14-11-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఉన్నతోన్నతమైన పదవిని పొందాలంటే స్మృతియాత్రలో ఆనందముగా నిమగ్నమై ఉండండి - ఇదే ఆత్మిక ఉరికంబము, బుద్ధి తమ ఇంటికి వేలాడుతూ ఉండాలి’’

ప్రశ్న:-
ఎవరి బుద్ధిలోనైతే జ్ఞాన ధారణ జరగదో, వారి గుర్తులేమిటి?

జవాబు:-
వారు చిన్న-చిన్న విషయాలలో డిస్టర్బ్ అవుతూ, బాధపడుతూ ఉంటారు. ఎవరి బుద్ధిలో ఎంతగా జ్ఞాన ధారణ జరుగుతుందో, అంతగా వారికి సంతోషముంటుంది. ఇప్పుడిక ప్రపంచము కిందకు దిగజారవలసిందే, ఇందులో నష్టమే జరగనున్నది - ఈ జ్ఞానము ఒకవేళ బుద్ధిలో ఉన్నట్లయితే ఎప్పుడూ డిస్టర్బ్ అవ్వరు, బాధపడరు. సదా సంతోషము ఉంటుంది.

ఓంశాంతి
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. భగవంతుడిని ఉన్నతోన్నతమైన వారు అని అంటారని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఆత్మ యొక్క బుద్ధియోగము ఇంటి వైపుకు వెళ్ళాలి. కానీ ఈ విషయము బుద్ధిలో ఉన్న మనుష్యులు ప్రపంచములో ఒక్కరు కూడా లేరు. సన్యాసులు కూడా బ్రహ్మ తత్వాన్ని ఇల్లు అని భావించరు, వారు మేము బ్రహ్మ తత్వములో లీనమైపోతామని అంటారు, అంటే అది ఇల్లు కాదు. ఇంటిలో నివసించడం జరుగుతుంది. పిల్లలైన మీ బుద్ధి అక్కడ ఉండాలి. ఉదాహరణకు ఎవరైనా ఉరికంబము పైకి ఎక్కుతారు కదా, అలా మీరు ఇప్పుడు ఆత్మిక ఉరికంబముపైకి ఎక్కి ఉన్నారు. ఉన్నతోన్నతమైన తండ్రి వచ్చి మమ్మల్ని ఉన్నతోన్నతమైన ఇంటికి తీసుకువెళ్తారని మీకు లోలోపల ఉంది. ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళాలి. ఉన్నతోన్నతమైన బాబా మనకు మళ్ళీ ఉన్నతోన్నతమైన పదవి ప్రాప్తి అయ్యేలా చేస్తారు. రావణ రాజ్యములో అందరూ నీచముగా ఉన్నారు. వారు ఉన్నతమైనవారు, వీరు నీచమైనవారు. వీరికి ఉన్నతమైనవారి గురించి తెలియనే తెలియదు. ఉన్నతమైనవారికి కూడా నీచమైనవారి గురించి తెలియదు. ఉన్నతోన్నతమైనవారు అని ఒక్క భగవంతుడినే అంటారని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. వారు ఉన్నదే పరంధామ నివాసి. ఆత్మలమైన మనము కూడా అక్కడి నివాసులమేనని, ఇక్కడకు కేవలం పాత్రను అభినయించేందుకు వస్తామని ఎవ్వరూ భావించరు. ఇది ఎవ్వరి ఆలోచనలోనూ ఉండదు. తమ వ్యాపార వ్యవహారాలలోనే నిమగ్నమై ఉంటారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఎప్పుడైతే స్మృతియాత్రలో ఆనందముగా నిమగ్నమై ఉంటారో, అప్పుడే ఉన్నతోన్నతమైనవారిగా అవుతారు. స్మృతి ద్వారానే ఉన్నత పదవిని పొందాలి. మీకు నేర్పించే జ్ఞానము, మర్చిపోయేది కాదు. దీనిని చిన్న పిల్లలు కూడా వర్ణిస్తారు. ఇకపోతే, యోగము విషయాన్ని చిన్న పిల్లలు అర్థం చేసుకోరు. స్మృతియాత్రను పూర్తిగా అర్థం చేసుకోని పిల్లలు చాలామంది ఉన్నారు. మనమెంత ఉన్నతోన్నతము వైపుకు వెళ్తాము. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము... ఇక్కడ పంచ తత్వాలు ఉన్నాయి. సూక్ష్మవతనము, మూలవతనములో ఇవి ఉండవు. ఈ జ్ఞానాన్ని బాబా మాత్రమే ఇస్తారు, అందుకే వారిని జ్ఞానసాగరుడని అంటారు. అనేక శాస్త్రాలు మొదలైనవి చదవడమే జ్ఞానమని మనుష్యులు భావిస్తారు. వారు ఎంత ధనాన్ని సంపాదిస్తారు. శాస్త్రాలు చదివేవారికి ఎంత గౌరవము లభిస్తుంది. కానీ ఇందులో గొప్పతనమేమీ లేదని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఉన్నతోన్నతమైనవారైతే ఒక్క భగవంతుడు మాత్రమే. వారి ద్వారానే మనము ఉన్నతోన్నతమైన స్వర్గములో రాజ్యము చేసేవారిగా అవుతాము. స్వర్గమంటే ఏమిటి, నరకమంటే ఏమిటి? 84 జన్మల చక్రము ఎలా తిరుగుతుంది? ఈ విషయాలు మీకు తప్ప ఈ సృష్టిలో ఇంకెవ్వరికీ తెలియవు, ఇదంతా ఊహ అని అనేస్తారు. ఇటువంటివారి విషయములో వీరు మన కులానికి చెందినవారు కాదని భావించాలి. నిరుత్సాహపడకూడదు. వారి పాత్ర లేదు, అందుకే ఏమీ అర్థం చేసుకోలేరని భావించడం జరుగుతుంది. ఇప్పుడు పిల్లలైన మీ తల చాలా పైకి ఎత్తి ఉంది. మీరు ఉన్నతమైన ప్రపంచములో ఉన్నప్పుడు మీకు నీచ ప్రపంచము గురించి తెలియదు. నీచ ప్రపంచములోని వారికి ఉన్నతమైన ప్రపంచము గురించి తెలియదు. దానినే స్వర్గమని అంటారు. విదేశీయులు స్వరములోకి వెళ్ళరు కానీ హెవెన్, ప్యారడైజ్ అన్న పేర్లనైతే ఉపయోగిస్తారు. ముసల్మానులు కూడా బహిష్త్ అని అంటారు. కానీ అక్కడకు ఎలా వెళ్ళాలి అనేది వారికి తెలియదు. ఇప్పుడు మీకు ఎంత వివేకము లభిస్తుంది, ఉన్నతోన్నతమైన తండ్రి ఎంత జ్ఞానాన్ని ఇస్తారు. ఈ డ్రామా ఎంత అద్భుతముగా తయారుచేయబడి ఉంది. ఎవరికైతే డ్రామా రహస్యము గురించి తెలియదో, వారు దీనిని ఊహ అని అంటారు.

ఇది ఉన్నదే పతిత ప్రపంచమని, అందుకే ఓ పతిత-పావనా, మీరు వచ్చి మమ్మల్ని పావనముగా చేయండి అని ఆర్తనాదాలు చేస్తారని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి అంటారు - ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత చరిత్ర రిపీట్ అవుతుంది, పాత ప్రపంచము కొత్తదిగా అవుతుంది, అందుకే నేను రావలసి ఉంటుంది. కల్ప-కల్పము వచ్చి పిల్లలైన మిమ్మల్ని ఉన్నతోన్నతముగా తయారుచేస్తాను. పావనమైనవారిని ఉన్నతులని మరియు పతితమైనవారిని నీచులని అంటారు. ఈ ప్రపంచమే కొత్తదిగా, పావనముగా ఉండేది, ఇప్పుడు పతితముగా ఉంది. ఈ విషయాలను అర్థం చేసుకునేవారు మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. ఎవరి బుద్ధిలోనైతే ఈ విషయాలు ఉంటాయో వారు సదా సంతోషముగా ఉంటారు. బుద్ధిలో లేకపోతే, ఎవరైనా ఏమైనా అన్నా, ఏదైనా నష్టము జరిగినా డిస్టర్బ్ అవుతారు, బాధపడతారు. బాబా అంటారు, ఇప్పుడు ఈ నీచ ప్రపంచము యొక్క అంతము జరగబోతున్నది. ఇది పాత ప్రపంచము. మనుష్యులు ఎంత నీచముగా అవుతారు. కానీ మేము నీచమైనవారము అని ఎవ్వరూ అర్థం చేసుకోరు. భక్తులు ఎప్పుడూ తల వంచి నమస్కరిస్తారు, అయితే నీచుల ఎదురుగా తల వంచడం జరగదు. పవిత్రమైనవారి ఎదురుగా తల వంచడం జరుగుతుంది. సత్యయుగములో ఎప్పుడూ ఇలా జరగదు. భక్తులే ఇలా చేస్తారు. తల వంచి నడవండి అని బాబా అయితే ఇలా అనరు. అలా కాదు. ఇది చదువు. గాడ్ ఫాదర్లీ యూనివర్శిటీలో మీరు చదువుకుంటున్నారు కావున ఎంత నషా ఉండాలి. అంతేకానీ, కేవలం యూనివర్శిటీలో ఉన్నప్పుడు నషా ఉండి, ఇంటిలో తగ్గిపోవడం కాదు. ఇంటిలోనూ నషా ఉండాలి. శివబాబా మనల్ని చదివిస్తున్నారని ఇక్కడైతే పిల్లలైన మీకు తెలుసు. నేను జ్ఞానసాగరుడిని కాను అని వీరు అంటారు. ఈ బాబా జ్ఞానసాగరుడు కారు. సాగరము నుండి నదులు వెలువడుతాయి కదా. సాగరము అయితే ఒక్కటే, బ్రహ్మపుత్ర అన్నింటికన్నా పెద్ద నది. చాలా పెద్ద స్టీమర్లు వస్తాయి. నదులైతే బయట కూడా చాలా ఉన్నాయి. పతిత-పావని గంగ అని కేవలం ఇక్కడ మాత్రమే అంటారు. బయట ఏ నదిని ఇలా అనరు. ఒకవేళ నది పతిత-పావని అయితే ఇక గురువు అవసరమే ఉండదు. నదులలో, చెరువులలో ఎంతగా భ్రమిస్తారు. అక్కడక్కడా చెరువులు ఎంత అశుద్ధముగా ఉంటాయంటే, ఇక అడగకండి. వాటి మట్టి తీసుకుని దేహానికి పూసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కిందకు దిగజారే మార్గాలని ఇప్పుడు బుద్ధిలోకి వచ్చింది. వారు ఎంత ప్రేమగా వెళ్తారు. ఈ జ్ఞానముతో మన కళ్ళు తెరుచుకున్నాయని ఇప్పుడు మీరు భావిస్తారు. జ్ఞానము యొక్క మీ మూడవ నేత్రము తెరుచుకుంది. ఆత్మకు మూడవ నేత్రము లభిస్తుంది, అందుకే త్రికాలదర్శీ అని అంటారు. మూడు కాలాల జ్ఞానము ఆత్మలోకి వస్తుంది. ఆత్మ అయితే బిందువు, అందులో నేత్రము ఎలా ఉంటుంది. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. జ్ఞానము యొక్క మూడవ నేత్రముతో మీరు త్రికాలదర్శులుగా, త్రిలోకనాథులుగా అవుతారు. నాస్తికుల నుండి ఆస్తికులుగా అవుతారు. ఇదివరకు మీకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి తెలియదు. ఇప్పుడు తండ్రి ద్వారా రచన యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకోవడముతో మీకు వారసత్వము లభిస్తోంది. ఇది జ్ఞానము కదా. చరిత్ర-భౌగోళికము కూడా ఉంది, లెక్క ఉంది కదా. అచ్ఛా, చురుకైన బిడ్డ అయితే - మనం ఎన్ని జన్మలు తీసుకుంటాము, ఈ లెక్కన ఇతర ధర్మాలవారికి ఎన్ని జన్మలు ఉంటాయి అని లెక్క తీయండి. కానీ తండ్రి అంటారు, ఈ విషయాలన్నిటి వెనుక ఎక్కువగా కష్టపడవలసిన అవసరము లేదు. సమయము వృధా అయిపోతుంది. ఇక్కడైతే అన్ని మర్చిపోవాలి. ఇది వినిపించవలసిన అవసరము లేదు. మీరు రచయిత అయిన తండ్రి పరిచయాన్ని ఇస్తారు, వారి గురించి ఎవ్వరికీ తెలియదు. శివబాబా భారత్ లోనే వస్తారు. తప్పకుండా ఏదో చేసి వెళ్తారు, అందుకే వారి జయంతిని జరుపుకుంటారు కదా. గాంధి లేక ఎవరైనా సాధువు మొదలైనవారు ఉండి వెళ్తే, వారి స్టాంప్ లు తయారుచేస్తూ ఉంటారు. కుటుంబ నియంత్రణ స్టాంప్ లను తయారుచేస్తారు. మనది పాండవ గవర్నమెంట్ అని, ఆల్మైటీ బాబా యొక్క గవర్నమెంట్ అని ఇప్పుడు మీకు నషా ఉంది. ఇది మీ కోట్ ఆఫ్ ఆర్మ్స్ (రాజముద్ర). ఇతరులెవ్వరికీ ఈ రాజముద్ర గురించి తెలియదు. వినాశన కాలములో ప్రీతి బుద్ధి మనదేనని మీకు తెలుసు. తండ్రిని మనము చాలా స్మృతి చేస్తాము. తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ ప్రేమలో కన్నీళ్ళు వస్తాయి. బాబా, మీరు మమ్మల్ని అర్ధకల్పము కోసం అన్ని దుఃఖాల నుండి దూరము చేస్తారు. ఇంకే గురువులు లేదా మిత్ర-సంబంధీకులు మొదలైనవారెవ్వరినీ స్మృతి చేయవలసిన అవసరము లేదు. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి. ఉదయము సమయము చాలా మంచిది. బాబా, మీదైతే చాలా అద్భుతము. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత మీరు మమ్మల్ని మేలుకొలుపుతారు. మనుష్యమాత్రులందరూ కుంభకర్ణుని ఆసురీ నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు అనగా అజ్ఞాన అంధకారములో ఉన్నారు. భారత్ యొక్క ప్రాచీన యోగమైతే ఇదేనని ఇప్పుడు మీకు తెలుసు, ఇక మిగిలిన హఠయోగాలు మొదలైనవి ఏవైతే నేర్పిస్తారో, అవన్నీ శరీరాన్ని ఆరోగ్యముగా ఉంచేందుకు వ్యాయామాలు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం జ్ఞానముంది కావున సంతోషము ఉంటుంది. ఇక్కడకు వస్తారు, బాబా రిఫ్రెష్ చేస్తారని భావిస్తారు. కొంతమందైతే ఇక్కడ రిఫ్రెష్ అయ్యి బయటకు వెళ్తారు, ఆ నషా సమాప్తమైపోతుంది. నంబరువారుగా అయితే ఉన్నారు కదా. ఇది పతిత ప్రపంచము అని బాబా అర్థం చేయిస్తున్నారు. ఓ పతిత-పావనా రండి అని పిలుస్తారు కూడా కానీ స్వయాన్ని పతితులుగా భావించరు, అందుకే పాపాలను కడుక్కునేందుకు వెళ్తారు. కానీ శరీరానికి పాపము అంటుకోదు. తండ్రి వచ్చి మిమ్మల్ని పావనముగా తయారుచేస్తారు మరియు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని అంటారు. ఈ జ్ఞానము ఇప్పుడు మీకు లభించింది. భారత్ స్వర్గముగా ఉండేది, ఇప్పుడు నరకముగా ఉంది. పిల్లలైన మీరైతే ఇప్పుడు సంగమములో ఉన్నారు. ఎవరైనా వికారాలలోకి పడిపోతే ఫెయిల్ అయిపోతారు అంటే నరకములోకి వెళ్ళి పడిపోయినట్లు. 5 అంతస్థుల నుండి కింద పడిపోతారు, ఆ తర్వాత 100 రెట్లు శిక్షలు అనుభవించవలసి వస్తుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, భారత్ ఎంత ఉన్నతముగా ఉండేది, ఇప్పుడు ఎంత నీచముగా ఉంది. ఇప్పుడు మీరు ఎంత తెలివైనవారిగా అవుతారు. మనుష్యులైతే ఎంత తెలివిహీనులుగా ఉన్నారు. బాబా మీకు ఇక్కడ ఎంతగా నషా ఎక్కిస్తారు, మళ్ళీ బయటకు వెళ్ళడముతో నషా తగ్గిపోతుంది, సంతోషము దూరమైపోతుంది. విద్యార్థులు ఏదైనా పెద్ద పరీక్షను పాస్ అయితే, నషా ఎప్పుడైనా తగ్గుతుందా? చదువుకొని పాస్ అవుతారు, ఆ తర్వాత ఏమేమో అవుతారు. ఇప్పుడు ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఉన్నతోన్నతమైన తండ్రి వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నారు, అది కూడా వారు నిరాకారుడు. ఆత్మలైన మీరు కూడా నిరాకారియే. ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చారు. ఈ డ్రామా రహస్యాన్ని తండ్రే వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఈ సృష్టి చక్రాన్ని డ్రామా అని కూడా అంటారు. ఆ నాటకములో ఎవరైనా రోగగ్రస్థులుగా అయితే బయటకు వెళ్ళిపోతారు. ఇది అనంతమైన నాటకము. ఇది యథార్థ రీతిగా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది, మనం ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తామని మీకు తెలుసు. మనము అనంతమైన పాత్రధారులము. ఇక్కడ శరీరము తీసుకొని పాత్రను అభినయిస్తాము. బాబా వచ్చేసారు - ఇదంతా బుద్ధిలో ఉండాలి. అనంతమైన డ్రామా ఎంతగా బుద్ధిలో ఉండాలి. అనంతమైన విశ్వము యొక్క రాజ్యాధికారము లభిస్తుందంటే దాని కోసం అటువంటి మంచి పురుషార్థము కూడా చేయాలి కదా. గృహస్థ వ్యవహారములో కూడా ఉండండి కానీ పవిత్రముగా అవ్వండి. విదేశాలలో చాలా మంది వృద్ధులుగా అయినప్పుడు కంపానియన్షిప్ (తోడు) కోసం మళ్ళీ వివాహము చేసుకుంటారు... వీరిని సంభాళించినందుకని వారి పేరు మీద వీలునామా వ్రాస్తారు. కొంత సంభాళించే వారికి, కొంత దానధర్మాలకు (చారిటీలకు) వ్రాస్తారు. వికారాల విషయము ఉండదు. ప్రేయసీ-ప్రియులు కూడా వికారాల కోసం బలిహారము అవ్వరు. కేవలం శారీరక ప్రేమ ఉంటుంది. మీరు ఆత్మిక ప్రేయసులు, ఒక్క ప్రియుడిని స్మృతి చేస్తారు. ప్రేయసులందరికీ ఒక్కరే ప్రియుడు. అందరూ ఒక్కరినే స్మృతి చేస్తారు. వారు ఎంత శోభనీయముగా ఉంటారు. ఆత్మ సుందరముగా ఉంటుంది కదా. వారు సదా సుందరమైనవారు. మీరైతే నల్లగా అయిపోయారు, వారు మిమ్మల్ని నల్లగా ఉన్నవారి నుండి తెల్లగా చేస్తారు. తండ్రి మమ్మల్ని తెల్లగా చేస్తారని మీకు తెలుసు. ఇక్కడ చాలామంది ఏయే ఆలోచనలతో కూర్చొని ఉంటారో తెలియనే తెలియదు. స్కూల్ లో అలాగే ఉంటుంది - కూర్చుని-కూర్చునే బుద్ధి బయోస్కోప్ వైపుకు, మిత్రులు మొదలైనవారివైపుకు వెళ్ళిపోతుంది. సత్సంగాలలో కూడా అలాగే జరుగుతుంది. ఇక్కడ కూడా అలాగే ఉంటారు, బుద్ధిలో కూర్చోదు కావున నషాయే ఎక్కదు, ఇతరుల చేత ధారణ చేయించేందుకు స్వయానికే ధారణ జరగదు. చాలామంది మాతలు వస్తారు, వారికి ఇక్కడ సేవలో నిమగ్నమైపోవాలని మనసు కలుగుతుంది కానీ వారికి చిన్న-చిన్న పిల్లలు ఉంటారు. బాబా అంటారు, ఆ పిల్లలను సంభాళించేందుకు ఎవరైనా ఆయాను పెట్టండి. ఆ మాతలు ఎంతోమంది కళ్యాణము చేస్తారు. తెలివైనవారైతే ఆత్మిక సేవలో ఎందుకు నిమగ్నమవ్వకూడదు. 5-6 మంది పిల్లలను సంభాళించేందుకు ఎవరైనా ఆయాను పెట్టండి. ఇప్పుడు ఇది మాతల వంతు కదా. మీకు చాలా నషా ఉండాలి. నా పత్ని అయితే సన్యాసులను కూడా దాటి జయించిందని పురుషులు చూస్తారు, ఇది మున్ముందు జరుగుతుంది. ఈ మాతలు లౌకిక మరియు పారలౌకిక పేరును ప్రసిద్ధము చేసి చూపిస్తారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మీరు బుద్ధి ద్వారా అంతా మర్చిపోవాలి. ఏ విషయాలలోనైతే సమయము వ్యర్థము అవుతుందో, వాటిని వినవలసిన, వినిపించవలసిన అవసరము లేదు.

2. చదువుకునే సమయములో బుద్ధియోగము ఒక్క తండ్రితోనే జోడించబడి ఉండాలి, బుద్ధి ఎక్కడా భ్రమించకూడదు. నిరాకార తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు, ఈ నషాలో ఉండాలి.

వరదానము:-
తమ మహానతను మరియు మహిమను తెలుసుకుని సర్వాత్మలలో కల్లా శ్రేష్టమైనవారిగా, విశ్వము ద్వారా పూజ్యనీయులుగా కండి

ప్రతి బ్రాహ్మణ బిడ్డ వర్తమాన సమయములో విశ్వములోని సర్వాత్మలలో కల్లా శ్రేష్ఠమైనవారు మరియు భవిష్యత్తులో విశ్వము ద్వారా పూజ్యనీయులు. నంబరువారుగా ఉన్నప్పటికీ చివరి నంబరులో ఉన్న మణిపూస కూడా విశ్వము ఎదురుగా మహానులే. ఈ రోజు వరకు భక్తాత్మలు చివరి నంబరు మణిపూసను కూడా కళ్లకు అద్దుకుంటారు ఎందుకంటే పిల్లలందరూ బాప్ దాదాకు కంటి తారలు, ప్రకాశ రత్నాలు. ఎవరైతే ఒక్కసారి అయినా మనసు ద్వారా, సత్యమైన హృదయము ద్వారా స్వయాన్ని బాబా బిడ్డగా నిశ్చయము ఏర్పరచుకుంటారో, బాబాకు డైరెక్ట్ బిడ్డగా అయ్యారో, వారికి మహానులుగా మరియు పూజ్యనీయులుగా అయ్యే లాటరీ మరియు వరదానము తప్పకుండా లభిస్తుంది.

స్లోగన్:-
స్థితి సదా ఖజానాలతో సంపన్నముగా మరియు సంతుష్టముగా ఉన్నట్లయితే పరిస్థితులు మారిపోతాయి.

అవ్యక్త సూచనలు - అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి

ఈ శరీరమనే ఇంటిని వదిలి, దేహాభిమాన స్థితిని వదిలి దేహీ-అభిమానులుగా అయిపోండి అని, ఈ ప్రపంచము నుండి దూరముగా ఉన్న మీ స్వీట్ హోమ్ కు వెళ్ళండి అని బాప్ దాదా అకస్మాత్తుగా డైరెక్షన్ ఇస్తే అలా వెళ్ళగలరా? యుద్ధ స్థలములో యుద్ధము చేస్తూ-చేస్తూ సమయాన్ని గడిపేయరు కదా! అశరీరిగా అవ్వటానికి ఒకవేళ యుద్ధములోనే సమయము గడిచిపోతే మరి అంతిమ పరీక్షలో ఎన్ని మార్కులు వస్తాయి మరియు ఏ డివిజన్ వస్తుంది!