13-04-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడు మీరు ఎటువంటి ప్రపంచానికి
యజమానులుగా అవుతున్నారంటే, అక్కడ ఎటువంటి హద్దులు ఉండవు, యోగబలముతో మొత్తం విశ్వము
యొక్క రాజ్యాధికారాన్ని తీసుకోవడము, ఇది కూడా అద్భుతమే’’
ప్రశ్న:-
డ్రామా
యొక్క ఏ బంధనములో తండ్రి కూడా బంధించబడి ఉన్నారు?
జవాబు:-
బాబా అంటారు -
నేను పిల్లలైన మీ సమ్ముఖములోకి రావాల్సిందే, నేను ఈ బంధనములో బంధించబడి ఉన్నాను.
ఎప్పటివరకైతే నేను రానో, అప్పటివరకు చిక్కుముడి విడిపోదు. ఇకపోతే, నేను మీపై ఎటువంటి
కృపను చూపించేందుకో లేక ఆశీర్వదించేందుకో రాను. నేను మరణించినవారినేమీ బ్రతికించను.
నేను మిమ్మల్ని పతితము నుండి పావనముగా చేసేందుకు వస్తాను.
పాట:-
మిమ్మల్ని
పొంది మేము...
ఓంశాంతి
పాటలోని పదాలను విని పిల్లలైన మీ రోమాలు నిక్కబొడుచుకోవాలి, ఎందుకంటే మీరు
సమ్ముఖములో కూర్చుని ఉన్నారు. మొత్తము ప్రపంచములో ఎంతోమంది విద్వాంసులు, పండితులు,
ఆచార్యులు ఉన్నప్పటికీ, అనంతమైన తండ్రి ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వస్తారు అన్న
విషయము మనుష్యమాత్రులెవ్వరికీ తెలియదు. ఇది పిల్లలకు మాత్రమే తెలుసు. నేను ఏమై ఉన్నా,
ఎలా ఉన్నా, మీ వాడినే - అని పిల్లలు అంటారు కూడా. మీరు ఏమై ఉన్నా, ఎలా ఉన్నా, నా
పిల్లలే అని తండ్రి కూడా అంటారు. వారు ఆత్మలందరికీ తండ్రి అని మీకు కూడా తెలుసు.
వారిని అందరూ పిలుస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, రావణుడి నీడ ఎంతగా ఉందో
చూడండి. ఎవరినైతే మనము పరమపిత పరమాత్మ అని అంటున్నామో, వారిని పిత అని అనడముతో
సంతోషము ఎందుకు కలగడము లేదు అనేది ఒక్కరు కూడా అర్థం చేసుకోలేరు, ఈ విషయాన్ని
మర్చిపోయారు. ఆ బాబాయే మనకు వారసత్వాన్ని ఇస్తారు. ఇంత సహజమైన ఈ విషయాన్ని కూడా ఎవరూ
అర్థం చేసుకోలేరని తండ్రి స్వయమే అర్థం చేయిస్తున్నారు. ఓ ఖుదా, ఓ రామా... అని
ఎవరినైతే మొత్తము ప్రపంచమంతా పిలుస్తుందో, వారు వీరే అని తండ్రి అర్థం
చేయిస్తున్నారు. అలా పిలుస్తూ-పిలుస్తూ ప్రాణాలు వదిలేస్తారు. ఇక్కడ ఆ తండ్రి
మిమ్మల్ని చదివిస్తున్నారు. మీ బుద్ధి ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయింది. బాబా
కల్పక్రితం వలె వచ్చి ఉన్నారు. కల్ప-కల్పము బాబా వచ్చి పతితుల నుండి పావనులుగా చేసి
దుర్గతి నుండి సద్గతిలోకి తీసుకువెళ్తారు. సర్వుల పతిత-పావనుడైన తండ్రి అని పాడుతారు
కూడా. ఇప్పుడు పిల్లలైన మీరు వారి సమ్ముఖములో కూర్చున్నారు. మీరు మోస్ట్ బిలవెడ్
స్వీట్ చిల్డ్రన్ (అత్యంత ప్రియమైన మధురమైన పిల్లలు). ఇది భారతవాసుల విషయమే. తండ్రి
కూడా భారత్ లోనే జన్మ తీసుకుంటారు. తండ్రి అంటారు, నేను భారత్ లో జన్మ తీసుకుంటాను
కావున తప్పకుండా భారతవాసులే ప్రియమనిపిస్తారు. అందరూ భగవంతుడినే స్మృతి చేస్తారు.
ఎవరు ఏ ధర్మానికి చెందినవారో, వారు తమ ధర్మస్థాపకుడిని స్మృతి చేస్తారు. మేము ఆది
సనాతన ధర్మానికి చెందినవారిగా ఉండేవారము అని భారతవాసులకే తెలియదు. భారత్ యే ప్రాచీన
దేశము అని బాబా అర్థం చేయిస్తున్నారు, దానికి మనుష్యులు, కేవలం భారత్ యే ఉండేదని
ఎవరు చెప్పారు అని అడుగుతారు. అనేకానేక మాటలు వింటుంటారు. ఒకరు ఒకటి చెప్తారు,
ఇంకొకరు ఇంకొకటి చెప్తారు. కొందరు - ‘గీతను శివ పరమాత్మయే వినిపించారని ఎవరు
చెప్పారు, శ్రీకృష్ణుడు కూడా పరమాత్మయే కదా, వారు వినిపించారు, పరమాత్మ సర్వవ్యాపి,
ఈ ఆటంతా వారిదే, ఇవన్నీ భగవంతుని రూపాలే, భగవంతుడే అనేక రూపాలను ధరించి లీలలు
చేస్తారు, భగవంతుడు ఏది కావాలనుకుంటే అది చేయగలరు’ అని అంటారు. మాయ కూడా ఎంత
ప్రబలమైనది అనేది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. బాబా, మేము వారసత్వాన్ని తప్పకుండా
తీసుకుంటాము, నరుని నుండి నారాయణునిగా అవుతామని ఈ రోజు అంటారు. రేపు ఇక్కడ ఉండరు.
ఎంతమంది వెళ్ళిపోయారు, విడాకులిచ్చేసారు అనేది మీకు తెలుసు కూడా. వారు మమ్మాను
కారులో తీసుకువెళ్ళేవారు కానీ ఈ రోజు లేరు. ఇటువంటి మంచి-మంచి వారు కూడా మాయ
సాంగత్యములోకి వచ్చి ఎలా పడిపోతారంటే, ఇక పూర్తిగా కింద పడిపోతారు. ఎవరైతే
కల్పక్రితం అర్థం చేసుకున్నారో, వారే అర్థం చేసుకుంటారు. ఈ రోజు ప్రపంచములో
ఏమవుతుందో చూడండి మరియు పిల్లలైన మీరు ఎలా తయారవుతున్నారో చూసుకోండి. పాటను విన్నారు
కదా. మేము ఎటువంటి వారసత్వాన్ని తీసుకుంటామంటే, దాని ద్వారా మేము మొత్తం విశ్వానికి
యజమానులుగా అవుతామని చెప్తారు. అక్కడ హద్దు విషయాలేవీ ఉండవు. ఇక్కడ హద్దులు ఉన్నాయి.
మా ఆకాశములోకి మీ విమానము వచ్చినట్లయితే షూట్ చేసేస్తాము అని అంటారు. అక్కడైతే హద్దు
విషయాలేవీ ఉండవు. పాటలు కూడా పాడుతారు కానీ అర్థమేమీ తెలియదు. తప్పకుండా బాబా ద్వారా
మళ్ళీ మేము విశ్వానికి యజమానులుగా అవుతున్నామని మీకైతే తెలుసు. అనేక సార్లు ఈ 84
జన్మల చక్రములో తిరిగారు. కొద్ది సమయమే దుఃఖము పొందారు, సుఖమైతే ఎంతో ఉంటుంది,
అందుకే బాబా అంటారు, నేను పిల్లలైన మీకు అపారమైన సుఖాన్ని ఇస్తాను, ఇప్పుడిక మాయతో
ఓడిపోకండి. బాబాకు చాలామంది పిల్లలు ఉన్నారు. అందరూ ఒకే విధమైన సుపుత్రులుగా ఉండలేరు.
కొంతమందికి 5-7 మంది పిల్లలుంటారు - వారిలో ఒకరిద్దరు కుపుత్రులుగా ఉంటే బాగా
విసిగించేస్తారు. లక్షల-కోట్ల రూపాయలను పోగొట్టేస్తారు. తండ్రి చూస్తే పూర్తిగా
ధర్మాత్మగా ఉంటారు, పిల్లలు చూస్తే పూర్తిగా సున్నా ఖాతాతో ఉంటారు. బాబా ఇటువంటి
ఉదాహరణలను ఎన్నో చూసారు.
మొత్తము ప్రపంచమంతా ఈ అనంతమైన తండ్రికి సంతానమని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి
అంటారు, నా జన్మ స్థలము ఈ భారత్. ప్రతి ఒక్కరికీ తమ స్వస్థలం పట్ల గౌరవముంటుంది.
వేరే స్థానములో శరీరాన్ని వదిలినట్లయితే, వారిని తమ స్వగ్రామానికి తీసుకువస్తారు.
తండ్రి కూడా భారత్ లోనే వస్తారు. భారతవాసులైన మీకు మళ్ళీ అనంతమైన వారసత్వాన్ని
ఇస్తారు. పిల్లలైన మీరు అంటారు - మేము మళ్ళీ దేవతలుగా, విశ్వానికి యజమానులుగా
అవుతున్నాము. మేమే యజమానులుగా ఉండేవారము, ఇప్పుడు ఎలాంటి గతి ఏర్పడింది, ఎక్కడ నుండి
ఎక్కడికి వచ్చి పడ్డాము. 84 జన్మలను అనుభవిస్తూ, అనుభవిస్తూ ఈ పరిస్థితి ఏర్పడింది.
డ్రామానైతే అర్థం చేసుకోవాలి కదా. దీనిని గెలుపు-ఓటముల ఆట అని అంటారు. ఈ ఆట భారత్
కు చెందినదే, ఇందులో మీ పాత్ర ఉంది. ఈ డ్రామాలో బ్రాహ్మణులైన మీది అందరికన్నా
ఉన్నతోన్నతమైన పాత్ర. మీరు విశ్వమంతటికీ యజమానులుగా అవుతారు, చాలా సుఖాన్ని
అనుభవిస్తారు. మీ అంతటి సుఖాన్ని ఇంకెవ్వరూ అనుభవించలేరు. దాని పేరే స్వర్గము. ఇది
నరకము. ఇక్కడి సుఖము కాకిరెట్టతో సమానము. నేడు లక్షాధికారులుగా ఉన్నారు, మరుసటి
జన్మలో ఏమవుతారు అనేది ఏమీ తెలియదు. ఇది ఉన్నదే పాపాత్ముల ప్రపంచము. సత్యయుగము
పుణ్యాత్ముల ప్రపంచము. మీరు పుణ్యాత్ములుగా అవుతున్నారు కావున ఎప్పుడూ కూడా పాపము
చేయకూడదు. ఎప్పుడూ బాబాతో స్పష్టముగా వ్యవహరించాలి. తండ్రి అంటారు - ద్వాపరము నుండి
మొదలుకుని నాతోపాటు ధర్మరాజు సదా ఉండనే ఉన్నారు. సత్య, త్రేతాయుగాలలో నాతోపాటు
ధర్మరాజు ఉండరు. ద్వాపరము నుండి మీరు నా పేరు మీద దాన-పుణ్యాలను చేస్తూ వస్తున్నారు.
ఈశ్వరార్పణము అని అంటారు కదా. గీతలో శ్రీకృష్ణుని పేరు వేయడముతో - శ్రీకృష్ణార్పణము
అని వ్రాశారు. రిటర్న్ ఇచ్చేవారైతే ఒక్క తండ్రి మాత్రమే, అందుకే శ్రీకృష్ణార్పణము
అని అనడము తప్పు. ఈశ్వరార్పణము అని అనడము కరక్టు. శ్రీగణేశార్పణము అని అనడము వలన ఏమీ
లభించదు. అయినా సరే, ఆ భావనకు అందరికీ ఏదో ఒకటి ఇస్తూ వచ్చాను. నా గురించైతే అసలు
ఎవరికీ తెలియదు. మనము అంతటినీ శివబాబాకు సమర్పణ చేస్తున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు
మాత్రమే తెలుసు. నేను మీకు 21 జన్మల వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చానని బాబా కూడా
అంటారు. ఇప్పుడు ఉన్నదే దిగే కళ. రావణ రాజ్యములో ఏవైతే దాన-పుణ్యాలు చేస్తారో, అవి
పాపాత్ములకే ఇస్తారు. కళలు తగ్గుతూ ఉంటాయి. ఒకవేళ ఏదైనా లభించినా సరే, అది అల్పకాలము
కోసమే. ఇప్పుడైతే మీకు 21 జన్మల కోసం లభిస్తుంది. దానిని రామ రాజ్యము అని అంటారు.
అక్కడ ఈశ్వరుని రాజ్యముందని అనరు. రాజ్యము దేవీ-దేవతలది. తండ్రి అంటారు, నేను
రాజ్యము చేయను. మీ ఆది సనాతన దేవి-దేవతా ధర్మము ఏదైతే ఉండేదో, అది ఇప్పుడు
కనుమరుగైపోయింది, అది ఇప్పుడు మళ్ళీ స్థాపనవుతోంది. తండ్రి అయితే ఎలాగూ కళ్యాణకారియే,
వారిని సత్యమైన బాబా అని అంటారు. వారు తమ యొక్క మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల సత్య
జ్ఞానాన్ని మీకు ఇస్తున్నారు. బాబా మీకు అనంతమైన చరిత్ర-భౌగోళికాలను వినిపిస్తారు.
ఇది ఎంత గొప్ప సంపాదన. మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. కానీ వారు ఆ హింసాత్మక
చక్రాన్ని చూపించారు. వాస్తవానికి ఇది జ్ఞాన చక్రము. కానీ ఈ జ్ఞానమైతే
కనుమరుగైపోతుంది. ఇవి మీ ముఖ్యమైన చిత్రాలు. ఒక వైపు త్రిమూర్తి, మరొకవైపు
కల్పవృక్షము మరియు చక్రము. బాబా అర్థం చేయించారు, శాస్త్రాలలోనైతే కల్పము యొక్క
ఆయుష్షు లక్షల సంవత్సరాలని రాసేశారు. మొత్తము దారమంతా చిక్కులు పడి ఉంది. తండ్రి
తప్ప ఇంకెవ్వరూ చిక్కు ముడులను విప్పలేరు. తండ్రి స్వయం సమ్ముఖములోకి వచ్చారు. వారు
అంటున్నారు - నేను డ్రామానుసారముగా రావలసే ఉంటుంది, నేను ఈ డ్రామాలో బంధించబడి
ఉన్నాను, నేను రాకపోవడమనేది జరగనే జరగదు. అలాగని నేను వచ్చి మరణించినవారిని
బ్రతికిస్తానని లేదా ఎవరినైనా అనారోగ్యము నుండి విడిపిస్తానని కాదు. బాబా, మాపై కృప
చూపించండి అని చాలామంది పిల్లలు అంటారు. కానీ ఇక్కడ కృప మొదలైన విషయాలేవీ లేవు. మీరు
నన్ను - మాకు ఎటువంటి నష్టము కలగకుండా మమ్మల్ని ఆశీర్వదించండి అని ఇలా పిలవలేదు కదా.
మీరు నన్ను - ఓ పతిత-పావనా రండి, దుఃఖహర్త-సుఖకర్త రండి అనే పిలుస్తారు. శరీరానికి
దుఃఖహర్తలుగానైతే డాక్టర్లు కూడా ఉంటారు. నేనేమైనా దాని కోసం వస్తానా! కొత్త
ప్రపంచమైన స్వర్గానికి యజమానులుగా చేయండి లేక శాంతిని ఇవ్వండి అని మీరు అంటారు.
అంతేకానీ, మీరు వచ్చి మమ్మల్ని అనారోగ్యము నుండి బాగుచేయండి అని అనరు. సదా కోసం
శాంతి లేదా ముక్తి అయితే లభించదు, పాత్రనైతే అభినయించాల్సిందే. ఎవరైతే చివరిలో
వస్తారో, వారికి ఎంత శాంతి లభిస్తుంది. ఇప్పటివరకు వస్తూనే ఉన్నారు. ఇంత సమయమైతే
శాంతిధామములో ఉన్నారు కదా. డ్రామానుసారముగా ఎవరి పాత్ర ఉంటే, వారే వస్తారు. పాత్ర
మారదు. బాబా అర్థం చేయిస్తున్నారు, శాంతిధామములోనైతే చాలా-చాలామంది ఆత్మలు ఉంటారు,
వారు చివరిలో వస్తారు. ఈ డ్రామా తయారై ఉంది. చివరిలో రావాల్సినవారు చివరిలోనే
రావాల్సి ఉంటుంది. ఈ వృక్షము తయారై ఉంది. ఈ చిత్రాలు మొదలైనవేవైతే తయారుచేసారో,
వాటన్నింటి గురించి మీరు అర్థం చేయించాలి. ఇంకా కూడా చిత్రాలు వెలువడుతూ ఉంటాయి,
కల్పక్రితం వలె వెలువడుతాయి. 84 జన్మల విస్తారము కల్పవృక్షము చిత్రములో కూడా ఉంది,
డ్రామా చక్రము చిత్రములో కూడా ఉంది. ఇప్పుడు మెట్ల వరుస చిత్రాన్ని కూడా తయారుచేసారు.
మనుష్యులకు ఏమీ తెలియదు. పూర్తిగా బుద్ధిహీనులు వలె ఉన్నారు. జ్ఞానసాగరుడు,
శాంతిసాగరుడు అయిన పరమపిత పరమాత్మ ఈ తనువు ద్వారా మమ్మల్ని చదివిస్తున్నారని ఇప్పుడు
పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. తండ్రి అంటారు, ఎవరైతే మొట్టమొదట విశ్వానికి యజమానిగా
ఉండేవారో, నేను వారిలోనే వస్తాను. తప్పకుండా మేము కూడా బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులుగా
అవుతామని మీకు కూడా తెలుసు. గీతలోనైతే ఈ విషయాలు లేవు. తండ్రి అంటారు - ఇతను స్వయమే
నారాయణుడి పూజను చేసేవారు, రైలులో ప్రయాణిస్తూ కూడా గీతను చదివేవారు. ఇతను పెద్ద
ధర్మాత్మ అని మనుష్యులు అనుకునేవారు. ఇప్పుడు ఆ విషయాలన్నింటినీ మర్చిపోతూ ఉంటారు.
ఎంతైనా, ఇతను గీత మొదలైనవన్నీ చదివారు కదా. నాకు ఇవన్నీ తెలుసు అని బాబా అంటారు.
ఇప్పుడు మీరు ఆలోచించండి - మేము ఎవరి ముందు కూర్చుని ఉన్నాము? ఎవరి ద్వారానైతే
విశ్వానికి యజమానులుగా అవుతారో, వారిని పదే-పదే ఎందుకు మర్చిపోతున్నారు? తండ్రి
అంటారు, నేను మీకు 16 గంటలు ఫ్రీ టైమ్ ఇస్తాను, మిగిలిన సమయములో స్వయము యొక్క సేవ
చేసుకోండి. స్వయము యొక్క సేవ చేసుకుంటున్నారంటే విశ్వ సేవను చేస్తున్నట్లు. ఎంత
పురుషార్థము చేయండంటే, కర్మలు చేస్తూ తక్కువలో తక్కువ 8 గంటలు తండ్రిని స్మృతి
చేయండి. ప్రస్తుతం రోజంతటిలో 8 గంటలు స్మృతి చేయలేరు. ఆ అవస్థ ఎప్పుడైతే ఏర్పడుతుందో,
అప్పుడు వీరు చాలా సేవ చేస్తున్నారని భావిస్తారు. మేము చాలా సేవ చేస్తున్నామని
అనుకోకండి. భాషణ చాలా ఫస్ట్ క్లాస్ గా చేస్తారు కానీ యోగము అస్సలు లేదు. యోగము
యొక్క యాత్రే ముఖ్యమైనది.
తండ్రి అంటారు, తలపై వికర్మల భారము చాలా ఉంది, అందుకే ఉదయాన్నే లేచి తండ్రిని
స్మృతి చేయండి. 2 నుండి 5 గంటల వరకు ఫస్ట్ క్లాస్ వాయుమండలము ఉంటుంది. ఆత్మ
రాత్రివేళ ఆత్మాభిమానిగా అవుతుంది, దానిని నిద్ర అని అంటారు, అందుకే తండ్రి అంటారు,
ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేయండి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మన్మనాభవ. ఇది
పైకి ఎక్కే కళ కోసం మంత్రము. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రితో స్పష్టముగా మరియు సత్యముగా ఉంటూ నడుచుకోవాలి. మీరు కళ్యాణకారీ
తండ్రికి పిల్లలు, అందుకే సర్వుల కళ్యాణము చేయాలి. సుపుత్రులుగా అవ్వాలి.
2. కర్మలు చేస్తూ కూడా తక్కువలో తక్కువ 8 గంటలు స్మృతిలో తప్పకుండా ఉండాలి.
స్మృతియే ముఖ్యమైనది - దీనితోనే వికర్మల భారాన్ని తొలగించుకోవాలి.
వరదానము:-
దాతగా అయి ప్రతి సెకండు, ప్రతి సంకల్పములో దానమిచ్చే
ఉదారచిత్త, మహాదానీ భవ
దాత పిల్లలైన మీరు తీసుకునేవారు కాదు, ఇచ్చేవారు. ప్రతి
సెకండు, ప్రతి సంకల్పములో ఇవ్వాలి, ఎప్పుడైతే ఇటువంటి దాతలుగా అవుతారో, అప్పుడు
ఉదారచిత్తులు, మహాదానులు అని అంటారు. ఇటువంటి మహాదానులుగా అయినట్లయితే మహాన్ శక్తి
యొక్క ప్రాప్తి స్వతహాగా కలుగుతుంది. కానీ ఇచ్చేందుకు స్వయము యొక్క భాండాగారము
నిండుగా ఉండాలి. ఏదైతే తీసుకోవాలో, అదంతా తీసేసుకున్నారు, ఇక ఇవ్వడమే మిగిలి ఉంది.
కావున ఇస్తూ ఉండండి, ఇవ్వడముతో భాండాగారము ఇంకా నిండుతూ ఉంటుంది.
స్లోగన్:-
ప్రతి
సబ్జెక్టులోనూ ఫుల్ మార్కులు జమ చేసుకోవాలంటే గంభీరత గుణాన్ని ధారణ చేయండి.
అవ్యక్త ప్రేరణలు -
‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’
నమ్రచిత్త ఆత్మలు
సహజముగానే సుఖదాతలుగా అవ్వగలరు కానీ అభిమానము నమ్రచిత్తులుగా అవ్వనివ్వదు.
నమ్రచిత్తులుగా లేకపోతే సేవ జరగదు. సేవాధారుల విశేషత ఏమిటంటే - వారు సదా
నమ్రచిత్తులుగా ఉంటారు. స్వయము వంగి ఉంటే అప్పుడు ఇతరులను వంగేలా చేయగలరు. ఎంతగా
నమ్రచిత్తులుగా ఉంటారో, అంతగా నిర్మాణము చేస్తారు. ఎక్కడైతే నిర్మానత ఉంటుందో,
అక్కడ అధికార దర్పము ఉండదు, ఆత్మికత ఉంటుంది. ఏ విధముగా బాబా ఎంతో నమ్రచిత్తులై
వస్తారో, అదే విధముగా ఫాలో ఫాదర్ చేయండి.
| | | |