ఓంశాంతి
భోళానాథుడు అని ఎవరినంటారో మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు. సంగమయుగీ పిల్లలైన మీరు
మాత్రమే ఇది తెలుసుకోగలరు. కలియుగీ మనుష్యులకు అంశమాత్రము కూడా తెలియదు.
జ్ఞానసాగరుడు ఒక్క తండ్రియే. వారే సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు.
తండ్రి తన పరిచయాన్ని ఇస్తారు. పిల్లలైన మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు.
ఇంతకుముందు మీకు ఏమీ తెలియదు. తండ్రి అంటారు, నేనే వచ్చి భారత్ ను స్వర్గముగా
చేస్తాను, అనంతమైన వారసత్వాన్ని ఇస్తాను. దానిని మీరు ఇప్పుడు తీసుకుంటున్నారు. మనము
అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖపు వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. ఇది
తయారై, తయారుచేయబడిన డ్రామా, ఇందులో ఒక్క పాత్రధారి కూడా అదనముగా కలవలేరు, అలాగే
ఇందులో నుండి పాత్రధారులెవ్వరూ తగ్గలేరు. ప్రతి ఒక్కరికీ తమ-తమ పాత్ర లభించి ఉంది.
ఎవ్వరూ మోక్షాన్ని పొందలేరు. ఎవరు ఏ ధర్మానికి చెందినవారో వారు మళ్ళీ ఆ ధర్మములోకే
వెళ్తారు. బౌద్ధులు లేక క్రిస్టియన్లు మొదలైనవారు - మేము స్వర్గములోకి వెళ్ళాలి అని
కోరుకున్నా కానీ వారు వెళ్ళలేరు. ఎప్పుడైతే వారి ధర్మ స్థాపకులు వస్తారో, అప్పుడే
వారి పాత్ర ఉంటుంది. ఇది పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మొత్తము ప్రపంచములోని
మనుష్యమాత్రులందరూ ఈ సమయములో నాస్తికులుగా ఉన్నారు అనగా అనంతమైన తండ్రి గురించి
తెలియనివారిగా ఉన్నారు. మనుష్యులే తెలుసుకుంటారు కదా. ఈ నాటకశాల మనుష్యులది. ప్రతి
ఒక్క ఆత్మ పాత్రను అభినయించేందుకు నిర్వాణధామము నుండి వస్తుంది, మళ్ళీ
నిర్వాణధామములోకి వెళ్ళేందుకు పురుషార్థము చేస్తుంది. బుద్ధుడు నిర్వాణాన్ని పొందారు
అని అంటారు, ఇప్పుడు బుద్ధుని శరీరమైతే వెళ్ళలేదు కదా, అంటే ఆత్మయే వెళ్ళి ఉండాలి.
కానీ తండ్రి అర్థం చేయిస్తున్నారు, వాస్తవానికి అక్కడికి ఎవ్వరూ వెళ్ళరు. ఈ నాటకము
నుండి అసలు ఎవ్వరూ బయటపడనే పడలేరు, మోక్షాన్ని పొందలేరు. ఇది తయారై, తయారుచేయబడిన
డ్రామా కదా. కొందరు మనుష్యులు, మోక్షము లభిస్తుందని భావిస్తారు, కావుననే పురుషార్థము
చేస్తూ ఉంటారు. ఉదాహరణకు జైన ధర్మమువారు పురుషార్థము చేస్తూ ఉంటారు. వారికి వారి
ఆచార-వ్యవహారాలు ఉన్నాయి, వారికి వారి గురువు ఉంటారు, వారు వారిని నమ్ముతారు. కానీ
మోక్షము ఎవ్వరికీ లభించదు. మనము ఈ డ్రామాలోని పాత్రధారులము అని మీకు తెలుసు. మనము
ఎప్పుడు వచ్చామో, మళ్ళీ ఎలా వెళ్తామో ఎవ్వరికీ తెలియదు. జంతువులైతే తెలుసుకోవు కదా.
నటులమైన మనము పాత్రను అభినయిస్తున్నామని మనుష్యులే అంటారు. ఇది కర్మక్షేత్రము,
ఇక్కడ ఆత్మలు ఉంటాయి. దానిని కర్మక్షేత్రము అనరు, అది నిరాకారీ ప్రపంచము. అక్కడ ఏ
ఆట ఉండదు, ఏ పాత్ర ఉండదు. నిరాకారీ ప్రపంచము నుండి సాకారీ ప్రపంచములోకి పాత్రను
అభినయించేందుకు వస్తారు, అదే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ప్రళయము ఎప్పుడూ జరగదు.
శాస్త్రాలలో ఎలా చూపించారంటే - మహాభారత యుద్ధములో యాదవులు మరియు కౌరవులు మరణించారు,
చివరికి కేవలము పంచ పాండవులు మాత్రమే మిగిలారు, వారు కూడా పర్వతాలపై కరిగిపోయి
చనిపోయారు, ఇంకేమీ మిగలలేదు అని. ఇలా చూపించినందుకు ప్రళయము జరిగిందని భావిస్తారు.
ఇవన్ని విషయాలను కూర్చుని తయారుచేసారు. ఆ తరువాత మళ్ళీ సముద్రములో రావి ఆకుపై ఒక
బాలుడు నోటిలో బొటను వేలు పెట్టుకుని చప్పరిస్తూ వచ్చినట్లుగా చూపిస్తారు. మరి
ఇప్పుడు అతడి నుండి ప్రపంచము ఎలా జన్మిస్తుంది. మనుష్యులు ఏది విన్నా అది సత్యమేనని
అంటూ ఉంటారు. శాస్త్రాలలో కూడా ఏమేమో రాసారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇవన్నీ
భక్తి మార్గపు శాస్త్రాలు. భక్తులకు ఫలాన్ని ఇచ్చేది ఒక్క భగవంతుడైన తండ్రి మాత్రమే.
కొందరు ముక్తిలోకి, కొందరు జీవన్ముక్తిలోకి వెళ్ళిపోతారు. పాత్రధారి అయిన ప్రతి
ఆత్మ యొక్క పాత్ర ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ ఆత్మ మళ్ళీ కిందికి వస్తుంది. ఈ
డ్రామా రహస్యము పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మాకు రచయిత మరియు రచన
గురించి తెలియదు అని అంటారు. డ్రామాలోని పాత్రధారులై ఉండి డ్రామా యొక్క
ఆదిమధ్యాంతాల గురించి, డ్రామా యొక్క కాల వ్యవధి మొదలైన విషయాల గురించి తెలియకపోతే
వారిని బుద్ధిహీనులు అనే అంటారు కదా. ఇవి అర్థం చేయించినా అర్థం చేసుకోరు. 84 లక్షల
జన్మలు ఉన్నాయని భావించిన కారణముగా డ్రామా యొక్క కాల వ్యవధిని కూడా లక్షల
సంవత్సరాలుగా చూపించారు.
ఇప్పుడు మీరు ఏమని భావిస్తారంటే - బాబా, మేము వచ్చి మీ నుండి కల్ప-కల్పము స్వర్గ
రాజ్యాధికారాన్ని తీసుకుంటాము, ఐదు వేల సంవత్సరాల క్రితము కూడా అనంతమైన వారసత్వాన్ని
తీసుకునేందుకు మిమ్మల్ని కలుసుకున్నాము. యథా రాజా రాణి తథా ప్రజ, అందరూ విశ్వానికి
యజమానులుగా అవుతారు. మేము విశ్వానికి యజమానులము అని ప్రజలు కూడా అంటారు. మీరు
ఎప్పుడైతే విశ్వానికి యజమానులుగా అవుతారో, అప్పుడు ఆ సమయములో చంద్రవంశీ రాజ్యము
ఉండదు. పిల్లలైన మీకు డ్రామా యొక్క ఆదిమధ్యాంతములన్నింటి గురించి తెలుసు. మనుష్యులు
భక్తి మార్గములో ఎవరినైతే పూజిస్తారో వారి గురించి కూడా వారికి తెలియదు. ఎవరి
భక్తినైతే చేసేది ఉంటుందో, వారి జీవితచరిత్రను కూడా తెలుసుకోవాలి కదా. పిల్లలైన మీరు
ఇప్పుడు తండ్రి ద్వారా అందరి జీవితచరిత్రను గురించి తెలుసుకున్నారు. మీరు తండ్రికి
చెందినవారిగా అయ్యారు. తండ్రి జీవితచరిత్రను గురించి మీకు తెలుసు. ఆ తండ్రియే
పతిత-పావనుడు, ముక్తిప్రదాత, మార్గదర్శకుడు. మిమ్మల్ని పాండవులు అని అంటారు. మీరు
అందరికీ మార్గాన్ని తెలియజేసేందుకు అందరికీ మార్గదర్శకులుగా అవుతారు, అంధులకు
చేతికర్రగా అవుతారు. ఏ విధముగా తండ్రి మార్గదర్శకుడో, అలాగే పిల్లలైన మీరు కూడా
తయారవ్వాలి. అందరికీ మార్గాన్ని తెలియజేయవలసి ఉంటుంది. మీరు ఆత్మ, వారు పరమాత్మ,
వారి నుండి అనంతమైన వారసత్వము లభిస్తుంది. భారత్ లో అనంతమైన రాజ్యము ఉండేది, ఇప్పుడు
లేదు. మనము అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖపు వారసత్వాన్ని తీసుకుంటామని అనగా
మనుష్యులు నుండి దేవతలుగా అవుతామని మీకు తెలుసు. మనమే ఒకప్పుడు దేవతలుగా ఉండేవారము,
మళ్ళీ 84 జన్మలు తీసుకుని శూద్రులుగా అయ్యాము. తండ్రి వచ్చి శూద్రుల నుండి
బ్రాహ్మణులుగా తయారుచేస్తారు. యజ్ఞములో బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. ఇది జ్ఞాన
యజ్ఞము. భారత్ లో ఎన్నో యజ్ఞాలు రచించడం జరుగుతుంది. అందులోనూ విశేషముగా ఆర్యసమాజము
వారు ఎన్నో యజ్ఞాలను చేస్తూ ఉంటారు. కానీ ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము, ఇందులో మొత్తము
పాత ప్రపంచమంతా స్వాహా అవ్వనున్నది. ఇప్పుడు బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసి ఉంటుంది.
కలియుగములోనైతే ఎంతోమంది మనుష్యులు ఉన్నారు. ఇంతటి పాత ప్రపంచమంతా అంతమైపోతుంది.
ఇక్కడి ఏ వస్తువూ ఉపయోగపడదు. సత్యయుగములోనైతే అన్నీ కొత్తగా ఉంటాయి. ఇక్కడ ఎంత
అశుద్ధత ఉంది. మనుష్యులు ఎంత అశుద్ధముగా ఉంటారు. ధనవంతులు చాలా మంచి మహళ్ళలో ఉంటారు.
పేదవారు పాపము మురికిలో పూరి గుడిసెలలో పడి ఉన్నారు. ఇప్పుడు ఈ గుడిసెలను నాశనము
చేస్తూ ఉంటారు. వారికి వేరే స్థానాన్ని ఇచ్చి ఆ భూమిని అమ్మేస్తూ ఉంటారు. వారు
అక్కడి నుండి లేవకపోతే బలవంతంగా లేపేస్తారు. పేదవారు చాలా దుఃఖితులుగా ఉన్నారు.
ఎవరైతే సుఖముగా ఉన్నారో వారు కూడా స్థిరమైన సుఖములో లేరు. ఒకవేళ సుఖము ఉన్నట్లయితే
మరి దానిని కాకి రెట్టతో సమానమైన సుఖము అని ఎందుకు అంటారు.
శివ భగవానువాచ, నేను ఈ మాతల ద్వారా స్వర్గ ద్వారాలను తెరుస్తున్నాను. మాతలపై
కలశాన్ని పెట్టారు. వారు మళ్ళీ అందరికీ జ్ఞానామృతాన్ని తాగిస్తారు. కానీ మీది
ప్రవృత్తి మార్గము. మీరు సత్యాతి-సత్యమైన బ్రాహ్మణులు, కావున మీరు అందరినీ
జ్ఞానచితిపై కూర్చోబెడతారు. ఇప్పుడు మీరు దైవీ సాంప్రదాయమువారిగా అవుతున్నారు. ఆసురీ
సాంప్రదాయము అనగా రావణ రాజ్యము. గాంధీ కూడా రామ రాజ్యము కావాలి అని అనేవారు. ఓ
పతిత-పావనా రండి అని పిలుస్తారు, కానీ స్వయాన్ని పతితులుగా భావించరు. తండ్రి
పిల్లలను మేల్కొలుపుతారు, మీరు ఘోర అంధకారము నుండి ప్రకాశములోకి వచ్చారు. గంగా
స్నానము చేయడం ద్వారా పావనముగా అయిపోతామని మనుష్యులు భావిస్తారు. మమూలుగా కూడా గంగా
నదిలో హరిద్వార్ లోని చెత్త అంతా కలుస్తుంది, మళ్ళీ ఆ చెత్తనంతటినీ పొలాలలోకి
తీసుకువెళ్తారు. సత్యయుగములో ఇటువంటి పనులు ఉండవు. అక్కడైతే లెక్కలేనంత ధాన్యము
ఉంటుంది. అక్కడ ధనము ఖర్చు చేయవలసిన అవసరముండదు. బాబా అనుభవజ్ఞులు కదా. పూర్వము
ధాన్యము ఎంత చవకగా ఉండేది. సత్యయుగములో చాలా కొద్దిమంది మనుష్యులు ఉంటారు, ప్రతి
వస్తువూ చవకగా ఉంటుంది. తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, ఇప్పుడు మీరు పతితుల నుండి
పావనులుగా అవ్వాలి. దాని కోసము చాలా సహజమైన యుక్తిని తెలియజేస్తున్నారు - స్వయాన్ని
ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఆత్మలోనే మాలిన్యాలు కలవడముతో ఆత్మలో కల్తీ
కలిసింది. ఎవరైతే పారసబుద్ధి కలవారిగా ఉండేవారో, వారే ఇప్పుడు రాతిబుద్ధి కలవారిగా
అయ్యారు. పిల్లలైన మీరు ఇప్పుడు తండ్రి వద్దకు రాతినాథుల నుండి పారసనాథులుగా
అవ్వడానికి వచ్చారు. అనంతమైన తండ్రి మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు,
అది కూడా స్వర్ణిమయుగ విశ్వానికి. ఇది ఇనుపయుగ విశ్వము. తండ్రి కూర్చుని పిల్లలను
పారసపురికి యజమానులుగా తయారుచేస్తారు. ఇక్కడ ఉన్న ఇన్ని మేడలు-మిద్దెలు మొదలైనవేవీ
పనికిరావని మీకు తెలుసు. అన్నీ అంతమైపోతాయి. అయినా ఇక్కడ అసలు ఏముంది! అమెరికా వద్ద
ఎంత బంగారము ఉంది! ఇక్కడైతే మాతల వద్ద ఉన్న కాస్త బంగారాన్ని కూడా తీసేసుకుంటూ
ఉంటారు ఎందుకంటే వారి నుండి తీసుకున్న అప్పుకు బదులుగా బంగారాన్ని ఇవ్వవలసి ఉంటుంది.
మీ వద్ద అక్కడ అంతా బంగారమే బంగారము ఉంటుంది. ఇక్కడ గవ్వలు ఉన్నాయి, అక్కడ వజ్రాలు
ఉంటాయి. దీనిని ఇనుపయుగము అని అంటారు. భారత్ యే అవినాశీ ఖండము, ఇది ఎప్పుడూ
వినాశనమవ్వదు. భారత్ యే అన్నిటికన్నా ఉన్నతోన్నతమైనది. మాతలైన మీరు మొత్తం
విశ్వమంతటినీ ఉద్ధరిస్తారు. మీ కోసము తప్పకుండా కొత్త ప్రపంచము కావాలి. పాత ప్రపంచము
వినాశనమవ్వాలి. ఇవి ఎంతగా అర్థం చేసుకోవలసిన విషయాలు. శరీర నిర్వాహణకర్తకు
వ్యాపార-వ్యవహారాలు మొదలైనవి కూడా చేయాలి, ఏమీ వదలవలసిన అవసరం లేదు. బాబా అంటారు,
అన్నీ చేస్తూ నన్ను స్మృతి చేస్తూ ఉండండి. భక్తి మార్గములో కూడా మీరు ప్రియుడినైన
నన్ను తలచుకుంటూ వచ్చారు, మీరు వచ్చి నల్లగా ఉన్న మమ్మల్ని తెల్లగా తయారుచేయండి అని
తలచుకుంటూ వచ్చారు. వారిని యాత్రికుడు అని అంటారు. మీరందరూ యాత్రికులే కదా. మీ ఇల్లు
అది, అక్కడ ఆత్మలన్నీ ఉంటాయి.
మీరు అందరినీ జ్ఞాన చితిపై కూర్చోబెడతారు. అన్ని లెక్కాచారాలను సమాప్తము చేసుకుని
తిరిగి వెళ్తారు. మళ్ళీ కొత్తగా మీరు వస్తారు. ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా
పవిత్రముగా అవుతారు మరియు ఉన్నత పదవిని పొందుతారు. మాతలకైతే ఖాళీ సమయము ఉంటుంది.
పురుషుల బుద్ధి వ్యాపార-వ్యవహారాలు మొదలైనవాటి వైపు తిరుగుతూ ఉంటుంది. అందుకే తండ్రి
కలశాన్ని కూడా మాతలపై పెట్టారు. ఇక్కడైతే స్త్రీకి - పతియే నీకు గురువు, ఈశ్వరుడు,
సర్వస్వము, నీవు అతనికి దాసివి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి మాతలైన
మిమ్మల్ని ఎంత ఉన్నతముగా తయారుచేస్తారు. నారీలైన మీరే భారత్ ను ఉద్ధరిస్తారు. కొందరు
బాబాను అడుగుతూ ఉంటారు - ఈ జన్మ-మరణ చక్రము నుండి విముక్తులుగా అవ్వవచ్చా అని. బాబా
అంటారు - అవును, అవ్వవచ్చు కానీ కొద్ది సమయము కోసమే. పిల్లలైన మీరైతే ఆది నుండి
అంతిమము వరకు ఆల్రౌండ్ పాత్రను అభినయిస్తారు. మిగిలినవారందరూ ముక్తిధామములో ఉంటారు.
వారి పాత్రయే కొద్దిగా ఉంటుంది. వారు స్వర్గములోకైతే వెళ్ళేది లేదు. జనన-మరణాల నుండి
మోక్షాన్ని పొందారు అని ఎవరిని ఉద్దేశించి అంటారంటే, ఎవరైతే అంతిమములో వచ్చి వెంటనే
వెళ్ళిపోతోరో వారు. వారు జ్ఞానము మొదలైనవాటిని వినలేరు. ఎవరైతే ఆది నుండి అంతిమము
వరకు పాత్రను అభినయిస్తారో వారే ఈ జ్ఞానాన్ని వింటారు. కొందరు అంటారు - మాకైతే అదే
ఇష్టము, మేము అక్కడే కూర్చుని ఉంటాము. కానీ అలా జరగదు. డ్రామాలో నిశ్చితమై ఉంది.
అక్కడికి వెళ్ళి మళ్ళీ అంతిమములో తప్పకుండా వస్తారు. మిగిలిన సమయమంతా శాంతిధామములో
ఉంటారు. ఇది అనంతమైన నాటకము. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.