09-12-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - బాబా వచ్చారు మీకు అనంతమైన జాగీరును ఇవ్వడానికి, ఇటువంటి మధురమైన బాబాను మీరు ప్రేమగా స్మృతి చేసినట్లయితే పావనముగా అయిపోతారు’’

ప్రశ్న:-
వినాశన సమయము దగ్గరకు వస్తున్న కొలది దాని గుర్తులు ఎలా ఉంటాయి?

జవాబు:-
వినాశన సమయము దగ్గరకు వస్తున్నప్పుడు - 1. మా బాబా వచ్చేశారు అని అందరికీ తెలిసిపోతూ ఉంటుంది. 2. ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనము జరుగనున్నది అని చాలామందికి సాక్షాత్కారాలు కూడా జరుగుతూ ఉంటాయి. 3. సన్యాసులు, రాజులు మొదలైనవారికి జ్ఞానము లభిస్తుంది. 4. అనంతమైన తండ్రి వచ్చారు, వారే సద్గతినిచ్చేవారు అని విన్నప్పుడు చాలామంది వస్తారు. 5. వార్తాపత్రికల ద్వారా అనేకమందికి సందేశము లభిస్తుంది. 6. పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అవుతూ ఉంటారు. ఒక్క తండ్రి స్మృతిలోనే అతీంద్రియ సుఖములో ఉంటారు.

పాట:-
ఈ పాపపు ప్రపంచము నుండి...

ఓంశాంతి
ఈ మాట ఎవరు అంటారు మరియు ఎవరితో అంటారు - ఆత్మిక పిల్లలు అంటారు. బాబా పదే-పదే ఆత్మిక అని ఎందుకంటారు? ఎందుకంటే ఇప్పుడు ఆత్మలు తిరిగి వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడైతే ఈ ప్రపంచములోకి వస్తారో, అప్పుడు ఇక్కడ సుఖముంటుంది. ఆత్మలు ఈ శాంతి మరియు సుఖము యొక్క వారసత్వాన్ని కల్పక్రితము కూడా పొందారు. ఇప్పుడు మళ్ళీ ఈ వారసత్వము రిపీట్ అవుతుంది. రిపీట్ అయినప్పుడు సృష్టి చక్రము కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది. అంతా రిపీట్ అవుతుంది కదా. ఏదైతే గతించిందో, అది మళ్ళీ రిపీట్ అవుతుంది. మామూలుగా నాటకాలు కూడా ఇలా రిపీట్ అవుతాయి కానీ వాటిలో మార్పులు కూడా చేసుకోవచ్చు. ఏవైనా పదాలు మర్చిపోతే, వాటిని తయారుచేసి కలుపుతారు. దీనిని సినిమా అని అంటారు, ఇందులో మార్పులు చేయలేరు. ఇది అనాదిగా తయారై, తయారుచేయబడిన డ్రామా. ఆ నాటకాన్ని తయారై, తయారుచేయబడిన నాటకమని అనరు. ఈ డ్రామాను అర్థం చేసుకోవడము ద్వారా దాని గురించి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు చూసే నాటకాలు మొదలైనవన్నీ అసత్యమైనవని పిల్లలు అర్థం చేసుకున్నారు. కలియుగములో ఏ వస్తువులనైతే చూస్తారో, అవి సత్యయుగములో ఉండవు. సత్యయుగములో ఏదైతే జరిగిందో, అది మళ్ళీ సత్యయుగములోనే జరుగుతుంది. ఈ హద్దు నాటకాలు మొదలైనవన్నీ మళ్ళీ భక్తి మార్గములోనే ఉంటాయి. ఏవైతే భక్తి మార్గములో ఉంటాయో, అవి జ్ఞాన మార్గములో అనగా సత్యయుగములో ఉండవు. ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి మీరు వారసత్వాన్ని పొందుతున్నారు. బాబా అర్థం చేయించారు - ఒకటేమో లౌకిక తండ్రి నుండి, ఇంకొకటి పారలౌకిక తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది, ఇకపోతే ఈ అలౌకిక తండ్రి నుండి వారసత్వము లభించదు. వీరు స్వయం వారి నుండే వారసత్వాన్ని పొందుతారు. ఈ కొత్త ప్రపంచము యొక్క ఆస్తి ఏదైతే ఉందో, దానిని ఆ అనంతమైన తండ్రియే ఇస్తారు, కేవలం వీరి ద్వారా మాత్రమే ఇస్తారు. వీరి ద్వారా మనల్ని దత్తత తీసుకుంటారు, అందుకే వీరిని తండ్రి అని అంటారు. భక్తి మార్గములో కూడా లౌకిక తండ్రి మరియు పారలౌకిక తండ్రి, ఇరువురూ గుర్తుకొస్తారు. వీరు (అలౌకిక తండ్రి) గుర్తుకు రారు ఎందుకంటే వీరి నుండి ఏ వారసత్వము లభించదు. తండ్రి అన్న పదమైతే కరక్టుగానే ఉంది కానీ ఈ బ్రహ్మా కూడా రచనయే కదా. రచనకు రచయిత నుండి వారసత్వము లభిస్తుంది. మిమ్మల్ని కూడా శివబాబాయే రచించారు. బ్రహ్మాను కూడా వారే రచించారు. వారసత్వము రచయిత నుండి లభిస్తుంది, వారు అనంతమైన తండ్రి. బ్రహ్మా వద్ద అనంతమైన వారసత్వము ఏమైనా ఉందా? తండ్రి కూర్చుని వీరి ద్వారా అర్థం చేయిస్తున్నారు, వీరికి కూడా వారసత్వము లభిస్తుంది, అంతేకానీ వీరు వారసత్వాన్ని తీసుకుని మీకు ఇస్తారని కాదు. తండ్రి అంటారు, మీరు వీరిని కూడా స్మృతి చేయకండి. ఈ అనంతమైన తండ్రి నుండి మీకు ఆస్తి లభిస్తుంది. లౌకిక తండ్రి నుండి హద్దు వారసత్వము, పారలౌకిక తండ్రి నుండి అనంతమైన వారసత్వము, ఈ రెండూ రిజర్వ్ అయిపోయాయి. శివబాబా నుండి వారసత్వము లభిస్తుంది అని బుద్ధిలోకి వస్తుంది! అంతేకానీ బ్రహ్మాబాబా యొక్క వారసత్వము అని దేనిని అంటారు! బుద్ధిలో జాగీరు గుర్తుకువస్తుంది కదా. ఈ అనంతమైన రాజ్యాధికారము కూడా మీకు వారి నుండి లభిస్తుంది. వారు పెద్ద తండ్రి. వీరు అంటారు - నన్ను స్మృతి చేయకండి, మీకు లభించేందుకు నా వద్ద ఆస్తి ఏమీ లేదు, ఎవరి నుండైతే ఆస్తి లభించనున్నదో, వారిని స్మృతి చేయండి. వారే అంటారు - నన్నొక్కరినే స్మృతి చేయండి. లౌకిక తండ్రి యొక్క ఆస్తి విషయములో ఎన్ని గొడవలు జరుగుతుంటాయి. ఇక్కడైతే గొడవల విషయమేమీ లేదు. తండ్రిని స్మృతి చేయకపోతే ఆటోమేటిక్ గా అనంతమైన వారసత్వము కూడా లభించదు. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. నీవు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే విశ్వ రాజ్యాధికారము లభిస్తుందని వారు ఈ రథానికి కూడా చెప్తున్నారు. దీనినే స్మృతియాత్ర అని అంటారు. దేహ సంబంధాలన్నింటినీ వదిలి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించండి. ఇందులోనే శ్రమ ఉంది. చదువు కోసం ఎంతోకొంత శ్రమించవలసి ఉంటుంది కదా. ఈ స్మృతియాత్ర ద్వారా మీరు పతితుల నుండి పావనులుగా అవుతారు. వారు శరీరాలతో యాత్రలు చేస్తారు. ఇది ఆత్మ యొక్క యాత్ర. మీ ఈ యాత్ర పరంధామానికి వెళ్ళేందుకు చేసే యాత్ర. పరంధామానికి లేక ముక్తిధామానికి ఈ పురుషార్థము చేయకుండా ఎవ్వరూ వెళ్ళలేరు. ఎవరైతే బాగా స్మృతి చేస్తారో, వారే వెళ్ళగలరు మరియు ఉన్నత పదవిని కూడా వారే పొందగలరు. వెళ్ళడమైతే అందరూ వెళ్తారు. కానీ వారు పతితులు కదా, అందుకే పిలుస్తూ ఉంటారు. ఆత్మ స్మృతి చేస్తుంది. తినడము, తాగడము, అన్నీ ఆత్మయే చేస్తుంది కదా. ఈ సమయములో మీరు దేహీ-అభిమానులుగా అవ్వాలి, ఇందులోనే శ్రమ ఉంది. శ్రమ చేయకుండా ఏదీ లభించదు. వాస్తవానికి ఇది చాలా సహజము, కానీ మాయ నుండి అపోజిషన్ ఉంటుంది కదా. ఎవరి భాగ్యమైతే బాగుంటుందో, వారు వెంటనే ఇందులో నిమగ్నమైపోతారు. కొంతమంది ఆలస్యముగా కూడా వస్తారు. ఒకవేళ బుద్ధిలో సరిగ్గా కూర్చున్నట్లయితే, ఇక నేను ఈ ఆత్మిక యాత్రలోనే నిమగ్నమైపోతాను అని అంటారు. ఇలా తీవ్ర వేగముతో నిమగ్నమైపోతే బాగా పరుగు తీయవచ్చు. ఇంట్లో ఉంటూ కూడా - ఇది చాలా మంచి విషయము, సరైన విషయము అని బుద్ధిలోకి వచ్చేస్తుంది. మనము స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పతిత-పావనుడైన తండ్రిని స్మృతి చేస్తాము. తండ్రి ఆజ్ఞను అనుసరిస్తే పావనముగా అవ్వగలుగుతారు. అలా తప్పకుండా అవుతారు కూడా. ఇది పురుషార్థము యొక్క విషయము. వాస్తవానికి ఇది చాలా సహజమైనది. భక్తి మార్గములోనైతే చాలా కష్టము ఉంటుంది. ఇప్పుడు మనము బాబా వద్దకు తిరిగి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడకు వచ్చి విష్ణుమాలలో కూర్చబడాలి అని మీ బుద్ధిలో ఉంది. మాలల లెక్క చూడాలి. మాల అనేది బ్రహ్మాది కూడా ఉంది, విష్ణువుది కూడా ఉంది, రుద్రునిది కూడా ఉంది. మొట్టమొదట కొత్త సృష్టిలోనివారు వీరే కదా. మిగిలినవారంతా వెనుక వస్తారు అనగా చివరిలో కూర్చబడతారు. మీ ఉన్నతమైన కులమేమిటి అని ఎవరైనా అడిగితే, మీరు విష్ణు కులమని చెప్తారు. మనము వాస్తవానికి విష్ణు కులానికి చెందినవారము, ఆ తర్వాత క్షత్రియ కులానికి చెందినవారిగా అయ్యాము, ఆ తర్వాత వారి నుండి వంశాలు వెలువడుతాయి. వంశాలు ఎలా తయారవుతాయి అనేది ఈ జ్ఞానము ద్వారా మీరు అర్థం చేసుకున్నారు. మొట్టమొదట రుద్ర మాల తయారవుతుంది. అది ఉన్నతోన్నతమైన వంశము. ఇది మీ చాలా ఉన్నతమైన కులము అని బాబా అర్థం చేయించారు. మొత్తం ప్రపంచమంతటికీ సందేశము తప్పకుండా లభిస్తుందని ఇది కూడా అర్థం చేసుకుంటారు. భగవంతుడు తప్పకుండా ఎక్కడో వచ్చి ఉన్నారు, కానీ ఎక్కడ అనేది తెలియదు అని కొంతమంది అంటుంటారు. చివరికైతే అందరికీ తెలుస్తుంది. వార్తాపత్రికల్లో వస్తూ ఉంటుంది. ఇప్పుడైతే వార్తాపత్రికల్లో కొంచెమే వేస్తున్నారు. అలాగని అందరూ ఒకే వార్తాపత్రికను చదువుతారని కాదు. లైబ్రరీలో చదవవచ్చు. కొంతమంది 2-4 వార్తాపత్రికలు కూడా చదువుతారు. కొంతమంది ఏమీ చదవరు. ఇప్పుడు బాబా వచ్చారని అందరికీ తెలియబోతుంది. వినాశన సమయము చాలా దగ్గరకు వచ్చినప్పుడు తెలుస్తుంది. కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనము జరుగుతుంది. చాలామందికి సాక్షాత్కారాలు కూడా జరగవచ్చు. మీరు సన్యాసులు, రాజులు మొదలైనవారికి జ్ఞానాన్ని ఇవ్వాలి. చాలామందికి సందేశము లభించనున్నది. అనంతమైన తండ్రి వచ్చారని, వారే సద్గతినిచ్చేవారని విన్నప్పుడు చాలామంది వస్తారు. ఇప్పుడు వార్తాపత్రికల్లో అంతగా మనకు నచ్చే విధముగా, నియమబద్ధముగా రావడము లేదు. ఎవరో ఒకరు వెలువడుతారు, వారు అన్నీ అడిగి తెలుసుకుంటారు. మనము శ్రీమతము అనుసారముగా సత్యయుగాన్ని స్థాపన చేస్తున్నామని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇది మీ కొత్త మిషన్. మీరు ఈశ్వరీయ మిషన్ లోని ఈశ్వరీయ సభ్యులు. ఉదాహరణకు క్రిస్టియన్ మిషన్ లో క్రిస్టియన్ సభ్యులుగా అవుతారు కదా. మీరు ఈశ్వరీయ సభ్యులు, అందుకే అతీంద్రియ సుఖము గురించి తెలుసుకోవాలనుకుంటే ఆత్మాభిమానులుగా అయిన గోప-గోపికలను అడగండి అనే గాయనముంది. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి, ఇతరులెవ్వరినీ కాదు. ఈ రాజయోగాన్ని ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు. వారే గీతా భగవానుడు. అందరికీ తండ్రి ఇచ్చే ఈ ఆహ్వానాన్ని లేక సందేశాన్ని ఇవ్వాలి. మిగిలిన విషయాలన్నీ జ్ఞాన అలంకరణనే. ఈ చిత్రాలన్నీ జ్ఞాన అలంకరణలు, అంతేకానీ భక్తికి సంబంధించినవి కాదు. మనుష్యులకు అర్థం చేయించేందుకని తండ్రి కూర్చుని వీటిని తయారుచేయించారు. ఈ చిత్రాలు మొదలైనవన్నీ అయితే కనుమరుగైపోతాయి. ఇకపోతే, ఈ జ్ఞానము ఆత్మలో నిలిచిపోతుంది. తండ్రికి కూడా ఈ జ్ఞానముంది, ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది.

మీరు ఇప్పుడు భక్తి మార్గాన్ని దాటి జ్ఞాన మార్గములోకి వచ్చారు. మన ఆత్మలో ఈ పాత్ర ఉందని, అది ఇప్పుడు నడుస్తూ ఉందని మీకు తెలుసు. నిశ్చితమై ఉంది కావున మనము మళ్ళీ తండ్రి నుండి రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. తండ్రియే వచ్చి ఈ జ్ఞానాన్ని ఇవ్వవలసి ఉంది. ఇది ఆత్మలో నిశ్చితమై ఉంది. వెళ్ళి అక్కడికి చేరుకుంటాము, మళ్ళీ కొత్త ప్రపంచములో పాత్ర రిపీట్ అవుతుంది. ప్రారంభము నుండి మొదలుకుని ఆత్మ యొక్క రికార్డు అంతటినీ ఈ సమయములో మీరు తెలుసుకున్నారు. తర్వాత ఇవన్నీ ఆగిపోతాయి. భక్తి మార్గపు పాత్ర కూడా ఆగిపోతుంది. మళ్ళీ సత్యయుగములో మీ పాత్ర ఏదైతే జరిగి ఉంటుందో, అదే జరుగుతుంది. అక్కడ ఏమవుతుంది అనేది తండ్రి చెప్పరు. ఏదైతే ఇంతకుముందు జరిగిందో, అదే జరుగుతుంది. సత్యయుగము కొత్త ప్రపంచమని అర్థం చేసుకోవడము జరుగుతుంది. తప్పకుండా అక్కడ అన్నీ కొత్తవిగా, సతోప్రధానముగా మరియు చవకగా ఉంటాయి. కల్పక్రితము ఏదైతే జరిగిందో, అదే జరుగుతుంది. ఈ లక్ష్మీ-నారాయణులకు ఎంత సుఖముంటుంది అనేది చూస్తారు కూడా. వజ్ర-వైఢూర్యాలు, ధనము అపారముగా ఉంటాయి. ధనముంటే సుఖము కూడా ఉంటుంది. ఇక్కడ మీరు పోల్చవచ్చు. అక్కడ పోల్చలేరు. ఇక్కడి విషయాలన్నింటినీ అక్కడ మర్చిపోతారు. ఇవన్నీ కొత్త విషయాలు, వీటిని తండ్రియే పిల్లలకు అర్థం చేయిస్తారు. కార్య వ్యవహారాలన్నీ సమాప్తమైపోయే ఆ స్థానానికి ఆత్మలు వెళ్ళవలసి ఉంటుంది. లెక్కాచారాలన్నీ సమాప్తమైపోతాయి. రికార్డు పూర్తయిపోతుంది. ఒక్క రికార్డే చాలా పెద్దదిగా ఉంటుంది. మరి ఆత్మ కూడా అంతే పెద్దగా ఉండాలి కదా అని అంటారు. కానీ అలా ఉండదు. ఇంత చిన్నని ఆత్మలో 84 జన్మల పాత్ర ఉంది. ఆత్మ కూడా అవినాశీయే. దీనిని కేవలం అద్భుతమనే అంటారు. ఇటువంటి ఆశ్చర్యకరమైన విషయము ఇంకేదీ ఉండదు. సత్య-త్రేతాయుగాల సమయములో బాబా విశ్రాంతిలో ఉంటారు అని బాబా కోసం అంటుంటారు. మనమైతే ఆల్ రౌండ్ పాత్రను అభినయిస్తాము. అందరికంటే ఎక్కువగా మన పాత్రే ఉంది కావున తండ్రి వారసత్వము కూడా ఉన్నతమైనది ఇస్తారు. బాబా అంటారు, 84 జన్మలు కూడా మీరే తీసుకుంటారు. మన పాత్ర ఏ విధముగా ఉందంటే, దీనిని ఇంకెవ్వరూ అభినయించలేరు. ఇవి అద్భుతమైన విషయాలు కదా. ఆత్మలకు తండ్రి కూర్చొని ఇదంతా అర్థం చేయించడమనేది కూడా అద్భుతమైన విషయము. ఆత్మ మేల్ కాదు, ఫీమేల్ కూడా కాదు. శరీరాన్ని ధరించినప్పుడు స్త్రీ, పురుషులుగా పిలువబడతారు. ఆత్మలందరూ పుత్రులే కావున పరస్పరము సోదరులవుతారు. వారసత్వాన్ని పొందేందుకు అందరూ సోదరులే. ఆత్మ తండ్రికి పుత్రుడు కదా. తండ్రి నుండి వారసత్వము తీసుకుంటుంది కావున పురుష్ అనే అంటారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే హక్కు ఆత్మలందరికీ ఉంది. దాని కోసము తండ్రిని స్మృతి చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. మనమందరమూ సోదరులము. ఆత్మ ఆత్మే. అది ఎప్పుడూ మారదు. ఇకపోతే, శరీరము ఒక్కోసారి పురుష శరీరాన్ని, ఒక్కోసారి స్త్రీ శరీరాన్ని తీసుకుంటుంది. ఇవి అర్థం చేసుకోవలసిన చాలా గమ్మత్తు అయిన విషయాలు. వీటిని ఇంకెవ్వరూ వినిపించలేరు. తండ్రి నుండి లేక పిల్లలైన మీ నుండి మాత్రమే వినగలరు. తండ్రి అయితే పిల్లలైన మీతోనే మాట్లాడుతారు. ఇంతకుముందైతే అందరినీ కలిసేవారు, అందరితోనూ మాట్లాడేవారు. ఇక ముందు-ముందు మెల్లమెల్లగా చివరికి ఎవరితోనూ మాట్లాడరు. కొడుకు తండ్రిని ప్రత్యక్షము చేస్తాడు కదా. పిల్లలే చదివించాలి. పిల్లలైన మీరే అనేకుల సేవను చేసి తీసుకువస్తారు. వీరు చాలా మందిని తమ సమానముగా తయారుచేసి తీసుకువస్తున్నారని బాబా భావిస్తారు. ఇతను పెద్ద రాజుగా అవుతారు, ఇతను చిన్న రాజుగా అవుతారు అని అర్థం చేసుకుంటారు. మీరు అందరినీ రావణుడి సంకెళ్ళ నుండి విడిపించి మీ మిషన్ లోకి తీసుకువచ్చే ఆత్మిక సైన్యము కూడా. ఎవరు ఎంత సేవ చేస్తారో, వారికి అంత ఫలము లభిస్తుంది. ఎవరైతే ఎక్కువ భక్తి చేశారో, వారే ఎక్కువ చురుకైనవారిగా అవుతారు మరియు వారసత్వాన్ని తీసుకుంటారు. ఇది చదువు, బాగా చదువుకోకపోతే ఫెయిల్ అయిపోతారు. చదువు చాలా సహజమైనది. అర్థం చేసుకోవడము మరియు అర్థం చేయించడము కూడా సహజమే. కష్టమైన విషయమేమీ లేదు, కానీ రాజధాని స్థాపనవ్వనున్నది, అందులోనైతే అందరూ కావాలి కదా. ఆ రాజధానిలో మనము ఉన్నత పదవిని పొందాలని పురుషార్థము చేయాలి. మృత్యులోకము నుండి ట్రాన్స్ఫర్ అయ్యి అమరలోకములోకి వెళ్ళాలి. ఎంతగా చదువుకుంటారో, అంతగా అమరపురిలో ఉన్నత పదివిని పొందుతారు.

తండ్రిని ప్రేమించాలి కూడా ఎందుకంటే వారు అత్యంత ప్రియమైనవారు. వారు ప్రేమసాగరుడు కూడా. అందరికీ ఒకేలాంటి ప్రేమ ఉండదు. కొంతమంది స్మృతి చేస్తారు, కొంతమంది చేయరు. కొంతమందికి ఇతరులకు అర్థం చేయించాలనే నషా కూడా ఉంటుంది కదా. ఇది చాలా పెద్ద టెంప్టేషన్. ఇది విశ్వవిద్యాలయమని ఎవరికైనా సరే చెప్పాలి. ఇది ఆధ్యాత్మిక చదువు. ఇటువంటి చిత్రాలు ఇంకే స్కూళ్ళలోనూ చూపించబడవు. రోజురోజుకు ఇంకా ఎన్నో చిత్రాలు వెలువడుతూ ఉంటాయి. వాటిని చూడగానే మనుష్యులు అర్థం చేసుకోగలిగేలా ఉంటాయి. మెట్ల వరస చిత్రము చాలా బాగుంది, కానీ దేవతా ధర్మానికి చెందినవారు కాకపోతే వారికి అర్థం కాదు. ఎవరైతే ఈ కులానికి చెందినవారు ఉంటారో, వారికి బాణము తగులుతుంది. మన దేవతా ధర్మానికి చెందిన ఆకులు ఎవరైతే ఉంటారో, వారే వస్తారు. వీరు చాలా అభిరుచితో వింటున్నారని మీకు ఫీల్ అవుతుంది. కొంతమంది ఊరికినే వెళ్ళిపోతారు. రోజురోజుకు కొత్త-కొత్త విషయాలను కూడా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. సేవ చేయాలనే అభిరుచి చాలా ఉండాలి. ఎవరైతే సేవలో తత్పరులై ఉంటారో, వారే హృదయాన్ని కూడా అధిరోహిస్తారు మరియు సింహాసనాన్ని కూడా అధిరోహిస్తారు. మున్ముందు మీకు అన్ని విషయాలు సాక్షాత్కారమవుతూ ఉంటాయి. ఆ సంతోషములోనే మీరు ఉంటారు. ప్రపంచములోనైతే ఎన్నో హాహాకారాలు జరగనున్నాయి. రక్తపు నదులు కూడా ప్రవహించనున్నాయి. సేవ చేసే సాహసవంతులు ఎప్పుడూ ఆకలితో మరణించరు. కానీ ఇక్కడైతే మీరు వనవాసములో ఉండాలి. సుఖము కూడా అక్కడ లభిస్తుంది. కన్యను అయితే వనవాహములో కూర్చోబెడతారు కదా. అత్తవారింటికి వెళ్ళి బాగా ధరించు అని అంటారు. మీరు కూడా అత్తవారింటికి వెళ్తారు కావున ఆ నషా ఉంటుంది. అది ఉన్నదే సుఖధామము. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మాలలో కూర్చబడేందుకు దేహీ-అభిమానులుగా అయి తీవ్ర వేగముతో స్మృతియాత్రను ేయాలి. తండ్రి ఆజ్ఞపై నడుస్తూ పావనముగా అవ్వాలి.

2. తండ్రి పరిచయాన్ని ఇచ్చి అనేకులను తమ సమానముగా తయారుచేసే సేవ చేయాలి. ఇక్కడ వనవాహములో ఉండాలి. అంతిమ హాహాకారాల దృశ్యాలను చూసేందుకు మహావీరులుగా అవ్వాలి.

వరదానము:-
బంధనాల పంజరాన్ని తెంచి జీవన్ముక్త స్థితిని అనుభవము చేసే సత్యమైన ట్రస్టీ భవ

శరీరము లేక సంబంధాల బంధనమే పంజరము. బాధ్యతను కూడా నిమిత్తమాత్రముగా నిర్వర్తించాలే కానీ మోహముతో కాదు, అప్పుడు నిర్బంధనులు అని పిలువబడతారు. ఎవరైతే ట్రస్టీలుగా అయి నడుచుకుంటారో వారే నిర్బంధనులు. ఏదైనా నాది అనేది ఉన్నట్లయితే పంజరములో బంధింపబడి ఉన్నట్లు. ఇప్పుడు పంజరములోని మైనాల నుండి ఫరిశ్తాలుగా అయిపోయారు, అందుకే ఎక్కడా కొద్దిగా కూడా బంధనము ఉండకూడదు. మనసు యొక్క బంధనము కూడా ఉండకూడదు. ఏం చేయాలి, ఎలా చేయాలి, నేను కోరుకుంటున్నాను కానీ జరగడము లేదు... ఇవి కూడా మనసు యొక్క బంధనాలు. ఎప్పుడైతే మరజీవాగా అయిపోయారో అప్పుడు అన్ని రకాల బంధనాలు సమాప్తమైపోతాయి, సదా జీవన్ముక్త స్థితి అనుభవమవుతూ ఉండాలి.

స్లోగన్:-
సంకల్పాలను పొదుపు చేసినట్లయితే సమయము, మాటలు అన్నీ స్వతహాగానే పొదుపు అవుతాయి.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి

కర్మాతీతము అనగా కర్మ యొక్క ఎటువంటి బంధనము యొక్క స్పర్శ నుండి కూడా అతీతము. అటువంటి అనుభవమే పెరుగుతూ ఉండాలి. ఏ కార్యమూ స్పర్శించకూడదు మరియు చేసిన తరువాత ఫలితము ఏదైతే వెలువడుతుందో అది కూడా స్పర్శించకూడదు, పూర్తిగా అతీతత్వము అనుభవమవుతూ ఉండాలి. ఎవరో చేయించారు మరియు నేను చేసాను అన్నట్లుగా ఉండాలి. నిమిత్తులుగా అవ్వటములో కూడా అతీతత్వము అనుభవమవ్వాలి. ఏదైతే గతించిందో దానికి ఫుల్ స్టాప్ పెట్టి అతీతులుగా అవ్వండి.