25-11-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఆత్మను సతోప్రధానముగా తయారుచేసుకోవాలి అనే చింత పెట్టుకోండి, ఏ విధమైన లోపము ఉండిపోకూడదు, మాయ నిర్లక్ష్యము చేయించకూడదు’’

ప్రశ్న:-
పిల్లలైన మీ నోటి నుండి ఎటువంటి శుభమైన మాటలు సదా వెలువడాలి?

జవాబు:-
సదా నోటి ద్వారా ఇవే శుభమైన మాటలు మాట్లాడండి - మేము నరుని నుండి నారాయణునిగా అవుతాము, అంతకంటే తక్కువగా అవ్వము. మేమే విశ్వానికి యజమానులుగా ఉండేవారము, మళ్ళీ అవుతాము. కానీ ఈ గమ్యము ఉన్నతమైనది, అందుకే చాలా-చాలా అప్రమత్తముగా ఉండాలి. మీ లెక్కాపత్రాన్ని చూసుకోవాలి. లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా ఉంచుకుని పురుషార్థము చేస్తూ ఉండాలి, హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు (నిరాశకు లోనవ్వకూడదు).

ఓంశాంతి
తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఇక్కడ స్మృతియాత్రలో కూర్చున్నప్పుడు, మీరు ఆత్మాభిమానులుగా అయి కూర్చోండి మరియు తండ్రిని స్మృతి చేయండి అని సోదరీ-సోదరులకు చెప్పండి. ఈ స్మృతిని ఇప్పించాలి. మీకు ఇప్పుడు ఈ స్మృతి లభిస్తోంది. మనము ఆత్మలము, మన తండ్రి మనల్ని చదివించడానికి వస్తారు. మనము కూడా కర్మేంద్రియాల ద్వారా చదువుకుంటాము. తండ్రి కూడా కర్మేంద్రియాలను ఆధారముగా తీసుకుని వీటి ద్వారా మొట్టమొదట ఈ మాట చెప్తారు - తండ్రిని స్మృతి చేయండి అని. ఇది జ్ఞాన మార్గమని పిల్లలకు అర్థం చేయించడము జరిగింది. దీనిని భక్తి మార్గమని అనరు. జ్ఞానాన్ని కేవలం జ్ఞాన సాగరుడు, పతిత-పావనుడు అయిన వారొక్కరే ఇస్తారు. మీకు మొదటి నంబరు పాఠముగా ఇదే లభిస్తుంది - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని. ఇది చాలా అవసరము. ఇతర ఏ సత్సంగములోనూ ఎవ్వరికీ ఇలా చెప్పడము రాదు. ఈ రోజుల్లో నకిలీ సంస్థలు చాలానే వెలువడ్డాయి కానీ మీ నుండి విని ఎవరైనా చెప్పినా కూడా వారు అర్థాన్ని అర్థం చేసుకోలేరు. వారికి అర్థం చేయించే తెలివి ఉండదు. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయని తండ్రి మీకు మాత్రమే చెప్తున్నారు. ఇది పాత ప్రపంచమని వివేకము కూడా చెప్తుంది. కొత్త ప్రపంచానికి మరియు పాత ప్రపంచానికి చాలా వ్యత్యాసము ఉంది. అది పావన ప్రపంచము, ఇది పతిత ప్రపంచము. ఓ పతిత-పావనా రండి, వచ్చి పావనముగా చేయండి అని పిలుస్తారు కూడా. గీతలో కూడా ఈ పదాలు ఉన్నాయి - నన్నొక్కరినే స్మృతి చేయండి, దేహపు సర్వ సంబంధాలను త్యజించి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ దేహపు సంబంధాలు ఇంతకుముందు లేవు. ఆత్మలైన మీరు పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వస్తారు. ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా వెళ్ళాలి - అని గాయనము కూడా ఉంది. దీని అర్థాన్ని మనుష్యులకు అర్థం చేసుకోరు. ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా తెలుసు. స్మృతియాత్ర ద్వారా మరియు స్మృతి బలము ద్వారా మనము ఇప్పుడు పావనముగా అవుతున్నాము. ఇది రాజయోగ బలము. అది హఠయోగము, దాని వలన మనుష్యులు కొంత సమయము కోసము ఆరోగ్యముగా ఉంటారు. సత్యయుగములో మీరు ఎంత ఆరోగ్యముగా ఉంటారు. హఠయోగము యొక్క అవసరము ఉండదు. ఇవన్నీ ఇక్కడ ఈ ఛీ-ఛీ ప్రపంచములోనే చేస్తారు. ఇది ఉన్నదే పాత ప్రపంచము. సత్యయుగము కొత్త ప్రపంచము, అది గతించిపోయింది, ఆ ప్రపంచములో ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది. ఇది ఎవ్వరికీ తెలియదు. అక్కడ ప్రతి వస్తువు కొత్తగా ఉంటుంది. మేలుకోండి ప్రేయసులారా మేలుకోండి... అని పాట కూడా ఉంది కదా. నవయుగము సత్యయుగము. పాతయుగము కలియుగము. ఇప్పుడు దీనిని ఎవ్వరూ సత్యయుగము అని అనరు. ఇప్పుడు ఇది కలియుగము, మీరు సత్యయుగము కోసం చదువుకుంటున్నారు. ఈ చదువు ద్వారా మీకు కొత్త ప్రపంచములో రాజ్య పదవి లభిస్తుందని చెప్పేవారు, ఈ విధముగా చదివించేవారు ఎవ్వరూ ఉండరు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు. పిల్లలైన మీకు ప్రతి విషయము స్మృతినిప్పించడము జరుగుతుంది. నిర్లక్ష్యము చేయకూడదు. బాబా అందరికీ అర్థం చేయిస్తూ ఉంటారు. ఎక్కడైనా కూర్చోండి, వ్యాపారాలు మొదలైనవి చేయండి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ చేయండి. వ్యాపార, వ్యవహారాలలో కొద్దిగా ఏదైనా కష్టము వస్తే, ఎంత వీలైతే అంత సమయము తీసి స్మృతిలో కూర్చోండి, అప్పుడే ఆత్మ పవిత్రముగా అవుతుంది. ఇంకే ఉపాయమూ లేదు. మీరు కొత్త ప్రపంచము కోసం రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. అక్కడకు ఇనుప యుగపు ఆత్మ వెళ్ళలేదు. మాయ ఆత్మ యొక్క రెక్కలను విరిచేసింది. ఆత్మ ఎగురుతుంది కదా. ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. ఆత్మ అన్నిటికన్నా తీవ్ర వేగము గల రాకెట్. పిల్లలైన మీకు ఈ కొత్త-కొత్త విషయాలను విని ఆశ్చర్యమనిపిస్తుంది. ఆత్మ ఎంత చిన్నని రాకెట్. అందులో 84 జన్మల పాత్ర నిశ్చితమై ఉంది. ఇటువంటి విషయాలను హృదయములో గుర్తు పెట్టుకున్నట్లయితే ఉల్లాసము కలుగుతుంది. స్కూల్లో విద్యార్థుల బుద్ధిలో చదువు గుర్తుంటుంది కదా. మీ బుద్ధిలో ఇప్పుడు ఏముంది? బుద్ధి అనేది శరీరములో లేదు. ఆత్మలోనే మనసు-బుద్ధి ఉన్నాయి. ఆత్మయే చదువుకుంటుంది. ఉద్యోగము మొదలైనవన్నీ ఆత్మయే చేస్తుంది. శివబాబా కూడా ఆత్మనే. కానీ వారిని పరమ అని అంటారు. వారు జ్ఞాన సాగరుడు. వారు చాలా చిన్నని బిందువు. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. ఆ తండ్రిలో ఏవైతే సంస్కారాలు ఉన్నాయో, అవే పిల్లలైన మీలో నింపబడుతున్నాయి. ఇప్పుడు మీరు యోగబలముతో పావనముగా అవుతున్నారు. దాని కోసం పురుషార్థము చేయవలసి ఉంటుంది. మేము ఫెయిల్ అవ్వకూడదు అని చదువులో చింత అయితే ఉంటుంది. ఆత్మనైన నేను సతోప్రధానముగా అవ్వాలి అన్నదే ఇందులో మొదటి నంబరు సబ్జెక్ట్. ఏ లోపాలు మిగిలిపోకూడదు. లేదంటే ఫెయిల్ అయిపోతారు. మాయ మిమ్మల్ని ప్రతి విషయములోనూ మరపింపజేస్తుంది. చార్ట్ పెట్టాలని, రోజంతటిలో ఎటువంటి ఆసురీ పనులు చేయకూడదని ఆత్మ కోరుకుంటుంది కూడా. కానీ మాయ చార్ట్ పెట్టనివ్వదు. మీరు మాయ పంజాలోకి వచ్చేస్తారు. లెక్కాపత్రము పెట్టాలని మనసు చెప్తుంది కూడా. వ్యాపారస్థులు ఎప్పుడూ లాభ నష్టాల లెక్కాపత్రాన్ని వ్రాస్తారు. మీదైతే చాలా పెద్ద లెక్కాపత్రము. ఇది 21 జన్మల సంపాదన, ఇందులో నిర్లక్ష్యము చేయకూడదు. పిల్లలు చాలా నిర్లక్ష్యము చేస్తారు. ఈ బాబానైతే పిల్లలైన మీరు సూక్ష్మవతనములో, స్వర్గములో కూడా చూస్తారు. బాబా కూడా చాలా పురుషార్థము చేస్తారు. ఆశ్చర్యపోతూ ఉంటారు కూడా. బాబా స్మృతిలోనే స్నానము చేస్తాను, భోజనము తింటాను, అయినా మర్చిపోతూ ఉంటాను, మళ్ళీ స్మృతి చేయడము మొదలుపెడతాను. పెద్ద సబ్జెక్టు ఇదే. ఈ విషయములో ఎటువంటి అభిప్రాయ బేధాలు తలెత్తలేవు. దేహ సహితముగా దేహపు ధర్మాలన్నింటినీ వదిలేయండి అని గీతలో కూడా ఉంది. ఇక మిగిలింది ఆత్మ. దేహాన్ని మరచి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మయే పతితముగా, తమోప్రధానముగా అయ్యింది. కానీ మనుష్యులు ఆత్మ నిర్లేపి అని అంటారు. ఆత్మయే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అని అనుకుంటారు, అందుకే ఆత్మకు ఏమీ అంటుకోదని అనుకుంటారు. తమోగుణీ మనుష్యులు శిక్షణ కూడా తమోగుణీ శిక్షణే ఇస్తారు. వారు సతోగుణీగా తయారుచేయలేరు. భక్తి మార్గములో తమోప్రధానముగా అవ్వవలసి ఉంటుంది. ప్రతి వస్తువు మొదట సతోప్రధానముగా ఉంటుంది, ఆ తర్వాత రజో, తమోలలోకి వస్తుంది. కంస్ట్రక్షన్ మరియు డిస్ట్రక్షన్ (నిర్మాణము మరియు వినాశనము) జరుగుతాయి. తండ్రి కొత్త ప్రపంచము యొక్క నిర్మాణము చేయిస్తారు, ఆ తర్వాత ఈ పాత ప్రపంచము యొక్క వినాశనము జరుగుతుంది. భగవంతుడు అయితే కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. ఈ పాత ప్రపంచము మారి కొత్తదిగా అవుతుంది. కొత్త ప్రపంచానికి గుర్తు అయితే ఈ లక్ష్మీ-నారాయణులు కదా. వీరు కొత్త ప్రపంచానికి యజమానులు. త్రేతాను కూడా కొత్త ప్రపంచమని అనరు. కలియుగాన్ని పాత ప్రపంచమని, సత్యయుగాన్ని కొత్త ప్రపంచమని అనడం జరుగుతుంది. ఇది కలియుగ అంతిమము మరియు సత్యయుగ ఆది యొక్క సంగమయుగము. ఎవరైనా ఎమ్.ఎ, బి.ఎ. చదువుకుంటే వారు ఉన్నతముగా అవుతారు కదా. మీరు ఈ చదువు ద్వారా ఎంత ఉన్నతముగా అవుతారు. వీరిని ఇంత ఉన్నతముగా ఎవరు తయారుచేసారు అన్న విషయము ప్రపంచము వారికి తెలియదు. మీరు ఇప్పుడు ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నారు. అందరి జీవిత కథలు మీకు తెలుసు. ఇది జ్ఞానము. భక్తిలో జ్ఞానము ఉండదు, కేవలం కర్మకాండలను నేర్పిస్తారు. భక్తి అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎంతగా వర్ణిస్తారు. చాలా అందముగా కనిపిస్తుంది. బీజములో అందమేముంటుంది, ఇంత చిన్నని బీజము ఎంత పెద్దదిగా అవుతుంది. ఇది భక్తి యొక్క వృక్షము, ఎన్నో కర్మకాండలు ఉన్నాయి. జ్ఞానములో ఒకే ఒక్క మాట ఉంది - మన్మనాభవ. తండ్రి అంటారు, తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయ్యేందుకు నన్ను స్మృతి చేయండి. ఓ పతిత-పావనా, మీరు వచ్చి మమ్మల్ని పావనముగా చేయండి అని మీరు అంటారు కూడా. రావణ రాజ్యములో అందరూ పతితులుగా, దుఃఖితులుగా ఉన్నారు. రామ రాజ్యములో అందరూ పావనముగా, సుఖవంతులుగా ఉంటారు. రామ రాజ్యము, రావణ రాజ్యము అన్న పేర్లు అయితే ఉన్నాయి. రామ రాజ్యము గురించి పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మీరు ఇప్పుడు పురుషార్థము చేస్తున్నారు. 84 జన్మల రహస్యము కూడా మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. భగవానువాచ - మన్మనాభవ అనైతే అంటూ ఉంటారు. కానీ మీరు పూర్తి 84 జన్మలను ఎలా తీసుకున్నారు అన్నది ఎవరైనా అర్థం చేయించగలరా. ఇప్పుడు చక్రము పూర్తవుతోంది. గీతను వినిపించేవారి వద్దకు వెళ్ళి - వారు గీత గురించి ఏమి చెప్తున్నారో వినండి. మీ బుద్ధిలోనైతే ఇప్పుడు మొత్తం జ్ఞానమంతా చుక్క-చుక్క పడుతూ ఉన్నట్లుగా ఉంటుంది. బాబా అడుగుతారు - ఇంతకుముందు ఎప్పుడైనా కలిసారా? అవును బాబా, కల్పక్రితము కలిసాము అని అంటారు. బాబా అడుగుతారు మరియు మీరు అర్థ సహితముగా జవాబు ఇస్తారు. అంతేకానీ చిలుక వలె ఏదో అలా జవాబివ్వరు. మళ్ళీ బాబా అడుగుతారు - ఎందుకు కలిశారు, ఏం పొందారు? అప్పుడు మీరు - మేము విశ్వ రాజ్యాన్ని పొందాము అని చెప్పవచ్చు, అందులో అంతా వచ్చేస్తుంది. మేము నరుని నుండి నారాయణునిగా అయ్యామని మీరంటారు కానీ విశ్వానికి యజమానులుగా అవ్వడము అంటే అందులో రాజా, రాణి మరియు దైవీ వంశము అందరూ ఉంటారు. విశ్వానికి రాజా, రాణి, ప్రజలు అందరూ యజమానులుగా అవుతారు. మేమైతే నరుని నుండి నారాయణునిగా అవుతాము, తక్కువగా అవ్వము - దీనినే శుభం పలకడము అని అంటారు. దీనికి తండ్రి అంటారు - సరే పిల్లలూ, పూర్తి పురుషార్థము చేయండి. తమ లెక్కాపత్రాన్ని కూడా చూసుకోవాలి - ఈ పరిస్థితిలో నేను ఉన్నత పదవిని పొందగలనా లేదా, ఎంతమందికి మార్గాన్ని తెలియజేసాను, ఎంతమంది అంధులకు చేతికర్రగా అయ్యాను? ఒకవేళ సేవ చేయడము లేదంటే మేము ప్రజలలోకి వెళ్ళిపోతామని అర్థం చేసుకోవాలి. తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి - ఒకవేళ ఇప్పుడే నేను శరీరాన్ని వదిలేస్తే ఏం పదవిని పొందుతాను? గమ్యము చాలా ఉన్నతమైనది కావున జాగ్రత్తగా ఉండాలి. చాలామంది పిల్లలు ఏమనుకుంటారంటే - మేమైతే స్మృతే చేయడము లేదు కావున ఇక లెక్కాపత్రము పెట్టి ఏం చేస్తాము. ఇలా అనుకుంటే, దీనిని హార్ట్ ఫెయిల్ అవ్వడము (నిరాశకు లోనవ్వడము) అని అంటారు. వారు చదువు కూడా అలాగే చదువుతారు. ధ్యాస పెట్టరు. నాకు అన్నీ తెలుసు అనుకుని కూర్చుండిపోకూడదు, అలా చేస్తే చివరిలో ఫెయిల్ అయిపోతారు. తమ కళ్యాణము చేసుకోవాలి. లక్ష్యము-ఉద్దేశ్యము అయితే ఎదురుగా ఉంది. మనము చదువుకుని అలా తయారవ్వాలి. ఇది కూడా ఆశ్చర్యము కదా. కలియుగములోనైతే రాజ్యము లేదు. మరి సత్యయుగములో వీరికి రాజ్యము ఎక్కడ నుండి వచ్చింది. అంతా చదువుపైనే ఆధారపడి ఉంది. అంతేకానీ దేవతలకు మరియు అసురులకు యుద్ధము జరిగిందని, దేవతలు విజయము పొంది రాజ్యము పొందారని కాదు. ఇప్పుడు అసురులకు మరియు దేవతలకు యుద్ధము ఎలా జరగగలదు. అలాగే కౌరవులకు మరియు పాండవులకు కూడా యుద్ధము జరగలేదు. యుద్ధమనే విషయమే నిషేధించబడుతుంది. మొట్టమొదట ఈ మాట చెప్పండి - తండ్రి అంటున్నారు, దేహము యొక్క సంబంధాలన్నింటినీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలైన మీరు అశరీరిగా వచ్చారు, ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి. పవిత్రాత్మలు మాత్రమే తిరిగి వెళ్ళగలరు. తమోప్రధాన ఆత్మలు వెళ్ళలేరు. ఆత్మ రెక్కలు తెగిపోయాయి. మాయ పతితముగా చేసేసింది. తమోప్రధానముగా అయిన కారణముగా అంత దూరములో ఉన్న ఆ పవిత్రమైన స్థానానికి వెళ్ళలేరు. ఇప్పుడు మీ ఆత్మ అంటుంది - వాస్తవానికి నేను పరంధామ నివాసిని, పాత్రను అభినయించేందుకని ఇక్కడ ఈ పంచ తత్వాల బొమ్మను తీసుకున్నాను. మరణించినప్పుడు స్వర్గస్థులయ్యారని అంటారు. ఎవరు? అక్కడకు వెళ్ళింది ఆత్మనా లేక శరీరమా? శరీరమైతే కాలిపోయింది. ఇక మిగిలింది ఆత్మ. ఆత్మ స్వర్గములోకైతే వెళ్ళలేదు. మనుష్యులు ఎవరు ఏది వినిపిస్తే అది చెప్తూ ఉంటారు. భక్తి మార్గము వారు భక్తినే నేర్పించారు, ఎవరికైతే భక్తి చేస్తున్నారో, వారి కర్తవ్యము గురించి ఎవ్వరికీ తెలియదు. శివుని పూజ అన్నిటికన్నా ఉన్నతమైనదని అంటారు. ఉన్నతోన్నతమైనవారు శివుడే, వారినే స్మృతి చేయండి, స్మరించండి. మాలను కూడా ఇస్తారు. శివ-శివ అని అంటూ మాలను తిప్పుతూ ఉండండి అని చెప్తారు. అర్థం తెలియకుండా మాలను తిప్పుతూ శివ-శివ అని అంటూ ఉంటారు. గురువులు అనేక రకాల శిక్షణలను ఇస్తూ ఉంటారు. ఇక్కడైతే ఒకటే విషయము - నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి అని తండ్రి స్వయంగా అంటారు. శివ-శివ అని నోటితో అనకూడదు. తండ్రి పేరును కొడుకు స్మరణ చేస్తాడా. ఇవన్నీ గుప్తమైన విషయాలు. మీరు ఏం చేస్తున్నారు అనేది ఎవ్వరికీ తెలియదు. ఎవరైతే కల్పక్రితము అర్థం చేసుకున్నారో, వారే అర్థం చేసుకుంటారు. కొత్త-కొత్త పిల్లలు వస్తూ ఉంటారు, వృద్ధి చెందుతూ ఉంటారు. మున్ముందు డ్రామా ఏం చూపిస్తుందో, దానిని సాక్షీగా అయి చూడాలి. ఇలా-ఇలా జరుగుతుందని మొదటే బాబా సాక్షాత్కారము చేయించరు. అలా చేస్తే ఆర్టిఫిషియల్ అయిపోతుంది. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. మీకు వివేకము లభిస్తుంది. భక్తి మార్గములో వివేకము లేనివారిగా ఉండేవారు. డ్రామాలో భక్తి కూడా నిశ్చితమై ఉందని మీకు తెలుసు.

మనము ఈ పాత ప్రపంచములో ఉండేవారము కాము అని ఇప్పుడు పిల్లలైన మీరు భావిస్తారు. విద్యార్థులకు ఈ చదువు బుద్ధిలో ఉంటుంది. మీరు కూడా ముఖ్యమైన పాయింట్లను బుద్ధిలో ధారణ చేయాలి. నంబరు వన్ విషయము భగవంతుడి పరిచయము, అది పక్కా చేసిన తర్వాత ముందుకు వెళ్ళండి. లేకపోతే అనవసరమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. గీతా భగవానుడు శివుడు, ఇది పూర్తిగా కరక్ట్ అని ఫలానావారు వ్రాసి ఇచ్చారని కుమార్తెలు వ్రాస్తారు. వారు అలా అంటారు కానీ వారి బుద్ధిలో ఏమీ కూర్చోదు. ఒకవేళ తండ్రి వచ్చారని అర్థం చేసుకుంటే - అటువంటి తండ్రిని మేము వెళ్ళి కలుసుకుంటాము, వారసత్వాన్ని తీసుకుంటాము అని అనాలి. ఒక్కరికి కూడా నిశ్చయము కూర్చోదు. ఒక్కరి నుండి కూడా వెంటనే ఉత్తరము రాదు. జ్ఞానము చాలా బాగుందని వ్రాస్తారు కానీ - వాహ్! ఏ తండ్రి నుండైతే మేము ఇంత సమయము దూరముగా ఉన్నామో, భక్తి మార్గములో ఎదురుదెబ్బలు తిన్నామో, ఇప్పుడు ఆ తండ్రి విశ్వానికి యజమానులుగా తయారుచేయడానికి వచ్చారని అర్థం చేసుకునేంత ధైర్యము ఉండదు. అలా ఉంటే, పరుగెత్తుకుని వచ్చేవారు. మున్ముందు అటువంటివారు వెలువడుతారు. ఒకవేళ భగవంతుడు ఉన్నతోన్నతమైనవారు అని ఆ తండ్రిని గుర్తించినట్లయితే మరి వారికి చెందినవారిగా అవ్వండి కదా. వారి బుద్ధి తెరుచుకునే విధముగా వారికి అర్థం చేయించాలి.

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. వ్యాపారాలు మొదలైనవి చేసుకుంటూ ఆత్మను పావనముగా తయారుచేసుకునేందుకు సమయము తీసి స్మృతి చేసే కృషి చేయాలి. ఎటువంటి ఆసురీ పనులను ఎప్పుడూ చేయకూడదు.

2. తమ మరియు ఇతరుల యొక్క కళ్యాణము చేయాలి. చదువును చదవాలి మరియు చదివించాలి. నాకు అన్నీ తెలుసు అని అనుకునేవారిగా అవ్వకూడదు. స్మృతి బలాన్ని జమ చేసుకోవాలి.

వరదానము:-
పేరు-ప్రతిష్ఠల యొక్క త్యాగము ద్వారా సర్వుల ప్రేమను ప్రాప్తి చేసుకునే విశ్వపు భాగ్యవిధాత భవ

ఏ విధముగా బాబాను నామ-రూపాలకు అతీతుడు అని అన్నా కానీ, అందరికన్నా ఎక్కువ గాయనము ఆ తండ్రి పేరుకే ఉందో, అదే విధముగా మీరు కూడా అల్పకాలికమైన పేరు-ప్రతిష్ఠల నుండి అతీతముగా అయినట్లయితే సదాకాలము కొరకు సర్వులకూ ప్రియమైనవారిగా స్వతహాగా అవుతారు. ఎవరైతే పేరు-ప్రతిష్ఠల బికారీతనమును త్యాగము చేస్తారో, వారు విశ్వానికి భాగ్యవిధాతగా అవుతారు. కర్మల ఫలమైతే స్వతహాగా మీ ముందు సంపన్న స్వరూపములో వస్తుంది, అందుకే అల్పకాలికమైన కోరికలంటే ఏమిటో తెలియనివారిగా అవ్వండి. అపరిపక్వమైన ఫలాన్ని తినకండి, దానిని త్యాగము చేయండి, అప్పుడు భాగ్యము మీ వెనుకే వస్తుంది.

స్లోగన్:-
మీరు తండ్రి అయిన పరమాత్ముని పిల్లలు కావున బుద్ధి రూపీ పాదము సదా సింహాసనముపై ఉండాలి.

అవ్యక్త సూచనలు - అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి

సేవకు చెందిన ఏ ప్లాన్ నైనా తయారుచేసేటప్పుడు తయారుచెయ్యండి, మంచిదే, దాని కోసం ఆలోచించండి, మంచిదే, కానీ ఏమవుతుందో!... అని ఆశ్చర్యవంతులై చెయ్యకండి. విదేహీగా, సాక్షీగా అయ్యి ఆలోచించండి. ఆలోచించండి, ప్లాన్ తయారుచేయండి మరియు సెకండులో ప్లెయిన్ స్థితిని తయారుచేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు అవసరమైనది స్థితి. ఈ విదేహీ స్థితి పరిస్థితిని చాలా సహజముగా దాటించేస్తుంది. మేఘాలు వచ్చాయి, వెళ్ళిపోయాయి అన్నట్లుగా అనిపిస్తుంది. విదేహీగా, చలించనివారిగా, స్థిరముగా అయ్యి ఆటను చూస్తున్నట్లుగా ఉంటుంది.