06-06-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - భవిష్య ఉన్నతమైన వంశములోకి వచ్చేందుకు ఆధారము చదువు, ఈ చదువు ద్వారానే మీరు బికారి నుండి రాకుమారునిగా అవ్వగలుగుతారు’’

ప్రశ్న:-
నోటిలో బంగారు చెంచా అనేది రెండు విధాలుగా ప్రాప్తించగలదు, అది ఎలా?

జవాబు:-
ఒకటి, భక్తిలో దాన-పుణ్యాలు చేయడం ద్వారా, రెండు, జ్ఞాన మార్గములో చదువు ద్వారా. భక్తిలో దాన-పుణ్యాలు చేసినట్లయితే రాజుల వద్ద లేక షావుకారుల వద్ద జన్మ తీసుకుంటారు, కానీ అది హద్దులోని విషయము. మీరు జ్ఞాన మార్గములో చదువు ద్వారా నోటిలో బంగారు చెంచాను పొందుతారు. ఇది అనంతమైన విషయము. భక్తిలో చదువు ద్వారా రాజ్యము లభించదు. ఇక్కడ ఎవరు ఎంత బాగా చదివితే, అంతటి ఉన్నత పదవిని పొందుతారు.

ఓంశాంతి
మధురాతి మధురమైన చాలాకాలం తర్వాత కలిసిన పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, దీనిని ఆత్మిక జ్ఞానము అని అంటారు. తండ్రి వచ్చి భారతవాసులైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి. తండ్రి విశేషముగా ఈ ఆజ్ఞను ఇచ్చారు కావున దీనిని పాటించాలి కదా. ఉన్నతోన్నతుడైన తండ్రి శ్రీమతము ఎంతో ప్రసిద్ధమైనది. కేవలం శివబాబానే శ్రీశ్రీ అని అనగలమని కూడా పిల్లలైన మీకు జ్ఞానముంది. వారే శ్రీశ్రీగా (శ్రేష్ఠాతి శ్రేష్ఠముగా) తయారుచేస్తారు. శ్రీ అనగా శ్రేష్ఠము. వీరిని తండ్రియే ఆ విధంగా తయారుచేసారని పిల్లలైన మీకు ఇప్పుడు తెలిసింది. మనము ఇప్పుడు కొత్త ప్రపంచము కొరకు చదువుతున్నాము. కొత్త ప్రపంచము పేరే స్వర్గము, అమరపురి. మహిమ కొరకు ఎన్నో పేర్లు ఉన్నాయి. స్వర్గము మరియు నరకము అని అంటారు కూడా. ఫలానావారు స్వర్గవాసిగా అయ్యారు అనగా అంతకుముందు నరకవాసిగా ఉన్నట్లే కదా. కానీ మనుష్యుల్లో అంతటి వివేకము లేదు. వారికి స్వర్గము, నరకము, కొత్త ప్రపంచము, పాత ప్రపంచము అని వేటిని అంటారో ఏమీ తెలియదు. బాహ్య ఆర్భాటము ఎంతగా ఉంది. తప్పకుండా మమ్మల్ని తండ్రియే చదివిస్తున్నారు అని భావించేవారు పిల్లలైన మీలో కూడా కొద్దిమందే ఉన్నారు. మనము ఈ లక్ష్మీ-నారాయణులుగా అయ్యేందుకు వచ్చాము. మనము బికారుల నుండి రాకుమారులుగా అవుతాము. మొట్టమొదట మనము వెళ్ళి రాకుమారులుగా అవుతాము. ఇది చదువు. ఏ విధంగా ఇంజినీరింగ్, బ్యారిస్టరీ మొదలైనవి చదివినప్పుడు - నేను ఇల్లు కడతాను, ఆ తర్వాత ఇది చేస్తాను, అది చేస్తాను... అని బుద్ధిలో ఉంటుంది కదా. ప్రతి ఒక్కరికీ తమ కర్తవ్యము స్మృతిలోకి వస్తుంది. పిల్లలైన మీరు వెళ్ళి ఈ చదువు ద్వారా పెద్ద ఉన్నతమైన ఇంట్లో జన్మ తీసుకోవాలి. ఎవరు ఎంత ఎక్కువగా చదువుకుంటారో, అంత ఉన్నతమైన ఇంట్లో జన్మ తీసుకుంటారు. రాజు ఇంట్లో జన్మ తీసుకుని, ఆ తర్వాత రాజ్యము చేయాలి. గోల్డెన్ స్పూన్ ఇన్ ది మౌత్ (నోటిలో బంగారు చెంచా) అని అంటూ ఉంటారు కూడా. నోటిలో బంగారు చెంచా అనేది - ఒకటేమో, ఈ జ్ఞానము ద్వారా లభించగలదు, ఇంకొకటి, దాన-పుణ్యాలు ఒకవేళ బాగా చేసినా కూడా రాజు వద్ద జన్మ లభిస్తుంది, కానీ అది హద్దులోనిది, ఇది అనంతమైనది. ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. ఏదైనా అర్థం కాకపోతే అడగవచ్చు. ఈ, ఈ విషయాల గురించి తండ్రిని అడగాలి అని నోట్ చేసుకోండి. ముఖ్యమైనది తండ్రి స్మృతి విషయమే. ఒకవేళ సంశయాలు మొదలైనవి ఏమైనా ఉంటే వాటిని వారు సరి చేసేస్తారు. భక్తి మార్గములో ఎంతో దాన-పుణ్యాలు చేస్తే, షావుకారుల వద్దకు వెళ్ళి జన్మ తీసుకుంటారని కూడా పిల్లలకు తెలుసు. ఎవరైనా చెడు పనులు చేస్తే వారికి దాని అనుసారముగా జన్మ లభిస్తుంది. కొందరికి ఎటువంటి కర్మ బంధనాలు ఉన్నాయంటే, ఇక వాటి గురించి చెప్పలేము. అవన్నీ గతంలోని కర్మ బంధనాలు. రాజులు కూడా కొందరు అలా ఉంటారు, చాలా కఠినమైన కర్మ బంధనాలు ఉంటాయి. ఈ లక్ష్మీ-నారాయణులకు అయితే ఎటువంటి బంధనాలు లేవు. అక్కడ ఉన్నది యోగబలము యొక్క రచనయే. యోగబలము ద్వారా మనము విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకోగలుగుతున్నప్పుడు, మరి దాని ద్వారా పిల్లలు జన్మించలేరా. అది ముందు నుండే సాక్షాత్కారమవుతుంది. అక్కడ అది చాలా సామాన్యమైన విషయము. సంతోషములో బాజా-భజంత్రీలు మ్రోగుతూ ఉంటాయి, వృద్ధుల నుండి చిన్న పిల్లలుగా అయిపోతారు. మహాత్ముల కంటే కూడా చిన్న పిల్లలకు ఎక్కువ గౌరవము ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే ఆ మహాత్ములు ఎంతైనా జీవితమంతా గడిపి పెద్దవారవుతారు కదా. వారికి వికారాల గురించి తెలుసు. కానీ చిన్న పిల్లలకు ఏమీ తెలియదు, అందుకే వారిని మహాత్ముల కంటే ఉన్నతులు అని అనడం జరుగుతుంది. అక్కడైతే అందరూ మహాత్ములే. శ్రీకృష్ణుడిని కూడా మహాత్మ అనే అంటారు. అతను సత్యమైన మహాత్మ. సత్యయుగములోనే మహానాత్మలు ఉంటారు. అటువంటివారు ఇక్కడ ఎవ్వరూ ఉండరు. పిల్లలైన మీకు లోలోపల ఎంతో సంతోషముండాలి. ఇప్పుడు మనము కొత్త ప్రపంచములో జన్మ తీసుకుంటాము. ఈ పాత ప్రపంచము ఇక అంతము కానున్నది. ఇల్లు పాతబడిపోతే కొత్త ఇంటి సంతోషము ఉంటుంది కదా. ఎన్ని మంచి-మంచి పాలరాతి ఇళ్ళను నిర్మిస్తారు. జైన ధర్మము వారి వద్ద ధనము ఎంతో ఉంటుంది, వారు స్వయాన్ని ఉన్నత కులము వారిగా భావిస్తారు. వాస్తవానికి ఇక్కడ ఉన్నత కులము అంటూ ఏదీ లేదు. ఉన్నత కులములో వివాహం చేయడానికి వెదుకుతారు. అక్కడ కులము మొదలైనవాటి విషయము ఉండదు. అక్కడైతే ఒక్క దేవతా కులమే ఉంటుంది, ఇంకేదీ ఉండదు. దాని కోసం మీరు సంగమములో ఈ అభ్యాసం చేస్తారు - మేము ఒక్క తండ్రి పిల్లలము, అందరమూ ఆత్మలమే. మొదట ఆత్మ, ఆ తర్వాత శరీరము. ప్రపంచములో అందరూ దేహాభిమానులుగా ఉంటారు. మీరు ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వాలి. గృహస్థ వ్యవహారములో ఉంటూ మీ అవస్థను బాగా తయారుచేసుకోవాలి. బాబాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంత పెద్ద గృహస్థము ఉంది, వారికి ఎన్ని ఆలోచనలు ఉంటూ ఉండవచ్చు. ఇతను కూడా కష్టపడవలసి ఉంటుంది. నేను సన్యాసిని ఏమీ కాను. తండ్రి వీరిలోకి ప్రవేశించారు. బ్రహ్మా, విష్ణు, శంకరుల చిత్రము కూడా ఉంది కదా. బ్రహ్మా అందరికన్నా ఉన్నతమైనవారు, మరి వారిని వదిలి తండ్రి ఇంకెవరిలోకి వస్తారు. బ్రహ్మా ఏమీ కొత్తగా జన్మించరు. వారిని ఎలా దత్తత తీసుకుంటాను, మీరు ఎలా బ్రాహ్మణులుగా అవుతారు అనేది మీరు చూస్తున్నారు కదా. ఈ విషయాల గురించి మీకే తెలుసు, ఇతరులకేమి తెలుసు. వీరొక వజ్రాల వ్యాపారి, వీరిని మీరు బ్రహ్మా అని అంటారు. ఇంతమంది బ్రాహ్మణులు, బ్రాహ్మణీలు ఎలా జన్మ తీసుకుంటారు అనేది వారికేమి తెలుసు. ఒక్కొక్క విషయములో ఎంతగా అర్థం చేయించవలసి ఉంటుంది. ఇవి చాలా గుహ్యమైన విషయాలు కదా. ఈ బ్రహ్మా వ్యక్తమైనవారు, వారు అవ్యక్తమైనవారు. వీరే పవిత్రముగా అయి అవ్యక్తమైనవారిగా అవుతారు. వీరు అంటారు - ఈ సమయములో నేను పవిత్రముగా లేను, ఇలా పవిత్రముగా అవుతూ ఉన్నాను. ప్రజాపిత అయితే ఇక్కడే ఉండాలి కదా. లేకపోతే ఎక్కడి నుండి వస్తారు. నేను పతిత శరీరములోకి వస్తాను అని తండ్రి స్వయమే అర్థం చేయిస్తున్నారు. మరి తప్పకుండా ఇతడినే ప్రజాపిత అని అంటారు. సూక్ష్మవతనములో అలా అనరు. అక్కడ ప్రజలు ఏం చేస్తారు. వీరు ఇండిపెండెంట్ గా పవిత్రముగా అయిపోతారు. ఏ విధంగా ఇతను కూడా పురుషార్థము చేస్తున్నారో, అలా మీరు కూడా పురుషార్థము చేసి ఇండిపెండెంట్ గా పవిత్రముగా అయిపోతారు. మీరు విశ్వాధిపతులుగా అవుతారు కదా. స్వర్గము వేరు, నరకము వేరు. ఇప్పుడు ఎంతగా ముక్కలు, ముక్కలుగా అయిపోయింది. ఇది 5000 సంవత్సరాల క్రితం విషయము, అప్పుడు వీరి రాజ్యము ఉండేది. వాళ్ళేమో లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. ఎవరైతే కల్పక్రితము అర్థం చేసుకుని ఉంటారో, వారే ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. ఇక్కడకు ముసల్మానులు, పారశీయులు మొదలైనవారందరూ రావడమనేది మీరు చూస్తారు. స్వయం ముసల్మానులు హిందువులకు కూడా జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఇది ఆశ్చర్యము కదా. ఒకవేళ ఎవరైనా సిక్కు ధర్మమువారు ఉంటే, వారు కూడా కూర్చుని రాజయోగాన్ని నేర్పిస్తారు. ఎవరైతే ఇతర ధర్మాలలోకి కన్వర్ట్ (బదిలీ) అయ్యారో, వారు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయి దేవతా కులములోకి వచ్చేస్తారు. అంటు కట్టడం జరుగుతుంది. మీ వద్దకు క్రిస్టియన్లు, పారశీయులు కూడా వస్తారు, అలాగే బౌద్ధులు కూడా వస్తారు. సమయము దగ్గరకు వచ్చినప్పుడు నలువైపుల నుండి మన పేరు వెలువడుతుందని మీకు తెలుసు. మీరు ఒక్క భాషణ చేసినా అనేకమంది మీ వద్దకు వచ్చేస్తారు. ఇదే మా సత్యమైన ధర్మము అని అందరికీ స్మృతి కలుగుతుంది. మన ధర్మానికి చెందినవారు ఎవరైతే ఉంటారో, వారందరూ తప్పకుండా వస్తారు కదా. ఇది లక్షల సంవత్సరాల విషయమేమీ కాదు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - మీరు నిన్న దేవతలుగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అయ్యేందుకు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు.

మీరు సత్యాతి సత్యమైన పాండవులు, పాండవులు అనగా పండాలు. వారు దైహికమైన పండాలు మరియు బ్రాహ్మణులైన మీరు ఆత్మికమైన పండాలు. మీరు ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి చదువుకుంటున్నారు. ఈ నషా మీకు ఎంతగానో ఉండాలి. మనం తండ్రి వద్దకు వెళ్తాము, వారి నుండి అనంతమైన వారసత్వము లభిస్తుంది. వారు మన తండ్రి, టీచర్ కూడా. ఇక్కడ చదువుకోవడానికి టేబుల్, కుర్చీ మొదలైనవాటి అవసరమేమీ లేదు. ఇక్కడ మీరు వ్రాసుకునేది కూడా మీ పురుషార్థము కొరకే వ్రాసుకుంటారు. వాస్తవానికి ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. శివబాబా మీకు ఉత్తరాలు వ్రాసేందుకు పెన్సిలు మొదలైనవి ఉపయోగిస్తారు. శివబాబా వ్రాసిన ఎర్రని అక్షరాలు వచ్చాయి అని పిల్లలు భావిస్తారు. ఆత్మిక పిల్లలూ అని తండ్రి వ్రాస్తారు. వారు ఆత్మిక బాబా అని పిల్లలు కూడా భావిస్తారు. వారు ఎంతో ఉన్నతోన్నతమైనవారు, వారి మతము అనుసారముగా నడుచుకోవాలి. తండ్రి అంటారు, కామము మహాశత్రువు, అది ఆదిమధ్యాంతము దుఃఖాన్ని ఇస్తుంది, ఆ భూతానికి వశమవ్వకండి, పవిత్రముగా అవ్వండి. ఓ పతిత-పావనా అని పిలుస్తారు కూడా. పిల్లలైన మీకు ఇప్పుడు రాజ్యము చేయడానికి ఎంతో శక్తి లభిస్తుంది. మీపై ఎవ్వరూ విజయాన్ని పొందలేరు. మీరు ఎంత సుఖవంతులుగా అవుతారు. మరి ఈ చదువుపై ఎంతటి అటెన్షన్ పెట్టాలి. మనకు రాజ్యాధికారము లభిస్తుంది. మనము ఎలా ఉన్నవారి నుండి ఎలా అవుతున్నాము అనేది మీకు తెలుసు. భగవానువాచ కదా. నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను, రాజులకే రాజులుగా తయారుచేస్తాను. భగవంతుడు అని ఎవరిని అంటారు, ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. ఆత్మ ఓ బాబా అని పిలుస్తుంది, కావున వారు ఎప్పుడు వస్తారు మరియు ఎలా వస్తారు అనేది తెలియాలి కదా. మనుష్యులే డ్రామా ఆదిమధ్యాంతాల గురించి, దాని కాలము గురించి తెలుసుకుంటారు కదా. అది తెలుసుకోవడముతో మీరు దేవతలుగా అయిపోతారు. జ్ఞానము ఉన్నది సద్గతి కొరకే. ఈ సమయములో ఇది కలియుగాంతము. అందరూ దుర్గతిలో ఉన్నారు. సత్యయుగములో సద్గతి లభిస్తుంది. సర్వులకు సద్గతిని ఇచ్చేందుకు బాబా వచ్చారని ఇప్పుడు మీకు తెలుసు. వారు అందరినీ మేల్కొల్పేందుకు వచ్చారు. ఇది సమాధి ఏమీ కాదు. కానీ ఘోర అంధకారములో పడి ఉన్నారు, వారిని మేల్కొల్పేందుకు వారు వస్తారు. ఏ పిల్లలైతే ఘోర నిద్ర నుండి మేల్కొంటారో, వారికి లోపల ఎంతో సంతోషము ఉంటుంది. మేము శివబాబా పిల్లలము, మాకు ఎటువంటి చింతా లేదు. తండ్రి మనల్ని విశ్వాధిపతులుగా తయారుచేస్తున్నారు. ఇందులో ఏడ్చే మాటే లేదు. ఈ ప్రపంచమే ఏడుపు ప్రపంచము. అది హర్షితముగా ఉండే ప్రపంచము. వారి చిత్రాలను చూడండి, ఎంత శోభాయమానంగా, హర్షిత ముఖము వలె తయారుచేస్తారు. ఆ ముఖకవళికలను ఇక్కడ తయారుచేయలేరు. ఇటువంటి ముఖకవళికలు కనిపిస్తాయని బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు. భవిష్యత్తులో మేము అమరపురికి యువరాజులుగా అవుతాము అని మధురాతి మధురమైన పిల్లలైన మీకు ఇప్పుడు స్మృతి కలిగింది. ఈ మృత్యులోకానికి, ఈ ప్రపంచానికి మంటలు అంటుకోనున్నాయి. సివిల్ వార్ లో కూడా ఒకరినొకరు ఎలా హతమార్చుకుంటారో చూడండి. తాము ఎవరిని హతమారుస్తున్నారు అనేది కూడా వారికి తెలియదు. హాహాకారాల తర్వాత జయజయకారాలు ప్రతిధ్వనించనున్నాయి. మీకు విజయము లభిస్తుంది, మిగిలినవారందరి వినాశనము జరుగుతుంది. రుద్రమాలలో కూర్చబడి, ఆ తర్వాత విష్ణుమాలలో కూర్చబడతారు. ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళేందుకు పురుషార్థము చేస్తారు. భక్తి విస్తారము ఎంతగా ఉంది. ఏ విధంగా వృక్షానికి అనేక ఆకులు ఉంటాయో, అలా భక్తి కూడా ఎంతగానో విస్తరించి ఉంది. బీజము జ్ఞానము, బీజము ఎంత చిన్నగా ఉంది, బీజము బాబా, ఈ వృక్షము యొక్క స్థాపన, పాలన మరియు వినాశనము ఎలా అవుతాయి అనేది మీకు తెలుసు. ఇది వెరైటీ ధర్మాల తలక్రిందుల వృక్షము. దీని గురించి ప్రపంచములో ఒక్కరికి కూడా తెలియదు. ఇప్పుడు పిల్లలు తండ్రిని స్మృతి చేయడానికి ఎంతగానో కష్టపడాలి, తద్వారా వికర్మలు వినాశనమవుతాయి. ఆ గీతను వినిపించేవారు కూడా ‘మన్మనాభవ’ అని అంటారు. దేహపు అన్ని ధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. మనుష్యులు దీని అర్థాన్ని అర్థం చేసుకోరు. అదంతా భక్తి మార్గము, ఇది జ్ఞాన మార్గము. ఇక్కడ రాజధాని స్థాపన అవుతోంది. ఇందులో చింతించాల్సిన విషయమేదీ లేదు. ఎవరైనా కొద్దిగా జ్ఞానాన్ని విన్నా వారు ప్రజలలోకి వచ్చేస్తారు. జ్ఞానము వినాశనం అవ్వదు. ఇకపోతే ఎవరైతే యథార్థముగా తెలుసుకుని పురుషార్థము చేస్తారో, వారే ఉన్నత పదవిని పొందుతారు. బుద్ధి ద్వారా ఇది అర్థమైంది కదా. మనము కొత్త ప్రపంచములో యువరాజులుగా అవ్వనున్నాము. విద్యార్థులు పరీక్షలు పాస్ అయితే, వారికి ఎంత సంతోషము కలుగుతుంది. మీకు అయితే వేల రెట్లు ఎక్కువ అతీంద్రియ సుఖము ఉండాలి. మనము మొత్తం విశ్వానికి అధిపతులుగా అవుతాము. ఏ విషయములోనూ ఎప్పుడూ అలగకూడదు. బ్రాహ్మణీతో పడకపోతే తండ్రిపై అలుగుతారు. అరే, మీరు తండ్రితో బుద్ధియోగాన్ని జోడించండి కదా, వారినైతే ప్రేమగా స్మృతి చేయండి. బాబా, కేవలం మిమ్మల్నే స్మృతి చేస్తూ, స్మృతి చేస్తూ మేము ఇంటికి వచ్చేస్తాము. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏ విషయము గురించి చింతించకూడదు, సదా హర్షితముగా ఉండాలి. మేము శివబాబా పిల్లలము, మమ్మల్ని విశ్వాధిపతులుగా తయారుచేయడానికి తండ్రి వచ్చారు అన్నది స్మృతిలో ఉండాలి.

2. మీ అవస్థను ఏకరసంగా తయారుచేసుకునేందుకు దేహీ-అభిమానులుగా అయ్యే పురుషార్థము చేయాలి. ఈ పాత ఇంటి నుండి మమకారాన్ని తొలగించివేయాలి.

వరదానము:-
మనన శక్తి ద్వారా బుద్ధిని శక్తిశాలిగా చేసుకునే మాస్టర్సర్వశక్తివాన్భవ

మనన శక్తియే దివ్య బుద్ధికి ఔషధము. భక్తిలో ఏ విధంగా స్మరణ చేసే అభ్యాసము ఉందో, అలా జ్ఞానములో స్మృతి యొక్క శక్తి ఉంది. ఈ శక్తి ద్వారా మాస్టర్సర్వశక్తివంతులుగా అవ్వండి. ప్రతి రోజూ అమృతవేళ మీ టైటిల్స్ లో ఒకదానిని స్మృతిలోకి తీసుకురండి మరియు దానిని మననము చేస్తూ ఉండండి, అప్పుడు మనన శక్తి ద్వారా బుద్ధి శక్తిశాలిగా ఉంటుంది. శక్తిశాలి బుద్ధిపై మాయ దాడి జరగదు, అటువంటివారు పరవశము అవ్వలేరు, ఎందుకంటే మాయ అన్నింటికన్నా ముందు వ్యర్థ సంకల్పాల రూపీ బాణము ద్వారా దివ్య బుద్ధినే బలహీనం చేసేస్తుంది, ఈ బలహీనమవ్వడం నుండి రక్షించుకునేందుకు సాధనమే మనన శక్తి.

స్లోగన్:-
ఆజ్ఞాకారీ పిల్లలే ఆశీర్వాదాలకు పాత్రులు, ఆశీర్వాదాల ప్రభావము హృదయాన్ని సదా సంతుష్టముగా ఉంచుతుంది.

అవ్యక్త ప్రేరణలు - ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసము చెయ్యండి, అంతర్ముఖులుగా అవ్వండి

సదా అనంతమైన ఆత్మిక దృష్టి, భాయి-భాయి (సోదర) సంబంధము యొక్క వృత్తి ద్వారా ఏ ఆత్మ పట్లనైనా శుభ భావనను పెట్టుకున్నందుకు ఫలము తప్పకుండా ప్రాప్తిస్తుంది, అందుకే పురుషార్థముతో అలసిపోకండి, నిరాశకు కూడా లోనవ్వకండి. నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యి, నా వారు అన్న సంబంధము నుండి అతీతముగా అయ్యి, శాంతి మరియు శక్తి యొక్క సహయోగాన్ని ఆత్మలకు ఇస్తూ ఉండండి.