25-04-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - తండ్రి పిల్లలైన మీ కోసం కొత్త
రాజ్యాన్ని స్థాపన చేయడానికి దూరదేశము నుండి వచ్చారు, మీరిప్పుడు స్వర్గానికి
యోగ్యులుగా అవుతున్నారు’’
ప్రశ్న:-
ఏ
పిల్లలకైతే శివబాబా పట్ల ఎడతెగని నిశ్చయము ఉందో వారి గుర్తులేమిటి?
జవాబు:-
వారు కళ్ళు
మూసుకుని బాబా శ్రీమతముపై నడుస్తూ ఉంటారు, ఏ ఆజ్ఞ లభిస్తే అది స్వీకరిస్తారు. దీని
వలన ఏమైనా నష్టము కలుగుతుందేమో అన్న ఆలోచన కూడా రాదు, ఎందుకంటే ఇటువంటి నిశ్చయబుద్ధి
కల పిల్లల బాధ్యత తండ్రిది. వారికి ఉన్న నిశ్చయానికి బలం లభిస్తుంది. అవస్థ
స్థిరముగా మరియు అచలముగా తయారవుతుంది.
పాట:-
నీవే తల్లివి,
నీవే తండ్రివి...
ఓంశాంతి
మీరు ఎవరి మహిమను విన్నారు? వారి గురించి పిల్లలైన మీకు తప్ప ఈ ప్రపంచములో
ఇంకెవ్వరికీ తెలియదు. ఇది ఉన్నతోన్నతమైన తండ్రి మహిమ. ఇక మిగిలినవారెవరి మహిమను
చేసినా అది వ్యర్థమే అవుతుంది. ఉన్నతోన్నతమైనవారు ఒక్క తండ్రి మాత్రమే. కానీ తండ్రి
పరిచయాన్ని ఎవరిస్తారు. వారే స్వయంగా వచ్చి ఆత్మ పరిచయాన్ని మరియు తమ పరిచయాన్ని
ఇస్తారు. మహాన్ ఆత్మ, జీవాత్మ అని అంటూ ఉంటారు కానీ మనుష్యులెవ్వరికీ ఆత్మ పరిచయము
లేదు. శరీరము వదిలినప్పుడు ఆత్మ వెళ్ళిపోతుందని అంటారు. శరీరము శవమైపోతుంది, ఆత్మ
అవినాశీ, అది ఎప్పుడూ అంతమవ్వదు. నక్షత్రము వలె ఉండే ఆత్మ అతి సూక్ష్మమైనది. అది ఈ
కళ్ళకు కనిపించదు. కర్తవ్యాలన్నీ ఆత్మయే చేస్తుంది కానీ పదే-పదే దేహాభిమానములోకి
వచ్చి, నేను ఫలానాను, నేను ఇది చేస్తాను అని అంటారు. వాస్తవానికి అంతా చేసేది ఆత్మయే.
శరీరమైతే ఇంద్రియాలతో కూడినది. ఆత్మ చాలా సూక్ష్మమైనదని, అది భృకుటి మధ్యలో ఉంటుందని
ఈ సాధువులు మొదలైనవారికి కూడా తెలుసు, కానీ ఆత్మలో ఈ పాత్రను అభినయించే సంస్కారాలు
ఉన్నాయి అనే జ్ఞానము వారికి లేదు. కొందరు - ఆత్మలో సంస్కారాలు ఉండవు, ఆత్మ నిర్లేపి
అని అంటారు. మరికొందరు - సంస్కారాల అనుసారముగా జన్మ లభిస్తుంది అని అంటారు. ఇలా
అనేక అభిప్రాయ బేధాలు ఉన్నాయి. ఎటువంటి ఆత్మలు 84 జన్మలు తీసుకుంటారు అనేది కూడా
ఎవరికీ తెలియదు. సూర్యవంశీయులు మాత్రమే 84 జన్మల చక్రములో తిరగవలసి ఉంటుందని మీకు
తెలుసు. ఆత్మయే 84 జన్మల చక్రములో తిరిగి పతితముగా అవుతుంది, దానిని ఇప్పుడు
పావనముగా ఎవరు తయారుచేయాలి. పతిత-పావనుడు, ఉన్నతోన్నతమైనవారు ఒక్క తండ్రి మాత్రమే,
వారి మహిమ అందరికన్నా ఉన్నతమైనది. 84 జన్మలను అందరూ అయితే తీసుకోరు. వెనుక
వచ్చేవారైతే 84 జన్మలను తీసుకోలేరు. అందరూ ఒకేసారి అయితే రారు. సూర్యవంశీ రాజులు
మరియు ప్రజలు, ఎవరైతే మొట్టమొదట సత్యయుగములోకి వస్తారో, వారికి 84 జన్మలు ఉంటాయి.
తర్వాతర్వాత మనుష్యుల సంఖ్య చాలా వృద్ధి చెందుతుంది కదా. ఇక కొంతమందికి 83,
కొంతమందికి 80 జన్మలు ఉంటాయి. అక్కడ సత్యయుగములోనైతే పూర్తి 150 సంవత్సరాల ఆయుష్షు
ఉంటుంది, ఎవరూ ముందే మరణించరు. ఈ విషయాలను తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు.
పరమపిత పరమాత్మను గురించి ఇప్పుడు ఎవరికీ తెలియదు. తండ్రి అంటారు - మీ ఆత్మ ఎలాగైతే
ఉంటుందో, అలాగే నా ఆత్మ కూడా ఉంటుంది, కానీ మీరు జనన-మరణాలలోకి వస్తారు, నేను రాను.
నన్ను పిలవడము కూడా పతితులుగా అయినప్పుడు పిలుస్తారు, చాలా దుఃఖితులుగా అయినప్పుడు
పిలుస్తారు. ఈ సమయములో పిల్లలైన మిమ్మల్ని శివబాబా చదివిస్తున్నారు.
పరమాత్మ వస్తారు అన్నది ఎలా నమ్మాలి అని కొంతమంది అడుగుతారు! వారికి ఇలా అర్థం
చేయించాలి - ఓ పతిత-పావనా రండి అని అందరూ పిలుస్తారు, అయితే వారు నిరాకారుడు, వారికి
తమదంటూ శరీరము లేదు, వారు రావడము కూడా పతిత ప్రపంచములోకి రావలసి ఉంటుంది, పావన
ప్రపంచములోకైతే రారు. ఈ విధముగా అర్థం చేయించాలి. ఇది కూడా అర్థం చేయించాలి - ఏ
విధముగా ఆత్మ చిన్నగా ఉంటుందో, పరమాత్మ కూడా అంతే చిన్నగా ఉంటారు, కానీ వారు మనుష్య
సృష్టికి బీజరూపుడు, నాలెడ్జ్ ఫుల్. తండ్రి అంటారు - మీరు నన్ను పరమపిత పరమాత్మ అని
అంటారు, పిలుస్తారు, కావున తప్పకుండా వస్తాను కదా. దూరదేశములో నివసించేవారు పరాయి
దేశములోకి వచ్చారని గాయనము కూడా ఉంది. ఇప్పుడు మనము పరాయి దేశములో అనగా రావణుడి
దేశములో ఉన్నామని తండ్రి ద్వారా తెలిసింది. సత్య, త్రేతాయుగాలలో మనము ఈశ్వరీయ
దేశములో అనగా మన దేశములో ఉండేవారము, తర్వాత ద్వాపరము నుండి మొదలుకుని మనము పరాయి
దేశములోకి, పరాయి రాజ్యములోకి వచ్చేస్తాము, వామ మార్గములోకి వచ్చేస్తాము. అప్పుడు
భక్తి ప్రారంభమవుతుంది. మొట్టమొదట శివబాబాను భక్తి చేయడము మొదలుపెడతారు, మనుష్యులు
శివునికి ఎంతో పెద్ద లింగాన్ని తయారుచేస్తారు కానీ వారు అంత పెద్దగా అయితే లేరు.
ఇప్పుడు మీరు, ఆత్మ మరియు పరమాత్మకు గల వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్నారు. వారు
నాలెడ్జ్ ఫుల్, సదా పావనుడు, సుఖ సాగరుడు, ఆనంద సాగరుడు. ఇది పరమాత్ముని మహిమయే కదా.
ఓ పతిత-పావనా రండి అని ఇప్పుడు పిలుస్తారు. వారు పరమపిత, వారు కల్ప-కల్పము వస్తారు.
దూరదేశములో ఉండే ప్రయాణీకుడిని పిలుస్తారు, వారి మహిమను పాడుతారు.
బ్రహ్మా-సరస్వతులనైతే పిలవరు, నిరాకార పరమాత్మను పిలుస్తారు. దూరదేశములో
నివసించేవారు, ఇప్పుడు పరాయి దేశములోకి రండి అని ఆత్మ పిలుస్తుంది ఎందుకంటే అందరూ
పతితముగా అయిపోయారు. నేను కూడా వస్తాను, రావణ రాజ్యము సమాప్తమవ్వనున్నప్పుడు వస్తాను,
నేను రావడము కూడా సంగమయుగములోనే వస్తాను. ఇది ఎవరికీ తెలియదు. వారు పరమాత్ముడు
బిందువు అని అంటారు కూడా. ఈ రోజుల్లోనైతే ఆత్మయే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అని అంటారు
కానీ ఆత్మ పరమాత్మగా కాలేదు. ఆత్మ, పరమాత్మ, ఇరువురూ వేర్వేరు. రూపము ఇరువురిది
ఒకేలా ఉంటుంది. కానీ ఆత్మ పతితముగా అవుతుంది, 84 జన్మల పాత్రను అభినయించవలసి ఉంటుంది.
పరమాత్మ జనన-మరణ రహితుడు. ఒకవేళ ఆత్మయే పరమాత్మ అని అంటే, మరి సతోప్రధానమైన పరమాత్మ
తమోప్రధానతలోకి వస్తారా, రారు, ఈ విధముగా జరగడం సాధ్యము కాదు. తండ్రి అంటారు - నేను
సర్వాత్మల సేవ చేయడానికి వస్తాను. నా జన్మ జరిగింది అని కూడా అనరు. నేను వచ్చేదే
నరకవాసులను స్వర్గవాసులుగా చేసేందుకు. వారు మన స్వర్గాన్ని స్థాపన చేయడానికి పరాయి
దేశములోకి వచ్చారు. తండ్రియే వచ్చి మనల్ని స్వర్గానికి యోగ్యులుగా తయారుచేస్తారు.
మిగిలిన ఆత్మలందరికీ తమ-తమ పాత్రలు ఉన్నాయని కూడా అర్థం చేయించారు. పరమాత్మ జనన-మరణ
రహితుడు. వారు రావడము కూడా తప్పకుండా వస్తారు, అందుకే శివరాత్రిని జరుపుకుంటారు.
కానీ వారు ఎప్పుడు వచ్చారు అనేది ఎవరికీ తెలియదు. మామూలుగా శివజయంతిని జరుపుకుంటూ
వచ్చారు. వారు స్వర్గ స్థాపన చేయడానికి తప్పకుండా సంగమములోనే వచ్చి ఉంటారు. వారు
పతితులను పావనముగా చేయడానికి తప్పకుండా సంగమములోనే వస్తారు కదా. పావన సృష్టి
స్వర్గము. పతిత-పావనా రండి అని అంటారు. మరి తప్పకుండా పతిత ప్రపంచ వినాశన సమయములోనే,
పావన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. వారు ప్రతి యుగములోనూ రారు. తండ్రి అంటారు - నేను
సంగమములోనే వచ్చి పతిత ప్రపంచాన్ని పావనముగా తయారుచేయవలసి ఉంటుంది. ఇది పరాయి దేశము,
రావణుడి దేశము. కానీ రావణ రాజ్యము నడుస్తుందని మనుష్యులెవరికీ తెలియదు. ఈ రావణ
రాజ్యము ఎప్పటినుండి ప్రారంభమయ్యింది, ఏమీ తెలియదు. మొట్టమొదటి ముఖ్యమైన విషయము -
ఆత్మ మరియు పరమాత్మల రహస్యాన్ని అర్థం చేయించాలి, ఆ తర్వాత - వారు పావనముగా
తయారుచేయడానికి కల్పము యొక్క సంగమయుగములో వస్తారని అర్థం చేయించాలి. ఈ పని వారిదే,
అంతేకానీ శ్రీకృష్ణుడిది కాదు. శ్రీకృష్ణుడు స్వయమే 84 జన్మలను తీసుకుని కిందకు
వస్తారు. సూర్యవంశీయులందరూ కిందకు దిగుతారు. వృక్షములోని సగ భాగము తాజాగా, సగ భాగము
పాతదిగా ఉండదు కదా. అందరిదీ శిథిలావస్థయే ఉంటుంది. కల్పము ఆయుష్షు గురించి కూడా
మనుష్యులకు తెలియదు. శాస్త్రాల్లో చాలా ఎక్కువ ఆయువును చూపించారు. ఇది తండ్రియే
కూర్చుని అర్థం చేయిస్తారు. ఇందులో వేరే ప్రశ్నలేవీ తలెత్తవు. రచయిత అయిన తండ్రి
సత్యమే చెప్తారు. మనము ఇంతమంది బి.కె.లు ఉన్నాము, అందరము నమ్ముతాము. వారు తప్పకుండా
ఉన్నారు కావుననే నమ్ముతున్నాము కదా. మున్ముందు నిశ్చయము ఏర్పడిన తర్వాత అంతా
అర్థమవుతుంది కూడా. మొట్టమొదట మనుష్యులకు ఇది అర్థం చేయించాలి - పరమపిత పరమాత్మ
నిరాకారుడు, వారు దూరదేశము నుండి వచ్చారు. కానీ ఏ శరీరములోకి వచ్చారు,
సూక్ష్మవతనములోకి వచ్చి ఏమి చేస్తారు. వారు తప్పకుండా ఇక్కడికే రావలసి ఉంటుంది.
ప్రజాపిత బ్రహ్మా కూడా ఇక్కడే కావాలి. బ్రహ్మా ఎవరు, అది కూడా తండ్రి కూర్చుని అర్థం
చేయిస్తారు. నేను ఎవరిలోనైతే ప్రవేశించానో, వారికీ ఇంతకుముందు తమ జన్మల గురించి
తెలియదు, అలానే పిల్లలకు కూడా తెలియదు. పిల్లలుగా కూడా ఎప్పుడు అవుతారంటే, నేను
దత్తత తీసుకున్నప్పుడు. నేను వీరి (సాకార బ్రహ్మా) సహితముగా పిల్లలను అడుగుతున్నాను
- మీరు మీ జన్మలను మర్చిపోయారా? ఇప్పుడు సృష్టి చక్రము పూర్తవుతుంది, మళ్ళీ రిపీట్
అవుతుంది. నేను పావనముగా తయారుచేసేందుకు, రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను.
పావనముగా అవ్వడానికి ఇంకే మార్గము లేదు. ఒకవేళ ఈ రహస్యాన్ని మనుష్యులు
తెలుసుకున్నట్లయితే, ఇక గంగా మొదలైన స్థానాలకు స్నానాలు చేయడానికి, మేళాలు
మొదలైనవాటికి వెళ్ళరు. ఈ నీటి నదులలోనైతే సదా స్నానాలు చేస్తూ ఉంటారు. ద్వాపరము
నుండి మొదలుకుని చేస్తూనే వచ్చారు. గంగలో మునకలు వేస్తే పాపాలు నశిస్తాయని
భావిస్తారు, కానీ ఎవరి పాపాలు నశించవు. మొట్టమొదట అయితే ఆత్మ మరియు పరమాత్మల
రహస్యాన్నే తెలియజేయండి. ఆత్మలే తండ్రి అయిన పరమాత్మను పిలుస్తారు, వారు నిరాకారుడు,
ఆత్మ కూడా నిరాకారియే. ఈ ఇంద్రియాల ద్వారా ఆత్మ పిలుస్తుంది. భక్తి తర్వాత భగవంతుడు
రావలసి ఉంటుంది, ఇది కూడా డ్రామాలోని పాత్ర.
తండ్రి అంటారు - నేను కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి రావలసి ఉంటుంది.
భగవంతునికి సంకల్పము కలిగింది అని శాస్త్రాలలో కూడా ఉంది, అంటే తప్పకుండా డ్రామా
ప్లాన్ అనుసారముగా వారికి సంకల్పము కలిగి ఉంటుంది. ఇంతకుముందు ఈ విషయాలను అర్థం
చేసుకునేవారు కాదు. రోజురోజుకు అర్థం చేసుకుంటూ ఉంటారు. తండ్రి అంటారు - నేను మీకు
కొత్త-కొత్త గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తాను, అవి వింటూ-వింటూ అర్థం
చేసుకుంటూ ఉంటారు. ఇంతకుముందు శివబాబా చదివిస్తున్నారని అనేవారు కాదు. ఇప్పుడైతే
మంచి రీతిలో అర్థం చేసుకున్నారు, ఇంకా అర్థం చేసుకోవలసినది చాలా ఉంది. ఎవరికి ఎలా
అర్థం చేయించాలి అనేది రోజూ చెప్తూ ఉంటారు. ముందు అనంతమైన తండ్రి అర్థం
చేయిస్తున్నారు అన్న నిశ్చయము ఏర్పడాలి, వారు తప్పకుండా సత్యాన్నే వినిపిస్తారు.
ఇందులో తికమకపడాల్సిన విషయము కూడా లేదు. పిల్లల్లో కొంతమంది పక్కాగా ఉన్నారు,
కొంతమంది కచ్చాగా ఉన్నారు. కచ్చాగా ఉన్నవారు ఎవరికీ అర్థం చేయించలేరు. స్కూల్లో కూడా
ఈ విధముగా నంబరువారుగా ఉంటారు. పరమపిత పరమాత్మ వచ్చి చదివిస్తున్నారు అన్నది మేము
ఎలా నమ్మాలి అన్న సంశయము చాలామందికి కలుగుతుంది, ఎందుకంటే వారి బుద్ధిలో
శ్రీకృష్ణుడు జ్ఞానాన్ని వినిపించారు అన్నట్లు ఉంది. ఇప్పుడు పతిత ప్రపంచములోకైతే
శ్రీకృష్ణుడు రాలేరు. పతిత ప్రపంచములోకి మరియు పతిత శరీరములోకి పరమాత్మయే రావలసి
ఉంటుందని వారికి ఋజువు చేసి చెప్పండి. ప్రతి ఒక్కరికి తమ-తమ బుద్ధి ఉంటుందని కూడా
తండ్రి అర్థం చేసుకుంటారు. కొంతమందైతే వెంటనే అర్థం చేసుకుంటారు. ఎంత వీలైతే అంత
అర్థం చేయించాలి. బ్రాహ్మణులందరూ ఒకేలా ఉండరు. కానీ దేహాభిమానము పిల్లల్లో చాలా ఉంది.
నంబరువారుగా ఉన్నారని బాబాకు కూడా తెలుసు. పిల్లలు డైరెక్షన్ల అనుసారముగా
నడుచుకోవాలి. పెద్ద బాబా ఏమి చెప్పినా సరే, దానిని స్వీకరించాలి. గురువులు
మొదలైనవారిదైతే స్వీకరిస్తూ వచ్చారు. మరి ఇప్పుడు స్వర్గములోకి తీసుకువెళ్ళే తండ్రి
మాటలనైతే కళ్ళు మూసుకుని స్వీకరించాలి. కానీ అంతటి నిశ్చయబుద్ధి కలవారిగా లేరు.
అందులో నష్టము ఉన్నా, లాభము ఉన్నా స్వీకరించాలి. ఒకవేళ నష్టం జరిగిందనే అనుకోండి,
బాబా అయితే అంటారు కదా - ఎల్లప్పుడూ శివబాబాయే చెప్తున్నారని అనుకోండి, బ్రహ్మా
చెప్తున్నారని అనుకోకండి. శివబాబా బాధ్యులవుతారు. ఇది వారి రథము, వారే సరి చేస్తారు.
నేను కూర్చుని ఉన్నాను అని బాబా అంటారు. ఎల్లప్పుడూ శివబాబాయే చెప్తున్నారు అని
అనుకోండి, వీరికేమీ తెలియదు. ఇలాగే అనుకోండి. ఒకవైపు ఈ నిశ్చయము పెట్టుకోవాలి. నేను
చెప్పింది వింటూ ఉన్నట్లయితే, మీ కళ్యాణము జరుగుతూ ఉంటుందని శివబాబా అంటారు. ఒకవేళ
ఈ బ్రహ్మా ఏదైనా చెప్పినా, దానికి కూడా నేనే బాధ్యుడిని. పిల్లలైన మీరు చింతించకండి.
శివబాబాను స్మృతి చేసినట్లయితే అవస్థ మరింత పక్కా అయిపోతుంది. నిశ్చయములో వికర్మలు
కూడా వినాశనమవుతాయి, బలం కూడా లభిస్తుంది. ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంత ఎక్కువ
బలం లభిస్తుంది. ఎవరైతే శ్రీమతాన్ని అనుసరిస్తూ సేవ చేస్తారో, వారే ఉన్నత పదవిని
పొందుతారు. చాలామందిలో దేహాభిమానము చాలా ఉంటుంది. బాబా పిల్లలందరితో ఎంత ప్రేమగా
నడుచుకుంటారో చూడండి, అందరితోనూ మాట్లాడుతూ ఉంటారు. పిల్లలను అడుగుతుంటారు - బాగానే
కూర్చున్నారా! ఏ కష్టము లేదు కదా! పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది. అనంతమైన తండ్రికి
పిల్లల పట్ల చాలా-చాలా ప్రేమ ఉంది. శ్రీమతమనుసారముగా ఎవరు ఎంత సేవను చేస్తారో, దాని
అనుసారముగా ప్రేమ ఉంటుంది. సేవలోనే లాభము ఉంటుంది. సేవలో ఎముకలు ఇవ్వాలి. ఏదో ఒక
సేవ చేస్తూ ఉన్నట్లయితే, వీరు ఫస్ట్ క్లాస్ బిడ్డ అని బాబా హృదయములో కూడా ఉంటారు.
కానీ నడుస్తూ-నడుస్తూ కొంతమందిపై గ్రహచారము కూడా కూర్చుంటుంది. మాయ ఎదిరిస్తుంది కదా.
గ్రహచారము కారణముగా ఇక జ్ఞానము తీసుకోలేరు. కొంతమందైతే కర్మణా సేవను అలసట లేకుండా
చేస్తారు.
మీ పని అందరినీ సుఖధామానికి యజమానులుగా చేయడము. ఎవరికీ దుఃఖము ఇవ్వకండి. జ్ఞానము
లేకపోతే చాలా దుఃఖము ఇస్తారు. ఇక ఎంత అర్థం చేయించినా అర్థం చేసుకోరు. మొట్టమొదట
ఆత్మ మరియు పరమాత్మ గురించి అర్థం చేయించాలి, ఆత్మలో 84 జన్మల పాత్ర ఎలా నిండి ఉంది
అన్నది అర్థం చేయించాలి, అది అవినాశీ పాత్ర. అది ఎప్పటికీ మారదు, డ్రామాలో నిశ్చితమై
ఉంది. ఈ నిశ్చయము ఉన్నవారు ఎప్పుడూ చలించరు. చాలామంది చలించిపోతూ ఉంటారు. చివరిలో
ప్రపంచానికి నిప్పు అంటుకున్నప్పుడు అచలముగా అయిపోతారు. ఇప్పుడైతే చాలా యుక్తిగా
అర్థం చేయించాలి. మంచి-మంచి పిల్లలైతే సేవలో ఉంటారు, హృదయాన్ని అధిరోహించి ఉంటారు.
చాలా చురుకుగా ముందుకు వెళ్తూ ఉంటారు. చాలా కష్టపడతారు. వారికి సేవ పట్ల చాలా
అభిరుచి ఉంటుంది. ఎవరిలో ఏ గుణాలైతే ఉంటాయో, వాటిని బాబా వర్ణిస్తారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. సేవలో ఎముకలను ఇవ్వాలి, ఏ విషయములోనూ సంశయము కలగకూడదు. అందరికీ సేవతో సుఖము
ఇవ్వాలి, దుఃఖము ఇవ్వకూడదు.
2. నిశ్చయము యొక్క బలముతో మీ అవస్థను స్థిరముగా చేసుకోవాలి. ఏ శ్రీమతమైతే
లభిస్తుందో, అందులో కళ్యాణము ఇమిడి ఉంది, ఎందుకంటే తండ్రి బాధ్యులు, అందుకే
చింతించకూడదు.
వరదానము:-
యోగయుక్త స్థితి ద్వారా సూక్ష్మమైన మరియు కఠినమైన బంధనాలను
దాటి వేసే బంధనముక్త భవ
యోగయుక్తమైనవారి గుర్తు ఏమిటంటే - వారు బంధనముక్తులుగా
ఉంటారు. యోగయుక్తముగా అయ్యేందుకు అన్నింటికంటే పెద్ద అంతిమ బంధనము - స్వయాన్ని
తెలివైనవారిగా భావిస్తూ శ్రీమతాన్ని తమ స్వంత బుద్ధి యొక్క అద్భుతమని భావించడము అనగా
శ్రీమతములో తమ బుద్ధిని మిక్స్ చేయడము, దీనినే బుద్ధి యొక్క అభిమానమని అంటారు.
2-ఎప్పుడైనా ఎవరైనా ఈ బలహీనత ఉంది అని సూచన ఇచ్చినా లేక మనల్ని నిందించినా - ఒకవేళ
ఆ సమయములో ఏ కొంచెం వ్యర్థ సంకల్పాలు నడిచినా, అది కూడా బంధనమే. ఎప్పుడైతే ఈ
బంధనాలను దాటి గెలుపు-ఓటమి, నింద-స్తుతిలో సమాన స్థితిని తయారుచేసుకుంటారో, అప్పుడు
సంపూర్ణ బంధనముక్తులు అని అంటారు.
స్లోగన్:-
ముందు
ఆలోచించడము, ఆ తర్వాత చేయడము - ఇదే జ్ఞానయుక్త ఆత్మల గుణము.
అవ్యక్త ప్రేరణలు -
‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’
ఏ విధముగా ఏమీ తెలియని
చిన్న బాలుడు ఏదైనా నష్టము కలిగించే వస్తువును ఆటబొమ్మగా భావించి తీసుకుంటే ఆ
బాలుడికి ఏదో ఒకటి ఇచ్చి దాని నుండి విడిపించాల్సి వస్తుందో, అదే విధముగా ఎవరైతే
అల్పకాలికమైన పేరు-ప్రతిష్టలను కోరుకుంటారో మరియు అల్పకాలికమైన కోరికలను
పెట్టుకుంటారో, వారికి గౌరవాన్ని ఇచ్చి స్వయం నిర్మానచిత్తులుగా అవ్వండి. ఆ సమయములో
ఒకవేళ వారికి శిక్షణను ఇచ్చినట్లయితే ఘర్షణ మొదలవుతుంది, అందుకే అటువంటి సమయములో
యుక్తియుక్తమైన నడవడిక ద్వారా, పరోపకారులుగా అయ్యి క్షమా భావముతో గౌరవాన్ని ఇచ్చి
ముందుగా వారిని వివేకవంతులుగా చేయండి, తద్వారా ఈ విషయము నష్టపరిచేటువంటిది అని వారు
స్వయమే అర్థం చేసుకుంటారు.
| | | |