03-06-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలు - ఇప్పుడు మీరు కొత్త సంబంధములోకి వెళ్తున్నారు, అందుకే ఇక్కడి కర్మబంధనాల సంబంధాలను మరచి, కర్మాతీతులుగా అయ్యే పురుషార్థము చేయండి’’

ప్రశ్న:-
తండ్రి ఏ పిల్లలను వాహ్-వాహ్ అని అంటారు? అందరికన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారు?

జవాబు:-
బాబా పేద పిల్లలను వాహ్-వాహ్ అని అంటారు, వాహ్ పేదరికము వాహ్! ప్రశాంతముగా రెండు రొట్టెలు తినాలి, లోభము ఉండకూడదు. పేద పిల్లలు తండ్రిని ప్రేమగా స్మృతి చేస్తారు. బాబా చదువుకోని పిల్లలను చూసి సంతోషిస్తారు ఎందుకంటే వారికి చదువుకున్నది మర్చిపోయే శ్రమ చేయవలసిన అవసరము ఉండదు.

ఓంశాంతి
ఇప్పుడు తండ్రికి ప్రతిరోజూ పిల్లలకు స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్పవలసిన అవసరము ఉండదు. ఆత్మాభిమానీ భవ అన్నా లేక దేహీ-అభిమానీ భవ అన్నా, ఈ పదాల అర్థమైతే అదే కదా. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలోనే 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఒక శరీరము తీసుకుంటారు, పాత్రను అభినయిస్తారు, తర్వాత శరీరము సమాప్తమైపోతుంది. ఆత్మ అయితే అవినాశీ. పిల్లలైన మీకు ఈ జ్ఞానము ఇప్పుడే లభిస్తుంది, ఇంకెవ్వరికీ ఈ విషయాల గురించి తెలియదు. ఇప్పుడు తండ్రి అంటారు - మీరు ప్రయత్నించి ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేయండి. వ్యాపార- వ్యవహారాలలో నిమగ్నమైపోయినట్లయితే స్మృతి అంతగా నిలవదు. గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానముగా పవిత్రముగా అవ్వాలి మరియు ఎంత వీలైతే అంత నన్ను స్మృతి చేయండి. అలాగని తాము నేష్ఠలో కూర్చోవాలని కాదు. నేష్ఠ అన్న పదము కూడా తప్పు. వాస్తవానికి అది స్మృతి. ఎక్కడ కూర్చున్నా సరే తండ్రిని స్మృతి చేయండి. మాయ తుఫానులైతే ఎన్నో వస్తాయి. ఒక్కొక్కరికీ ఒక్కోటి గుర్తుకువస్తూ ఉంటుంది. తుఫానులైతే తప్పకుండా వస్తాయి, ఆ సమయములో అవి రాకుండా ఉండేందుకు వాటిని అంతము చేయవలసి ఉంటుంది. ఇక్కడ కూర్చుని ఉండగా కూడా మాయ చాలా విసిగిస్తుంది. ఇదే యుద్ధము. ఎంతగా తేలికగా ఉంటారో అంతగా బంధనాలు తక్కువ అవుతాయి. మొదటైతే ఆత్మ నిర్భంధనముగా ఉంటుంది, తర్వాత జన్మ తీసుకున్నప్పుడు తల్లి-తండ్రుల వైపుకు బుద్ధి వెళ్తుంది, ఆ తర్వాత పత్నిని దత్తత తీసుకుంటారు. ఏవైతే అప్పటివరకు ఎదురుగా లేవో, అవి ఎదురుగా వచ్చేస్తాయి. ఆ తర్వాత పిల్లలు జన్మిస్తే ఇక వారి స్మృతి పెరుగుతుంది. ఇప్పుడు మీరందరూ ఈ విషయాలను మర్చిపోవాలి, ఒక్క తండ్రినే స్మృతి చేయాలి, అందుకే తండ్రి మహిమ ఉంది. మీకు తల్లి-తండ్రి మొదలైన సంబంధాలన్నీ వారితోనే, వారినే స్మృతి చేయండి. వారు మీకు భవిష్యత్తు కొరకు అన్నీ కొత్తవే ఇస్తారు. కొత్త సంబంధాలలోకి తీసుకువెళ్తారు. సంబంధాలైతే అక్కడ కూడా ఉంటాయి కదా. అలాగని ఏదో ప్రళయము జరిగిపోతుందని కాదు. మీరు ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు. ఎవరైతే చాలా మంచివారు ఉంటారో, వారు తప్పకుండా ఉన్నతమైన కులములో జన్మ తీసుకుంటారు. మీరు భవిష్య 21 జన్మల కోసమే చదువుకుంటారు. చదువు పూర్తవగానే ప్రారబ్ధము మొదలవుతుంది. స్కూల్లో చదువుకుని తర్వాత క్లాస్ కు ట్రాన్స్ఫర్ అవుతారు కదా. మీరు కూడా శాంతిధామము మరియు సుఖధామములోకి ట్రాన్స్ఫర్ అవ్వనున్నారు. ఈ ఛీ-ఛీ ప్రపంచము నుండి విముక్తులైపోతారు. దీని పేరే నరకము. సత్యయుగాన్ని స్వర్గము అని అంటారు. ఇక్కడ మనుష్యులు ఎంత ఘోర అంధకారములో ఉన్నారు. ధనవంతులు ఎవరైతే ఉంటారో వారు - మాకు స్వర్గము ఇక్కడే ఉంది అని భావిస్తారు. స్వర్గము అనేది కొత్త ప్రపంచములోనే ఉంటుంది. ఈ పాత ప్రపంచమైతే వినాశనమవ్వనున్నది. ఎవరైతే కర్మాతీత అవస్థ కలవారు ఉంటారో, వారు ధర్మరాజుపురిలో శిక్షలేమీ అనుభవించరు. స్వర్గములోనైతే శిక్షలు ఉండనే ఉండవు. అక్కడ గర్భము కూడా మహలు వలె ఉంటుంది. దుఃఖపు విషయమేదీ ఉండదు. ఇక్కడైతే గర్భ జైలు ఉంటుంది, అందులో శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. మీరు ఎన్ని సార్లు స్వర్గవాసులుగా అవుతారు అనేది గుర్తు చేసుకున్నా కూడా మొత్తము చక్రమంతా గుర్తుంటుంది. ఈ ఒక్క విషయమే లక్షల రూపాయల విలువ చేస్తుంది. ఇది మర్చిపోవడము వలన, దేహాభిమానములోకి రావడము వలన మాయ నష్టము కలిగిస్తుంది. ఇదే శ్రమతో కూడుకున్న పని. మరి శ్రమ లేకుండా ఉన్నత పదవిని పొందలేరు. బాబా, మేము చదువురానివారము, మాకు ఏమీ తెలియదు అని బాబాతో అంటారు. బాబా అయితే సంతోషిస్తారు, ఎందుకంటే ఇక్కడ చదువుకున్నదంతా మర్చిపోవాలి. శరీర నిర్వహణ మొదలైనవాటి కోసమని చెప్పి కొద్ది సమయము చదువుకోవాలి, అంతే. ఇదంతా అంతమైపోనున్నదని మీకు తెలుసు కదా. ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేయాలి మరియు రొట్టె ముక్కను సంతోషముగా తినాలి. ఈ సమయములోని పేదరికానికి వాహ్. ప్రశాంతముగా రొట్టెముక్కను తినాలి, లోభము ఉండకూడదు. ఈ రోజుల్లో ధాన్యము ఎక్కడ లభిస్తుంది. పంచదార మొదలైనవి కూడా మెల్లమెల్లగా ఇక లభించనే లభించవు. మీరు ఈశ్వరీయ సేవ చేస్తున్నందుకు మీకు ప్రభుత్వము ఇస్తుందనేమీ కాదు. వారికి అసలు ఏమీ తెలియదు. అయితే, ప్రభుత్వానికి ఈ విధంగా అర్థం చేయించమని పిల్లలకు చెప్పడం జరుగుతుంది - మేమందరమూ కలిసి తల్లి-తండ్రి వద్దకు వెళ్తాము, వారు పిల్లల కోసం టోలీ పంపించవలసి ఉంటుంది అని. ఇక్కడ అసలు ఏమీ లేదు అని వాళ్ళు స్పష్టముగా చెప్పేస్తారు. తప్పదు అన్నట్లు కొద్దిగా ఇస్తారు. ఉదాహరణకు ఎవరైనా షావుకార్లు ఉంటే ఫకీరులకు పిడికిలి నిండుగా ఇస్తారు, పేదవాళ్ళు అయితే ఏదో కొద్దిగా ఇస్తారు. పంచదార మొదలైనవి రావచ్చు కానీ పిల్లల యోగము తగ్గిపోతుంది. స్మృతి ఉండని కారణముగా, దేహాభిమానములోకి వచ్చిన కారణముగా ఏ పనులూ జరగవు. ఈ పనులు ఎంతగానైతే యోగము ద్వారా జరుగుతాయో అంతగా చదువు ద్వారా జరగవు. యోగము చాలా తక్కువగా ఉంది. మాయ స్మృతిని దూరం చేసేస్తుంది. శక్తివంతులను ఇంకా బాగా పట్టుకుంటుంది. మంచి-మంచి ఫస్ట్ క్లాస్ పిల్లలపై కూడా గ్రహచారము కూర్చుంటుంది. గ్రహచారము కూర్చోవడానికి ముఖ్యమైన కారణము యోగము లోపించడము. గ్రహచారము కారణముగానే నామ-రూపాలలో చిక్కుకుని మరణిస్తారు. ఇది గొప్ప గమ్యము. ఒకవేళ సత్యమైన గమ్యాన్ని చేరుకోవాలంటే, స్మృతిలో ఉండవలసి ఉంటుంది.

తండ్రి అంటారు - ధ్యానము కంటే కూడా జ్ఞానము మంచిది. జ్ఞానము కంటే స్మృతి మంచిది. ధ్యానములోకి ఎక్కువగా వెళ్ళడము వలన మాయ భూతాలు ప్రవేశిస్తాయి. అనవసరముగా ధ్యానములోకి వెళ్ళేవారు చాలా మంది ఉన్నారు. వారు ఏమేమో మాట్లాడుతారు, వారిని నమ్మకండి. జ్ఞానమైతే బాబా మురళిలో లభిస్తూ ఉంటుంది. తండ్రి అప్రమత్తము చేస్తూ ఉంటారు. ధ్యానము ఎందుకూ ఉపయోగపడదు. అందులో మాయ ఎంతగానో ప్రవేశిస్తుంది. అహంకారము వచ్చేస్తుంది. జ్ఞానమైతే అందరికీ లభిస్తూ ఉంటుంది. జ్ఞానాన్ని ఇచ్చేవారు శివబాబా. మమ్మాకు కూడా ఇక్కడి నుండే జ్ఞానము లభించేది కదా. ఆమెకు కూడా మన్మనాభవ అనే చెప్తారు. తండ్రిని స్మృతి చేయండి, దైవీ గుణాలను ధారణ చేయండి. స్వయాన్ని చూసుకోవాలి - నేను దైవీ గుణాలను ధారణ చేస్తున్నానా? ఇక్కడే దైవీ గుణాలను ధారణ చేయాలి. కొందరిని చూడండి, ఇప్పుడే ఫస్ట్ క్లాస్ అవస్థ ఉంటుంది, సంతోషముగా పని చేస్తారు, గంట తర్వాత క్రోధము అనే భూతము వస్తే, ఇక సమాప్తము. నేను ఈ పొరపాటు చేసాను అని తర్వాత గుర్తుకువస్తుంది. అప్పుడు మళ్ళీ బాగైపోతారు. ఇలా గంటల ఘడియారములా పదే-పదే మారిపోయేవారు బాబా వద్ద చాలా మంది ఉన్నారు - ఇప్పటికిప్పుడు చూస్తే చాలా మధురముగా ఉంటారు, అసలు ఇటువంటి పిల్లలపైనైతే బలిహారమైపోవాలి అని వాళ్ళ గురించి బాబా కూడా అంటారు, మళ్ళీ ఒక గంట తర్వాత చూస్తే ఏదో ఒక విషయములో డిస్టర్బ్ అయి ఉంటారు. క్రోధము వస్తే, ఇక చేసుకున్న సంపాదనంతా సమాప్తమైపోతుంది. ఇప్పుడిప్పుడే సంపాదన చేసుకుంటారు, ఇప్పుడిప్పుడే నష్టపోతారు. మొత్తం ఆధారమంతా స్మృతిపైనే ఉంది. జ్ఞానమైతే చాలా సహజము. చిన్న పిల్లవాడు కూడా అర్థం చేయించగలడు. కానీ నేను ఎవరిని, ఎలా ఉన్నాను అనేది యథార్థ రీతిలో తెలుసుకోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించడమంటే, చిన్న పిల్లలు ఈ విధంగా స్మృతి చేయలేరు. మనుష్యులకు మరణించే సమయములో భగవంతుడిని స్మృతి చేయండి అని చెప్పడం జరుగుతుంది. కానీ స్మృతి చేయలేకపోతారు ఎందుకంటే వారి గురించి యథార్థముగా ఎవరికీ తెలియదు. ఎవరూ తిరిగి వెళ్ళలేరు. అలాగే వికర్మలు కూడా వినాశనమవ్వవు. పరంపరగా ఋషులు, మునులు మొదలైనవారందరూ రచయిత మరియు రచనల గురించి మాకు తెలియదు అని అంటూ వచ్చారు. కానీ ఆ ఋషులు, మునులైతే సతోగుణము కలిగి ఉండేవారు. మరి ఈ నాటి తమోప్రధాన బుద్ధి కలవారు ఎలా తెలుసుకోగలరు. తండ్రి అంటారు, ఈ లక్ష్మీ-నారాయణులకు కూడా తెలియదు. రాజు-రాణులకే తెలియనప్పుడు ఇక ప్రజలకు ఎలా తెలుస్తుంది. ఎవరికీ తెలియదు. ఇప్పుడు కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీలో కూడా యథార్థ రీతిగా తెలిసినవారు కొందరే ఉన్నారు. బాబా, ఘడియ-ఘడియ మర్చిపోతున్నాము అని అంటారు. తండ్రి అంటారు - ఎక్కడికి వెళ్ళినా సరే, కేవలం తండ్రిని స్మృతి చేయండి. ఇది చాలా భారీ సంపాదన. మీరు 21 జన్మల కొరకు నిరోగులుగా అవుతారు. ఇటువంటి తండ్రిని అంతర్ముఖులుగా అయి స్మృతి చేయాలి కదా. కానీ మాయ మరపింపజేసి తుఫానులలోకి తీసుకువస్తుంది. ఇక్కడ అంతర్ముఖులుగా అయి విచార సాగర మంథనము చేయాలి. విచార సాగర మంథనము చేసే విషయము కూడా ఇప్పటికి సంబంధించినదే. ఇది పురుషోత్తములుగా అయ్యే సంగమయుగము. పిల్లలైన మీరు చూసారు కదా, విచిత్రము ఏమిటంటే - ఒకే ఇంటిలో మేము సంగమయుగవాసులము అని మీరు అంటారు, కానీ పత్ని మరియు పిల్లలు మొదలైనవారు కలియుగము వారిగా ఉంటారు. ఎంత తేడా ఉంది. తండ్రి చాలా సూక్ష్మమైన విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. ఇంటిలో ఉంటూ కూడా - నేను పుష్పములా తయారయ్యేందుకు పురుషార్థము చేస్తున్నాను అన్నది బుద్ధిలో ఉంటుంది. ఇవి అనుభవముతో కూడిన విషయాలు. ప్రాక్టికల్ గా శ్రమించాలి. స్మృతిలోనే శ్రమ ఉంది. ఒకే ఇంటిలో ఒకరు హంసలా ఉంటే, ఇంకొకరు కొంగలా ఉన్నారు. కొందరు చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటారు. వారికి ఎప్పుడూ వికారాలకు సంబంధించిన ఆలోచనలు కూడా రావు, కలిసి ఉంటూ కూడా పవిత్రముగా ఉంటారు, ధైర్యాన్ని చూపిస్తారు, కావున వారికి ఎంతటి ఉన్నత పదవి లభిస్తుంది. ఇటువంటి పిల్లలు కూడా ఉన్నారు కదా. కొందరిని చూడండి, వికారాల కోసం ఎంతగా కొట్లాడుతారు, గొడవపడతారు. సంకల్పములో కూడా ఎప్పుడూ అపవిత్రముగా అయ్యే ఆలోచన రానటువంటి అవస్థ కలిగి ఉండాలి. తండ్రి అన్ని రకాలుగా సలహా ఇస్తూ ఉంటారు. శ్రీశ్రీ యొక్క మతము ద్వారా మనము శ్రీలక్ష్మిగా, శ్రీనారాయణునిగా అవుతాము అని మీకు తెలుసు. శ్రీ అంటేనే శ్రేష్ఠము. సత్యయుగములో నంబరువన్ శ్రేష్ఠమైనవారు ఉంటారు. త్రేతాలో రెండు డిగ్రీలు తగ్గిపోతాయి. ఈ జ్ఞానము పిల్లలైన మీకు ఇప్పుడే లభిస్తుంది.

ఈ ఈశ్వరీయ సభ యొక్క నియమము ఏమిటంటే - ఎవరికైతే జ్ఞాన రత్నాల పట్ల గౌరవము ఉంటుందో, ఎవరైతే ఎప్పుడూ ఆవలింతలు తీయరో, అటువంటివారు ముందు కూర్చోవాలి. కొందరు పిల్లలైతే తండ్రి ఎదురుగా కూర్చుని కూడా కునికిపాట్లు పడుతుంటారు, ఆవలిస్తూ ఉంటారు. అటువంటివారు వెనుకకు వెళ్ళి కూర్చోవాలి. ఇది పిల్లల యొక్క ఈశ్వరీయ సభ. కానీ కొందరు బ్రాహ్మణీలు ఇటువంటి వారిని కూడా తీసుకువస్తారు. వాస్తవానికి తండ్రి నుండి ధనము లభిస్తుంది, ఒక్కొక్క వాక్యము లక్షల రూపాయల విలువ చేస్తుంది. జ్ఞానము సంగమములోనే లభిస్తుందని మీకు తెలుసు. మీరు అంటారు - బాబా, మేము అనంతమైన వారసత్వాన్ని తీసుకోవడానికి మళ్ళీ వచ్చాము. మధురాతి-మధురమైన పిల్లలకు బాబా పదే-పదే అర్థం చేయిస్తున్నారు - ఇది ఛీ-ఛీ ప్రపంచము. మీది అనంతమైన వైరాగ్యము. తండ్రి అంటారు - ఈ ప్రపంచములో మీరు ఏదైతే చూస్తున్నారో, అది రేపు ఉండనే ఉండదు. మందిరాలు మొదలైనవాటి నామ-రూపాలు కూడా ఉండవు. అక్కడ స్వర్గములో వాళ్ళకు పాత వస్తువులను చూడవలసిన అవసరము లేదు. ఇక్కడైతే పాత వస్తువులకు ఎంత విలువ ఉంది. వాస్తవానికి ఒక్క తండ్రికి తప్ప ఇతర ఏ వస్తువుకూ విలువ లేదు. తండ్రి అంటారు - నేను రాకపోతే మీరు రాజ్యము ఎలా తీసుకుంటారు. ఎవరికైతే తెలుసో వారే వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు, అందుకే కోట్లల్లో ఏ ఒక్కరో అని అంటారు. ఏ విషయములోనూ సంశయము రాకూడదు. భోగ్ మొదలైనవి కూడా ఆచారము వంటివి. వీటికి జ్ఞానము మరియు యోగముతో ఏ కనెక్షన్ లేదు. మీకు ఇంకే విషయముతోనూ సంబంధము లేదు. కేవలం రెండు విషయాలే ఉన్నాయి - అల్ఫ్ (భగవంతుడు) మరియు వారు ఇచ్చే రాజ్యాధికార వారసత్వము. అల్ఫ్ అని భగవంతుడినే అంటారు. వేలుతో కూడా అలా పైకి సైగ చేసి చూపిస్తారు కదా. ఆత్మ అలా సైగ చేసి చూపిస్తుంది కదా. తండ్రి అంటారు, భక్తి మార్గములో మీరు నన్ను స్మృతి చేస్తారు. మీరందరూ నా ప్రేయసులు. బాబా కల్ప-కల్పమూ వచ్చి మనుష్యమాత్రులందరినీ దుఃఖము నుండి విడిపించి శాంతిని మరియు సుఖాన్ని ఇస్తారని కూడా మీకు తెలుసు, అందుకే బాబా చెప్పారు - బోర్డ్ పై ఇలా వ్రాయండి - విశ్వములో శాంతిని అనంతమైన తండ్రి ఏ విధంగా స్థాపన చేస్తున్నారో వచ్చి అర్థం చేసుకోండి. ఒక్క క్షణములో 21 జన్మల కొరకు విశ్వానికి యజమానులుగా అవ్వాలంటే వచ్చి అర్థం చేసుకోండి. ఇంటి వద్ద బోర్డ్ పెట్టండి. మూడు అడుగుల నేలపై మీరు అతి పెద్ద హాస్పిటల్ ను, యూనివర్సిటీని తెరవవచ్చు. స్మృతి ద్వారా 21 జన్మల కొరకు నిరోగులుగా అవుతారు మరియు చదువు ద్వారా స్వర్గ రాజ్యాధికారము లభిస్తుంది. ప్రజలు కూడా - మేము స్వర్గానికి యజమానులము అని అంటారు. ఈ రోజు మనుష్యులకు సిగ్గుగా అనిపిస్తుంది ఎందుకంటే నరకవాసులుగా ఉన్నారు. మా తండ్రి స్వర్గస్థులయ్యారు అని వారు స్వయమే అంటారు, అంటే వాళ్ళు నరకవాసులు అన్నట్లే కదా! మరణించిన తర్వాత స్వర్గములోకి వెళ్తారు అని అంటారు. ఇది ఎంత సహజమైన విషయము. మంచి పనులు చేసినవారి గురించి - ఇతను ఎంతో మహాదానిగా ఉండేవారు, స్వర్గస్థుడయ్యారు అని విశేషముగా అంటారు. కానీ వాస్తవానికి ఎవరూ వెళ్ళరు. నాటకము ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు అందరూ స్టేజ్ పైకి వచ్చి నిలబడతారు. ఎప్పుడైతే పాత్రధారులందరూ ఇక్కడకు వచ్చేస్తారో, అప్పుడే యుద్ధము కూడా జరుగుతుంది, ఇక తిరిగి వెళ్తారు. శివుని ఊరేగింపు అని అంటారు కదా. శివబాబాతోపాటు ఆత్మలందరూ వెళ్తారు. ముఖ్యమైన విషయము ఏమిటంటే - ఇప్పుడు 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఈ చెప్పును వదిలేయాలి. ఏ విధంగా సర్పము పాత కుబుసాన్ని వదిలి కొత్త కుబుసము తీసుకుంటుందో అలా. మీరు కొత్త దేహాన్ని సత్యయుగములో తీసుకుంటారు. శ్రీకృష్ణుడు ఎంత సుందరమైనవాడు, అతనిలో ఎంత ఆకర్షణ ఉంటుంది. అతనిది ఫస్ట్ క్లాస్ శరీరము. మనమందరమూ అలానే తీసుకుంటాము. నేను నారాయణుని వలె అవుతాను అని అంటారు కదా. ఇది కుళ్ళిపోయిన ఛీ-ఛీ శరీరము. దీనిని వదిలి మనము కొత్త ప్రపంచములోకి వెళ్తాము. ఇది తలచుకున్నప్పుడు సంతోషము ఎందుకు ఉండదు. మేము నరుని నుండి నారాయణునిగా అవుతాము అని అంటారు కదా! ఈ సత్యనారాయణుని కథను మంచి రీతిలో అర్థం చేసుకోండి. ఏదైతే చెప్తారో అది చేసి చూపించండి. చెప్పడము, చేయడము ఒకటే అయి ఉండాలి. వ్యాపారాలు మొదలైనవి కూడా చేయండి. తండ్రి అంటారు - చేతులతో పని చేయండి, హృదయము తండ్రి స్మృతిలో ఉండాలి. ఎంతెంతగా ధారణ చేస్తారో అంతంతగా మీ వద్ద జ్ఞానము యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది, జ్ఞాన ధారణ ద్వారా మీరు ఎంతటి ధనవంతులుగా అవుతారు. ఇది ఆత్మిక జ్ఞానము. మీరు ఆత్మ, ఆత్మయే శరీరము ద్వారా మాట్లాడుతుంది, ఆత్మయే జ్ఞానాన్ని ఇస్తుంది, ఆత్మయే ధారణ చేస్తుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ పాత ప్రపంచము యొక్క పాత వస్తువులను చూస్తూ కూడా చూడకూడదు. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు చెప్పడము మరియు చేయడము సమానముగా ఉండాలి.

2. అవినాశీ జ్ఞాన రత్నాల పట్ల గౌరవము ఉంచాలి, ఇది చాలా గొప్ప సంపాదన, ఇందులో ఆవలింతలు లేక కునికిపాట్లు రాకూడదు. నామ-రూపాల గ్రహచారము నుండి రక్షించుకునేందుకు స్మృతిలో ఉండే పురుషార్థము చేయాలి.

వరదానము:-
తండ్రి ఛత్రఛాయ కింద ఉంటూ నాజూకు పరిస్థితులలో కూడా కమలపుష్ప సమానముగా అతీతముగా మరియు ప్రియముగా కండి

సంగమయుగములో ఎప్పుడైతే తండ్రి సేవాధారిగా అయ్యి వస్తారో, అప్పుడు ఛత్రఛాయ రూపములో సదా పిల్లల సేవను చేస్తారు. స్మృతి చేయగానే క్షణములో తోడు యొక్క అనుభవమవుతుంది. స్మృతి అనే ఈ ఛత్రఛాయ ఎటువంటి నాజూకు పరిస్థితుల్లోనైనా కమలపుష్ప సమానముగా అతీతముగా మరియు ప్రియముగా చేస్తుంది. శ్రమ అనిపించదు. తండ్రిని ఎదురుగా తెచ్చుకోవటంతో, స్వస్థితిలో స్థితులవ్వటంతో ఎటువంటి పరిస్థితి అయినా పరివర్తన అయిపోతుంది.

స్లోగన్:-
విషయాలు అనే పరదాను మధ్యలోకి రానివ్వకపోతే తండ్రి తోడు అనుభవమవుతూ ఉంటుంది.

అవ్యక్త ప్రేరణలు - ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసము చెయ్యండి, అంతర్ముఖులుగా అవ్వండి

ఏ విఘ్నము నుండైనా ముక్తులుగా అయ్యేందుకు యుక్తి - క్షణములో స్వయము యొక్క స్వరూపములోకి అనగా ఆత్మిక జ్యోతి స్వరూపపు స్మృతిలోకి రావటము మరియు కర్మలలో నిమిత్త భావము యొక్క స్వరూపములో ఉండటము - ఈ డబుల్లైట్స్వరూపములో స్థితులైనట్లయితే క్షణములో హైజంప్చేసేస్తారు. ఏ విఘ్నమూ కూడా ముందుకు వెళ్ళటంలో ఆటంకము వెయ్యలేదు.