13-12-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఇది మీ ఈశ్వరీయ మిషన్, మీరు అందరినీ
ఈశ్వరునికి చెందినవారిగా తయారుచేసి, వారికి అనంతమైన వారసత్వాన్ని ఇప్పిస్తారు’’
ప్రశ్న:-
కర్మేంద్రియాల చంచలత్వము ఎప్పుడు సమాప్తమవుతుంది?
జవాబు:-
ఎప్పుడైతే మీ
స్థితి సిల్వర్ ఏజ్ (వెండి యుగము) వరకు చేరుకుంటుందో అనగా ఎప్పుడైతే ఆత్మ
త్రేతాయుగపు సతో స్థితి వరకు చేరుకుంటుందో, అప్పుడు కర్మేంద్రియాల చంచలత్వము
సమాప్తమైపోతుంది. ఇప్పుడు మీది రిటర్న్ జర్నీ (తిరుగు ప్రయాణము), అందుకే
కర్మేంద్రియాలను వశములో ఉంచుకోవాలి. ఎవరికీ తెలియకుండా దాచిపెడుతూ, ఆత్మ పతితముగా
అయ్యే విధమైన కర్మలేవీ చేయకూడదు. అవినాశీ సర్జన్ మీకు ఏ పథ్యాన్ని అయితే
తెలియజేస్తున్నారో, దానిపై నడుస్తూ ఉండండి.
పాట:-
ముఖాన్ని
చూసుకో ఓ ప్రాణీ...
ఓంశాంతి
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తారు. ఈ విషయము కేవలం పిల్లలైన మీకు
మాత్రమే తెలుసని కాదు, బ్రాహ్మణులైన మనకే తండ్రి అర్థం చేయిస్తారు అన్న విషయము
ప్రజాపిత బ్రహ్మా ముఖవంశావళి అయిన ఆత్మిక పిల్లలందరికీ తెలుసు. ఇంతకుముందు మీరు
శూద్రులుగా ఉండేవారు, తర్వాత వచ్చి బ్రాహ్మణులుగా అయ్యారు. తండ్రి వర్ణాల యొక్క
లెక్కను కూడా అర్థం చేయించారు. ప్రపంచములో వర్ణాల గురించి కూడా అర్థం చేసుకోరు,
కేవలం వాటి గురించి గాయనముంది. ఇప్పుడు మీరు బ్రాహ్మణ వర్ణానికి చెందినవారిగా
ఉన్నారు, ఆ తర్వాత దేవతా వర్ణానికి చెందినవారిగా అవుతారు. ఈ విషయము రైట్ యేనా అని
ఆలోచించండి. జడ్జ్ యువర్ సెల్ఫ్ (మీకు మీరే నిర్ణయించుకోండి). నేను చెప్పింది వినండి
మరియు పోల్చి చూసుకోండి. జన్మ-జన్మాంతరాలుగా వింటూ వచ్చిన శాస్త్రాలను మరియు
జ్ఞానసాగరుడైన తండ్రి ఏదైతే అర్థం చేయిస్తున్నారో, వాటిని పోల్చి చూడండి - రైట్
ఏమిటి? బ్రాహ్మణ ధర్మాన్ని మరియు కులాన్ని పూర్తిగా మర్చిపోయారు. మీ వద్ద విరాట
రూపము యొక్క చిత్రము కరక్టుగా తయారుచేయబడి ఉంది, దానిపై అర్థం చేయించడం జరుగుతుంది.
ఇకపోతే ఇన్ని భుజాలు ఉన్న చిత్రాలను ఏవైతే తయారుచేసారో మరియు దేవీలకు ఆయుధాలు
మొదలైనవేవైతే చూపించారో, అవన్నీ తప్పు. అవి భక్తి మార్గపు చిత్రాలు. ఈ కళ్ళ ద్వారా
అన్నీ చూస్తారు కానీ అర్థం చేసుకోరు. ఎవరి కర్తవ్యము గురించి తెలియదు. ఇప్పుడు
పిల్లలైన మీకు మీ ఆత్మ గురించి తెలిసింది మరియు 84 జన్మల గురించి కూడా తెలిసింది. ఏ
విధముగా తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారో, అలా మీరు ఇతరులకు అర్థం
చేయించాలి. శివబాబా అయితే అందరి వద్దకు వెళ్ళరు. తప్పకుండా తండ్రికి సహాయకులు కావాలి
కదా, అందుకే మీది ఈశ్వరీయ మిషన్. మీరు అందరినీ ఈశ్వరునికి చెందినవారిగా
తయారుచేస్తారు. వారు ఆత్మలైన మనకు అనంతమైన తండ్రి అని, వారి నుండి అనంతమైన వారసత్వము
లభిస్తుందని మీరు అర్థం చేయిస్తారు. ఏ విధముగా లౌకిక తండ్రిని స్మృతి చేయడము
జరుగుతుందో, అంతకంటే ఎక్కువగా పారలౌకిక తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. లౌకిక
తండ్రి అయితే అల్పకాలము కొరకు సుఖాన్ని ఇస్తారు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని
ఇస్తారు. ఆత్మలకు ఇప్పుడు ఈ జ్ఞానము లభిస్తుంది. ముగ్గురు తండ్రులు ఉన్నారని ఇప్పుడు
మీకు తెలుసు. లౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి మరియు అలౌకిక తండ్రి. అనంతమైన తండ్రి,
అలౌకిక తండ్రి ద్వారా మీకు అర్థం చేయిస్తున్నారు. ఈ తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు.
బ్రహ్మా యొక్క జీవిత చరిత్ర గురించి ఎవ్వరికీ తెలియదు. వారి కర్తవ్యము గురించి కూడా
తెలుసుకోవాలి కదా. శివుని మహిమను, శ్రీకృష్ణుని మహిమను గానము చేస్తారు, బ్రహ్మాను
ఎక్కడ మహిమ చేసారు? అమృతాన్ని ఇవ్వడము కోసం నిరాకార తండ్రికి తప్పకుండా నోరు కావాలి
కదా. భక్తి మార్గములో తండ్రిని ఎప్పుడూ యథార్థ రీతిలో స్మృతి చేయలేరు. వీరు శివబాబా
రథమని ఇప్పుడు మీకు తెలిసింది మరియు అర్థం చేసుకున్నారు. రథాన్ని కూడా అలంకరిస్తారు
కదా. ఉదాహరణకు మహమ్మద్ యొక్క గుర్రాన్ని కూడా అలంకరిస్తారు. పిల్లలైన మీరు
మనుష్యులకు ఎంత బాగా అర్థం చేయిస్తారు. మీరు అందరినీ మహిమ చేస్తారు. మీరు ఏ విధముగా
చెప్తారంటే - మీరు దేవతలుగా ఉండేవారు, 84 జన్మలు తీసుకుని తమోప్రధానముగా అయ్యారు,
ఇప్పుడు మళ్ళీ సతోప్రధానముగా అవ్వాలంటే దాని కోసం యోగము కావాలి. కానీ ఈ విషయాన్ని
చాలా కష్టం మీద ఎవరైనా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుంటే సంతోషమనే పాదరసము పైకి
ఎక్కుతుంది. అర్థం చేయించేవారికైతే పాదరసము ఇంకా పైకి ఎక్కుతుంది. అనంతమైన తండ్రి
యొక్క పరిచయాన్ని ఇవ్వడమనేది ఏమైనా తక్కువ విషయమా? అర్థం చేసుకోలేరు. ఇది ఎలా
సాధ్యమవుతుంది అని అంటారు. మీరు అనంతమైన తండ్రి యొక్క జీవిత గాథను వినిపిస్తారు.
తండ్రి అంటారు - పిల్లలూ, పావనముగా అవ్వండి. ఓ పతిత-పావనా రండి, అని మీరు
పిలిచేవారు కదా. గీతలో కూడా మన్మనాభవ అనే పదము ఉంది కానీ దాని వివరణ ఎవరి వద్ద లేదు.
తండ్రి ఆత్మ జ్ఞానాన్ని కూడా ఎంత స్పష్టము చేసి అర్థం చేయిస్తారు. ఏ శాస్త్రాలలోనూ
ఈ విషయాలు లేవు. అయితే ఆత్మ బిందువని, అది భృకుటి మధ్యలో ఉండే నక్షత్రమని అంటారు
కానీ యథార్థ రీతిగా ఎవరి బుద్ధిలోనూ లేదు. అది కూడా తెలుసుకోవలసి ఉంటుంది.
కలియుగములో అధర్మయుక్తముగానే ఉంటారు. సత్యయుగములో అందరూ ధర్మయుక్తముగా ఉంటారు.
ఇవన్నీ ఈశ్వరుడిని కలుసుకునేందుకు మార్గాలని భక్తి మార్గములో మనుష్యులు భావిస్తారు,
అందుకే మీరు మొదట - మీరు ఇక్కడకు ఎందుకు వచ్చారు అని ఫార్మ్ ను నింపిస్తారు. దీని
ద్వారా కూడా మీరు అనంతమైన తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. ఆత్మకు తండ్రి ఎవరు అని
వారిని మీరు అడుగుతారు. సర్వవ్యాపి అని అనడము వలనైతే అందులో అర్థమేమీ వెలువడదు.
అందరి తండ్రి ఎవరు? ఇది ముఖ్యమైన విషయము. మీ-మీ ఇళ్ళల్లో కూడా మీరు అర్థం
చేయించవచ్చు. ఒకటి-రెండు ముఖ్యమైన చిత్రాలు - మెట్ల వరుస చిత్రము, త్రిమూర్తి
చిత్రము, కల్ప వృక్షము, ఇవి చాలా అవసరము. కల్ప వృక్షము చిత్రము ద్వారా అన్ని
ధర్మాలవారు - మా ధర్మము ఎప్పుడు ప్రారంభమయ్యింది, ఈ లెక్కన మేము స్వర్గములోకి
వెళ్ళగలుగుతామా అన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు! ఎవరైతే రావడమే వెనుక వస్తారో,
వారు స్వర్గములోకి వెళ్ళలేరు కానీ శాంతిధామములోకి వెళ్ళగలరు. కల్ప వృక్షము చిత్రము
ద్వారా కూడా చాలా స్పష్టమవుతుంది. ఏయే ధర్మాలైతే చివర వచ్చాయో, వారి ఆత్మలు
తప్పకుండా పైకి వెళ్ళి విరాజమానమవుతాయి. మీ బుద్ధిలో మొత్తం పునాది అంతా వేయబడుతుంది.
తండ్రి అంటారు, ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క అంటు అయితే కట్టబడింది, అలాగే
వృక్షము యొక్క ఆకులను కూడా మీరే తయారుచేయాలి, ఆకులు లేకుండానైతే వృక్షము ఉండదు,
అందుకే బాబా తమ సమానముగా తయారుచేయడానికి పురుషార్థము చేయిస్తూ ఉంటారు. ఇతర
ధర్మాలవారికి ఆకులను తయారుచేయవలసిన అవసరము ఉండదు. వారైతే పై నుండి వస్తారు, పునాది
వేస్తారు, ఆ తర్వాత ఆకులు వారి వెనుక పై నుండి వస్తూ ఉంటారు. మీరు ఏమో వృక్షాన్ని
వృద్ధి చేయడానికి ఈ ప్రదర్శనీలు మొదలైనవి ఏర్పాటు చేస్తారు, వీటి ద్వారా ఆకులు
తయారవుతారు, మళ్ళీ తుఫానులు రావడముతో రాలిపోతారు, వాడిపోతారు. ఈ ఆది సనాతన
దేవీ-దేవతా ధర్మము యొక్క స్థాపన అవుతుంది. ఇందులో యుద్ధాలు మొదలైనవాటి విషయమేమీ లేదు.
కేవలం తండ్రిని స్మృతి చేయాలి మరియు చేయించాలి. మీరు అందరికీ చెప్తుంటారు - మిగిలిన
రచన అంతటినీ వదిలేయండి. రచన ద్వారా ఎప్పుడూ వారసత్వము లభించదు. రచయిత అయిన తండ్రిని
మాత్రమే స్మృతి చేయాలి. ఇంకెవ్వరి స్మృతి కలగకూడదు. తండ్రికి చెందినవారిగా అయ్యి,
జ్ఞానములోకి వచ్చి మళ్ళీ ఒకవేళ అలాంటి, ఇలాంటి పనులు ఏవైనా చేస్తే దాని భారము తలపై
ఎంతగానో పడుతుంది. తండ్రి పావనముగా తయారుచేయడానికి వస్తారు, కావున అలాంటి, ఇలాంటి
పనులు ఏవైనా చేస్తే ఇంకా ఎక్కువగా పతితముగా అయిపోతారు, అందుకే బాబా అంటారు, నష్టము
కలిగించే పనులేవీ చేయకండి. తండ్రి యొక్క నింద జరుగుతుంది కదా. వికర్మలు ఎక్కువగా
తయారయ్యే పనులేవీ చేయకండి. పథ్యము కూడా పాటించాలి. మందులు వాడేటప్పుడు కూడా పథ్యము
పాటిస్తారు. పులుపు మొదలైనవి తినకూడదని డాక్టర్లు చెప్తే వినాలి. కర్మేంద్రియాలను
వశము చేసుకోవలసి ఉంటుంది. ఒకవేళ దాచిపెట్టుకుని తింటే మందుల ప్రభావము పడదు. దీనిని
ఆసక్తి అని అంటారు. ఇలా చేయకండి అని తండ్రి కూడా శిక్షణను ఇస్తారు. వారు సర్జన్ కదా.
బాబా, మనసులో చాలా సంకల్పాలు వస్తున్నాయి అని వ్రాస్తారు. అప్రమత్తముగా ఉండాలి.
అశుద్ధమైన స్వప్నాలు, మనసులో సంకల్పాలు మొదలైనవి చాలా వస్తాయి, వాటికి భయపడకూడదు.
సత్య, త్రేతాయుగాలలో ఈ విషయాలు ఉండవు. మీరు ఎంతగా సమీపముగా వస్తూ ఉంటారో, వెండి
యుగము వరకూ ఎప్పుడైతే మీ స్థితి చేరుకుంటుందో, అప్పుడు కర్మేంద్రియాల చంచలత్వము
సమాప్తమైపోతుంది. కర్మేంద్రియాలు వశమైపోతాయి. సత్య, త్రేతాయుగాలలో అవి వశములో ఉండేవి
కదా. ఎప్పుడైతే ఆ త్రేతాయుగపు అవస్థ వరకు చేరుకుంటారో, అప్పుడు అవి వశమవుతాయి. ఇక
సత్యయుగపు అవస్థ వరకు చేరుకుంటే సతోప్రధానమైపోతారు, అప్పుడు కర్మేంద్రియాలన్నీ
పూర్తిగా వశమైపోతాయి. ప్రారంభములో కర్మేంద్రియాలు వశములో ఉండేవి కదా. ఇది కొత్త
విషయమేమీ కాదు. ఈ రోజు కర్మేంద్రియాలకు వశమై ఉన్నారు, రేపు పురుషార్థము చేసి
కర్మేంద్రియాలను వశము చేసుకుంటారు. మీరు 84 జన్మలుగా దిగుతూ వచ్చారు. ఇప్పుడు ఇది
రిటర్న్ జర్నీ (తిరుగు ప్రయాణము), అందరూ సతోప్రధాన అవస్థలోకి వెళ్ళాలి. తమ చార్టును
చూసుకోవాలి - మేము ఎంత పాపము చేసాము, ఎంత పుణ్యము చేసాము. తండ్రిని స్మృతి
చేస్తూ-చేస్తూ ఇనుపయుగము నుండి వెండియుగము వరకు చేరుకుంటారు, అప్పుడు కర్మేంద్రియాలు
వశమైపోతాయి. అప్పుడు మీకు - ఇప్పుడిక తుఫానులేవీ రావడము లేదు అని అనుభవమవుతుంది. ఆ
అవస్థ కూడా వస్తుంది. ఇక అప్పుడు బంగారుయుగములోకి వెళ్ళిపోతారు. కృషి చేసి పావనముగా
అయినట్లయితే సంతోషపు పాదరసము కూడా పైకి ఎక్కుతుంది. ఎవరు వచ్చినా సరే వారికి - మీరు
ఏ విధముగా 84 జన్మలను తీసుకున్నారు అన్నది అర్థం చేయించాలి. ఎవరైతే 84 జన్మలు
తీసుకున్నారో, వారే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసి యజమానులుగా
అవ్వాలి అని అంటారు. 84 జన్మలను అర్థం చేసుకోకపోతే, ఇంతకుముందు కూడా రాజ్యానికి
అధికారులుగా అయి ఉండకపోవచ్చు. నేనైతే ధైర్యాన్ని అందిస్తాను, మంచి విషయాలను
వినిపిస్తాను. అయినా మీరు కింద పడిపోతారు. ఎవరైతే 84 జన్మలు తీసుకుని ఉంటారో, వారికి
వెంటనే స్మృతి కలుగుతుంది. తండ్రి అంటారు, మీరు శాంతిధామములో పవిత్రముగానైతే
ఉండేవారు కదా. ఇప్పుడు మళ్ళీ మీకు శాంతిధామానికి, సుఖధామానికి వెళ్ళే మార్గాన్ని
తెలియజేస్తాను. ఇంకెవ్వరూ మార్గాన్ని తెలియజేయలేరు. శాంతిధామములోకి కూడా పావనాత్మలే
వెళ్ళగలుగుతారు. ఎంతగా మాలిన్యము తొలగుతూ ఉంటుందో, అంత ఉన్నత పదవి లభిస్తుంది.
ఎవరెంత పురుషార్థము చేస్తే అంత. ప్రతి ఒక్కరి పురుషార్థాన్ని అయితే మీరు
చూస్తున్నారు, బాబా కూడా చాలా మంచి సహాయము చేస్తారు. ఇతనైతే పాత బిడ్డ వంటివారు.
మీరు ప్రతి ఒక్కరి నాడిని అర్థం చేసుకుంటారు కదా. తెలివైనవారు ఎవరైతే ఉంటారో, వారు
వెంటనే అర్థం చేసుకుంటారు. వారు అనంతమైన తండ్రి, వారి నుండి తప్పకుండా స్వర్గ
వారసత్వము లభించాలి. ఇంతకుముందు లభించింది, ఇప్పుడు అది లేదు, అది మళ్ళీ లభిస్తోంది.
లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా నిలబడి ఉంది. తండ్రి స్వర్గ స్థాపన చేసినప్పుడు మీరు
స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. ఆ తర్వాత 84 జన్మలు తీసుకుని కిందికి దిగుతూ
వచ్చారు. ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మ. చరిత్ర అయితే తప్పకుండా రిపీట్ అవుతుంది కదా.
మీరు మొత్తం 84 జన్మల లెక్కను తెలియజేస్తారు. ఎంతగా అర్థం చేసుకుంటారో, అంతగా ఆకులు
తయారవుతూ ఉంటారు. మీరు కూడా అనేకులను మీ సమానముగా తయారుచేస్తారు కదా. విశ్వమంతటినీ
మాయ సంకెళ్ళ నుండి విడిపించేందుకు మేము వచ్చామని మీరు అంటారు. తండ్రి అంటారు, నేను
అందరినీ రావణుడి నుండి విడిపించడానికి వస్తాను. తండ్రి జ్ఞానసాగరుడని పిల్లలైన మీరు
కూడా అర్థం చేసుకున్నారు. మీరు కూడా జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకుని మాస్టర్
జ్ఞానసాగరులుగా అవుతారు కదా. జ్ఞానము వేరు, భక్తి వేరు. భారత్ యొక్క ప్రాచీన
రాజయోగము తండ్రియే నేర్పిస్తారని, ఇతర మనుష్యులెవ్వరూ నేర్పించలేరని మీకు తెలుసు.
కానీ ఈ విషయాన్ని అందరికీ ఎలా తెలియజేయాలి? ఇక్కడైతే అసురుల విఘ్నాలు కూడా ఎన్నో
కలుగుతాయి. భక్తి మార్గములో ఈ విషయాన్నే - అసురులు ఏదో చెత్త వేసారేమోనని
భావించేవారు. ఆ విఘ్నాలను ఎలా కలిగిస్తున్నారు అనేది ఇప్పుడు అర్థం చేసుకున్నారు.
నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు). కల్పక్రితము కూడా ఇలా జరిగింది. మీ బుద్ధిలో ఈ పూర్తి
చక్రమంతా తిరుగుతూ ఉంటుంది. బాబా మనకు సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం
చేయిస్తున్నారు, బాబా మనకు లైట్ హౌస్ అన్న టైటిల్ ను కూడా ఇస్తారు. ఒక కంటిలో
ముక్తిధామము, రెండవ కంటిలో జీవన్ముక్తిధామము. మీరు శాంతిధామములోకి వెళ్ళి మళ్ళీ
సుఖధామములోకి రావాలి. ఇది ఉన్నదే దుఃఖధామము. తండ్రి అంటారు, ఈ కళ్ళ ద్వారా ఏదైతే
మీరు చూస్తున్నారో, దానిని మర్చిపోండి. మీ శాంతిధామాన్ని స్మృతి చేయండి. ఆత్మ తన
తండ్రిని స్మృతి చేయాలి, దీనినే అవ్యభిచారి యోగమని అనడము జరుగుతుంది. జ్ఞానము కూడా
ఒక్కరి నుండే వినాలి. ఇది అవ్యభిచారి జ్ఞానము. స్మృతి కూడా ఒక్కరినే చేయండి. నాకైతే
ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఎప్పటివరకైతే స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోరో,
అప్పటివరకు ఆ ఒక్కరి స్మృతి కలగదు. ఆత్మ అంటుంది, నేనైతే ఒక్క బాబాకు చెందినవానిగానే
అవుతాను. నేను బాబా వద్దకు వెళ్ళాలి. ఈ శరీరమైతే పురాతనమైనది, శిథిలావస్థలో ఉంది,
దీని పట్ల కూడా మమకారము ఉంచుకోకూడదు. ఇది జ్ఞానము యొక్క విషయము. అలాగని శరీరాన్ని
సంభాళించకూడదని కాదు. ఇది పాత శరీరము, దీనిని ఇప్పుడు వదిలేయాలి అని లోలోపల
భావించాలి. మీది అనంతమైన సన్యాసము. వారైతే అడవులలోకి వెళ్ళిపోతారు. మీరు ఇంట్లో ఉంటూ
స్మృతిలో ఉండాలి. స్మృతిలో ఉంటూ-ఉంటూ మీరు కూడా శరీరాన్ని వదిలివేయవచ్చు. ఎక్కడ
ఉన్నా సరే, మీరు తండ్రిని స్మృతి చేయండి. స్మృతిలో ఉన్నట్లయితే, స్వదర్శన
చక్రధారులుగా అయినట్లయితే, ఎక్కడ ఉన్నా సరే మీరు ఉన్నత పదవిని పొందుతారు. ఎంతగా
వ్యక్తిగతముగా కృషి చేస్తారో, అంతగా పదవిని పొందుతారు. ఇంట్లో ఉంటూ కూడా
స్మృతియాత్రలో ఉండాలి. ఇప్పుడు ఫైనల్ రిజల్టు వెలువడటానికి కొంత సమయమే ఉంది. మళ్ళీ
కొత్త ప్రపంచము కూడా తయారుకావాలి కదా. ఇప్పుడే కర్మాతీత అవస్థ ఏర్పడినట్లయితే,
సూక్ష్మవతనములో ఉండవలసి ఉంటుంది. సూక్ష్మవతనములో ఉన్నా కూడా మళ్ళీ జన్మ తీసుకోవలసి
ఉంటుంది. మున్ముందు మీకు అన్నీ సాక్షాత్కారమవుతాయి. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఒక్క తండ్రి నుండే వినాలి. ఒక్కరి అవ్యభిచారి స్మృతిలోనే ఉండాలి. ఈ శరీరాన్ని
సంభాళించాలి కానీ మమకారము పెట్టుకోకూడదు.
2. తండ్రి ఏ పథ్యమునైతే చెప్పారో, దానిని పూర్తిగా పాటించాలి. తండ్రిని
నిందింపజేసే మరియు పాప ఖాతా తయారయ్యే కర్మలేవీ చేయకూడదు. స్వయాన్ని నష్టపరచుకోకూడదు.
వరదానము:-
మూడు సేవల బ్యాలెన్స్ ద్వారా సర్వ గుణాలను అనుభూతి చేసే
గుణమూర్త భవ
ఏ పిల్లలైతే సంకల్పాలు, మాటలు మరియు ప్రతి కర్మ ద్వారా
సేవలో తత్పరులై ఉంటారో వారే సఫలతామూర్తులుగా అవుతారు. ఈ మూడింటిలోనూ మార్కులు
సమానముగానే ఉంటే, రోజంతటిలో ఈ మూడు సేవల బ్యాలెన్స్ ఉంటే, పాస్ విత్ ఆనర్ గా మరియు
గుణమూర్తులుగా అయిపోతారు. వారి ద్వారా సర్వ దివ్య గుణాల అలంకారము స్పష్టముగా
కనిపిస్తుంది. పరస్పరము ఒకరికొకరు బాబా గుణాల యొక్క మరియు స్వయము యొక్క ధారణలోని
గుణాల యొక్క సహయోగాన్ని ఇవ్వడమే గుణమూర్తులుగా అవ్వడము ఎందుకంటే గుణ దానము
అన్నింటికన్నా పెద్ద దానము.
స్లోగన్:-
నిశ్చయము రూపీ పునాది పక్కాగా ఉన్నట్లయితే శ్రేష్ఠ జీవితపు అనుభవము స్వతహాగా
కలుగుతుంది.
అవ్యక్త ప్రేరణలు -
ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి
గతములో చేసిన కర్మల
లెక్కాచారాల ఫల స్వరూపముగా తనువుకు సంబంధించిన రోగాలు వచ్చినా, తమ మనసు యొక్క
సంస్కారాలు ఇతర ఆత్మల సంస్కారాలతో ఘర్షణ పడుతూ ఉన్నా కానీ కర్మాతీతులు అంటే
కర్మభోగానికి వశమవ్వకుండా యజమానులుగా అయ్యి లెక్కాచారాన్ని సమాప్తము చేసుకోవాలి.
కర్మయోగిగా అయ్యి కర్మభోగాన్ని సమాప్తము చేసుకోవటము - ఇదే కర్మాతీత స్థితికి గుర్తు.
ఇప్పుడిప్పుడే కర్మయోగి, ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితి అన్నది ప్రాక్టీస్ చెయ్యండి.
| | | |