20-04-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు ఈశ్వరీయ ముక్తి దళము, మీరు
అందరికీ సద్గతిని ఇవ్వాలి, అందరి ప్రీతిని ఒక్క తండ్రితో జోడింపజేయాలి’’
ప్రశ్న:-
మనుష్యులు తమ బుద్ధిని ఏ విషయములో ఉపయోగిస్తారు మరియు మీరు మీ బుద్ధిని ఎక్కడ
ఉపయోగించాలి?
జవాబు:-
మనుష్యులు తమ
బుద్ధిని ఆకాశము మరియు సృష్టి యొక్క అంతాన్ని పొందడానికి ఉపయోగిస్తున్నారు కానీ దీని
వలన లాభమేమీ లేదు. వాటి అంతమైతే లభించదు. పిల్లలైన మీరు మీ బుద్ధిని పూజ్యులుగా
అవ్వడానికి ఉపయోగిస్తారు. వాళ్ళను ప్రపంచము పూజించదు. పిల్లలైన మీరు పూజ్య దేవతలుగా
అవుతారు.
పాట:-
మిమ్మల్ని
పొంది మేము...
ఓంశాంతి
ఇది జ్ఞాన మార్గమని, అది భక్తి మార్గమని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు
ప్రశ్న ఏమని తలెత్తుతుందంటే, భక్తి మార్గము మంచిదా లేక జ్ఞాన మార్గము మంచిదా? ఇవి
రెండు విషయాలైనట్లు కదా. జ్ఞానముతో సద్గతి కలుగుతుందని అంటారు. తప్పకుండా భక్తి
మరియు జ్ఞానము, రెండు వేర్వేరు అని అంటారు. భక్తి చేయడము వలన జ్ఞానము లభిస్తుందని,
అప్పుడే సద్గతి కలుగుతుందని మనుష్యులు భావిస్తారు. భక్తి మధ్యలోకి జ్ఞానము రాలేదు.
భక్తి అందరి కోసముంది, జ్ఞానము కూడా అందరి కోసముంది. ఇది కలియుగము యొక్క అంతిమ సమయము,
కావున తప్పకుండా అందరి దుర్గతి జరుగుతుంది, అందుకే పిలుస్తారు కూడా మరియు ఇలా
పాడుతారు కూడా - ఇతర సాంగత్యాలన్నింటినీ వదిలి ఇప్పుడు మీతోనే సాంగత్యాన్ని
జోడిస్తాము అని. ఇప్పుడు ఇంతకీ వారెవరు, ఎవరితో జోడిస్తాము అనేది అర్థం చేసుకోరు.
చాలా వరకు బుద్ధి శ్రీకృష్ణుని వైపుకు వెళ్తుంది, మేము సత్యమైన ప్రీతిని నీతోనే
జోడిస్తామని అంటారు. కేవలం శ్రీకృష్ణుడితోనే ప్రీతిని జోడిస్తున్నప్పుడు, ఇక
గురువులు మొదలైనవారి అవసరమే లేదు, శ్రీకృష్ణుడినే స్మృతి చేయాలి. శ్రీకృష్ణుడి
చిత్రమైతే అందరి వద్ద ఉంది. శ్రీకృష్ణ జయంతిని కూడా జరుపుకుంటారు, ఇక ఇతరులెవ్వరి
వద్దకు వెళ్ళవలసిన అవసరమే లేదు. ఏ విధముగా మీరా ఒక్కరితోనే ప్రీతిని జోడించారు కదా,
పనులు చేసుకుంటూ కూడా శ్రీకృష్ణుడినే తలచుకుంటూ ఉండేవారు. ఇంటిలో ఉంటూ, అన్నీ
చేసుకుంటూ, తినడం-త్రాగడము అన్నీ చేసేవారు, కానీ సత్యమైన ప్రీతిని ఒక్క
శ్రీకృష్ణునితోనే జోడించారు. ఆమె ఒక ప్రేయసి మరియు శ్రీకృష్ణుడు ఒక ప్రియుడు
అన్నట్లు అయిపోయారు. శ్రీకృష్ణుడిని స్మృతి చేయడము వలన ఫలం కూడా లభిస్తుంది.
శ్రీకృష్ణుని గురించైతే అందరికీ తెలుసు. మేము సత్యమైన ప్రీతిని నీతోనే జోడించాము,
ఇతర సాంగత్యాలన్నింటినీ వదిలేశామని పాడుతారు కూడా. ఇప్పుడు ఉన్నతోన్నతమైనవారు,
సత్యమైనవారైతే పరమపితయే. అందరికీ వారసత్వాన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే, వారి
గురించి ఎవ్వరికీ తెలియదు. పరమపిత పరమాత్మ శివ అని అంటారు కానీ వారు ఎప్పుడు వస్తారు
అనేది తెలియదు. శివజయంతి జరుగుతుంది అంటే వారు తప్పకుండా వస్తూ ఉండి ఉండవచ్చు. వారు
ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, వచ్చి ఏమి చేస్తారు అనేది ఎవరికీ తెలియదు. వారు
సర్వులకు సద్గతినిస్తారని మనుష్యమాత్రులెవ్వరికీ తెలియదు. కానీ అది ఎలా ఇస్తారు,
సద్గతికి అర్థమేమిటి అన్నది ఏమీ తెలియదు! శివబాబా అయితే తప్పకుండా స్వర్గ
రాజ్యాధికారాన్ని ఇచ్చి ఉంటారు కదా. పిల్లలైన మీరు ఆ ధర్మానికి చెందినవారిగా
ఉండేవారు కానీ మీకు ఈ విషయము తెలియదు, మీరు మర్చిపోయారు, అటువంటప్పుడు ఇతరులు ఎలా
తెలుసుకోగలరు. ఇప్పుడు శివబాబా ద్వారా మీరు తెలుసుకున్నారు మరియు ఇతరులకు
తెలియజేస్తారు. మీరు ఈశ్వరీయ ముక్తి దళము. ముక్తి దళము అనండి లేక సద్గతినిచ్చే దళము
అనండి, రెండూ ఒకటే. ఇప్పుడు పిల్లలైన మీపై బాధ్యత ఉంది. మీరు చిత్రాలపై కూడా అర్థం
చేయించవచ్చు. భాషలు అనేకమున్నాయి. ముఖ్యమైన భాషలలో చిత్రాలను తయారుచేయవలసి ఉంటుంది.
భాషల విషయములో కూడా చాలా జంజాటము ఉంటుంది, అందుకే ప్రదర్శనీలు కూడా తయారుచేయవలసి
ఉంటుంది. చిత్రాలపై అర్థం చేయించడము చాలా సులువుగా ఉంటుంది. సృష్టి చక్రము చిత్రములో
కూడా పూర్తి జ్ఞానము ఉంది, మెట్ల వరుస చిత్రము కేవలం భారతవాసుల కోసం మాత్రమే ఉంది.
ఇందులో ఇతర ధర్మాలేవీ లేనే లేవు. భారత్ తమోప్రధానముగా అయినప్పుడు ఇతరులెవ్వరూ అలా
అవ్వరని కాదు, తమోప్రధానముగానైతే అందరూ అవుతారు. కావున వారి కోసం కూడా ఏదైనా ఉండాలి.
బుద్ధిలో సేవకు సంబంధించిన ఇలాంటి ఆలోచనలు రావాలి. ఇద్దరు తండ్రుల రహస్యాన్ని కూడా
అర్థం చేయించాలి. వారసత్వము రచయిత నుండి లభిస్తుంది. లక్ష్మీ-నారాయణులు భారత్ యొక్క
మొట్టమొదటి మహారాజా-మహారాణులుగా ఉండేవారని అనగా భగవాన్-భగవతీలుగా ఉండేవారని ఇది కూడా
అన్ని ధర్మాల వారికి తెలుసు. అచ్ఛా, వారికి ఈ స్వర్గ రాజ్యము ఎలా లభించింది.
తప్పకుండా భగవంతుని ద్వారా లభించింది. ఎలా లభించింది, ఎప్పుడు లభించింది అనేది
ఎవ్వరికీ తెలియదు. గీతలో శ్రీకృష్ణుని పేరును వ్రాసారు, ప్రళయాన్ని చూపించారు, కానీ
ఫలితమేమీ లేదు. ఇది పిల్లలైన మీరు అర్థం చేయించాలి. చిత్రాలైతే అన్ని చోట్ల ఉన్నాయి.
లక్ష్మీ-నారాయణుల చిత్రాలు కూడా ఉంటాయి. కాకపోతే డ్రెస్, ముఖ కవళికలు మొదలైనవి
వేర్వేరుగా ఉంటాయి. ఎవరికి ఎలా తోస్తే అలా తయారుచేశారు. ఈ రాధా-కృష్ణులే,
శ్రీనాథుడు-శ్రీనాథిని కదా. శ్రీరాధ, శ్రీకృష్ణులైతే కిరీటధారులు కారు, అలాగని
నల్లనివారూ కారు. రాజధాని లక్ష్మీ-నారాయణులది, అంతేకానీ రాధా-కృష్ణులది కాదు.
మందిరాలైతే అనేక రకాలవి నిర్మించారు, కానీ పేరు అయితే కేవలం లక్ష్మీ-నారాయణ అన్నదే
పెడతారు కదా. లక్ష్మీ-నారాయణుల వంశావళి అని అంటారు. సీతా-రాముల వంశావళి,
లక్ష్మీ-నారాయణుల వంశావళి ఉంటాయి, అంతేకానీ రాధా-కృష్ణుల వంశావళి ఉండదు. ఈ విషయాలు
మనుష్యుల ఆలోచనలలో లేనే లేవు. పిల్లలైన మీకు కూడా నంబరువారు పురుషార్థానుసారముగా
తెలుసు. ఎవరికైతే సేవ పట్ల అభిరుచి ఉంటుందో, వారు చాలా ఉత్సాహముతో ఉంటారు. కొంతమంది
- మాకు అర్థమవుతుంది అని అంటారు కానీ నెమ్మది-నెమ్మదిగా నోరు విప్పి జ్ఞానము
చెప్పగలిగేలా యుక్తులను కూడా రచించవలసి ఉంటుంది. వేద-శాస్త్రాలను అధ్యయనము చేయడం
వలన, యజ్ఞ-తపాదులు మొదలైనవి చేయడం వలన, తీర్థ యాత్రలు మొదలైనవి చేయడం వలన పరమాత్మను
పొందగలమని చాలామంది భావిస్తారు కానీ భగవంతుడు అంటున్నారు, ఇవన్నీ నా నుండి దూరము
చేసే మార్గాలు. డ్రామాలో అందరూ దుర్గతిని పొందవలసిందే, అందుకే ఇటువంటి విషయాలను
చెప్తారు. ఇంతకుముందు మనము కూడా ఇలా అనేవారము - భగవంతుడు ఒక పిలక వంటివారు, ఎవరు
ఎక్కడ నుండి వెళ్ళినా వారిని చేరుకోవచ్చు అని. అందుకే మనుష్యులు అనేక రకాల మార్గాలను
ఎన్నుకున్నారు. భక్తి మార్గములోని మార్గాలను పట్టుకుని-పట్టుకుని అలసిపోయినప్పుడు,
మళ్ళీ భగవంతుడినే పిలుస్తారు - ఓ పతితపావనా, మీరు వచ్చి పావనముగా అయ్యే మార్గాన్ని
తెలియజేయండి, మీరు లేకుండా పావనముగా అవ్వలేము, అలసిపోయాము అని అంటారు. భక్తి
రోజురోజుకు పూర్తిగా అలసిపోయేలా చేస్తుంది. ఇప్పుడైతే మేళాలు మొదలైనవాటి వద్దకు
ఎన్ని లక్షలమంది వెళ్తారు, అక్కడ ఎంత మురికి ఉంటుంది. ఇప్పుడైతే ఇది అంతిమము.
ప్రపంచము పరివర్తనవ్వాలి. వాస్తవానికి ప్రపంచము ఒక్కటే ఉంటుంది, దానిని రెండు
భాగాలుగా చూపించారు. మనుష్యులు స్వర్గము, నరకము వేర్వేరు ప్రపంచాలని భావిస్తారు,
కానీ ఇవి సగం-సగము ఉంటాయి. పైన సత్యయుగము, ఆ తర్వాత త్రేతా, ద్వాపర, కలియుగాలు.
కలియుగములో తమోప్రధానముగా అవ్వాల్సిందే. సృష్టి పాతదిగా అవుతుంది. ఈ విషయాలను ఎవ్వరూ
అర్థం చేసుకోరు, తికమకలో ఉన్నారు. కొంతమంది శ్రీకృష్ణుడిని భగవంతుడని, మరికొంతమంది
శ్రీరాముడిని భగవంతుడని అంటారు. ఈ రోజుల్లోనైతే మనుష్యులు తమను తామే భగవంతుడని
చెప్పుకుంటారు. మేము ఈశ్వరుని అవతారమని అంటారు. అంటే దేవతల కన్నా కూడా మనుష్యులు
తెలివైనవారు అయిపోయినట్లు. ఎంతైనా దేవతలను దేవతలనే అంటారు, కానీ ఇక్కడ మనుష్యులను
భగవంతుడని అంటారు. ఇది భక్తి మార్గము. దేవతలైతే స్వర్గములో ఉండేవారు. ఇప్పుడు
ఇనుపయుగమైన కలియుగములో మనుష్యులు భగవంతునిగా ఎలా అవ్వగలరు. తండ్రి అంటారు - నేను
రావడమే సంగమయుగములో వస్తాను, ఈ సమయములో నేను వచ్చి ప్రపంచాన్ని ట్రాన్స్ఫర్ చేయవలసి
ఉంటుంది. కలియుగము సత్యయుగముగా అవుతుంది, మిగిలినవారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు.
అది నిరాకారీ ప్రపంచము. ఇది సాకారీ ప్రపంచము. అర్థం చేయించేందుకు నిరాకారీ
వృక్షాన్ని కూడా పెద్దదిగా తయారుచేయవలసి ఉంటుంది. ఆకాశము ఎంత పెద్దదో,
బ్రహ్మమహాతత్వము కూడా అంత పెద్దదిగా ఉంటుంది, రెండింటి అంతాన్ని పొందలేరు. అక్కడికి
విమానాలు మొదలైనవాటిలో వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తారు కానీ దాని అంతాన్ని పొందలేరు.
సముద్రమే సముద్రము... ఆకాశమే ఆకాశము ఉంటుంది. అక్కడ ఏమీ ఉండదు. చాలానే
ప్రయత్నిస్తారు కానీ ఈ విషయాలన్నింటి వలన లాభమేముంది. మేము మా బుద్ధిని
ఉపయోగిస్తున్నామని భావిస్తారు. అయితే ఇది మనుష్యుల బుద్ధి, సైన్స్ యొక్క గర్వం కూడా
మనుష్యులలో ఉంది. ఒకవేళ ఎవరైనా వాటి అంతాన్ని కనుగొన్నా సరే, వారినేమీ ప్రపంచమంతా
పూజించదు. దేవతలకైతే పూజ జరుగుతుంది. పిల్లలైన మిమ్మల్ని తండ్రి ఎంత ఉన్నతముగా
తయారుచేస్తారు. అందరినీ శాంతిధామానికి తీసుకువెళ్తారు. మనము మూలవతనము నుండి వస్తామని
అందరికీ తెలుసు కానీ ఏ విధముగా మీరు అర్థం చేసుకున్నారో, ప్రపంచానికి ఆ విధముగా
తెలియదు. మూలవతనము అంటే ఏమిటి, అక్కడ ఆత్మలు ఎలా ఉంటాయి, మళ్ళీ నంబరువారుగా ఎలా
వస్తాయి అనేది ఎవరికీ తెలియదు. బ్రహ్మమహాతత్వములో నిరాకారీ వృక్షము ఉంటుంది.
సత్యయుగములో కొద్దిమంది మనుష్యులే ఉంటారని, మిగిలిన ఆత్మలన్నీ మూలవతనములో ఉంటాయని
వారు అర్థం చేసుకోరు. ఈ సాకార వతనము ఎలా ఉంటుందో, మూలవతనము కూడా అలాగే ఉంటుంది.
వతనము ఎప్పుడూ ఖాళీ అవ్వదు. ఈ సాకార వతనము ఖాళీ అవ్వదు, ఆ మూలవతనము ఖాళీ అవ్వదు.
అంతిమము వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ అవుతారు. కొంతమంది ఈ వతనములో ఉంటారు, వతనము
పూర్తిగా ఖాళీ అయిపోతే ఇక ప్రళయము జరిగినట్లు. కానీ ప్రళయము జరగదు. ఇది అవినాశీ
ఖండము కదా. ఈ విషయాలన్నింటినీ బుద్ధిలో ఉంచుకోవాలి. మేము ఎవరో ఒకరి కళ్యాణము చేయాలి
అని రోజంతా ఇవే ఆలోచనలు నడుస్తూ ఉండాలి. మీకు వారితో ప్రీతి జోడింపబడింది కావున మీరు
వారి పరిచయాన్ని ఇవ్వాలి కదా. వారు తండ్రి, వారి నుండి వారసత్వము లభిస్తుంది. ఎలా
లభిస్తుంది అనేది మేము తెలియజేయగలము అని చెప్పండి. ఇలా చెప్పగలిగేవారు కూడా
నంబరువారుగా ఉన్నారు. కొంతమందైతే చాలా మంచి రీతిలో భాషణ చేస్తారు, కొంతమంది చేయలేరు
కనుక నేర్చుకోవలసి ఉంటుంది. పిల్లలు ప్రతి ఒక్కరూ తమ కళ్యాణాన్ని చేసుకోవాలి.
మార్గము లభించినప్పుడు మరి ఇతరుల కళ్యాణము చేయాలి. ఇతరులకు కూడా తండ్రి నుండి
వారసత్వాన్ని ఇప్పించాలని, ఆత్మిక సేవ చేయాలని మనసుకు అనిపిస్తుంది. అందరూ ఇతరుల
సేవ చేస్తారు.
తండ్రి వచ్చి ఆత్మిక సేవను నేర్పిస్తారు, ఇతరులెవ్వరికీ ఆత్మిక సేవ గురించి
తెలియదు. ఆత్మిక తండ్రియే ఆత్మల సేవను చేస్తారు. దైహిక సేవనైతే జన్మజన్మలుగా చాలానే
చేశారు, ఇప్పుడు అంతిమ జన్మలో తండ్రి నేర్పించిన ఆత్మిక సేవను చేయాలి. ఇందులోనే
కళ్యాణముంది, ఇంక దేనిలోనూ లాభము లేదు. గృహస్థ వ్యవహారములో కూడా ఉండాలి, తోడును
నిర్వర్తించాలి. వారికి కూడా ఇదే అర్థం చేయించి కళ్యాణము చేయాలి. ప్రీతి ఉన్నట్లయితే
ఎంతోకొంత వింటారు. కొందమందైతే, మేము కూడా సన్యాసము తీసుకోవలసి వస్తుందేమోనని
భయపడతారు. ఈ రోజులలోనైతే సన్యాసులు చాలామంది ఉన్నారు కదా. కాషాయ వస్త్రాలను ధరించి
రెండు మాటలు వినిపిస్తే చాలు, ఎక్కడో ఒక చోట నుండి భోజనమైతే లభించేస్తుంది. ఏ
దుకాణానికి వెళ్ళినా, రెండు పూరీలైతే ఇస్తారు. తర్వాత ఇంకొకరి వద్దకు వెళ్తారు, ఇలా
కడుపుకు భోజనము లభిస్తుంది. భిక్షము అడిగేవారు కూడా అనేక రకాలవారు ఉంటారు. ఈ తండ్రి
నుండైతే ఒకే విధమైన వారసత్వము లభిస్తుంది. అనంతమైన రాజ్యాధికారము లభిస్తుంది, సదా
నిరోగిగా అవుతారు. షావుకారులు కష్టం మీద మేలుకుంటారు. పేదవారి కళ్యాణము కూడా చేయాలి.
బాబా ప్రదర్శనీలు ఎన్నో తయారుచేయిస్తున్నారు ఎందుకంటే గ్రామాలు చాలా ఉన్నాయి కదా.
మినిస్టర్లు మొదలైనవారు ఈ జ్ఞానము బాగుందని భావించినట్లయితే, అందరూ వినడము
ప్రారంభిస్తారు. మున్ముందు మీ పేరు ప్రసిద్ధి చెందుతుంది, అప్పుడు చాలామంది వస్తారు.
తుప్పు వదలడానికి సమయము పడుతుంది. ఎవరైనా రాత్రింబవళ్ళు ఇందులోనే నిమగ్నమైనట్లయితే
బహుశా వదిలిపోవచ్చు. ఆత్మ పవిత్రముగా అయిపోతే ఇక ఈ శరీరాన్ని కూడా వదిలేస్తుంది.
ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. ప్రదర్శనీలలో కూడా అర్థం చేయించాలి. ముఖ్యమైన
విషయమేమిటంటే, ఇదంతా భారత్ కు సంబంధించినది. భారత్ యొక్క ఉన్నతి జరిగినప్పుడు అందరి
ఉన్నతి జరుగుతుంది. ప్రొజెక్టర్లతో కన్నా ప్రదర్శనీలతో ఎక్కువ సేవ జరగగలదు.
నెమ్మది-నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటారు. రోజురోజుకు మీ పేరు ప్రసిద్ధమవుతూ ఉంటుంది.
5 వేల సంవత్సరాల క్రితం కూడా ఇలాగే జరిగింది అని ఇలా కూడా వ్రాయాలి. ఇవి చాలా
అద్భుతమైన విషయాలు. బాబా సూచనలు ఇస్తారు కానీ పిల్లలు చాలా విషయాలను మర్చిపోతారు.
ఏమి జరిగినా సరే, నేటికి 5 వేల సంత్సరాల క్రితం కూడా ఇలాగే జరిగింది అని అంటారు.
వాస్తవానికి ఇది చాలా స్పష్టమైన విషయము, కానీ ఇది ఎవరి బుద్ధిలోనైనా కూర్చోవాలి కదా.
వార్తాపత్రికలలో వేయించగలిగితే, ఎంతోకొంత అర్థం చేసుకుంటారు. జ్ఞాన మార్గములో చాలా
ఫస్ట్ క్లాస్ అవస్థ కావాలి. ఇటువంటి విషయాలను గుర్తు చేసుకుంటూ హర్షితముగా కూడా
ఉండవలసి ఉంటుంది. ఇది అలవాటైపోతే అవస్థ చాలా సంతోషభరితముగా ఉంటుంది. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఇతరులందరి నుండి బుద్ధి యొక్క ప్రీతిని తొలగించి ఒక్క తండ్రితో జోడించాలి
మరియు అందరి ప్రీతిని ఒక్క తండ్రితో జోడింపజేసే సేవను చేయాలి.
2. సత్యాతి-సత్యమైన ఆత్మిక సేవాధారులుగా అవ్వాలి. స్వ కళ్యాణము కూడా చేసుకోవాలి
మరియు ఇతరులకు కూడా మార్గాన్ని తెలియజేయాలి. అవస్థను చాలా సంతోషభరితముగా
తయారుచేసుకోవాలి.
వరదానము:-
తమ శ్రేష్ఠ వ్యవహారము ద్వారా సర్వాత్మలకు సుఖాన్ని ఇచ్చే
మహాన్ ఆత్మా భవ
ఎవరైతే మహాన్ ఆత్మలుగా ఉంటారో, వారి ప్రతి వ్యవహారము
ద్వారా సర్వాత్మలకు సుఖము యొక్క దానము లభిస్తుంది. వారు సుఖాన్ని ఇస్తారు మరియు
సుఖాన్ని తీసుకుంటారు. కావున చెక్ చేసుకోండి - మహాన్ ఆత్మ యొక్క లెక్కలో మొత్తము
రోజంతటిలో అందరికీ సుఖాన్ని ఇచ్చానా, పుణ్య కర్మలు చేసానా. పుణ్యము అనగా ఎవరికైనా
ఎటువంటి వస్తువును ఇవ్వాలంటే, దాని ద్వారా ఆ ఆత్మ నుండి ఆశీర్వాదాలు లభించాలి.
కావున చెక్ చేసుకోండి - ప్రతి ఆత్మ నుండి ఆశీర్వాదాలు లభిస్తున్నాయా! ఎవరికీ
దుఃఖాన్ని ఇవ్వలేదు కదా లేక ఎవరి నుండి దుఃఖాన్ని తీసుకోలేదు కదా! అప్పుడే మహాన్
ఆత్మ అని పిలవబడతారు.
స్లోగన్:-
చేసిన
తర్వాత ఆలోచించడమే పశ్చాత్తాపము యొక్క రూపము.
అవ్యక్త ప్రేరణలు -
‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’
సంస్కారాలు మరియు
నేచర్ అయితే ప్రతి ఒక్కరివి ఎవరివి వారికి ఉంటాయి, కానీ సర్వులకు స్నేహీలుగా మరియు
అన్ని విషయాలలో, సంబంధాలలో సఫలత, మనసులో విజయము మరియు వాణిలో మధురత అనేవి ఈజీ నేచర్
ఉన్నప్పుడే వస్తాయి. ఈజీ నేచర్ అనగా ఎటువంటి సమయమో, ఎటువంటి వ్యక్తులో, ఎటువంటి
పరిస్థితులో, వాటిని గమనిస్తూ స్వయాన్ని ఈజీగా చేసుకోవాలి. ఈజీ అనగా కలుపుగోలుగా
ఉండటము, మౌల్డ్ అయ్యేవారు. ఈజీ అంటే నిర్లక్ష్యులుగా ఉండటము కాదు.
| | | |