ఓంశాంతి
స్మృతిలోనైతే పిల్లలు కూర్చునే ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావించాలి, దేహము కూడా ఉంది.
దేహము లేకుండా కూర్చున్నారని కాదు. కానీ తండ్రి అంటున్నారు, దేహాభిమానాన్ని వదిలి
దేహీ-అభిమానులుగా అయి కూర్చోండి. దేహీ-అభిమానము శుద్ధమైనది, దేహాభిమానము అశుద్ధమైనది.
దేహీ-అభిమానులుగా అవ్వడముతోనే మనము శుద్ధముగా, పవిత్రముగా అవుతున్నామని మీకు తెలుసు.
దేహాభిమానులుగా అవ్వడముతో అశుద్ధముగా, అపవిత్రముగా అయిపోయాము. ఓ పతిత-పావనా రండి అని
పిలుస్తారు కూడా. పావన ప్రపంచము ఉండేది. ఇప్పుడు అది పతితముగా ఉంది, మళ్ళీ పావన
ప్రపంచము తప్పకుండా వస్తుంది. సృష్టి చక్రము తిరుగుతుంది. ఎవరైతే ఈ సృష్టి చక్రము
గురించి తెలుసుకుంటారో, వారిని స్వదర్శన చక్రధారులని అంటారు. మీలోని ప్రతి ఒక్కరూ
స్వదర్శన చక్రధారులు. స్వయం ఆత్మకు సృష్టి చక్రము యొక్క జ్ఞానము లభించింది.
జ్ఞానాన్ని ఎవరు ఇచ్చారు? తప్పకుండా వారు కూడా స్వదర్శన చక్రధారియే అయి ఉంటారు.
తండ్రి తప్ప ఇతర మనుష్యులెవ్వరూ నేర్పించలేరు. తండ్రియైన పరమ ఆత్మయే పిల్లలకు
నేర్పిస్తారు. వారు అంటారు - పిల్లలూ, మీరు దేహీ-అభిమానులుగా అవ్వండి. సత్యయుగములో
ఈ జ్ఞానాన్ని లేక శిక్షణను ఇవ్వవలసిన అవసరము ఉండదు. అలాగని అక్కడ భక్తి కూడా ఉండదు.
జ్ఞానముతో వారసత్వము లభిస్తుంది. ఈ విధముగా మీరు శ్రేష్ఠముగా అవుతారు అని తండ్రి
శ్రీమతాన్ని ఇస్తారు. మీరు శ్మశానవాసులుగా ఉండేవారని, ఇప్పుడు తండ్రి శ్రేష్ఠమైన
దేవతలుగా తయారుచేస్తున్నారని మీకు తెలుసు. ఈ పాత ప్రపంచము శ్మశానముగా అవ్వనున్నది.
మృత్యులోకాన్ని శ్మశానమనే అంటారు. పరిస్తాన్ అని కొత్త ప్రపంచాన్ని అంటారు. డ్రామా
రహస్యాన్ని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ మొత్తం సృష్టిని అడవి అని అంటారు.
బాబా అర్థం చేయించారు, మొత్తం సృష్టిపై ఈ సమయములో రావణ రాజ్యము ఉంది. దసరాను కూడా
జరుపుకుంటారు, ఎంత సంతోషపడతారు. తండ్రి అంటున్నారు, పిల్లలందరినీ దుఃఖము నుండి
విడిపించడానికి నేను కూడా రావణుడి పాత ప్రపంచములోకి రావలసి ఉంటుంది. ఒక కథను
వినిపిస్తారు. నీకు మొదట సుఖము కావాలా లేదా దుఃఖము కావాలా అని ఎవరో అడిగారు. అప్పుడు
సుఖము కావాలని అన్నారు. సుఖములోకి వెళ్ళినట్లయితే అక్కడకు ఎటువంటి యమదూతలు
మొదలైనవారు రాలేరు. ఇది కూడా ఒక కథ. తండ్రి చెప్తున్నారు, సుఖధామములోకి ఎప్పుడూ
కాలుడు రాడు, అది అమరపురిగా అవుతుంది. మీరు మృత్యువుపై విజయము పొందుతారు. మీరు ఎంత
సర్వశక్తివంతులుగా అవుతారు. అక్కడ ఎప్పుడూ ఫలానావారు మరణించారు అని అనరు, అక్కడ
మరణమనే పేరే ఉండదు. ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. సర్పము కూడా కుబుసాన్ని
మారుస్తుంది కదా. మీరు కూడా పాత చర్మాన్ని వదిలి కొత్త చర్మములోకి అనగా కొత్త
శరీరములోకి వస్తారు. అక్కడ పంచ తత్వాలు కూడా సతోప్రధానముగా అవుతాయి. అన్ని వస్తువులు
సతోప్రధానముగా అయిపోతాయి. ప్రతి వస్తువు, ఫలాలు మొదలైనవి ది బెస్ట్ గా ఉంటాయి.
సత్యయుగాన్ని స్వర్గము అని అంటారు. అక్కడ చాలా ధనవంతులుగా ఉండేవారు. వారు ఉన్నంత
సుఖముగా, విశ్వానికి యజమానులుగా ఎవ్వరూ ఉండలేరు. మనమే అలా ఉండేవారమని ఇప్పుడు మీకు
తెలుసు, కావున ఎంత సంతోషము ఉండాలి. ఒక్కొక్కరినీ దేవతలుగా తయారుచేయాలి, అనేకుల
కళ్యాణము చేయాలి. మీరు చాలా షావుకారులుగా అవుతారు. వారంతా పేదవారు. ఎంతవరకైతే మీ
చేతికి వారి చేతిని అందించరో అంతవరకు వారు స్వర్గవాసులుగా అవ్వలేరు. తండ్రి చేయి
అయితే అందరికీ లభించదు. తండ్రి చేయి మీకు లభిస్తుంది. మీ చేయి ఇతరులకు లభిస్తుంది.
ఆ తర్వాత వారి చేతులు మరికొంతమందికి లభిస్తాయి. ఏ విధముగా ఈత ఈదేవారు ఒక్కొక్కరిని
తీరానికి చేరుస్తారో, అలా మీరు కూడా మాస్టర్ నావికులు. అనేకమంది నావికులుగా
అవుతున్నారు. మీ వ్యాపారమే ఇది. మనము ప్రతి ఒక్కరి నావను తీరానికి చేర్చే మార్గాన్ని
తెలియజేయాలి. నావికుడి పిల్లలు నావికులుగా అవ్వాలి. పేరు ఎంత సాధారణముగా ఉంది - తోట
యజమాని, నావికుడు. ఇప్పుడు ప్రాక్టికల్ గా మీరు చూస్తున్నారు. మీరు పరిస్తాన్ ను
స్థాపన చేస్తున్నారు. మీ స్మృతిచిహ్నము ఎదురుగా నిలబడి ఉంది. కింద రాజయోగ తపస్య,
పైన రాజ్యము కనిపిస్తుంది. దిల్వాడా అన్న పేరు కూడా చాలా బాగుంది. తండ్రి అందరి
హృదయాలను గెలుచుకుంటారు. అందరికీ సద్గతిని ఇస్తారు. హృదయాన్ని గెలుచుకునేవారు ఎవరు,
ఇది ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మాకు కూడా తండ్రి శివబాబా. అందరి హృదయాలను
గెలుచుకునేవారు అనంతమైన తండ్రియే అవుతారు. వారు తత్వాలు మొదలైనవాటన్నిటి కళ్యాణము
చేస్తారు, ఇది కూడా పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఇతర ధర్మాల వారి శాస్త్రాలు
మొదలైనవి నిలిచి ఉంటాయి. మీకు జ్ఞానమనేది సంగమయుగములోనే లభిస్తుంది, వినాశనమైన
తర్వాత ఇక ఏ శాస్త్రాలు ఉండవు. శాస్త్రాలు భక్తి మార్గానికి గుర్తు. ఇది జ్ఞానము.
తేడా చూసారు కదా. భక్తి అపారముగా ఉంది, దేవీలు మొదలైనవారి పూజల కోసం ఎంత ఖర్చు
చేస్తారు. తండ్రి అంటున్నారు, వీటి ద్వారా అల్పకాలికమైన సుఖముంటుంది. ఎటువంటి భావన
పెట్టుకుంటారో, అది నెరవేరుతుంది. దేవీలను అలంకరిస్తూ, అలంకరిస్తూ ఉండగా ఎవరికైనా
సాక్షాత్కారము జరిగితే, ఇక చాలా సంతోషిస్తారు. కానీ లాభమేమీ ఉండదు. మీరా పేరు కూడా
మహిమ చేయబడింది. భక్తుల మాల ఉంది కదా. స్త్రీలలో మీరాను, పురుషులలో నారదుడిని భక్త
శిరోమణులుగా భావిస్తారు. పిల్లలైన మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. మాలలోని పూసలైతే
చాలామంది ఉన్నారు. పైన ఉన్న పుష్పము బాబా, ఆ తర్వాత జంట పూసలు. ఆ పుష్పానికి అందరూ
నమస్కరిస్తారు. ఒక్కొక్క పూసకు నమస్కరిస్తారు. రుద్ర యజ్ఞాన్ని రచించినప్పుడు అందులో
కూడా ఎక్కువ పూజ శివునికి చేస్తారు. సాలిగ్రామాలకు అంత పూజ చేయరు. మొత్తం ధ్యాస అంతా
శివుని వైపే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మీరు పావనముగా అవుతున్నారు కదా, ఇలా శివబాబా
ద్వారానే సాలిగ్రామాలు ఇంత చురుకైనవారిగా అయ్యారు. పతిత-పావనుడైన తండ్రి యొక్క
పిల్లలైన మీరు కూడా మాస్టర్ పతిత-పావనులు. ఒకవేళ ఎవ్వరికీ మార్గాన్ని తెలియజేయకపోతే
చాలా చిన్న పదవి లభిస్తుంది. అయినా తండ్రినైతే కలుసుకున్నారు కదా, అది కూడా
తక్కువేమీ కాదు. అందరికీ తండ్రి వారొక్కరే. శ్రీకృష్ణుని కోసం ఈ విధముగా అనరు.
శ్రీకృష్ణుడు ఎవరికి తండ్రి అవుతారు? శ్రీకృష్ణుడిని తండ్రి అని అనరు. పిల్లలను
తండ్రి అని అనలేరు. వివాహము అయిన తర్వాత, బిడ్డ జన్మించినప్పుడు తండ్రి అని అంటారు.
ఆ బిడ్డే వారిని తండ్రి అని సంబోధిస్తాడు. ఇతరులెవ్వరూ ఇలా అనలేరు. ఇకపోతే
వృద్ధులనెవరినైనా బాపూజీ అని అంటారు. వీరు (శివబాబా) అయితే అందరికీ తండ్రి. బ్రదర్
హుడ్ (సోదర భావము) అని పాడుతారు కూడా. ఈశ్వరుడిని సర్వవ్యాపి అన్నట్లయితే ఫాదర్ హుడ్
(పితృ భావము) అవుతుంది.
పిల్లలైన మీరు పెద్ద-పెద్ద సభలలో అర్థం చేయించవలసి ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా
భాషణ చేసేందుకు వెళ్ళవలసి ఉంటే, ఏ టాపిక్ పైనైతే భాషణ చేయవలసి ఉంటుందో, దానిపై
విచార సాగర మంథనము చేసి వ్రాసుకోవాలి. తండ్రి అయితే విచార సాగర మంథనము చేయనవసరము
లేదు. కల్పక్రితము ఏదైతే వినిపించారో, దానిని వినిపించి వెళ్ళిపోతారు. మీరైతే టాపిక్
పై అర్థం చేయించాలి. మొదట వ్రాసుకుని, ఆ తర్వాత చదువుకోవాలి. భాషణ చేసిన తర్వాత,
ఫలానా పాయింట్లు చెప్పలేదే అని గుర్తుకొస్తుంది. ఇవి అర్థం చేయించి ఉంటే బాగుండేది
అని అనిపిస్తుంది. ఎన్నో కొన్ని పాయింట్లు మర్చిపోతారు, ఇలా జరుగుతుంటుంది. సోదరీ,
సోదరులారా, ఆత్మాభిమానులుగా అయి కూర్చోండి అని మొట్టమొదట ఇలా చెప్పవలసి ఉంటుంది.
ఇదైతే ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇటువంటి సమాచారాన్ని బాబాకు ఎవ్వరూ వ్రాయరు. మొట్టమొదట
అందరికీ చెప్పాలి - ఆత్మాభిమానులుగా అయి కూర్చోండి. ఆత్మలైన మీరు అవినాశీ. ఇప్పుడు
తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నారు. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి
చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. దేహధారులెవ్వరినీ స్మృతి చేయకండి. స్వయాన్ని
ఆత్మగా భావించండి, మనము అక్కడి నివాసులము. మన బాబా కళ్యాణకారి అయిన శివుడు,
ఆత్మలమైన మనము వారి పిల్లలము. తండ్రి అంటారు, ఆత్మాభిమానులుగా అవ్వండి. నేను ఒక
ఆత్మను. తండ్రి స్మృతితో వికర్మలు వినాశనమవుతాయి. గంగా స్నానాలు మొదలైనవాటితో
వికర్మలు వినాశనమవ్వవు. మీరు నన్ను స్మృతి చేయండి అని తండ్రి యొక్క డైరెక్షన్ ఉంది.
వారు గీతను చదువుతారు, యదా యదాహి ధర్మస్య... అని అంటారు కానీ అర్థమేమీ తెలియదు. బాబా
సేవ కొరకు సలహాలు ఇస్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ శివబాబాను స్మృతి చేయండి
అని శివబాబా చెప్తున్నారు. వారు శ్రీకృష్ణుడు చెప్పారని భావిస్తారు కానీ మీరు -
శివబాబా పిల్లలైన మనకు వారిని స్మృతి చేయమని చెప్తున్నారని అంటారు. ఎంతగా నన్ను
స్మృతి చేస్తారో, అంతగా సతోప్రధానముగా అయి ఉన్నత పదవిని పొందుతారు. లక్ష్యము,
ఉద్దేశ్యము కూడా ఎదురుగా ఉంది. పురుషార్థముతో ఉన్నత పదవిని పొందాలి. అటువైపు వారు
వారి-వారి ధర్మాలలో ఉన్నత పదవిని పొందుతారు. మనము ఇతర ధర్మాలలోకి వెళ్ళము. వారు
రావడమే వెనుక వస్తారు. వారి కన్నా ముందు స్వర్గముండేదని వారికి కూడా తెలుసు. భారత్
అన్నిటికన్నా ప్రాచీనమైనది. కానీ అలా ఎప్పుడుండేది, అది ఎవ్వరికీ తెలియదు. వారిని
భగవాన్, భగవతి అని కూడా అంటారు, కానీ తండ్రి అంటారు, వారిని భగవాన్-భగవతి అని అనలేరు.
భగవంతుడిని నేను ఒక్కడిని మాత్రమే. మనము బ్రాహ్మణులము. తండ్రినైతే బ్రాహ్మణుడు అని
అనరు. వారు ఉన్నతోన్నతమైన భగవంతుడు, వారి శరీరానికి పేరు లేదు. మీ శరీరాలన్నిటికీ
పేర్లు ఉంటాయి. ఆత్మ అయితే ఆత్మే. వారు కూడా పరమ ఆత్మ. ఆ ఆత్మ పేరు శివ, వారు
నిరాకారుడు. వారికి సూక్ష్మ శరీరము కానీ, స్థూల శరీరము కానీ లేదు. అలాగని వారికి
ఆకారము లేదని కాదు. ఎవరికైతే పేరు ఉందో, వారికి ఆకారము కూడా తప్పకుండా ఉంటుంది.
నామ-రూపాలు లేని వస్తువేదీ ఉండదు. తండ్రియైన పరమాత్మను నామ-రూపాలకు అతీతమైనవారని
అనడం ఎంత పెద్ద అజ్ఞానము. తండ్రి కూడా నామ-రూపాలకు అతీతమైనవారైతే, పిల్లలు కూడా
నామ-రూపాలకు అతీతమైనవారైతే, ఇక సృష్టియే ఉండదు. మీరు ఇప్పుడు బాగా అర్థం చేయించవచ్చు.
గురువులు చివరలో అర్థం చేసుకుంటారు. ప్రస్తుతము వారి రాజ్యము ఉంది.
మీరు ఇప్పుడు డబల్ అహింసకులుగా అవుతారు. అహింసా పరమో దేవీ-దేవతా ధర్మము డబల్
అహింసాయుత ధర్మముగా గాయనం చేయబడింది. ఎవరిపైనైనా చేయి చేసుకోవడం, దుఃఖమునివ్వడం, ఇది
కూడా హింస అయినట్లు. మనసా-వాచా-కర్మణా ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు అని తండ్రి ప్రతి
రోజూ అర్థం చేయిస్తారు. మనసులో దుఃఖము తప్పకుండా వస్తుంది. సత్యయుగములో మనసులో కూడా
రాదు. ఇక్కడైతే మనసా-వాచా-కర్మణా వస్తుంది. ఈ పదాలను మీరు అక్కడ వినను కూడా వినరు.
అలాగే అక్కడ సత్సంగాలు మొదలైనవేవీ ఉండవు. సత్యమైనవారిగా తయారయ్యేందుకని సత్యమైనవారి
ద్వారా సత్సంగము జరుగుతుంది. సత్యమైనవారు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి కూర్చుని
నరుని నుండి నారాయణునిగా తయారయ్యే కథను వినిపిస్తున్నారు, దీని ద్వారా మీరు
నారాయణునిగా అవుతారు. ఆ తర్వాత భక్తి మార్గములో సత్యనారాయణుని కథను చాలా ప్రేమగా
వింటారు. మీ స్మృతిచిహ్నమైన దిల్వాడా మందిరము ఎంత బాగుందో చూడండి. తప్పకుండా
సంగమయుగములో వారు హృదయాన్ని గెలుచుకుని ఉంటారు. ఆదిదేవ్, ఆదిదేవి మరియు పిల్లలు
కూర్చుని ఉన్నారు. ఇది యథార్థమైన స్మృతిచిహ్నము. దాని చరిత్ర-భౌగోళికాల గురించి మీకు
తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అది మీ స్మృతిచిహ్నమే. ఇది కూడా అద్భుతము.
లక్ష్మీ-నారాయణుల మందిరములోకి వెళ్ళినప్పుడు, మేము ఇలా తయారవుతున్నామని మీరంటారు.
క్రైస్ట్ కూడా ఇక్కడే ఉన్నారు. క్రైస్ట్ బికారి రూపములో ఉన్నారని చాలామంది అంటూ
ఉంటారు. తమోప్రధానముగా ఉన్నారంటే మరి బికారి అన్నట్లే కదా. పునర్జన్మలనైతే తప్పకుండా
తీసుకుంటారు కదా. శ్రీకృష్ణుడు రాకుమారునిగా ఉండేవారు, ఇప్పుడు బికారిగా ఉన్నారు.
తెల్లనివారు మరియు నల్లనివారు. భారత్ ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనేది
మీకు కూడా తెలుసు. తండ్రి ఉన్నదే పేదల పెన్నిధి. మనుష్యులు ఈశ్వరార్థము
దాన-పుణ్యాలను కూడా పేదవారికే చేస్తారు. చాలామందికి ధాన్యము లభించదు. మున్ముందు
గొప్ప-గొప్ప షావుకారులకు కూడా ధాన్యము లభించకపోవడాన్ని మీరు చూస్తారు. ప్రతి ఊరులోనూ
షావుకారులు ఉంటారు కదా, వారిని దొంగలు దోచుకుంటారు. పదవులలో తేడా అయితే ఉంటుంది కదా.
తండ్రి అంటున్నారు, పురుషార్థము ఎలా చేయండంటే నంబరువన్ లోకి వెళ్ళాలి. టీచర్ పని
సావధానపరచడము. పాస్ విత్ ఆనర్ గా అవ్వాలి. ఇది అనంతమైన పాఠశాల. ఇది రాజ్యాన్ని
స్థాపన చేసేందుకు రాజయోగము. అయినా కానీ పాత ప్రపంచము వినాశనమవ్వాలి. లేకపోతే రాజ్యము
ఎక్కడ చేస్తారు. ఇది ఉన్నదే పతిత ధరణి.
గంగను పతిత-పావని అని మనుష్యులు అంటారు. తండ్రి అంటారు, ఈ సమయములో పంచ తత్వాలన్నీ
తమోప్రధానముగా, పతితముగా ఉన్నాయి. మొత్తం మురికి, చెత్త అంతా అందులోకి వెళ్ళి
కలుస్తుంది. చేపలు మొదలైనవి కూడా అందులో ఉంటాయి. నీరు కూడా ఒక ప్రపంచము వలె ఉంటుంది.
నీటిలో ఎన్ని జీవులు ఉంటాయి. పెద్ద-పెద్ద సముద్రాల నుండి కూడా ఎంత ఆహారము లభిస్తుంది.
కావున అది కూడా ఒక ఊరు వంటిదే కదా. ఒక ఊరును మరి పతిత-పావని అని ఎలా అంటారు. తండ్రి
అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, పతిత-పావనుడు ఒక్క తండ్రే. మీ
ఆత్మ మరియు శరీరము పతితముగా అయిపోయాయి, ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే పావనముగా
అవుతారు. మీరు విశ్వానికి యజమానులుగా, సుందరమైనవారిగా అవుతారు. అక్కడ ఇతర ఖండాలేవీ
ఉండవు. భారత్ దే ఆల్రౌండ్ పాత్ర. మీరంతా ఆల్రౌండర్లు. నాటకములో పాత్రధారులు
నంబరువారుగా వస్తూ-వెళ్తూ ఉంటారు. ఇది కూడా అటువంటిదే. బాబా అంటున్నారు, మిమ్మల్ని
భగవంతుడు చదివిస్తున్నారని మీరు భావించండి. మనము పతిత-పావనుడైన గాడ్ ఫాదర్లీ
విద్యార్థులము, ఇందులో అంతా వచ్చేస్తుంది. వారు పతిత-పావనుడు కూడా అయినట్లు, గురువు,
టీచర్ కూడా అయినట్లు, తండ్రి కూడా అయినట్లు. అది కూడా వారు నిరాకారుడు. ఇది నిరాకారీ
గాడ్ ఫాదర్లీ వరల్డ్ యూనివర్శిటీ. ఎంత మంచి పేరు. ఈశ్వరునికి ఎంత మహిమ చేస్తారు.
వారు బిందువు అని విన్నప్పుడు ఆశ్చర్యము కలుగుతుంది. ఈశ్వరుని మహిమను ఇంతగా చేస్తారు,
కానీ వారు ఎలా ఉన్నారు! బిందువు. వారిలో పాత్ర ఎంతగా నిండి ఉంది. ఇప్పుడు తండ్రి
అంటున్నారు, దేహము ఉంటూ కూడా, గృహస్థ వ్యవహారములో ఉంటూ కూడా నన్నొక్కరినే స్మృతి
చేయండి. భక్తి మార్గములో ఏదైతే నవ విధ భక్తిని చేస్తారో, దానిని సతోప్రధానమైన నవ
విధ భక్తి అని అంటారు. ఆ భక్తి ఎంత తీవ్రమైన భక్తిగా ఉంటుంది. ఇప్పుడు అదే విధముగా
స్మృతిలో తీవ్ర వేగము కావాలి. తీవ్రమైన స్మృతి చేసేవారి పేరే ఉన్నతముగా అవుతుంది.
వారు విజయమాలలోని మణులుగా అవుతారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.