10-06-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు శ్రీమతమనుసారముగా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి, శ్రేష్ఠముగా అయి ఇతరులను అలా తయారుచేయడానికి మీకు శ్రేష్ఠ మతము లభిస్తుంది’’

ప్రశ్న:-
దయార్ద్ర హృదయులైన పిల్లల హృదయములో ఏ అల వస్తుంది? వారు ఏం చేయాల్సి ఉంటుంది?

జవాబు:-
దయార్ద్ర హృదయులైన పిల్లలెవరైతే ఉన్నారో, వారికి - మేము పల్లె-పల్లెకు వెళ్ళి సేవ చేయాలి అని అనిపిస్తుంది. ఈ రోజుల్లో వారు పాపం చాలా దుఃఖితులుగా ఉన్నారు. కావున వెళ్ళి వారికి ఈ శుభవార్తను వినిపించాలి - విశ్వములో పవిత్రత, సుఖ-శాంతుల దైవీ స్వరాజ్యము స్థాపన అవుతోంది, ఇది ఆ మహాభారత యుద్ధమే, తప్పకుండా ఆ సమయములో తండ్రి కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా తండ్రి వచ్చి ఉన్నారు.

ఓంశాంతి
మధురాతి మధురమైన పిల్లలు ఇక్కడ కూర్చున్నారు, కావున - మేము ఈశ్వరీయ సంతానము అని తప్పకుండా భావిస్తారు. తప్పకుండా స్వయాన్ని ఆత్మగానే భావిస్తారు. శరీరము ఉంది కావున దాని ద్వారా ఆత్మ వింటుంది. తండ్రి ఈ శరీరాన్ని లోన్ గా తీసుకున్నారు, కావుననే వినిపిస్తారు. మనం ఈశ్వరీయ సంతానమని లేక ఈశ్వరీయ సాంప్రదాయమువారమని, తర్వాత మనం దైవీ సాంప్రదాయమువారిగా అవుతామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. స్వర్గాధిపతులుగా దేవతలే ఉంటారు. మనం మళ్ళీ 5000 సంవత్సరాల క్రితం వలె దైవీ స్వరాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము. ఆ తర్వాత మనం దేవతలుగా అయిపోతాము. ఈ సమయములో మొత్తం ప్రపంచమంతా, అందులోనూ విశేషముగా భారత్ లో మరియు మిగతా ప్రపంచములో కూడా, మనుష్యమాత్రులందరూ ఒకరికొకరు దుఃఖమునే ఇచ్చుకుంటూ ఉంటారు. వారికి సుఖధామము అనేది కూడా ఉంటుంది అన్నది తెలియదు. పరమపిత పరమాత్మయే వచ్చి అందరినీ సుఖవంతులుగా, శాంతిమయముగా తయారుచేస్తారు. ఇక్కడైతే ఇంటి-ఇంటిలోనూ ఒకరికొకరు దుఃఖమునే ఇచ్చుకుంటూ ఉంటారు. మొత్తం విశ్వమంతటిలోనూ దుఃఖమే దుఃఖము ఉంది. తండ్రి మనల్ని 21 జన్మల కొరకు సదా సుఖవంతులుగా తయారుచేస్తారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఎప్పటినుండి దుఃఖము ప్రారంభమయ్యింది, మళ్ళీ ఎప్పుడు పూర్తవుతుంది అన్న ఈ చింతన ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండదు. మేము తప్పకుండా ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందినవారిగా ఉండేవారము అన్నది మీకు మాత్రమే బుద్ధిలో ఉంది. వాస్తవానికి మొత్తం ప్రపంచములోని మనుష్యమాత్రులంతా ఈశ్వరీయ సాంప్రదాయము వారే. ప్రతి ఒక్కరూ వారిని తండ్రీ అనే పిలుస్తారు. శివబాబా మనకు శ్రీమతాన్ని ఇస్తున్నారని ఇప్పుడు పిల్లలకు తెలుసు. శ్రీమతము ప్రసిద్ధమైనది. ఇది ఉన్నతోన్నతుడైన భగవంతుని యొక్క ఉన్నతోన్నతమైన మతము. వారి ఇచ్చే గతి, వారు చూపే మార్గము అతీతమైనవి అని అంటూ ఉంటారు కూడా. శివబాబా ఇచ్చే శ్రీమతము మనల్ని ఎలా ఉన్నవారిని ఎలా తయారుచేస్తుంది! స్వర్గాధిపతులుగా తయారుచేస్తుంది. ఇకపోతే మనుష్యమాత్రులెవరైతే ఉన్నారో వారంతా నరకాధిపతులుగానే తయారుచేస్తారు. ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు. ఈ నిశ్చయమైతే ఉంది కదా. నిశ్చయబుద్ధి కలవారే ఇక్కడకు వస్తారు మరియు బాబా మమ్మల్ని మళ్ళీ సుఖధామానికి అధిపతులుగా తయారుచేస్తారు అని అర్థం చేసుకుంటారు. మనమే 100 శాతము పవిత్ర గృహస్థ మార్గానికి చెందినవారిగా ఉండేవారము అన్న ఈ స్మృతి కలిగింది. 84 జన్మల లెక్క కూడా ఉంది కదా. ఎవరెవరు ఎన్నెన్ని జన్మలు తీసుకుంటారు! ఏ ధర్మాలైతే తర్వాత వస్తాయో వాళ్ళకు జన్మలు కూడా తక్కువే ఉంటాయి.

పిల్లలైన మీరు ఇప్పుడు ఈ నిశ్చయముంచుకోవాలి - మేము ఈశ్వరీయ సంతానము. అందరినీ శ్రేష్ఠముగా తయారుచేయడానికి మనకు శ్రేష్ఠ మతము లభిస్తుంది. మన ఆ బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తారు. వేద-శాస్త్రాలు మొదలైనవన్నీ భగవంతుడిని కలుసుకునేందుకు మార్గాలు అని మనుష్యులు భావిస్తారు, కానీ భగవంతుడు అంటారు - వీటి వేటి ద్వారా నన్ను ఎవ్వరూ కలుసుకోలేరు. నేనే వస్తాను. అందుకే కదా నా జయంతిని కూడా జరుపుకుంటారు. కానీ ఎప్పుడు వస్తాను మరియు ఎవరి శరీరములోకి వస్తాను అనేది బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు అందరికీ సుఖమును ఇవ్వాలి. ప్రపంచములో అందరూ ఒకరికొకరు దుఃఖమునే ఇచ్చుకుంటూ ఉంటారు. వారు వికారాలలోకి వెళ్ళడమనేది దుఃఖాన్ని ఇవ్వడము అని అర్థం చేసుకోరు. అది మహా దుఃఖము అని ఇప్పుడు మీకు తెలుసు. ఏ కుమారి అయితే పవిత్రముగా ఉంటుందో, ఆమెను అపవిత్రముగా చేస్తారు. నరకవాసిగా అయ్యేందుకు ఎంత వేడుకను జరుపుతారు. ఇక్కడైతే అటువంటి హంగామాల విషయమేదీ లేదు. మీరు చాలా శాంతిగా కూర్చున్నారు. అందరూ సంతోషిస్తారు. మొత్తం విశ్వమంతటినీ సదా కొరకు సుఖవంతముగా తయారుచేస్తారు. మీకు శివశక్తుల రూపములో గౌరవముంది. మీతో పోలిస్తే లక్ష్మీ-నారాయణులకు అసలు ఏ గౌరవమూ లేనట్లే. శివశక్తుల పేరే ప్రసిద్ధమైనది, ఎందుకంటే ఏ విధంగా తండ్రి సేవ చేసారో, అందరినీ పవిత్రముగా తయారుచేసి సదా సుఖవంతులుగా చేసారో, అలాగే మీరు కూడా తండ్రికి సహాయకులుగా అయ్యారు, కావుననే భారతమాతలైన శక్తులైన మీకు మహిమ ఉంది. ఈ లక్ష్మీ-నారాయణులు యధా రాజా రాణి తథా ప్రజ అందరూ స్వర్గవాసులే. ఇదేమన్నా గొప్ప విషయమా! ఏ విధంగా వారు స్వర్గవాసులో అలా ఇక్కడి రాజా-రాణులందరూ నరకవాసులుగా ఉన్నారు. ఇటువంటి నరకవాసులను స్వర్గవాసులుగా మీరు తయారుచేస్తారు. మనుష్యులకైతే ఏమీ తెలియదు. పూర్తిగా తుచ్ఛబుద్ధి కలవారిగా ఉన్నారు. ఏమేమో చేస్తూ ఉంటారు! ఎన్ని యుద్ధాలు మొదలైనవి ఉన్నాయి. ప్రతి విషయములోనూ ఎంతో దుఃఖితులుగానే ఉన్నారు. సత్యయుగములో అన్ని పరిస్థితులలోనూ సుఖమే సుఖము ఉంది. ఇప్పుడు అందరికీ సుఖాన్ని ఇచ్చేందుకనే తండ్రి శ్రేష్ఠ మతాన్ని ఇస్తారు. శ్రీమత్ భగవానువాచ అని గానం చేస్తారు కూడా. శ్రీమత్ మనుష్య ఉవాచ కాదు. సత్యయుగములో దేవతలకు మతమునిచ్చే అవసరమే లేదు. ఇక్కడ మీకు శ్రీమతము లభిస్తుంది. తండ్రితోపాటు మీరు కూడా శివశక్తులుగా గానం చేయబడతారు. ఇప్పుడు మళ్ళీ ఆ పాత్ర ప్రాక్టికల్ గా జరుగుతోంది. ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలైన మీరు మనసా-వాచా-కర్మణా అందరికీ సుఖమును ఇవ్వాలి. అందరికీ సుఖధామపు మార్గాన్ని తెలియజేయాలి. మీ వ్యాపారమే ఇది. శరీర నిర్వహణార్థము పురుషులు వ్యాపారాలు కూడా చేయవలసి ఉంటుంది. సాయంత్ర వేళలో దేవతలు సంచరించేందుకు వెళ్తారు అని అంటారు. ఇప్పుడు దేవతలు ఇక్కడకు ఎక్కడి నుండి వస్తారు. కానీ ఆ సమయాన్ని శుద్ధమైన సమయము అని అంటారు. ఆ సమయములో అందరికీ ఖాళీ సమయము కూడా ఉంటుంది. పిల్లలైన మీరు నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ స్మృతి చేయాలి. ఏ దేహధారికీ చాకిరీ మొదలైనవి చేయకూడదు. ద్రౌపది కాళ్ళు వత్తినట్లుగా తండ్రికి గాయనము ఉంది. దీని భావాన్ని కూడా అర్థం చేసుకోరు. స్థూలంగా కాళ్ళు వత్తే విషయమేమీ కాదు. తండ్రి వద్దకు వృద్ధ మాతలు మొదలైనవారు ఎందరో వస్తారు, వారు భక్తి చేస్తూ, చేస్తూ అలసిపోయారని తండ్రికి తెలుసు. అర్ధకల్పము ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు కదా. కావున ఈ కాళ్ళు వత్తారు అన్న పదాన్ని వారు తీసుకున్నారు. వాస్తవానికి శ్రీకృష్ణుడు కాళ్ళు ఎలా వత్తుతారు, అదేమైనా శోభిస్తుందా? మీరు శ్రీకృష్ణుడిని కాళ్ళు వత్తనిస్తారా? శ్రీకృష్ణుడిని చూడగానే అతనికి అతుక్కుపోతారు. అతడిలోనైతే ఎంతో చమత్కారముంటుంది. శ్రీకృష్ణుడు తప్ప ఇంకే విషయమూ అసలు బుద్ధిలో కూర్చోనే కూర్చోదు, అతడే అందరికన్నా తేజోమయుడు. అంత చిన్న పిల్లవాడైన శ్రీకృష్ణుడు మురళి వినిపించాడంటే అసలు ఆ మాటే సరిపోదు. ఇక్కడ మీరు శివబాబాను ఎలా కలుసుకుంటారు? శివబాబాను స్మృతి చేసి ఆ తర్వాత వీరి వద్దకు రండి అని పిల్లలైన మీకు చెప్పవలసి ఉంటుంది. మమ్మల్ని శివబాబా 21 జన్మల కొరకు సుఖవంతులుగా తయారుచేస్తారని పిల్లలైన మీకైతే లోలోపల సంతోషము ఉండాలి. ఇటువంటి తండ్రిపైనైతే బలిహారమైపోవాలి. ఎవరైనా సుపుత్రులు ఉంటే, వారిపై తండ్రి బలిహారమవుతారు. అటువంటి పిల్లలు తండ్రి యొక్క ప్రతి కోరికను పూర్తి చేస్తారు. మరికొందరు పిల్లలు ఎలా ఉంటారంటే వారు తమ తండ్రిని కూడా హత్య చేయించేస్తారు. ఇక్కడైతే మీరు అతి ప్రియమైనవారిగా అవ్వాలి, ఎవ్వరికీ దుఃఖమును ఇవ్వకూడదు. దయార్ద్ర హృదయులైన పిల్లలెవరైతే ఉన్నారో, వారికి - తాము పల్లె-పల్లెకు వెళ్ళి సేవ చేయాలి అని ఉంటుంది. ఈ రోజుల్లో పాపం చాలా దుఃఖితులుగా ఉన్నారు. వారి వద్దకు వెళ్ళి ఈ శుభవార్తను వినిపించండి - విశ్వములో పవిత్రత, సుఖ-శాంతుల దైవీ స్వరాజ్యము స్థాపన అవుతోంది, ఇది ఆ మహాభారత యద్ధమే, తప్పకుండా ఆ సమయములో తండ్రి కూడా ఉన్నారు, అలాగే ఇప్పుడు కూడా తండ్రి వచ్చి ఉన్నారు. బాబా మనల్ని పురుషోత్తములుగా తయారుచేస్తున్నారని మీకు తెలుసు. ఇదే పురుషోత్తమ సంగమయుగము. మనము పురుషోత్తములుగా ఎలా అవుతాము అనేది పిల్లలైన మీకు తెలుసు. మీ ఉద్దేశ్యమేమిటి అని మిమ్మల్ని అడుగుతారు. మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడమే మా ఉద్దేశ్యమని చెప్పండి. దేవతలైతే ప్రసిద్ధమైనవారు. తండ్రి అంటారు, దేవతల భక్తులు ఎవరైతే ఉంటారో, వారికి అర్థం చేయించండి. భక్తిని కూడా మొట్టమొదట మీరే ప్రారంభించారు, శివుని భక్తితో ప్రారంభించారు, ఆ తర్వాత దేవతలను భక్తి చేసారు. కావున మొట్టమొదట శివబాబా భక్తులకు అర్థం చేయించాలి. నన్ను స్మృతి చేయండి అని శివబాబా చెప్తున్నారు అని చెప్పండి. శివుని పూజను చేస్తారు కానీ పతిత-పావనుడు ఆ తండ్రే అన్నది బుద్ధిలోకి రాదు. భక్తి మార్గములో ఎన్ని ఎదురుదెబ్బలు తింటారో చూడండి. శివలింగాన్ని అయితే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, పూజ చేయవచ్చు, మరి అమరనాథ్, బద్రీనాథ్ మొదలైన స్థానాలకు వెళ్ళవలసిన అవసరమేముంది. కానీ భక్తి మార్గములో మనుష్యులు తప్పకుండా ఎన్నో ఎదురుదెబ్బలు తినవలసి ఉంది. మిమ్మల్ని వాటి నుండి విడిపిస్తారు. మీరు శివశక్తులు, శివుని పిల్లలు. మీరు తండ్రి నుండి శక్తిని తీసుకుంటారు, అది కూడా స్మృతి ద్వారానే లభిస్తుంది. వికర్మలు వినాశనమవుతాయి. పతిత-పావనుడు అయితే తండ్రియే కదా. స్మృతి ద్వారానే మీరు వికర్మాజీతులుగా, పావనముగా అవుతారు. అందరికీ ఈ మార్గము తెలియజేయాలి. మీరు ఇప్పుడు రామునికి చెందినవారిగా అయ్యారు. రామ రాజ్యములో సుఖము ఉంటుంది, రావణ రాజ్యములో దుఃఖము ఉంటుంది. ఇంతగా పూజ జరిగే వారందరి చిత్రాలు భారత్ లోనే ఉన్నాయి, లెక్కలేనన్ని మందిరాలు ఉన్నాయి. కొందరు హనుమంతుడిని పూజిస్తారు, మరికొందరు ఇంకెవరినో పూజిస్తారు. దీనిని అంధ విశ్వాసము అని అంటారు. ఇంతకుముందు మీరు కూడా అంధులుగా ఉండేవారని ఇప్పుడు మీకు తెలుసు. బ్రహ్మా, విష్ణు, శంకరులు ఎవరు మరియు ఏమిటి అనేది ఇంతకుముందు ఇతడికి కూడా తెలియదు. ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో, వారే మళ్ళీ పూజారులుగా అయ్యారు. సత్యయుగములో పూజ్యులు ఉన్నారు, ఇక్కడ పూజారులు ఉన్నారు. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు. పూజ్యులు సత్యయుగములోనే ఉంటారని మీకు తెలుసు. ఇక్కడ పూజారులు ఉన్నారు, కావున వారు పూజలే చేస్తూ ఉంటారు. మీరు శివశక్తులు. ఇప్పుడు మీరు పూజారులూ కారు, పూజ్యులూ కారు. తండ్రిని మర్చిపోకండి. ఇది సాధారణ తనువు కదా. దీనిలోకి ఉన్నతోన్నతుడైన భగవంతుడు వస్తారు. మీరు తండ్రికి మీ వద్దకు రమ్మని ఆహ్వానమును ఇస్తారు కదా. బాబా, రండి, మేము చాలా పతితులుగా అయిపోయాము, పాత పతిత ప్రపంచములోకి, పతిత శరీరములోకి వచ్చి మమ్మల్ని పావనముగా తయారుచేయండి. ఇలా పిల్లలు ఆహ్వానమును ఇస్తారు. ఇక్కడ పావనులు ఎవ్వరూ లేనే లేరు. తప్పకుండా పతితులందరినీ పావనముగా తయారుచేసి తీసుకువెళ్తారు కదా. కావున అందరూ శరీరాన్ని వదలవలసి ఉంటుంది కదా. మనుష్యులు శరీరాన్ని వదిలితే ఎంతగా ఆర్తనాదాలు చేస్తారు. మీరు సంతోషముగా వెళ్తారు. శివబాబాను ఎవరు ఎక్కువగా స్మృతి చేస్తారో చూద్దాము అంటూ ఇప్పుడు మీ ఆత్మ పోటీ పడుతుంది. శివబాబా స్మృతిలో ఉంటూ, ఉంటూండగా శరీరాన్ని వదిలివేసినట్లయితే అది అహో సౌభాగ్యము. నావ ఆవలి తీరానికి చేరుకుంటుంది. ఇటువంటి పురుషార్థము చేయండి అని బాబా అందరికీ చెప్తారు. సన్యాసులలో కూడా కొందరు ఇలా ఉంటారు, బ్రహ్మములో లీనమయ్యేందుకు అభ్యాసము చేస్తుంటారు, ఇక చివరలో అలా కూర్చుని, కూర్చుని ఉండగానే శరీరాన్ని వదిలివేస్తారు. నిశ్శబ్ద వాతావరణము ఏర్పడుతుంది.

సుఖమయమైన రోజులు మళ్ళీ వస్తాయి. దాని కోసమే మీరు పురుషార్థము చేస్తారు. బాబా, మేము మీ వద్దకు రావాలి, మిమ్మల్నే స్మృతి చేస్తూ, చేస్తూ మా ఆత్మ ఎప్పుడైతే పవిత్రముగా అయిపోతుందో, అప్పుడు మీరు మమ్మల్ని మీతోపాటు తీసుకువెళ్తారు. పూర్వము కాశీలోని కత్తుల బావిలో దూకేటప్పుడు ఎంతో ప్రేమగా బలి అయ్యేవారు, మేము ఇక ముక్తులైపోతాము అని ఈ విధంగా భావించేవారు. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేస్తూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. మీరు తండ్రిని స్మృతి చేస్తారు, ఈ స్మృతి బలముతో పాపాలు అంతమవుతాయి. కానీ వాళ్ళు - నీటితో మా పాపాలు అంతమవుతాయి, తద్వారా ముక్తి లభిస్తుంది అని భావిస్తారు. అది యోగబలమేమీ కాదు అని తండ్రి అర్థం చేయిస్తారు. పాపాల శిక్షలను అనుభవిస్తూ, అనుభవిస్తూ వెళ్ళి జన్మ తీసుకుంటారు. మళ్ళీ కొత్తగా పాపాల ఖాతా ప్రారంభమవుతుంది. కర్మ, అకర్మ, వికర్మల గతులను తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. రామ రాజ్యములో కర్మలు అకర్మలవుతాయి, రావణ రాజ్యములో కర్మలు వికర్మలవుతాయి, అక్కడ వికారాలు మొదలైనవేవీ ఉండవు.

మధురాతి మధురమైన పుష్పాల వంటి పిల్లలకు తెలుసు - తండ్రి మనకు అన్ని యుక్తులను, అన్ని రహస్యాలను అర్థం చేయిస్తున్నారు. తండ్రిని స్మృతి చేయండి, ఇదే ముఖ్యమైన విషయము. పతిత-పావనుడైన తండ్రి మన ఎదురుగా కూర్చున్నారు, వారు ఎంత నిర్మానచిత్తులు, ఎటువంటి అహంకారమూ లేదు, పూర్తిగా సాధారణముగా నడుచుకుంటూ ఉంటారు. బాప్- దాదాలిరువురూ పిల్లలకు సేవకులే. మీకు ఇద్దరు సేవకులున్నారు, ఒకరు ఉన్నతోన్నతుడైన శివబాబా, మరొకరు ప్రజాపిత బ్రహ్మా. వారైతే త్రిమూర్తీ బ్రహ్మా అని అనేస్తారు కానీ దాని అర్థమేమీ తెలియదు. త్రిమూర్తి బ్రహ్మా ఏమి చేస్తారు అనేది ఏమీ తెలియదు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సదా ఈ నిశ్చయముండాలి - మేము ఈశ్వరీయ సంతానము, మేము శ్రేష్ఠ మతముపై నడవాలి, ఎవ్వరికీ దుఃఖమును ఇవ్వకూడదు, అందరికీ సుఖము యొక్క మార్గాన్ని తెలియజేయాలి.

2. సుపుత్రులుగా అయి తండ్రిపై బలిహారమవ్వాలి, తండ్రి యొక్క ప్రతి ఆశను పూర్తి చేయాలి. ఏ విధంగా బాప్ దాదా నిర్మానచిత్తులుగా మరియు నిరహంకారులుగా ఉన్నారో, అలా బాబా సమానముగా అవ్వాలి.

వరదానము:-
స్వ ఉన్నతి ద్వారా సేవలో ఉన్నతిని తీసుకువచ్చే సత్యమైన సేవాధారీ భవ

స్వ ఉన్నతి అనేది సేవా ఉన్నతికి విశేషమైన ఆధారము. స్వ ఉన్నతి తక్కువగా ఉన్నట్లయితే సేవ కూడా తక్కువగా ఉంటుంది. కేవలం ఎవరికైనా నోటితో పరిచయాన్ని ఇవ్వడమే సేవ కాదు, కానీ ప్రతి కర్మ ద్వారా శ్రేష్ఠ కర్మలకు ప్రేరణను ఇవ్వడము - ఇది కూడా సేవయే. ఎవరైతే మనసా, వాచా, కర్మణా సదా సేవలో తత్పరులై ఉంటారో, వారికి సేవ ద్వారా శ్రేష్ఠ భాగ్యము అనుభవమవుతుంది. ఎంత సేవ చేస్తారో, అంతగా స్వయము కూడా ముందుకు వెళ్తారు, అలాగే తమ శ్రేష్ఠ కర్మల ద్వారా సేవ చేసేవారు సదా ప్రత్యక్ష ఫలాన్ని ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు.

స్లోగన్:-
సమీపముగా వచ్చేందుకు ఆలోచించడము, మాట్లాడడము మరియు చేయడము, ఈ మూడింటినీ సమానము చేయండి.

అవ్యక్త ప్రేరణలు - ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసము చెయ్యండి, అంతర్ముఖులుగా అవ్వండి

ఏకాగ్రతకు ఆధారము అంతర్ముఖత. అంతర్ముఖతలో ఉండటం వలన సూక్ష్మ శక్తి యొక్క లీలలను అనుభవము చేస్తారు. ఆత్మిక స్థితిలో ఉంటూ ఆత్మలను ఆహ్వానించటము, ఆత్మలతో ఆత్మిక సంభాషణను చెయ్యటము, ఆత్మల సంస్కార-స్వభావాలను పరివర్తన చెయ్యటము, ఆత్మలకు తండ్రితో కనెక్షన్ ను జోడింపజెయ్యటము, ఈ విధమైన ఆత్మిక లీలలు అనుభవమవుతాయి.