ఓంశాంతి
ఓం శాంతి. ఓం శాంతి అనైతే ఎందరో మనుష్యులు అంటూ ఉంటారు. పిల్లలు కూడా ఓం శాంతి అని
అంటారు. లోపల ఆత్మ ఏదైతే ఉందో - అది ఓం శాంతి అని అంటుంది. కానీ ఆత్మలకైతే యథార్థ
రీతిలో స్వయం గురించి తెలియదు, అలాగే తండ్రి గురించి కూడా తెలియదు. పిలుస్తారు కానీ
తండ్రి అంటారు, నేను ఎవరిని, ఎలా ఉన్నాను అన్నది యథార్థ రీతిగా నా గురించి ఎవ్వరికీ
తెలియదు. వీరు (బ్రహ్మా) కూడా అంటారు, నేను ఎవరిని, ఎక్కడి నుండి వచ్చాను అన్నది నా
గురించి నాకు ఇంతకుముందు తెలియదు! ఆత్మ అయితే పురుషుడు కదా, కొడుకు. ఫాదర్ అయితే
పరమాత్మ. మరి ఆత్మలు పరస్పరంలో సోదరులయ్యారు. మళ్ళీ శరీరంలోకి వచ్చిన కారణంగా
కొందరిని పురుషులు అని, కొందరిని స్త్రీలు అని అంటారు. కానీ యథార్థముగా ఆత్మ అంటే
ఏమిటి, ఈ విషయం మనుష్యమాత్రులెవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ జ్ఞానం
లభిస్తుంది, దీనిని మళ్ళీ మీరు మీతోపాటు తీసుకువెళ్తారు. అక్కడ ఈ జ్ఞానం ఉంటుంది -
మేము ఆత్మలము, ఈ పాత శరీరాన్ని వదిలి మరొకదానిని తీసుకుంటాము. ఆత్మ పరిచయాన్ని
తమతోపాటు తీసుకువెళ్తారు. ఇంతకుముందు అయితే ఆత్మను గురించి కూడా తెలియదు. మనం ఎప్పటి
నుండి పాత్రను అభినయిస్తాము, ఏమీ తెలియదు. ఇప్పటివరకు కూడా చాలామంది తమను తాము
పూర్తిగా గుర్తించలేదు. బాహ్య రూపంగా తెలుసు మరియు పెద్ద లింగ రూపాన్నే గుర్తు
చేస్తారు. ఆత్మనైన నేను బిందువును. తండ్రి కూడా బిందువు, ఆ రూపంలో స్మృతి చేయడం, ఇలా
చాలా కొద్దిమంది ఉన్నారు. బుద్ధి నంబరువారుగా ఉంటుంది కదా. కొందరైతే బాగా అర్థం
చేసుకొని ఇతరులకు కూడా అర్థం చేయించడం మొదలుపెడతారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ
మరియు తండ్రిని స్మృతి చేయాలి అని మీరు అర్థం చేయిస్తారు. వారే పతిత-పావనుడు. మొదట
అయితే మనుష్యులకు ఆత్మ పరిచయమే లేదు, కావున దానిని కూడా అర్థం చేయించవలసి ఉంటుంది.
ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకుంటారో, అప్పుడే తండ్రిని కూడా
తెలుసుకోగలరు. ఆత్మనే గుర్తించరు అందుకే తండ్రిని కూడా పూర్తిగా తెలుసుకోలేరు.
ఆత్మలైన మనము ఒక బిందువు అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇంత చిన్న ఆత్మలో 84
జన్మల పాత్ర ఉంది, ఇది కూడా మీరు అర్థం చేయించవలసి ఉంటుంది. లేదంటే కేవలం ఇలా అంటారు,
జ్ఞానం చాలా బాగుంది, భగవంతుడిని కలుసుకునే చాలా మంచి మార్గాన్ని తెలియజేస్తారు.
కానీ నేను ఎవరు, తండ్రి ఎవరు అన్నది వారికి తెలియదు. కేవలం బాగుంది-బాగుంది అని
అనేస్తారు. కొందరైతే మళ్ళీ ఇలా కూడా అంటారు, వీరైతే నాస్తికులుగా చేసేస్తారు. జ్ఞానం
యొక్క వివేకం ఎవ్వరిలోనూ లేదని మీకు తెలుసు. మీరు అర్థం చేయిస్తారు, ఇప్పుడు మేము
పూజ్యులుగా అవుతున్నాము. మేము ఎవ్వరి పూజ చేయము ఎందుకంటే అందరికీ పూజ్యుడైన
ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఎవరైతే ఉన్నారో వారికి మేము సంతానము. వారు ఉన్నారే
పూజ్యులైన పితాశ్రీ. పితాశ్రీ మమ్మల్ని తమవారిగా చేసుకొని మరియు చదివిస్తున్నారని
ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అందరికన్నా ఉన్నతోన్నతమైన పూజ్యులు ఒక్కరే, వారు
తప్ప ఇంకెవ్వరూ పూజ్యులుగా చేయలేరు. పూజారులు తప్పకుండా పూజారులుగానే చేస్తారు.
ప్రపంచంలో అందరూ పూజారులే. ఇప్పుడు మీకు పూజ్యులు లభించారు, వారు తమ సమానంగా
తయారుచేస్తున్నారు. మీ చేత పూజను వదిలింపజేసారు. తమతోపాటు తీసుకువెళ్తారు. ఇది
ఛీ-ఛీ ప్రపంచము. ఇది ఉన్నదే మృత్యులోకము. ఎప్పుడైతే రావణ రాజ్యం ఉంటుందో అప్పుడే
భక్తి ప్రారంభమవుతుంది. పూజ్యుల నుండి పూజారులుగా అయిపోతారు. మళ్ళీ పూజారుల నుండి
పూజ్యులుగా తయారుచేయడానికి తండ్రి రావలసి ఉంటుంది. ఇప్పుడు మీరు పూజ్యులైన దేవతలుగా
అవుతున్నారు. ఆత్మ శరీరము ద్వారా పాత్రను అభినయిస్తుంది. ఇప్పుడు తండ్రి ఆత్మను
పవిత్రంగా చేసేందుకు, మనల్ని పూజ్య దేవతలుగా తయారుచేస్తున్నారు. పిల్లలైన మీకు
యుక్తిని ఇచ్చారు - తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీరు పూజారుల నుండి పూజ్యులుగా
అయిపోతారు ఎందుకంటే ఆ తండ్రి సర్వులకు పూజ్యులు. ఎవరైతే అర్ధకల్పం పూజారులుగా
అవుతారో, వారే మళ్ళీ అర్ధకల్పం పూజ్యులుగా అవుతారు. ఇది కూడా డ్రామాలోని పాత్ర.
డ్రామా ఆది-మధ్యాంతాల గురించి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి ద్వారా పిల్లలైన
మీరు తెలుసుకున్నారు మరియు ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. మొట్టమొదట ఈ ముఖ్యమైన
విషయాన్ని అర్థం చేయించాలి - స్వయాన్ని ఆత్మగా, బిందువుగా భావించండి. ఆత్మలకు తండ్రి
ఆ నిరాకారుడు, ఆ జ్ఞాన స్వరూపుడే వచ్చి చదివిస్తారు. సృష్టి ఆది-మధ్యాంతముల
రహస్యాన్ని అర్థం చేయిస్తారు. తండ్రి ఒక్క సారే వస్తారు. వారిని తెలుసుకోవడం కూడా
ఒక్క సారే జరుగుతుంది. రావడం కూడా ఒక్కసారి మాత్రమే సంగమయుగంలో వస్తారు. వారు వచ్చి
పాత పతిత ప్రపంచాన్ని పావనంగా తయారుచేస్తారు. ఇప్పుడు తండ్రి డ్రామా ప్లాన్
అనుసారంగా వచ్చారు. ఇది కొత్త విషయమేమీ కాదు. కల్ప-కల్పము అలాగే వస్తాను. ఒక్క క్షణం
కూడా ముందు-వెనుక అవ్వజాలదు. పిల్లలైన మీ మనస్సుకి ఈ విధంగా అనిపిస్తుంది, తప్పకుండా
బాబా ఆత్మలైన మనకు సత్యమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు, మళ్ళీ కల్పం తర్వాత కూడా తండ్రి
రావలసి ఉంటుంది. తండ్రి ద్వారా ఎవరైతే ఈ సమయంలో తెలుసుకున్నారో వారు మళ్ళీ కల్పం
తర్వాత తెలుసుకుంటారు. ఈ విషయం కూడా వారికి తెలుసు, ఇప్పుడు పాత ప్రపంచం యొక్క
వినాశనం జరుగుతుంది, మళ్ళీ మనం సత్యయుగంలోకి వచ్చి మన పాత్రను అభినయిస్తాము.
సత్యయుగీ స్వర్గవాసులుగా అవుతాము. ఇదైతే బుద్ధిలో గుర్తుంది కదా. గుర్తుండడం ద్వారా
సంతోషం కూడా ఉంటుంది. ఇది విద్యార్థి జీవితం కదా. మనం స్వర్గవాసులుగా అయ్యేందుకు
చదువుతున్నాము. చదువు పూర్తయ్యేంత వరకు, ఈ సంతోషము స్థిరంగా ఉండాలి. వినాశనం కొరకు
సామాగ్రి ఎప్పుడైతే తయారవుతుందో, అప్పుడు చదువు పూర్తవుతుంది అని తండ్రి అర్థం
చేయిస్తూ ఉంటారు. నిప్పు తప్పకుండా అంటుకుంటుందని అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు.
ఏర్పాట్లయితే జరుగుతూ ఉంటాయి కదా. ఒకరిని చూసి ఒకరు ఎంతగా వేడెక్కిపోతూ ఉంటారు.
నలువైపులా భిన్న-భిన్న రకాల సైన్యాలు ఉన్నాయి. అందరూ యుద్ధానికి తయారవుతూ ఉంటారు.
యుద్ధం తప్పకుండా జరిగే విధంగా ఎవరో ఒకరు ఆటంకాలు కలిగిస్తూనే ఉంటారు. కల్ప క్రితం
వలె వినాశనమైతే జరగవలసిందే. పిల్లలైన మీరు చూస్తారు. ఇంతకుముందు కూడా ఒక్క
నిప్పురవ్వతో ఎంత యుద్ధం జరిగిందో పిల్లలు చూసారు. ఇలా చేయకపోతే మేము ఈ బాంబులను
ఉపయోగించవలసి వస్తుంది అని ఒకరినొకరు భయపెట్టుకుంటూ ఉంటారు. మృత్యువు ఎదురుగా
వచ్చేస్తే ఇక తయారుచేయకుండా ఉండలేరు. ఇంతకుముందు కూడా యుద్ధం జరిగింది, అప్పుడు
బాంబులు వేసారు. విధి రాత కదా. ఇప్పుడైతే వేలాది బాంబులు ఉన్నాయి.
అందరినీ తిరిగి తీసుకువెళ్ళేందుకు ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారని పిల్లలైన మీరు
ఈ విషయాన్ని తప్పకుండా అర్థం చేయించాలి. ఓ పతిత-పావనా రండి, ఈ ఛీ-ఛీ ప్రపంచం నుండి
మమ్మల్ని పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని అందరూ పిలుస్తున్నారు. పిల్లలైన మీకు
తెలుసు, పావన ప్రపంచాలు రెండు ఉంటాయి - ముక్తి మరియు జీవన్ముక్తి. అందరి ఆత్మలు
పవిత్రంగా అయి ముక్తిధామానికి వెళ్ళిపోతాయి. ఈ దుఃఖధామము వినాశనమైపోతుంది, దీనిని
మృత్యులోకము అని అంటారు. మొదట అమరలోకము ఉండేది, తర్వాత చక్రము చుట్టి వచ్చి ఇప్పుడు
మృత్యులోకంలోకి వచ్చారు. మళ్ళీ అమరలోకం యొక్క స్థాపన జరుగుతుంది. అక్కడ అకాల
మృత్యువు అంటూ ఏదీ ఉండదు, అందుకే దానిని అమర లోకము అని అంటారు. శాస్త్రాలలో కూడా
పదాలు ఉండవచ్చు, కానీ యథార్థ రీతిలో ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఈ విషయం కూడా మీకు
తెలుసు - ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు. మృత్యులోకం యొక్క వినాశనం తప్పకుండా
జరగనున్నది. ఇది 100 శాతము తథ్యము. మీ ఆత్మను యోగబలంతో పవిత్రంగా చేసుకోండి అని
తండ్రి అర్థం చేయిస్తున్నారు. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమైపోతాయి.
కానీ ఈ విషయాన్ని కూడా పిల్లలు గుర్తు చేయలేరు. తండ్రి నుండి వారసత్వాన్ని లేక
రాజ్యాన్ని తీసుకోవడంలో శ్రమ అయితే కావాలి కదా. ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండాలి.
ఎంత సమయం మేము స్మృతిలో ఉంటున్నాము మరియు ఎంతమందికి స్మృతినిప్పిస్తున్నాము అని
స్వయాన్ని చూసుకోవాలి. మన్మనాభవ, దీనిని మంత్రము అని కూడా అనలేరు, ఇది తండ్రి స్మృతి.
దేహాభిమానాన్ని వదిలివేయాలి. మీరు ఒక ఆత్మ, ఇది మీ రథము, దీంతో మీరు ఎంత పని
చేస్తారు. సత్యయుగంలో మీరు దేవీ-దేవతలుగా అయి ఎలా రాజ్యం చేస్తారో మీరు మళ్ళీ ఇదే
అనుభవాన్ని పొందుతారు. ఆ సమయంలోనైతే ప్రాక్టికల్ గా ఆత్మాభిమానులుగా ఉంటారు. ఆత్మ
అంటుంది, మా ఈ శరీరము వృద్ధునిగా అయిపోయింది, దీనిని వదిలి కొత్తదానిని తీసుకుంటాము.
దుఃఖము యొక్క విషయమే లేదు. ఇక్కడైతే శరీరము వదలకూడదని, దాని కోసం డాక్టర్ల యొక్క
ఎన్నో మందులు మొదలైనవాటిని వాడేందుకు శ్రమిస్తారు. పిల్లలైన మీరు అనారోగ్యాలు
మొదలైనవాటిలో కూడా పాత శరీరం పట్ల ఎప్పుడూ విసుగు చెందకూడదు ఎందుకంటే ఈ శరీరంలోనే
జీవిస్తూ తండ్రి నుండి వారసత్వాన్ని పొందాలని మీరు అర్థం చేసుకుంటారు. శివబాబా
స్మృతి ద్వారానే పవిత్రంగా అవుతారు. ఇదే శ్రమ. కానీ మొదట అయితే ఆత్మను తెలుసుకోవలసి
ఉంటుంది. మీకు ముఖ్యమైనది స్మృతి యాత్రయే. స్మృతిలో ఉంటూ-ఉంటూ తర్వాత మనం
మూలవతనములోకి వెళ్ళిపోతాము. మనం అక్కడి నివాసులమే, అదే మన శాంతిధామము. శాంతిధామము,
సుఖధామము గురించి మీకే తెలుసు మరియు స్మృతి చేస్తారు. ఇంకెవ్వరికీ తెలియదు. ఎవరైతే
కల్ప క్రితం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నారో, వారే తీసుకుంటారు.
ముఖ్యమైనది స్మృతి యాత్ర. భక్తి మార్గపు యాత్రలు ఇప్పుడు సమాప్తమవ్వనున్నాయి.
భక్తి మార్గమే సమాప్తమైపోతుంది. భక్తి మార్గము అంటే ఏమిటి అన్నది ఎప్పుడైతే జ్ఞానం
ఉంటుందో అప్పుడే అర్థం చేసుకుంటారు. భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారు అని భావిస్తారు.
భక్తికి ఏ ఫలమును ఇస్తారు? ఏమీ తెలియదు. పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు,
తండ్రి పిల్లలకు తప్పకుండా స్వర్గ రాజ్యాధికారం యొక్క వారసత్వాన్నే ఇస్తారు. అందరికీ
వారసత్వాన్ని ఇచ్చారు, యథా రాజా-రాణి తథా ప్రజా, అందరూ స్వర్గవాసులుగా ఉండేవారు.
తండ్రి అంటారు, 5000 సంవత్సరాల క్రితం కూడా మిమ్మల్ని స్వర్గవాసులుగా తయారుచేసాను.
ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని తయారుచేస్తాను. మీరు మళ్ళీ ఆ విధంగా 84 జన్మలు తీసుకుంటారు.
ఈ విషయం బుద్ధిలో గుర్తుండాలి, మర్చిపోకూడదు. సృష్టి ఆది-మధ్యాంతాల జ్ఞానం ఏదైతే
తండ్రి వద్ద ఉందో, అది పిల్లల బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది. మనం 84 జన్మలు ఏ విధంగా
తీసుకుంటాము, ఇప్పుడు మళ్ళీ బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటాము, అనేక సార్లు
తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నాము. ఏ విధంగా తీసుకున్నారో, అలాగే మళ్ళీ
తీసుకోండి అని తండ్రి అంటారు. తండ్రి అయితే అందరినీ చదివిస్తూ ఉంటారు. దైవీ గుణాలను
ధారణ చేయమని కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది. స్వయాన్ని చెక్ చేసుకునేందుకు
సాక్షిగా అయి చూసుకోవాలి - మేము ఎంతవరకు పురుషార్థం చేస్తున్నాము, మేము చాలా మంచి
పురుషార్థం చేస్తున్నామని కొందరు భావిస్తారు. ప్రదర్శినీ మొదలైనవాటిని ఏర్పాటు
చేస్తూ ఉంటారు, తద్వారా భగవంతుడైన తండ్రి వచ్చి ఉన్నారు అని అందరికీ తెలుస్తుంది.
మనుష్యులు పాపం అందరూ ఘోరమైన నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. జ్ఞానం గురించి ఎవ్వరికీ
తెలియనే తెలియదు, మరి తప్పకుండా భక్తిని ఉన్నతమైనదిగానే భావిస్తారు. ఇంతకుముందు మీలో
కూడా జ్ఞానమేమైనా ఉందా? ఇప్పుడు మీకు తెలిసింది, జ్ఞానసాగరుడు తండ్రి మాత్రమే, వారే
భక్తి యొక్క ఫలాన్ని ఇస్తారు, ఎవరైతే ఎక్కువగా భక్తి చేసారో, వారికి ఎక్కువ ఫలం
లభిస్తుంది. ఉన్నత పదవిని పొందేందుకు వారే బాగా చదువుకుంటారు. ఇవి ఎంతటి
మధురాతి-మధురమైన విషయాలు. వృద్ధులు మొదలైనవారి కోసం కూడా చాలా సహజంగా అర్థం
చేయిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఉన్నతోన్నతమైనవారు
భగవంతుడు శివ. శివ పరమాత్మాయ నమః అని అంటారు, వారు అంటారు, నన్నొక్కరినే స్మృతి
చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. అంతే. ఇంకే కష్టమూ ఇవ్వరు. మున్ముందు
శివబాబాను కూడా స్మృతి చేయడం మొదలుపెడతారు. వారసత్వాన్ని అయితే తీసుకోవాలి, జీవిస్తూ
తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే తీరుతాము అని అంటారు. శివబాబా స్మృతిలో
శరీరాన్ని వదిలేస్తారు, వారు మళ్ళీ సంస్కారాలను తీసుకువెళ్తారు. స్వర్గంలోకి
తప్పకుండా వస్తారు, ఎంతగా యోగం ఉంటుందో, అంతటి ఫలం లభిస్తుంది. ముఖ్యమైన విషయం-
నడుస్తూ తిరుగుతూ ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండాలి. మీ శిరస్సు నుండి భారాన్ని
దించుకోవాలి, కేవలం స్మృతి కావాలి, ఇంకే కష్టమునూ తండ్రి ఇవ్వరు. అర్ధకల్పం నుండి
పిల్లలు కష్టం చూసారు అని తెలుసు అందుకే మీకు వారసత్వాన్ని తీసుకునే సహజమైన
మార్గాన్ని తెలియజేయడానికి ఇప్పుడు వచ్చాను. తండ్రిని కేవలం స్మృతి చేయండి.
స్మృతినైతే ఇంతకుముందు కూడా చేసేవారు కానీ ఎటువంటి జ్ఞానం ఉండేది కాదు, ఈ విధంగా
నన్ను స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి అని ఇప్పుడు తండ్రి జ్ఞానాన్ని
ఇచ్చారు. శివుని భక్తినైతే ప్రపంచంలో ఎంతో చేస్తారు, ఎంతగానో గుర్తు చేస్తారు కానీ
పరిచయం లేదు. ఈ సమయంలో తండ్రి స్వయమే వచ్చి నన్ను స్మృతి చేయండి అని పరిచయాన్ని
ఇస్తారు. మేము బాగా తెలుసుకున్నాము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మేము బాప్
దాదా వద్దకు వెళుతున్నాము అని మీరు అంటారు. తండ్రి ఈ భగీరథుడిని తీసుకున్నారు,
భగీరథుడు కూడా ప్రసిద్ధమైనవారు, వీరి ద్వారా కూర్చొని జ్ఞానాన్ని వినిపిస్తారు. ఇది
కూడా డ్రామాలోని పాత్ర. కల్ప-కల్పము ఈ భాగ్యశాలీ రథంలోకి వస్తారు. శ్యామ సుందరుడు
అని ఎవరినైతే అంటారో వారు వీరేనని మీకు తెలుసు. ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు.
మనుష్యులు మళ్ళీ అర్జునుడు అన్న పేరును పెట్టేసారు. బ్రహ్మాయే విష్ణువుగా, విష్ణువే
బ్రహ్మాగా ఎలా అవుతారో ఇప్పుడు తండ్రి యథార్థంగా అర్థం చేయిస్తారు. మనము
బ్రహ్మాపురికి చెందినవారమని, తర్వాత విష్ణుపురికి చెందినవారిగా అవుతామని పిల్లలలో
ఇప్పుడు వివేకం ఉంది. విష్ణుపురి నుండి బ్రహ్మాపురిలోకి వచ్చేందుకు 84 జన్మలు
పడుతుంది. ఈ విషయం కూడా అనేక సార్లు అర్థం చేయించారు, దీన్నే మీరు మళ్ళీ వింటారు.
ఆత్మతో ఇప్పుడు తండ్రి అంటారు, కేవలం నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు
వినాశనమవుతాయి అందుకే మీకు సంతోషం కూడా కలుగుతుంది. ఈ ఒక్క అంతిమ జన్మ పవిత్రంగా
అవ్వడం ద్వారా మనం పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతాము. మరి పవిత్రంగా ఎందుకు
అవ్వకూడదు. ఒక్క తండ్రి పిల్లలైన మనం బ్రహ్మాకుమారులము, కుమారీలము, అయినా ఆ దైహిక
వృత్తి మారడంలో సమయం పడుతుంది. నెమ్మది-నెమ్మదిగా చివర్లో కర్మాతీత అవస్థ
ఏర్పడనున్నది. ఈ సమయంలో ఎవరికైనా కర్మాతీత అవస్థ ఏర్పడడం అసంభవము. కర్మాతీత అవస్థ
ఏర్పడితే ఇక ఈ శరీరం కూడా ఉండదు, దీనిని వదిలివేయవలసి వస్తుంది. యుద్ధం మొదలవ్వడము,
ఒక్క తండ్రి స్మృతే ఉండడము, ఇందులో శ్రమ ఉంది. అచ్ఛా.
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.