16-06-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - సదా ఈ సంతోషములో ఉండండి - మమ్మల్ని
చదివిస్తున్నది దేహధారులెవ్వరూ కాదు, అశరీరి అయిన తండ్రి శరీరములోకి ప్రవేశించి
విశేషముగా మమ్మల్ని చదివించడానికి వచ్చారు’’
ప్రశ్న:-
పిల్లలైన మీకు జ్ఞానము యొక్క మూడవ నేత్రము ఎందుకు లభించింది?
జవాబు:-
మన
శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని చూసేందుకు మనకు జ్ఞానము యొక్క మూడవ నేత్రము
లభించింది. ఈ కనుల ద్వారా ఏదైతే పాత ప్రపంచము, మిత్ర-సంబంధీకులు మొదలైనవారు
కనిపిస్తున్నారో, వారి నుండి బుద్ధిని తొలగించాలి. తండ్రి వచ్చిందే మురికి నుండి
బయటకు తీసి పుష్పముగా (దేవతగా) తయారుచేయడానికి, కావున ఇటువంటి తండ్రి పట్ల గౌరవాన్ని
కూడా ఉంచాలి.
ఓంశాంతి
పిల్లల కొరకు శివ భగవానువాచ. శివ భగవానుడిని సత్యమైన తండ్రి అని తప్పకుండా అంటారు
ఎందుకంటే వారు రచయిత కదా. ఇప్పుడు భగవంతుడు చదివిస్తున్నది పిల్లలైన మిమ్మల్నే,
భగవాన్-భగవతీలుగా తయారుచేయడానికి చదివిస్తున్నారు. తమ టీచరు గురించి, చదువును
గురించి మరియు తమ రిజల్టును గురించి తెలియని విద్యార్థులంటూ ఎవ్వరూ ఉండరు, ఇది మీకు
బాగా తెలుసు. ఎవరినైతే భగవంతుడు చదివిస్తారో, వారికి ఎంతటి సంతోషము ఉండాలి! ఈ
సంతోషము స్థిరంగా ఎందుకు ఉండదు? మమ్మల్ని దేహధారి మనుష్యులెవ్వరూ చదివించడము లేదని
మీకు తెలుసు. అశరీరి అయిన తండ్రి శరీరములోకి ప్రవేశించి విశేషముగా పిల్లలైన
మిమ్మల్ని చదివించడానికి వచ్చారు. భగవంతుడు వచ్చి చదివిస్తారు అన్నది ఎవ్వరికీ
తెలియదు. మనము భగవంతుని పిల్లలమని, వారు మనల్ని చదివిస్తున్నారని, వారే
జ్ఞానసాగరుడని మీకు తెలుసు. శివబాబా సమ్ముఖములో మీరు కూర్చున్నారు. ఆత్మలు మరియు
పరమాత్మ ఇప్పుడే కలుసుకుంటారు, ఇది మర్చిపోకండి. కానీ మాయ ఎటువంటిదంటే అది
మరపింపజేస్తుంది. లేదంటే మరి భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అన్న నషా ఉండాలి కదా.
వారిని స్మృతి చేస్తూ ఉండాలి. కానీ ఇక్కడ ఎలాంటివారు ఉన్నారంటే, వారు పూర్తిగా
మర్చిపోతారు. వారికి ఏమీ తెలియదు. భగవంతుడు స్వయం అంటున్నారు - చాలామంది పిల్లలు ఈ
విషయాన్ని మర్చిపోతారు, లేకుంటే ఆ సంతోషము ఉండాలి కదా. మనము భగవంతుని పిల్లలము, వారు
మనల్ని చదివిస్తున్నారు. మాయ ఎలాంటి శక్తివంతమైనదంటే అది పూర్తిగా మరపింపజేస్తుంది.
ఈ కనులతో ఏదైతే ఈ పాత ప్రపంచమును, మిత్ర-సంబంధీకులు మొదలైనవారిని చూస్తారో, వారి
వైపుకి బుద్ధి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి మూడవ నేత్రాన్ని ఇస్తారు.
మీరు శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయండి. ఇది దుఃఖధామము, ఛీ-ఛీ ప్రపంచము.
భారత్ ఒకప్పుడు స్వర్గముగా ఉండేదని, ఇప్పుడు నరకముగా ఉందని మీకు తెలుసు. తండ్రి
వచ్చి మళ్ళీ పుష్పముగా తయారుచేస్తారు. అక్కడ మీకు 21 జన్మల కొరకు సుఖము లభిస్తుంది.
దాని కొరకే మీరు చదువుకుంటున్నారు. కానీ పూర్తిగా చదువుకోని కారణముగా ఇక్కడి
ధన-సంపదలు మొదలైనవాటిలోనే బుద్ధి వేలాడుతూ ఉంటుంది. వాటి నుండి బుద్ధి తొలగిపోదు.
తండ్రి అంటారు, శాంతిధామము మరియు సుఖధామము వైపుకు బుద్ధిని జోడించండి. కానీ బుద్ధి
మురికి ప్రపంచము వైపుకు పూర్తిగా అతుక్కుపోయి ఉన్నట్లు ఉంది. అసలు తొలగిపోవడమే లేదు.
ఇక్కడ కూర్చున్నా కానీ బుద్ధి పాత ప్రపంచము నుండి తొలగిపోదు. ఇప్పుడు బాబా పుష్పాల
వలె పవిత్రముగా తయారుచేయడానికి వచ్చి ఉన్నారు. బాబా మమ్మల్ని పవిత్రముగా తయారుచేసి
పవిత్ర ప్రపంచములోకి తీసుకువెళ్తారు అంటూ మీరు ముఖ్యముగా పవిత్రత కొరకే చెప్తుంటారు.
కావున ఇటువంటి తండ్రి పట్ల ఎంతటి గౌరవాన్ని ఉంచాలి. ఇటువంటి తండ్రి పైనైతే
బలిహారమైపోవాలి. వారు పరంధామము నుండి వచ్చి పిల్లలైన మనల్ని చదివిస్తున్నారు.
పిల్లల కోసం ఎంత కష్టపడతారు. పూర్తిగా మురికిలో నుండి బయటకు తీస్తారు. ఇప్పుడు మీరు
పుష్పాలుగా తయారవుతున్నారు. కల్ప-కల్పమూ మేము ఇటువంటి పుష్పాలుగా (దేవతలుగా)
అవుతామని మీకు తెలుసు. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసేందుకు భగవంతునికి ఎంతో
సమయము పట్టదు. ఇప్పుడు మనల్ని తండ్రి చదివిస్తున్నారు. మనము ఇక్కడకు మనుష్యుల నుండి
దేవతలుగా అయ్యేందుకు వచ్చాము. ఈ విషయము ఇప్పుడు మీకు తెలిసింది, మనము స్వర్గవాసులుగా
ఉండేవారమని ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు తండ్రి తెలియజేశారు - మీరు ఇంతకుముందు
రాజ్యము చేసేవారు, ఆ తర్వాత మళ్ళీ రావణుడు రాజ్యాన్ని తీసుకున్నాడు. ఎంతో సుఖాన్ని
మీరే చూసారు, ఆ తర్వాత 84 జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ మెట్లు కిందకు దిగుతారు. ఇది
ఉన్నదే ఛీ-ఛీ ప్రపంచము. ఎంతోమంది మనుష్యులు దుఃఖితులుగా ఉన్నారు. ఎంతోమంది అయితే
ఆకలితో మరణిస్తూ ఉంటారు, సుఖము ఏ మాత్రమూ లేదు. ఎంతో ధనవంతులైనా సరే, ఇక్కడున్న
అల్పకాలికమైన సుఖము కాకిరెట్టతో సమానమైనది. దీనిని విషయ వైతరణి నది అని అంటారు.
స్వర్గములోనైతే మనము ఎంతో సుఖముగా ఉంటాము. ఇప్పుడు మీరు నల్లనివారి నుండి
తెల్లనివారిగా అవుతున్నారు.
ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు - మేమే దేవతలుగా ఉండేవారము, తర్వాత పునర్జన్మలు
తీసుకుంటూ-తీసుకుంటూ వేశ్యాలయములోకి వచ్చి పడ్డాము. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని
శివాలయములోకి తీసుకువెళ్తారు. శివబాబా స్వర్గ స్థాపనను చేస్తున్నారు, మీకు చదువును
చదివిస్తున్నారు కావున మంచి రీతిలో చదువుకోవాలి కదా. చదువుకుని, చక్రాన్ని బుద్ధిలో
ఉంచుకుని దైవీ గుణాలను ధారణ చేయాలి. పిల్లలైన మీరు రూప్ మరియు బసంత్ (జ్ఞానస్వరూపులు,
యోగస్వరూపులు). మీ నోటి నుండి సదా జ్ఞాన రత్నాలే వెలువడాలి, అశుద్ధము కాదు. నేను
రూప్, బసంత్ ను ... అని బాబా కూడా అంటారు. నేను పరమాత్మను, జ్ఞానసాగరుడను. చదువు
సంపాదనకు ఆధారము అవుతుంది. చదువుకున్న తర్వాత ఎప్పుడైతే బ్యారిస్టర్, డాక్టర్
మొదలైనవారిగా అవుతారో, అప్పుడు లక్షలు సంపాదిస్తారు. ఒక్కొక్క డాక్టర్ నెలకు లక్ష
రూపాయలు సంపాదిస్తారు. తినడానికి కూడా తీరిక ఉండదు. మీరు కూడా ఇప్పుడు
చదువుకుంటున్నారు. మీరు ఏమవుతారు? విశ్వానికి యజమాని. కావున ఈ చదువు యొక్క నషా
ఉండాలి కదా. పిల్లలైన మీరు మాట్లాడే విధానములో ఎంత రాయల్టీ ఉండాలి. మీరు రాయల్ గా
అవుతారు కదా. రాజుల నడవడిక ఎలా ఉంటుందో చూడండి. బాబా అయితే అనుభవజ్ఞులు కదా. రాజులకు
కానుకలు ఇస్తారు, వారు వాటిని ఎప్పుడూ చేతితో తీసుకోరు. ఒకవేళ తీసుకోవలసి వచ్చినా,
సెక్రెటరీకి వెళ్ళి ఇవ్వండి అని సైగ చేస్తారు. రాజులు చాలా రాయల్ గా ఉంటారు. వీరి
నుండి తీసుకుంటే మళ్ళీ వీరికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది కూడా అన్న ఆలోచన బుద్ధిలో
ఉంటుంది, ఆ సందర్భములో తీసుకోరు. కొందరు రాజులు ప్రజల నుండి అసలు ఏ మాత్రమూ తీసుకోరు.
కొందరైతే ఎంతో దోచుకుంటారు. రాజులలో కూడా తేడా ఉంటుంది. ఇప్పుడు మీరు సత్యయుగీ డబుల్
కిరీటధారులైన రాజులుగా అవుతారు. డబుల్ కిరీటము కోసం పవిత్రత తప్పకుండా కావాలి. ఈ
వికారీ ప్రపంచాన్ని వదిలేయాలి. పిల్లలైన మీరు వికారాలను వదిలేశారు. ఇక్కడకు వికారులు
ఎవ్వరూ వచ్చి కూర్చోవడానికి వీల్లేదు. ఒకవేళ చెప్పకుండా వచ్చి కూర్చున్నట్లయితే వారు
స్వయాన్నే నష్టపర్చుకుంటారు. కొందరు చలాకీతనము చూపిస్తారు, ఎవరికీ ఏమీ తెలియదు కదా
అనుకుంటారు. తండ్రి చూసినా, చూడకపోయినా కానీ, వారు స్వయమే పాపాత్మగా అయిపోతారు. మీరు
కూడా పాపాత్ములుగానే ఉండేవారు. ఇప్పుడు పురుషార్థము ద్వారా పుణ్యాత్ములుగా అవ్వాలి.
పిల్లలైన మీకు ఎంతటి జ్ఞానము లభించింది. ఈ జ్ఞానము ద్వారా మీరు శ్రీకృష్ణపురికి
యజమానులుగా అవుతారు. తండ్రి ఎంతగా అలంకరిస్తారు. ఉన్నతోన్నతుడైన భగవంతుడు
చదివిస్తున్నారు కావున ఎంతటి సంతోషముతో చదువుకోవాలి. ఇటువంటి చదువునైతే ఎవరో
సౌభాగ్యశాలులు మాత్రమే చదువుకుంటారు, అంతేకాక సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. బాబా
అంటున్నారు, మీరు అసలు ఎక్కడ చదువుతున్నారు! బుద్ధి భ్రమిస్తూ ఉంటుంది. ఇలా అయితే
మరి ఏమవుతారు! ఈ పరిస్థితిలోనైతే నువ్వు ఫెయిల్ అయిపోతావు అని లౌకిక తండ్రి కూడా
అంటారు కదా. కొందరైతే చదువుకుని లక్షలు సంపాదిస్తారు. కొందరిని చూస్తే ఎదురుదెబ్బలు
తింటూ ఉంటారు. మీరు తల్లి-తండ్రిని ఫాలో చేయాలి, అంతేకాక ఏ సోదరులైతే మంచి రీతిలో
చదువుతుంటారో, చదివిస్తుంటారో మరియు ఇదే వ్యాపారాన్ని చేస్తుంటారో, వారిని ఫాలో
చేయాలి. ప్రదర్శినీలో అనేకులను చదివిస్తారు కదా. మున్ముందు ఎంతగా దుఃఖము పెరుగుతూ
ఉంటుందో, అంతగా మనుష్యులకు వైరాగ్యము కలుగుతుంది. అప్పుడిక చదవడం మొదలుపెడతారు.
దుఃఖములో భగవంతుడిని ఎంతగానో స్మృతి చేస్తారు. దుఃఖములో మరణించే సమయములో - ఓ రామా,
ఓ భగవంతుడా అని అంటూ ఉంటారు కదా. మీరైతే ఏమీ చేయవలసిన అవసరము లేదు. మీరైతే సంతోషముగా
ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ పాత శరీరాన్ని వదిలేసినట్లయితే మేము మా ఇంటికి వెళ్ళవచ్చు
అని భావిస్తారు. ఆ తర్వాత అక్కడ శరీరము కూడా సుందరమైనదే లభిస్తుంది. పురుషార్థము
చేసి చదివించేవారి కంటే కూడా ఉన్నతిలోకి వెళ్ళాలి. చదివించేవారి కంటే కూడా
చదువుకునేవారి అవస్థ చాలా బాగుంటుంది, అటువంటివారు కూడా ఉన్నారు. తండ్రికైతే ప్రతి
ఒక్కరి గురించి తెలుసు కదా. పిల్లలైన మీరు కూడా తెలుసుకోవచ్చు. మా లోపల ఏ లోపాలు
ఉన్నాయి అని మిమ్మల్ని మీరు లోలోపల చూసుకోవాలి. మాయ విఘ్నాలను దాటివేయాలి, వాటిలో
చిక్కుకోకూడదు.
మాయ అయితే చాలా శక్తివంతమైనది, మేము ఎలా నడుచుకోగలుగుతాము అని ఎవరైతే అంటారో, వారు
ఒకవేళ ఇలా ఆలోచిస్తే మాయ పూర్తిగా పచ్చిగానే తినేస్తుంది. ఏనుగును మొసలి తినేసింది
అని అంటారు. ఇది ఇప్పటి విషయమే కదా. మంచి-మంచి పిల్లలను కూడా మాయ రూపీ మొసలి
పూర్తిగా మింగేస్తుంది. తమను తాము విడిపించుకోలేకపోతారు. ఈ మాయ చెంపదెబ్బల నుండి
విముక్తులుగా అవ్వాలనుకుంటున్నాము అని స్వయం కూడా భావిస్తారు. కానీ మాయ
విముక్తులవ్వనివ్వదు. బాబా, ఇలా పట్టుకోవద్దని అని మాయకు చెప్పండి అని అంటారు. అరే,
ఇదైతే యుద్ధ మైదానము కదా. మైదానములో ఎక్కడైనా - నన్ను కింద పడేయవద్దు అని వారికి
చెప్పండి అని అంటారా. మ్యాచ్ లో ఏమైనా - మాకు బాల్ వేయవద్దు అని అంటారా. అలా అంటే -
యుద్ధ మైదానములోకి వచ్చావు కావున పోరాడు అని వెంటనే అంటారు. మాయ బాగా కింద
పడేస్తుంది. మీరు చాలా ఉన్నతమైన పదవిని పొందగలరు. భగవంతుడు చదివిస్తున్నారు, ఇదేమైనా
తక్కువ విషయమా! ఇప్పుడు నంబరువారు పురుషార్థానుసారముగా మీది ఎక్కే కళ జరుగుతుంది.
మేము భవిష్య జీవితాన్ని వజ్ర సమానముగా తయారుచేసుకోవాలి అని పిల్లలు ప్రతి ఒక్కరూ
అభిరుచిని ఉంచుకోవాలి. విఘ్నాలను తొలగించుకుంటూ వెళ్ళాలి. ఎలాగైనా సరే తండ్రి నుండి
వారసత్వాన్ని తప్పకుండా తీసుకోవాలి. లేదంటే మనము కల్ప-కల్పాంతరాలు ఫెయిల్ అయిపోతాము.
ఉదాహరణకు ఎవరైనా షావుకారు బిడ్డ ఉంటే, అతడి తండ్రి అతని చదువులో ఆటంకము వేస్తే, ఆ
బిడ్డ అంటాడు - నేను ఈ లక్షలు కూడా ఏమి చేసుకుంటాను, నేనైతే అనంతమైన తండ్రి నుండి
విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకోవాలి, ఈ లక్షలు-కోట్లూ అన్నీ సమాప్తమైపోనున్నాయి.
కొందరిది మట్టిలో కూరుకుపోతుంది, కొందరిది అగ్ని కాల్చి వేస్తుంది. మొత్తం సృష్టి
రూపీ అడవికి మంటలు అంటుకోనున్నాయి. ఇదంతా రావణుడి లంక. మీరందరూ సీతలు. రాముడు వచ్చి
ఉన్నారు. మొత్తం భూమి అంతా ఒక ద్వీపము, ఈ సమయములో ఉన్నదే రావణ రాజ్యము. తండ్రి వచ్చి
రావణ రాజ్యాన్ని సమాప్తము చేయించి మిమ్మల్ని రామ రాజ్యానికి యజమానులుగా
తయారుచేస్తారు. మీకైతే లోపల అపారమైన సంతోషము ఉండాలి - అతీంద్రియ సుఖము గురించి
అడగాలంటే బాబా పిల్లలను అడగండి అని అంటూ ఉంటారు. మీరు ప్రదర్శినీలో మీ సుఖము గురించి
తెలియజేస్తారు కదా. మనము భారత్ ను స్వర్గముగా తయారుచేస్తున్నాము. శ్రీమతముపై భారత్
యొక్క సేవను చేస్తున్నాము. ఎంతెంతగా శ్రీమతముపై నడుస్తారో, అంతగా మీరు శ్రేష్ఠముగా
అవుతారు. మీకు డైరెక్షన్లు ఇచ్చేవారు ఎందరో వెలువడుతారు, అందుకే అది కూడా
పరిశీలించాలి, సంభాళించుకోవాలి. అక్కడక్కడా మాయ కూడా గుప్తముగా ప్రవేశిస్తుంది. మీరు
విశ్వానికి యజమానులుగా అవుతారు, లోపల ఎంతో సంతోషము ఉండాలి. మీరు అంటారు - బాబా, మేము
మీ నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకోవడానికి వచ్చాము, సత్యనారాయణుని కథను విని మేము
నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అవుతాము. బాబా, మేము మీ నుండి పూర్తి
వారసత్వాన్ని తీసుకునే తీరుతాము అని మీరందరూ చేతులెత్తుతారు, లేకపోతే మేము
కల్ప-కల్పమూ పోగొట్టుకుంటాము అని అంటారు. ఎటువంటి విఘ్నాన్ని అయినా సరే మేము దూరం
చేసేస్తాము అని అంతటి సాహసము కావాలి. మీరు ఇంతటి సాహసము చేసారు కదా. ఎవరి నుండైతే
వారసత్వము లభిస్తుందో, వారిని ఏమైనా వదిలేస్తారా. కొందరు చాలా బాగా నిలిచారు, కొందరు
పారిపోయారు. మంచి-మంచి వారిని మాయ తినేసింది. కొండచిలువ తినేసి పూర్తిగా మింగేసింది.
ఇప్పుడు తండ్రి - ఓ ఆత్మల్లారా అని అంటారు, ఎంతో ప్రేమగా అర్థం చేయిస్తారు. నేను
వచ్చి పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచముగా తయారుచేస్తాను. ఇప్పుడు పతిత ప్రపంచము
యొక్క మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా
చేస్తాను. పతిత రాజులకు కూడా రాజులుగా చేస్తాను. సింగిల్ కిరీటము కల రాజులు డబుల్
కిరీటము కల రాజుల ఎదుట ఎందుకు తల వంచుతారు. అర్ధకల్పము తర్వాత ఎప్పుడైతే వీరి ఆ
పవిత్రత దూరమైపోతుందో, అప్పుడు రావణ రాజ్యములో అందరూ వికారులుగా మరియు పూజారులుగా
అయిపోతారు. ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఎటువంటి పొరపాట్లు
చేయకండి. మర్చిపోకండి. మంచి రీతిలో చదువుకోండి. రోజూ క్లాసుకు రాలేకపోయినా బాబా
అన్ని ఏర్పాట్లు అందించగలరు. ఏడు రోజుల కోర్సు తీసుకోండి, తద్వారా మురళీని సహజముగా
అర్థం చేసుకోగలుగుతారు. ఎక్కడికి వెళ్ళినా సరే, కేవలం రెండు పదాలను గుర్తు
పెట్టుకోండి. ఇది మహామంత్రము. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఏ
వికర్మలైనా లేక పాప కర్మలైనా దేహాభిమానములోకి రావడం వలనే జరుగుతాయి. వికర్మల నుండి
రక్షించుకునేందుకు బుద్ధి యొక్క ప్రీతిని ఒక్క తండ్రితోనే జోడించాలి. ఏ దేహధారులతోనూ
కాదు. ఒక్కరితోనే బుద్ధి యోగాన్ని జోడించాలి. అంతిమము వరకూ స్మృతి చేస్తూ ఉండాలి,
అప్పుడిక ఎటువంటి వికర్మ జరగదు. ఇది కుళ్ళిపోయిన దేహము. దీని యొక్క అభిమానాన్ని
వదిలేయండి. నాటకము పూర్తవుతుంది, ఇప్పుడు మన 84 జన్మలు పూర్తయ్యాయి. ఇది పురాతన
ఆత్మ, పురాతన శరీరము. ఇప్పుడు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలి, అప్పుడిక
శరీరము కూడా సతోప్రధానమైనదే లభిస్తుంది. ఆత్మను సతోప్రధానముగా తయారుచేసుకోవాలి - ఇదే
తపనతో కూడిన చింత ఉండాలి. తండ్రి కేవలం - నన్నొక్కరినే స్మృతి చేయండి అని అంటారు.
ఇదే తపనతో కూడిన చింత పెట్టుకోండి. బాబా, మేము పాస్ అయి చూపిస్తాము అని మీరు కూడా
అంటారు కదా. స్కాలర్షిప్ అనేది అందరికీ లభించదని క్లాసులో తెలుసు, అయినా కూడా
పురుషార్థమైతే ఎంతో చేస్తారు కదా. మేము నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు పూర్తి
పురుషార్థము చేయాలి, తక్కువ ఎందుకు చేయాలి అని మీరు కూడా భావిస్తారు. ఏ విషయానికి
సంబంధించిన చింతా లేదు. యోధులు ఎప్పుడూ దేనినీ లెక్క చేయరు. బాబా, ఎన్నో తుఫానులు,
స్వప్నాలు మొదలైనవి వస్తాయి అని కొందరు అంటారు. బాబా అంటారు, ఇవన్నీ జరుగుతాయి. మీరు
ఒక్క తండ్రినే స్మృతి చేస్తూ ఉండండి. ఈ శత్రువుపై విజయము పొందాలి. కొన్ని సమయాలలో
అసలు మనసులో కానీ, చిత్తములో కానీ లేనటువంటి స్వప్నాలు వస్తాయి, అటువంటి కష్టాలు
వస్తాయి. ఇదంతా మాయ. మనము మాయను జయిస్తాము. అర్ధకల్పము కొరకు శత్రువు నుండి రాజ్యము
తీసుకుంటాము, మనమేమీ లెక్క చేయము. సాహసవంతులు ఎప్పుడూ తటపటాయించరు. యుద్ధానికి
సంతోషముగా వెళ్తారు. మీరైతే ఇక్కడ ఎంతో ప్రశాంతముగా తండ్రి నుండి వారసత్వాన్ని
తీసుకుంటారు. ఈ ఛీ-ఛీ శరీరాన్ని వదిలేయాలి. ఇప్పుడు స్వీట్ సైలెన్స్ హోమ్ లోకి
వెళ్తారు. తండ్రి అంటారు - నేను మిమ్మల్ని తీసుకువెళ్ళేందుకు వచ్చాను. నన్ను స్మృతి
చేసినట్లయితే పావనముగా అవుతారు. అపవిత్రమైన ఆత్మ వెళ్ళలేదు. ఇవి కొత్త విషయాలు.
అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. వికర్మల నుండి రక్షించుకునేందుకు బుద్ధి యొక్క ప్రీతిని ఒక్క తండ్రితోనే
జోడించాలి, ఈ కుళ్ళిపోయిన దేహము యొక్క అభిమానాన్ని వదిలేయాలి.
2. మనం యోధులము, ఈ స్మృతి ద్వారా మాయా రూపీ శత్రువుపై విజయము ప్రాప్తి చేసుకోవాలి,
దానిని లెక్కచేయకూడదు. మాయ గుప్త రూపములో ఎంతగానో ప్రవేశిస్తుంది, అందుకే దానిని
పరిశీలించాలి మరియు సంభాళించుకోవాలి.
వరదానము:-
మనసా-వాచా మరియు కర్మణా యొక్క పవిత్రతలో సంపూర్ణ మార్కులను
తీసుకునే నంబరువన్ ఆజ్ఞాకారీ భవ
మనసా పవిత్రత అనగా సంకల్పాలలో కూడా అపవిత్రతా సంస్కారాలు
ఇమర్జ్ అవ్వకూడదు, సదా ఆత్మిక స్వరూపము అనగా భాయి-భాయి (సోదరులము) అనే శ్రేష్ఠ
స్మృతి ఉండాలి. వాచాలో సదా సత్యత మరియు మధురత ఉండాలి, కర్మణాలో సదా నమ్రత, సంతుష్టత
మరియు హర్షితముఖత ఉండాలి. ఈ ఆధారముపైనే నంబరు లభిస్తుంది మరియు ఇటువంటి సంపూర్ణ
పవిత్ర ఆజ్ఞాకారీ పిల్లలకు తండ్రి కూడా గుణగానము చేస్తారు. వారే తమ ప్రతి కర్మ
ద్వారా తండ్రి కర్తవ్యాన్ని నిరూపించే సమీప రత్నాలు.
స్లోగన్:-
సంబంధ-సంపర్కాలు మరియు స్థితిలో లైట్ గా అవ్వండి, అంతేకానీ దినచర్యలో కాదు.
అవ్యక్త ప్రేరణలు -
ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసము చెయ్యండి, అంతర్ముఖులుగా అవ్వండి
అంతర్ముఖీ ఆత్మలు
ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ, అవి మంచివైనా లేక కదిలింపజేసే విధంగా ఉన్నా, వారు
ప్రతి సమయము, ప్రతి పరిస్థితిలో తమను తాము ఎడ్జెస్ట్ చేసుకుంటారు. వారు ఒంటరిగా
ఉన్నా లేక సంగఠనలో ఉన్నా, రెండు పరిస్థితుల్లోనూ ఎడ్జెస్ట్ అవ్వటము - ఇదే బ్రాహ్మణ
జీవితము.
| | |