09-06-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు మొత్తం విశ్వములో శాంతి
రాజ్యాన్ని స్థాపన చేసే తండ్రికి సహాయకులుగా ఉన్నారు, ఇప్పుడు మీ ఎదురుగా సుఖ,
శాంతిమయమైన ప్రపంచము ఉంది’’
ప్రశ్న:-
తండ్రి
పిల్లలను ఎందుకు చదివిస్తారు, ఆ చదువు యొక్క సారము ఏమిటి?
జవాబు:-
తండ్రి తమ
పిల్లలను స్వర్గము యొక్క రాకుమారులుగా, విశ్వాధిపతులుగా తయారుచేయడానికి చదివిస్తారు.
తండ్రి అంటారు - పిల్లలూ, చదువు యొక్క సారము ఏమిటంటే - ప్రపంచపు అన్ని విషయాలనూ
వదిలేయండి. మా వద్ద కోట్లు, లక్షలు ఉన్నాయి అని ఎప్పుడూ భావించకండి. అవేవీ చేతికి
రావు. అందుకే మంచి రీతిలో పురుషార్థము చేయండి, చదువుపై అటెన్షన్ పెట్టండి.
పాట:-
చివరికి నేటికి
ఆ రోజు వచ్చింది...
ఓంశాంతి
విశ్వములో చివరికి శాంతి యొక్క సమయము వచ్చింది అని పిల్లలు పాటలో విన్నారు.
విశ్వములో శాంతి ఎలా ఏర్పడగలదు అని అందరూ అంటారు. ఇక ఎవరైతే సరైన సలహాను ఇస్తారో
వారికి బహుమానము ఇస్తారు. నెహ్రూ కూడా సలహా ఇచ్చేవారు, కానీ శాంతి అయితే ఏర్పడలేదు
కదా. కేవలం సలహా ఇచ్చి వెళ్ళారు. ఒకానొక సమయములో మొత్తము విశ్వమంతటిలోనూ సుఖ-శాంతులు,
సంపద మొదలైనవి ఉండేవని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. అవి ఇప్పుడు లేవు.
ఇప్పుడు అవి మళ్ళీ ఏర్పడనున్నాయి. చక్రమైతే తిరుగుతుంది కదా. ఇది సంగమయుగీ
బ్రాహ్మణులైన మీ బుద్ధిలో ఉంది. భారత్ మళ్ళీ బంగారు ప్రపంచముగా అవ్వనున్నది అని మీకు
తెలుసు. భారత్ నే గోల్డెన్ స్పారో (బంగారు పిచ్చుక) అని అంటారు. ఈ విధంగా మహిమ
చేస్తారు కానీ కేవలం నామమాత్రముగా చేస్తారు. మీరైతే ఇప్పుడు ప్రాక్టికల్ గా
పురుషార్థము చేస్తున్నారు. ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయని మీకు తెలుసు. కావున
ఈ నరకములోని దుఃఖపు విషయాలన్నింటినీ మర్చిపోతారు. మీ బుద్ధిలో ఇప్పుడు సుఖమయమైన
ప్రపంచము ఎదురుగా ఉంది. పూర్వము విదేశాల నుండి తిరిగి వచ్చేటప్పుడు - ఇప్పుడు మన
దేశానికి చేరుకోవటానికి ఇంకా కొద్ది సమయమే ఉంది అని భావించేవారు, ఎందుకంటే
ఇంతకుముందు విదేశాల నుండి వచ్చేందుకు చాలా సమయం పట్టేది, ఇప్పుడైతే విమానాలలో త్వరగా
చేరుకుంటారు. ఇప్పుడు మన సుఖమయమైన రోజులు రానున్నాయి అని ఇప్పుడు పిల్లలైన మీ
బుద్ధిలో ఉంది, దాని కొరకే పురుషార్థము చేస్తున్నారు. బాబా పురుషార్థము కూడా చాలా
సహజమైనది తెలియజేసారు. డ్రామా అనుసారముగా కల్పపూర్వము వలె ఇది ఖచ్చితముగా జరుగుతుంది.
మీరు దేవతలుగా ఉండేవారు. దేవతలకు ఎన్ని లెక్కలేనన్ని మందిరాలు తయారవుతున్నాయి. ఈ
మందిరాలు మొదలైనవన్నీ తయారుచేసి ఏమి చేస్తారు! ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయని! ఇది
పిల్లలైన మీకు తెలుసు. పిల్లలైన మీరు జ్ఞానము యొక్క అథారిటీలు. పరమపిత పరమాత్మ
సర్వశక్తివంతుడు, ఆల్మైటీ అథారిటీ అని కూడా అంటారు. మీరు జ్ఞానము యొక్క అథారిటీలు.
వారు భక్తి యొక్క అథారిటీలు. తండ్రిని ఆల్మైటీ అథారిటీ అని అంటారు. పిల్లలైన మీరు
నంబరువారు పురుషార్థానుసారముగా అలా అవుతున్నారు. మీకు సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము
ఉంది. తండ్రి నుండి వారసత్వాన్ని పొందేందుకు మనం పురుషార్థము చేస్తున్నామని మీకు
తెలుసు. భక్తి యొక్క అథారిటీలు ఎవరైతే ఉన్నారో, వారు అందరికీ భక్తినే వినిపిస్తారు.
మీరు జ్ఞానము యొక్క ఆథారిటీలు కావున జ్ఞానమునే వినిపిస్తారు. సత్యయుగములో భక్తి
అనేదే ఉండదు. పూజారులు ఒక్కరు కూడా ఉండరు, అంతా పూజ్యులే పూజ్యులు ఉంటారు.
అర్ధకల్పము పూజ్యులు ఉంటారు, అర్ధకల్పము పూజారులు ఉంటారు. పూజ్యులుగా ఉండేవారు, ఆ
సమయములో స్వర్గము ఉండేది అని భారతవాసులను గురించే అంటారు. ఇప్పుడు భారత్ పూజారిగా,
నరకముగా ఉంది. పిల్లలైన మీరు ఇప్పుడు ప్రాక్టికల్ జీవితాన్ని తయారుచేసుకుంటున్నారు.
నంబరువారు పురుషార్థానుసారముగా అందరికీ అర్థం చేయిస్తూ ఉంటారు మరియు వృద్ధిని
పొందుతూ ఉంటారు. డ్రామాలో ముందే అంతా నిశ్చితమై ఉంది. డ్రామా మీ చేత పురుషార్థము
చేయిస్తూ ఉంటుంది, మీరు చేస్తూ ఉంటారు. డ్రామాలో మనకు అవినాశీ పాత్ర ఉంది అని మీకు
తెలుసు. ప్రపంచానికి ఈ విషయాల గురించి ఏమి తెలుసు. డ్రామాలో మనకే ఈ పాత్ర ఉంది.
ఎవరైతే ఈ మాట అంటారో, వారే - డ్రామాలో మా పాత్ర ఈ విధంగా ఉంది అనేది అర్థం
చేసుకుంటారు కదా. ఈ సృష్టి చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఈ ప్రపంచ చరిత్ర మరియు
భౌగోళికము గురించి మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఉన్నతోన్నతమైనవారు ఎవరు అన్నది
ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. ఋషులు, మునులు మొదలైనవారు కూడా మాకు తెలియదు అని
అనేవారు. నేతి, నేతి (మాకు తెలియదు, తెలియదు) అని అనేవారు కదా. ఇప్పుడు పిల్లలైన
మీకైతే - వారు రచయిత అయిన తండ్రి అని మరియు వారు మనల్ని చదివిస్తున్నారు అని తెలుసు.
ఇక్కడ కూర్చున్నప్పుడు దేహీ-అభిమానులుగా కూర్చోండి అని కూడా బాబా పదే-పదే అర్థం
చేయించారు. ఒక్క తండ్రియే రాజయోగాన్ని నేర్పిస్తారు మరియు ప్రపంచ చరిత్ర-భౌగోళికాలను
గురించి అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు, నేను ఏమీ థాట్ రీడర్ ను కాను. ఇంత పెద్ద
ప్రపంచము ఉంది, దీనినేమి రీడ్ చేస్తాము. తండ్రి స్వయం అంటారు - నేను డ్రామాలో
నిశ్చితమై ఉన్నదాని అనుసారముగా మిమ్మల్ని పావనముగా తయారుచేయడానికి వస్తాను. డ్రామాలో
నాకు ఏ పాత్ర అయితే ఉందో, దానినే అభినయించేందుకు వస్తాను. అంతేకానీ నేనేమీ
సంకల్పాలను చదవను, నా పాత్ర ఏమిటి మరియు మీరు ఏ పాత్రను అభినయిస్తున్నారు అనేది నేను
తెలియజేస్తాను. మీరు ఈ జ్ఞానాన్ని నేర్చుకుని ఇతరులకు నేర్పిస్తున్నారు. నా పాత్రయే
పతితులను పావనముగా తయారుచేయడము. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు, మీకు తిథి, తారీఖు
మొదలైనవన్నీ తెలుసు. ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. మీకు తండ్రి నేర్పిస్తున్నారు,
తర్వాత ఎప్పుడైతే ఈ చక్రాన్ని పూర్తి చేస్తారో అప్పుడు మళ్ళీ బాబా వస్తారు. ఆ
సమయములో ఏ సీన్ అయితే జరిగిందో, అది మళ్ళీ కల్పము తర్వాత జరుగుతుంది. ఒక క్షణము ఇంకో
క్షణముతో కలవదు. ఈ నాటకము తిరుగుతూ ఉంటుంది. పిల్లలైన మీకు అనంతమైన నాటకము గురించి
తెలుసు. అయినా మీరు ఘడియ, ఘడియ మర్చిపోతారు. బాబా అంటారు, మీరు కేవలం స్మృతి చేయండి,
మన బాబా తండ్రి కూడా, వారే టీచర్ మరియు గురువు కూడా. మీ బుద్ధి అటువైపుకు
వెళ్ళిపోవాలి. తండ్రి మహిమను విని ఆత్మ సంతోషిస్తుంది. మా బాబా తండ్రి, టీచర్, అలాగే
వారు సత్యాతి సత్యమైనవారు అని అందరూ అంటారు. వారు చెప్పే చదువు కూడా సత్యమైనది మరియు
సంపూర్ణమైనది. ఆ మనుష్యుల చదువు అసంపూర్ణమైనది. కావున పిల్లలైన మీ బుద్ధిలో ఎంతటి
సంతోషము ఉండాలి. పెద్ద పరీక్షను పాస్ చేసేవారి బుద్ధిలో ఎక్కువ సంతోషము ఉంటుంది.
మీరు ఎంతో ఉన్నతమైన చదువును చదువుతారు కావున మీకు ఎంతటి అపారమైన సంతోషము ఉండాలి.
భగవంతుడైన తండ్రి, అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. మీ రోమాలు
నిక్కబొడుచుకోవాలి. అదే అధ్యాయము రిపీట్ అవుతోంది, ఇది మీకు తప్ప ఇంకెవ్వరికీ
తెలియదు. కల్పము ఆయువునే పెంచేసారు. మీ బుద్ధిలో ఇప్పుడు 5000 సంవత్సరాల కథ అంతా
చక్రములా తిరుగుతూ ఉంటుంది, దానినే స్వదర్శన చక్రము అని అంటారు.
బాబా, తుఫానులు ఎన్నో వస్తున్నాయి, మేము మర్చిపోతున్నాము అని పిల్లలు అంటారు. బాబా
అంటారు, మీరు ఎవరిని మర్చిపోతున్నారు? ఏ తండ్రి అయితే మిమ్మల్ని ద్వికిరీటధారులుగా,
విశ్వాధిపతులుగా తయారుచేస్తున్నారో, వారిని మీరు ఎలా మర్చిపోతారు! వేరేవారినెవ్వరినీ
మర్చిపోరే. భార్య, పిల్లలు, పినతండ్రులు, మామయ్యలు, మిత్ర-సంబంధీకులు అందరూ
గుర్తుంటారు. మరి ఈ విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారు. మీ యుద్ధము ఈ స్మృతిలోనే
ఉంది. ఎంత వీలైతే అంత స్మృతి చేయాలి. పిల్లలు తమ ఉన్నతి కోసం ఉదయముదయమే లేచి తండ్రి
స్మృతిలో షికారు చేయాలి. మీరు పైన మేడ పైకి లేక బయట చల్లగాలిలోకి వెళ్ళిపోండి.
ఇక్కడికే వచ్చి కూర్చోవాలి అన్నది తప్పనిసరేమీ కాదు. బయటకు కూడా వెళ్ళవచ్చు. ఉదయం
వేళలో భయమేమీ ఉండదు. బయటకు వెళ్ళి నడవండి. బాబాను ఎవరు ఎక్కువగా స్మృతి చేస్తారో
చూద్దాము అంటూ పరస్పరం ఇవే మాటలు మాట్లాడుకుంటూ ఉండండి. మీరు ఎంత సమయం స్మృతి చేసారో
ఆ తర్వాత చెప్పండి. మరి మిగిలిన సమయము మీ బుద్ధి ఎక్కడెక్కడికి వెళ్ళిందో చూసుకోవాలి.
దీనినే పరస్పరం ఉన్నతిని పొందడం అని అంటారు. ఎంత సమయం తండ్రిని స్మృతి చేసారో నోట్
చేసుకోండి. బాబా ఏదైతే అభ్యాసము చేస్తారో, అది చెప్తున్నారు. స్మృతిలో మీరు ఒక్క
గంట నడిచినా కానీ కాళ్ళు అలసిపోవు. స్మృతితో మీ పాపాలు ఎన్ని అంతమైపోతాయి. చక్రము
గురించి అయితే మీకు తెలుసు. రాత్రింబవళ్ళూ మీకు ఇప్పుడు బుద్ధిలో - మేము ఇప్పుడు ఇక
ఇంటికి వెళ్తాము అనే ఉంది. పురుషార్థము చేస్తారు. కలియుగీ మనుష్యులకు కొద్దిగా కూడా
తెలియదు - ముక్తి కొరకు ఎంతో భక్తి చేస్తూ ఉంటారు. అనేక మతాలు ఉన్నాయి.
బ్రాహ్మణులైన మీది ఒకే మతము. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారందరికీ శ్రీమతము ఉంది.
మీరు తండ్రి శ్రీమతము ద్వారా దేవతలుగా అవుతారు. దేవతలకు శ్రీమతమేమీ లేదు. శ్రీమతము
ఇప్పుడే బ్రాహ్మణులైన మీకు లభిస్తుంది. భగవంతుడు నిరాకారుడే. వారు మీకు రాజయోగాన్ని
నేర్పిస్తారు, దాని ద్వారా మీరు మీ రాజ్యభాగ్యాన్ని తీసుకుని ఎంతో ఉన్నతముగా,
విశ్వాధిపతులుగా అవుతారు. భక్తి మార్గపు వేద-శాస్త్రాలు మొదలైనవి ఎన్నో లెక్కలేనన్ని
ఉన్నాయి. కానీ ఉపయోగపడేది ఒక్క గీత మాత్రమే. భగవంతుడు వచ్చి రాజయోగాన్ని
నేర్పిస్తారు. దానినే గీత అని అంటారు. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా చదువుకుంటారు,
తద్వారా స్వర్గ రాజ్యాన్ని పొందుతారు. ఎవరైతే చదువుతారో వారు పొందుతారు. డ్రామాలో
పాత్ర ఉంది కదా. జ్ఞానాన్ని వినిపించేవారు జ్ఞానసాగరుడు, తండ్రి ఒక్కరే. వారు డ్రామా
ప్లాన్ అనుసారముగా కలియుగాంతము మరియు సత్యయుగ ఆది యొక్క సంగమములోనే వస్తారు. ఏ
విషయములోనూ తికమకపడకండి. తండ్రి వీరిలోకి వచ్చి చదివిస్తారు, ఇది ఇంకెవ్వరూ
చదివించలేరు. ఈ దాదా కూడా ఇంతకుముందు ఎవరి ద్వారా అయినా చదువుకుని ఉన్నట్లయితే, మరి
అతనితోపాటు ఇంకెంతోమంది చదువుకుని ఉంటారు కదా! తండ్రి అయితే అంటారు, ఈ గురువులు
మొదలైనవారందరినీ ఉద్ధరించేందుకు నేనే వస్తాను. ఇప్పుడు పిల్లలైన మీ
లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా ఉంది. మనం ఈ విధంగా అవుతాము. ఇది నరుని నుండి
నారాయణునిగా అయ్యేందుకు సత్యమైన కథ. దీనికి మళ్ళీ భక్తి మార్గములో మహిమ జరుగుతుంది.
భక్తి మార్గపు ఆచారము కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు ఈ రావణ రాజ్యము పూర్తవ్వనున్నది.
ఇప్పుడు మీరు దసరా మొదలైన ఉత్సవాలలోకి వెళ్ళరు. వారేమి చేస్తున్నారు అనేది మీరు
అర్థం చేయిస్తారు. అది పసి పిల్లల పని వంటిది. అది చూడటానికి పెద్ద-పెద్ద వ్యక్తులు
వెళ్తుంటారు. రావణుడిని ఎలా కాలుస్తారు, అతడు ఎవరు అనేది ఎవ్వరూ తెలియజేయలేరు. ఇది
రావణ రాజ్యము కదా. దసరా మొదలైనవాటిలో ఎంత సంతోషముగా జరుపుకుంటూ ఉంటారు, అక్కడ
రావణుడిని కాలుస్తూ వస్తారు. దుఃఖము కూడా కొనసాగుతూ ఉంటుంది. జ్ఞానమేమీ లేదు. మీరు
ఎంత అవివేకులుగా ఉండేవారు అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. రావణుడు
అవివేకులుగా చేసేస్తాడు. ఇప్పుడు మీరు అంటారు - బాబా, మేము లక్ష్మీ-నారాయణులుగా
తప్పకుండా అవుతాము, మేము ఏమీ తక్కువ పురుషార్థము చేయము. ఈ స్కూల్ ఒక్కటే, చదువు చాలా
సహజమైనది. వృద్ధ మాతలు ఇంకేమీ స్మృతి చేయలేకపోతే కేవలం తండ్రిని స్మృతి చేయండి.
నోటితో - ఓ రామ అని అయితే అంటారు కదా. బాబా చాలా సహజమైన ఈ విధానాన్ని
తెలియజేస్తున్నారు - మీరు ఆత్మ, పరమాత్మ అయిన తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు మీ
నావ తీరానికి చేరుకుంటుంది. ఎక్కడికి వెళ్తారు? శాంతిధామానికి- సుఖధామానికి.
మిగిలినవాటన్నింటినీ మర్చిపోండి. మీరు ఏదైతే విన్నారో, చదివారో వాటన్నింటినీ
మర్చిపోయి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే తండ్రి నుండి
వారసత్వము తప్పకుండా లభిస్తుంది. తండ్రి స్మృతి ద్వారానే పాపాలు అంతమవుతాయి. ఇది
ఎంత సహజము. భృకుటి మధ్యలో ఒక సితార మెరుస్తూ ఉంటుంది అని కూడా అంటారు. మరి తప్పకుండా
ఇంత చిన్నని ఆత్మయే ఉంటుంది కదా. ఆత్మను చూడాలని డాక్టర్లు ఎంతో ప్రయత్నిస్తారు,
కానీ అది చాలా సూక్ష్మమైనది. హఠముతో దానిని ఎవ్వరూ చూడలేరు. తండ్రి కూడా ఇటువంటి
బిందువే. వారు అంటారు, ఏ విధముగా మీరు సాధారణమైనవారో, అలాగే నేను కూడా సాధారణముగా
అయి మిమ్మల్ని చదివిస్తాను. వీరిని భగవంతుడు ఎలా చదివిస్తున్నారు అనేది ఎవరికైనా ఏమి
తెలుసు. శ్రీకృష్ణుడు చదివించినట్లయితే మొత్తం అమెరికా, జపాన్ మొదలైన స్థానాలన్నింటి
నుండి వచ్చేస్తారు. అతడిలో అంతటి ఆకర్షణ ఉంటుంది. శ్రీకృష్ణుని పట్ల అందరికీ ప్రేమ
ఉంది కదా. మనం కూడా ఆ విధంగా అవుతున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు.
శ్రీకృష్ణుడు రాకుమారుడు, అతడిని ఒడిలోకి తీసుకోవాలనుకుంటే మరి పురుషార్థము చేయవలసి
ఉంటుంది, అదేమంత పెద్ద విషయము కాదు. తండ్రి తమ పిల్లలను స్వర్గపు రాకుమారులుగా,
విశ్వాధిపతులుగా తయారుచేయడానికి చదివిస్తారు.
తండ్రి అంటారు, పిల్లలూ, చదువు యొక్క సారమేమిటంటే - ప్రపంచపు అన్ని విషయాలనూ
వదిలివేయండి. మా వద్ద కోట్లు, లక్షలు ఉన్నాయి అని ఎప్పుడూ భావించకండి, అవేవీ చేతికి
రావు, అందుకే మంచి రీతిలో పురుషార్థము చేయండి. పిల్లలు తండ్రి వద్దకు వచ్చినప్పుడు
తండ్రి ఫిర్యాదు చేస్తారు - మీరు 8 నెలల నుండీ వస్తున్నారు కానీ ఏ తండ్రి నుండైతే
స్వర్గ రాజ్యాధికారము లభిస్తుందో, వారిని ఇంత సమయం నుండి కలుసుకోను కూడా కలుసుకోలేదే.
బాబా, ఫలానా పని ఉంది అని పిల్లలు అంటారు. అరే, నీవు మరణించి ఉంటే ఇక్కడకు ఎలా
వచ్చేవాడివి! ఈ సాకులేవీ నడవవు. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తుంటే మీరు నేర్చుకోవటం
లేదు. ఎవరైతే ఎంతో భక్తి చేసి ఉంటారో, వారికి 7 రోజులు కాదు కదా, ఒక్క క్షణములోనైనా
బాణము తగలగలదు, క్షణములో విశ్వాధిపతులుగా అవ్వగలరు. ఇతడు స్వయం అనుభవజ్ఞుడు.
వినాశనాన్నీ చూసారు, చతుర్భుజ రూపాన్నీ చూసారు, అంతే - ఓహో, ఇక నేను విశ్వాధిపతిగా
అవుతున్నాను అని భావించారు. సాక్షాత్కారము జరిగింది, ఉత్సాహము కలిగింది, ఇక అంతా
వదిలేసారు. తండ్రి విశ్వ రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి వచ్చారు అని ఇక్కడ పిల్లలైన
మీకు తెలిసింది. నిశ్చయము ఎప్పుడు కలిగింది అని తండ్రి అడిగితే, 8 నెలల క్రితం అని
అంటారు. ముఖ్యమైన విషయము స్మృతి మరియు జ్ఞానము అని బాబా అర్థం చేయించారు. ఇకపోతే
సాక్షాత్కారాలు ఎందుకూ ఉపయోగపడవు. తండ్రిని గుర్తించిన తర్వాత ఇక చదవడం
మొదలుపెట్టండి, తద్వారా మీరు కూడా అలా అవుతారు. మీకు పాయింట్లు లభిస్తూ ఉంటాయి,
వాటిని ఎవరికైనా అర్థం చేయించవచ్చు. చాలా మధురతతో అర్థం చేయించండి. నన్ను స్మృతి
చేసినట్లయితే పావనముగా అయి పావన ప్రపంచానికి అధిపతులుగా అయిపోతారు అని
పతిత-పావనుడైన శివబాబా చెప్తున్నారు అని అర్థం చేయించండి. యుక్తిగా అర్థం చేయించాలి.
గాడ్ ఫాదర్ విముక్తులను చేసి తిరిగి స్వీట్ హోమ్ కు తీసుకువెళ్ళాలి అని మీరు
కోరుకుంటారు కదా. అచ్ఛా, ఇప్పుడు మీపై ఏదైతే తుప్పు పట్టి ఉందో, దానిని
తొలగించుకునేందుకు నన్ను స్మృతి చేయండి అని తండ్రి అంటారు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఉదయముదయమే లేచి నడుస్తూ, తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి. ఎవరు ఎంత సమయము
బాబాను స్మృతి చేస్తున్నారు అంటూ పరస్పరం ఇదే మధురమైన ఆత్మిక సంభాషణ చేసుకోండి, ఆ
తర్వాత మీ అనుభవాలను వినిపించండి.
2. తండ్రిని గుర్తించిన తర్వాత ఇక ఎటువంటి సాకులూ చెప్పకూడదు, చదువులో
నిమగ్నమైపోవాలి, మురళిని ఎప్పుడూ మిస్ చేయకూడదు.
వరదానము:-
సర్వుల గుణాలను చూస్తూ స్వయములో తండ్రి గుణాలను ధారణ చేసే
గుణమూర్త భవ
సంగమయుగములో ఏ పిల్లలైతే గుణాల మాలను ధారణ చేస్తారో, వారే
విజయమాలలోకి వస్తారు, కావున హోలీహంసలుగా అయ్యి సర్వుల గుణాలను చూడండి మరియు ఒక్క
తండ్రి గుణాలను స్వయములో ధారణ చెయ్యండి, ఈ గుణమాల అందరి మెడలో వేయబడి ఉండాలి. ఎవరు
ఎంతగా తండ్రి గుణాలను స్వయములో ధారణ చేస్తారో, వారి మెడలో అంత పెద్ద మాల పడుతుంది.
గుణమాలను స్మరణ చెయ్యటం ద్వారా స్వయము కూడా గుణమూర్తులుగా అయిపోతారు. దీని
స్మృతిచిహ్నముగానే దేవతలు మరియు శక్తుల మెడలో మాలను చూపిస్తారు.
స్లోగన్:-
సాక్షీ
స్థితియే యథార్థ నిర్ణయానికి సింహాసనము.
అవ్యక్త ప్రేరణలు -
ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసము చెయ్యండి, అంతర్ముఖులుగా అవ్వండి
అంతర్ముఖులుగా అయ్యి
కార్యము చేసినట్లయితే విఘ్నాల నుండి, వ్యర్థ సంకల్పాల నుండి రక్షింపబడతారు మరియు
సమయము కూడా చాలా పొదుపు అవుతుంది. ఎవరైతే అంతర్ముఖులుగా ఉంటారో వారిలో స్మృతి యొక్క
సమర్థత కూడా వస్తుంది మరియు ఆత్మ రూపీ నేత్రము శక్తిశాలిగా అవుతూ ఉంటుంది, దీని వలన
ఒకవేళ ఏదైనా విఘ్నము వచ్చేది ఉంటే - ఈ రోజు ఏదో ఒక పరీక్ష వచ్చేది ఉంది అని
అనిపిస్తుంది, అంతేకాక ఎంతగా ముందు నుండి తెలుస్తూ ఉంటుందో, అంతగా తెలివైనవారు
అయిన కారణముగా సఫలతను పొందుతారు.
| | |