి. తండ్రిని పతిత-పావనుడు,
జ్ఞానసాగరుడు అని అంటారు. ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. వారు పతితులను పావనముగా
తయారుచేస్తారు మరియు 84 జన్మల చక్రానికి సంబంధించిన జ్ఞానాన్ని వినిపిస్తారు. 84
జన్మల చక్రము కొనసాగుతూనే ఉంటుందని కూడా పిల్లలైన మీకు తెలుసు, దానికి అంతము లేదు.
తండ్రి ఎంత మధురమైనవారు, వారిని పతులకే పతి అని కూడా అంటారు, ఇది కూడా మీకు
నంబరువారు పురుషార్థానుసారముగా తెలుసు. వారు తండ్రి కూడా. ఇప్పుడు తండ్రి అంటారు -
నా నుండి పిల్లలైన మీకు చాలా గొప్ప వారసత్వము లభిస్తుంది. కానీ ఇలాంటి తండ్రినైన
నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోతారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది, చదువునే
వదిలేస్తారు, అనగా వదిలేసి వెళ్ళిపోతారు, ఎంత అవివేకులుగా ఉన్నారు. ఎవరైతే
వివేకవంతులైన పిల్లలు ఉన్నారో, వారు సహజముగానే అన్ని విషయాలను అర్థం చేసుకుని
ఇతరులను చదివించడం మొదలుపెడతారు. ఆ చదువు ద్వారా ఏమి లభిస్తుంది మరియు ఈ చదువు
ద్వారా ఏమి లభిస్తుంది, మరి ఏమి చదువుకోవాలి అనేది వారు వెంటనే నిర్ణయము తీసుకుంటారు.
బాబా పిల్లలను అడుగుతారు. ఈ చదువు చాలా మంచిది అని పిల్లలు అర్థం చేసుకుంటారు కూడా,
అయినా మళ్ళీ ఇలా అంటారు - ఏం చేయాలి, లౌకిక చదువును చదువుకోకపోతే మిత్ర-సంబంధీకులు
మొదలైనవారు అసంతుష్టులవుతారు అని. తండ్రి అంటారు - రోజురోజుకు సమయము చాలా తగ్గిపోతూ
ఉంటుంది. ఇంతటి చదువునైతే చదువుకోలేరు. చాలా తీవ్రతతో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ప్రతి వైపు నుండి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి కదా. రోజురోజుకు ఒకరి పట్ల ఒకరికి
శత్రుత్వము పెరుగుతూ ఉంటుంది. ఎటువంటి వస్తువులను తయారుచేసామంటే అవి వెంటనే అందరినీ
అంతం చేసేస్తాయి అని అంటారు కూడా. డ్రామానుసారముగా ఇప్పుడింకా యుద్ధము మొదలవ్వదు,
రాజ్య స్థాపన జరగనున్నది, అప్పటివరకు మనము కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాము అని
పిల్లలైన మీకు తెలుసు. వీరు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మీ ప్రభావము చివరిలో
ఎంతగానో వెలువడనున్నది. ఓ ప్రభూ నీ లీల అని గానము కూడా చేస్తారు. ఇది ఈ సమయము యొక్క
గాయనమే. మీరు ఇచ్చే గతి, మీరు చూపే మార్గము అతీతమైనవి అని కూడా అంటూ ఉంటారు.
ఆత్మలందరి పాత్ర అతీతమైనది. ఇప్పుడు తండ్రి మీకు శ్రీమతాన్ని ఇస్తున్నారు -
నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. శ్రీమతము ఎక్కడ,
మనుష్యుల మతము ఎక్కడ. విశ్వములో శాంతిని పరమపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ
స్థాపించలేరని మీకు తెలుసు. 100 శాతం పవిత్రత, సుఖ-శాంతులను 5000 సంవత్సరాల క్రితం
వలె డ్రామానుసారముగా స్థాపన చేస్తున్నారు, అది ఎలా అనేది వచ్చి అర్థం చేసుకోండి.
పిల్లలైన మీరు కూడా సహాయకులుగా అవుతారు. ఎవరైతే ఎంతో సహాయము చేస్తారో, వారు
విజయమాలలోని మణులుగా అవుతారు. పిల్లలైన మీ పేర్లు కూడా ఎంత రమణీకముగా ఉండేవి. ఆ
పేర్ల లిస్టును ఆల్బమ్ లో పెట్టాలి. మీరు భట్టీలో ఉండేవారు, ఇళ్ళు-వాకిళ్ళను వదిలి
వచ్చి తండ్రికి చెందినవారిగా అయ్యారు. నేరుగా భట్టీలోకి వచ్చి కూర్చున్నారు. అది
ఎటువంటి పక్కా భట్టీ అంటే దాని లోపలికి ఎవ్వరూ రాలేరు. తండ్రికి చెందినవారిగా
అయిపోయారు అన్నప్పుడు మరి పేరు తప్పకుండా ఉండాలి. అన్నింటినీ సమర్పణ చేసేసారు,
అందుకే పేర్లు పెట్టారు. ఇది అద్భుతము కదా - తండ్రి అందరికీ పేర్లు పెట్టారు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఏ విషయములోనూ సంశయబుద్ధి కలవారిగా అవ్వకూడదు, మాయా తుఫానులను మహావీరులుగా అయి
దాటాలి, ఎంతగా యోగములో ఉండండి అంటే మాయా తుఫానులు కదిలించలేకపోవాలి.
2. వివేకవంతులుగా అయి తమ జీవితాన్ని ఈశ్వరీయ సేవలో నిమగ్నము చేయాలి.
సత్యాతి-సత్యమైన ఆత్మిక సమాజ సేవకులుగా అవ్వాలి. ఆత్మిక చదువును చదవాలి మరియు
చదివించాలి.
వరదానము:-
అహం (అహంకారము) మరియు వహం (అనుమానము), వీటిని సమాప్తము చేసి
దయార్ద్ర హృదయులుగా అయ్యే విశ్వ కళ్యాణకారీ భవ
ఎటువంటి అవగుణాలు కలవారైనా, కఠినమైన సంస్కారాలు కలవారైనా,
మందబుద్ధి కలవారైనా, సదా నింద చేసే ఆత్మ అయినా సరే, దయార్ద్ర హృదయులైన, విశ్వ
కళ్యాణకారీ పిల్లలెవరైతే ఉన్నారో, వారు సర్వాత్మల పట్ల లాఫుల్ గా ఉండటముతోపాటు లవ్
ఫుల్గా ఉంటారు. ఎప్పుడూ కూడా - వీరైతే ఎప్పుడూ మారనే మారలేరు, వీరైతే ఇలానే ఉంటారు...
లేదా వీరు ఏమీ చెయ్యలేరు, నేనే అంతా, అసలు వీరేమి కాదు అనేటువంటి అనుమానము వారికి
కలగదు. ఈ విధమైన అహంకారాన్ని మరియు అనుమానాన్ని వదిలి, బలహీనతలు మరియు లోపాలను
గురించి తెలిసి ఉండి కూడా క్షమించేటువంటి దయార్ద్ర హృదయులైన పిల్లలే విశ్వ కళ్యాణ
సేవలో సఫలురు అవుతారు.
స్లోగన్:-
ఎక్కడైతే బ్రాహ్మణుల తనువు-మనసు-ధనముల సహయోగము ఉంటుందో, అక్కడ సఫలత తోడుగా ఉంటుంది.
అవ్యక్త ప్రేరణలు -
ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసము చెయ్యండి, అంతర్ముఖులుగా అవ్వండి
ఆత్మలు ఎప్పుడైతే మీ
ఆత్మిక స్వరూపాన్ని అనుభవము చేస్తారో, అప్పుడు వారు బాబా వైపుకు ఆకర్షితులై, ఓహో
ప్రభూ అన్న పాటను పాడుతారు మరియు దేహ భానం పరంగా సహజముగా అర్పణ అయిపోతారు. ఓహో, మీ
భాగ్యము! ఓహో నా భాగ్యము! ఈ భాగ్యపు అనుభూతి కారణముగా దేహము మరియు దేహ సంబంధాల
స్మృతిని త్యజిస్తారు.
| | |