26-05-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు చాలా మంచి సాంగత్యము చేయాలి, చెడు సాంగత్యపు రంగు అంటుకుంటే పడిపోతారు, చెడు సాంగత్యము బుద్ధిని తుచ్ఛముగా చేస్తుంది’’

ప్రశ్న:-
ఇప్పుడు పిల్లలైన మీకు ఏ ఉత్సాహము కలగాలి?

జవాబు:-
గ్రామ-గ్రామానికి వెళ్ళి సేవ చేయాలి అని మీకు ఉత్సాహము కలగాలి. మీ వద్ద ఏదైతే ఉందో అది సేవార్థమే ఉంది. తండ్రి పిల్లలకు సలహా ఇస్తున్నారు - పిల్లలూ, ఈ పాత ప్రపంచము నుండి మీ కొంగును తొలగించండి. ఏ వస్తువు పట్ల మమకారము పెట్టుకోకండి, వీటి పట్ల మనసు పెట్టుకోకండి.

పాట:-
ఈ పాపపు ప్రపంచము నుండి...

ఓంశాంతి
పాపాత్ముల ప్రపంచము మరియు పుణ్యాత్ముల ప్రపంచము, ఇలా ప్రపంచము గురించి చెప్పినప్పుడు ఆత్మల పేరునే ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ దుఃఖము ఉంది, కావుననే పిలుస్తారు. ఇక్కడి నుండి ఎక్కడికైనా తీసుకువెళ్ళిపోండి అని పుణ్యాత్ముల ప్రపంచములో పిలవరు. ఇక్కడ పండితులు లేక సన్యాసులు, శాస్త్రవాదులు మొదలైనవారెవరూ వినిపించడం లేదు అని పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. వీరు స్వయం కూడా అంటారు - ఇంతకుముందు నాకు ఈ జ్ఞానము తెలియదు, రామాయణము మొదలైన శాస్త్రాలనైతే ఎన్నో చదివేవాడిని. కానీ ఈ జ్ఞానాన్ని నేను మీకు వినిపిస్తాను, అప్పుడు వీరు కూడా వింటారు. ఇప్పుడు ఇది పాపాత్ముల ప్రపంచము. పుణ్యాత్ముల విషయములో - వీరు ఒకప్పుడు ఉండి వెళ్ళారు అని మాత్రమే అంటారు. అంతే, ఇక వారికి పూజ చేసి వచ్చేస్తారు, శివునికి కూడా పూజ చేసి వస్తారు. పిల్లలైన మీరు ఇప్పుడు ఎవరికి పూజ చేస్తారు? మీకు తెలుసు, ఉన్నతోన్నతమైనవారు శివ భగవానుడు, వారు విధేయుడైన తండ్రి, టీచరు, విధేయుడైన గురువు. తనతోపాటు తీసుకువెళ్తారు అన్న గ్యారంటీని ఇంకే గురువులు మొదలైనవారు ఇవ్వలేరు. ఒకవేళ తీసుకువెళ్ళినా, వాళ్ళు ఏమైనా అందరినీ తీసుకువెళ్తారా. ఇప్పుడు మీరు సమ్ముఖముగా కూర్చున్నారు, ఇక్కడి నుండి మీ ఇంటికి వెళ్ళినా సరే మీరు మర్చిపోతారు. ఇక్కడ సమ్ముఖముగా వినడం ద్వారా ఆనందము కలుగుతుంది. తండ్రి ఘడియ-ఘడియ చెప్తారు - పిల్లలూ, బాగా చదువుకోండి. ఇందులో నిర్లక్ష్యము చేయకండి, చెడు సాంగత్యములో చిక్కుకోకండి. లేదంటే ఇంకా తుచ్ఛబుద్ధి కలవారిగా అయిపోతారు. తాము ఎలా ఉండేవారు, ఏం పాపాలు చేసారు అన్నది పిల్లలకు తెలుసు. ఇప్పుడు మనము ఈ దేవతలుగా అవుతాము. ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది, ఇక ఇక్కడి ఇళ్ళు మొదలైనవాటి గురించి ఏం చింత పెట్టుకోవాలి. ఈ ప్రపంచానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిని మర్చిపోవాలి. లేకపోతే అవి ఆటంకము కలిగిస్తాయి. వీటిపై మనసు కలగదు. మనము కొత్త ప్రపంచములోకి వెళ్ళి వజ్ర-వైఢూర్యాలతో కూడిన మన మహళ్ళను తయారుచేసుకుంటాము. ఇక్కడి ధనము మొదలైన వస్తువులేమైనా మంచిగా అనిపిస్తే ఇక శరీరము వదిలే సమయములో వాటివైపుకు మోహం వెళ్ళిపోతుంది. నాది-నాది అని అన్నట్లయితే అది అంతిమములో ఎదురుగా వస్తుంది. ఇవన్నీ అయితే ఇక్కడే అంతమైపోనున్నాయి. మనము మన రాజధానిలోకి వచ్చేస్తాము, వీటిపై ఏం మనసు పెట్టుకోవాలి. అక్కడ ఎంతో సుఖము ఉంటుంది. పేరే స్వర్గము. ఇప్పుడు మనము మన వతనములోకి వెళ్తాము, ఇది రావణుని వతనము, ఇది మనది కాదు. దీని నుండి విముక్తి పొందేందుకు పురుషార్థము చేయాలి. పాత ప్రపంచము నుండి కొంగును తొలగించి వేస్తారు, అందుకే తండ్రి అంటారు, ఏ వస్తువు పట్ల మమకారము పెట్టుకోకండి. కడుపు ఎక్కువ ఏమీ అడగదు, వ్యర్థమైన వస్తువులపై ఎంతో ఖర్చు అవుతుంది. పిల్లలైన మీకు సేవ చేసేందుకు ఉత్సాహము కలగాలి. గ్రామ-గ్రామములోనూ సేవ చేసే అభిరుచి ఉన్న పిల్లలు కొందరు ఉన్నారు. ఇకపోతే, ఎవరికైతే సేవ పట్ల అభిరుచి ఉండదో, వారిని దేనికి పనికివస్తారు అని అనాలి. తండ్రి ఎలా ఉన్నారో పిల్లలు అలా తయారవ్వాలి. తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి. తండ్రిని స్మృతి చేయండి మరియు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి. మేము బాబా సేవ కోసం వెళ్తున్నాము అని పిల్లలకు అభిరుచి ఉంటుంది. అప్పుడు తండ్రి కూడా ఇంకా ధైర్యము ఇస్తారు. సేవ చేసేందుకు తండ్రి వచ్చారు, సేవ కోసమే అంతా ఉంది. ఇక్కడ తండ్రి పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి. తండ్రి ఒక్కరే. వారు భారత్ లోకి వచ్చారు, భారత్ లో దేవతల రాజ్యము ఉండేది. ఇది నిన్నటి విషయమే, లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది, తర్వాత సీతా-రాముల రాజ్యము ఉండేది. ఆ తర్వాత వామ మార్గములో పడిపోయారు, రావణ రాజ్యము ప్రారంభమయ్యింది, మెట్లు దిగుతూ వచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఎక్కే కళ అనేది క్షణము యొక్క విషయము.

ఒకటేమో - సత్యమైన ప్రేమ, ఇంకొకటి కృత్రిమమైన ప్రేమ. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తారో అప్పుడే తండ్రిపై సత్యమైన ప్రేమ ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ ప్రపంచము పట్ల కృత్రిమమైన ప్రేమ ఉంది. ఇది అంతమైపోనున్నది. సేవ చేసేవారు ఎప్పుడూ ఆకలితో చనిపోరు. పిల్లలు సేవ పట్ల అభిరుచి ఉంచాలి. మీ ఈశ్వరీయ మిషన్ చాలా సహజమైనది. ధర్మము ఎలా స్థాపన అవుతుంది అనేది ఎవరూ అర్థం చేసుకోరు. క్రైస్టు వచ్చారు, క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేసారు, ధర్మము వృద్ధి అవుతూ వెళ్ళింది. వారి మతముపై నడుస్తూ-నడుస్తూ పడిపోతూ వచ్చారు. ఇప్పుడు పిల్లలైన మీరు దేహీ-అభిమానులుగా అవ్వాలి. అర్ధకల్పము రావణ రాజ్యములో మనం తండ్రిని మర్చిపోయాము, ఇప్పుడు తండ్రి వచ్చి సుజాగృతులుగా చేసారు. బాబా అంటారు, డ్రామానుసారముగా మీరు పడిపోవలసే ఉంది. ఇందులో మీ దోషము కూడా లేదు. రావణ రాజ్యములో ప్రపంచ పరిస్థితి ఇలా అయిపోతుంది. తండ్రి అంటారు, ఇప్పుడు నేను చదివించడానికి వచ్చాను. మీరు మళ్ళీ మీ రాజ్యము తీసుకోండి. నేను ఇంకే కష్టమూ ఇవ్వను. ఒకటేమో బజారులోని ఛీ-ఛీ అశుద్ధమైన వస్తువులను తినకండి మరియు నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, ఇది డ్రామా చక్రము, ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. మీ బుద్ధిలో డ్రామా యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము ఉంది. మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. మొదటైతే తండ్రి స్మృతి ఉండాలి. సేవ కోసం పరస్పరం కలుసుకుని సహచరులను తయారుచేసుకోవాలి. మాతలు కూడా అలా తయారవ్వాలి. ఇందులో భయపడే విషయమేమీ లేదు. చిత్రాలు మొదలైనవన్నీ మీకు లభిస్తాయి. మీ సేవ ఎంతో జరుగుతుంది. ఏమంటారంటే - మీరు వెళ్ళిపోతే, మరి మాకు ఎవరు నేర్పిస్తారు? మీరు ఏం చెప్పండంటే - మేము సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నాము, ఇల్లు మొదలైనవాటి ఏర్పాట్లు చేయండి. అనేకుల కళ్యాణము కొరకు నిమిత్తము అవుతారు. బాబా సేవా ఉత్సాహాన్ని కలిగిస్తారు. పిల్లల్లో ధైర్యము ఉంటే సేవ కూడా పెరుగుతుంది. 10, 15 రోజులు నడిచి మళ్ళీ సమాప్తమైపోయేందుకు ఇది మేళా ఏమీ కాదు. ఈ మేళా అయితే కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మిలనము జరుగుతుంది, దీనినే సత్యమైన మేళా అని అంటారు. ఇది ఇప్పుడు కొనసాగుతూనే ఉంది. ఎప్పుడైతే సేవ పూర్తవుతుందో, అప్పుడు ఈ మేళా పూర్తవుతుంది. డ్రామానుసారముగా పిల్లలకు సేవ పట్ల చాలా అభిరుచి ఉండాలి. అనంతమైన తండ్రిలో ఏ జ్ఞానమైతే ఉందో, అది పిల్లల బుద్ధిలో ఉంది. ఉన్నతోన్నతమైన తండ్రి ద్వారా ఎంత ఉన్నతముగా అవుతూ వచ్చాము. ఇలా-ఇలా మీతో మీరు మాట్లాడుకోవాలి. పరస్పరం సెమినార్ చేసుకోవాలి. బాబా నుండి సలహా తీసుకుని సేవలో నిమగ్నమైపోండి. ఏదైనా సహాయం అవసరమైతే వరుడు అయిన బాబా కూర్చుని ఉన్నారు. ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. చింతించాల్సిన విషయమేమీ లేదు. లేకపోతే స్థాపన ఎలా జరుగుతుంది. ఇంకొక విషయము కూడా ఉంది, ఎవరైతే చేస్తారో వారు పొందుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు రాతిబుద్ధి కలవారి నుండి వజ్ర సమానముగా అవుతారు. తండ్రి జ్ఞానముతో ఎంతో సరి చేస్తారు, కానీ మాయ మళ్ళీ ముక్కు పట్టుకుని వెన్ను చూపించేలా చేస్తుంది.

పిల్లలైన మీరు చాలా మంచి సాంగత్యము చేయాలి. చెడు సాంగత్యము యొక్క రంగు అంటుకుంటే పడిపోతారు. బాబా బయోస్కోప్ (సినిమా) మొదలైనవి చూడవద్దు అని చెప్తారు. ఎవరికైతే సినిమా అలవాటు అయిపోతుందో వారు పతితముగా అవ్వకుండా ఉండలేరు. ఇక్కడ ప్రతి ఒక్కరి కర్మలు అశుద్ధముగా ఉన్నాయి, దీని పేరే వేశ్యాలయము. తండ్రి శివాలయాన్ని స్థాపన చేస్తున్నారు. వేశ్యాలయానికి పూర్తిగా నిప్పు అంటుకోనున్నది. కుంభకర్ణుని వలె ఆసురీ నిద్రలో నిదురిస్తున్నారు. మేము శివాలయములోకి వెళ్తున్నాము అని మీరు అర్థం చేసుకుంటారు. ఇంతకుముందు మనము కూడా కోతుల వలె ఉండేవారము, దీనిపై రామాయణములో కూడా కథ ఉంది. ఇప్పుడు మీరు తండ్రికి సహాయకులుగా అయ్యారు. మీరు మీ శక్తితో రాజ్య స్థాపన చేస్తున్నారు. ఇక తర్వాత ఈ రావణ రాజ్యము అంతమైపోనున్నది. పిల్లలైన మీకు అనేక రకాల యుక్తులను తెలియజేస్తూ ఉంటారు. ఎవరికీ దానము చేయకపోతే ఫలము కూడా ఎలా లభిస్తుంది. మొట్టమొదట 10-15 మందికి మార్గము తెలియజేసి, ఆ తర్వాత భోజనము చేయాలి. మొదట శుభ కార్యము చేసి రండి, ఇందులోనే మీ కళ్యాణము ఉంది. ఏ దేహధారినీ గుర్తు చేయకండి. ఇది పతిత ప్రపంచము. పతిత-పావనుడైన ఒక్క తండ్రినే స్మృతి చేసినట్లయితే పావన ప్రపంచానికి యజమానులుగా అయిపోతారు. అంతిమ స్మృతిని బట్టి మరుసటి జన్మ జరుగుతుంది. కావున ఎవరో ఒకరికి సందేశాన్ని వినిపించి, ఆ తర్వాత వచ్చి భోజనము చేయాలి. తండ్రిని స్మృతి చేయడం ద్వారా ఇంత ఉన్నతముగా అవుతారు అని మీరు అందరికీ ఈ విషయాన్నే చెప్తూ ఉండండి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

రాత్రి క్లాస్ - 17-03-68

ఎప్పుడైనా ఏదైనా భాషణ ఇవ్వాల్సి వస్తే పరస్పరం కలుసుకుని 2-4 సార్లు రిహార్సల్ చేయండి, పాయింట్లు కలపడం, సరి చేయడం చేసి తయారుచేయండి, అప్పుడు రిఫైన్ భాషణ ఇస్తారు. ముఖ్యముగా ఒక్క విషయము పైనే (గీతా భగవానుడి గురించి) మీరు విజయము పొందితే ఇక అన్ని విషయాలలోనూ విజయము లభించేస్తుంది, దీని కొరకు కాన్ఫరెన్స్ అయితే జరుగుతుంది కదా! వృక్షము యొక్క వృద్ధి అయితే తప్పకుండా జరగనున్నది అని అర్థం చేసుకుంటూ ఉంటారు. మాయా తుఫానులైతే అందరికీ వస్తాయి. చాలా వరకు ఏమని వ్రాస్తారంటే - బాబా, మేము కామము యొక్క దెబ్బ తిన్నాము. దీనిని సంపాదన పోగొట్టుకోవడము అని అంటారు. క్రోధము చేస్తే కొద్దిగా నష్టము జరిగింది అని అంటారు. కామము కోసమే అర్థం చేయించవలసి ఉంటుంది - కామముపై విజయము పొందితే జగజ్జీతులుగా అవుతారు, కామముతో ఓడిపోతే ఓడిపోతారు. కామముతో ఓడిపోయేవారికి సంపాదన సమాప్తమైపోతుంది, శిక్ష పడుతుంది. గమ్యము చాలా పెద్దది, అందుకే చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. 5000 సంవత్సరాల క్రితం కూడా మనకు రాజ్యాధికారము లభించిందని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ దైవీ రాజధాని స్థాపన అవుతోంది. ఈ చదువు ద్వారా మనము ఆ రాజధానిలోకి వెళ్తాము, అంతా చదువుపైన ఆధారపడి ఉంది. చదువు మరియు ధారణ ద్వారానే తండ్రి సమానముగా అవుతారు. రిజిస్టర్ కూడా కావాలి కదా, దాని ద్వారా ఎంతమందిని తమ సమానముగా తయారుచేసారు అనేది అర్థమవుతుంది. ఎంత ఎక్కువగా ధారణ చేస్తారో, అంతగానే మధురముగా అవుతారు. చాలా ప్రియమైన పిల్లలుగా ఉండాలి. పిల్లలైన మీ కోసమే నేటికి ఆ రోజు వచ్చింది, దీని కోసం మనుష్యులు - ముక్తిలోకి వెళ్ళాలి అని ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. తండ్రి అందరికీ కలిపే ముక్తి-జీవన్ముక్తులను ఇస్తారు. ఎవరైతే దేవతలుగా అయ్యే పురుషార్థము చేస్తారో, వారే జీవన్ముక్తిలోకి వస్తారు. మిగిలినవారంతా ముక్తిలోకి వెళ్తారు. లెక్క ఏక్యురేట్ గా తీయలేరు. కొందరు మిగిలి ఉంటారు కూడా. వినాశనము యొక్క సాక్షాత్కారము పొందుతారు. ఈ మనోహరమైన సమయాన్ని కూడా చూస్తారు. ప్రతి విషయములోనూ పురుషార్థము చేయవలసి ఉంటుంది. స్మృతిలో కూర్చుంటే పని అయిపోతుంది, ఇల్లు దొరికేస్తుంది అని కూడా కాదు. అలా కాదు. డ్రామాలో ఏది ఉంటే అదే జరుగుతుంది, ఇటువంటి ఆశ పెట్టుకోకూడదు. పురుషార్థము చేయవలసి ఉంటుంది. ఇకపోతే డ్రామాలో ఏది నిశ్చితమై ఉంటే అదే జరుగుతుంది. మున్ముందు మీ వృత్తి కూడా భాయి-భాయి వృత్తిగా మారిపోతుంది. ఎంతగా పురుషార్థము చేస్తారో అంతగా ఆ వృత్తి ఉంటుంది. మనము అశరీరిగా వచ్చాము. 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసాము. ఇప్పుడు తండ్రి అంటారు, కర్మాతీత అవస్థలోకి వెళ్ళాలి.

మీరు వాస్తవానికి ఎవరితోనూ శాస్త్రాలు మొదలైనవాటిపై వాదించవలసిన అవసరం లేదు. స్మృతికి సంబంధించినదే ముఖ్యమైన విషయము మరియు సృష్టి ఆదిమధ్యాంతాలను అర్థం చేసుకోవాలి. చక్రవర్తీ రాజుగా అవ్వాలి. కేవలం ఈ చక్రాన్నే అర్థం చేసుకోవాలి. దీనికి సంబంధించే - క్షణములో జీవన్ముక్తి అన్న గాయనము ఉంది. పిల్లలైన మీకు ఆశ్చర్యమనిపించవచ్చు, అర్ధకల్పము భక్తి నడుస్తుంది, జ్ఞానము అంశమాత్రము కూడా ఉండదు. జ్ఞానము ఉన్నది తండ్రి వద్ద మాత్రమే. దీనిని తండ్రి ద్వారానే తెలుసుకోవాలి. ఈ తండ్రి ఎంత అసాధారణమైనవారు, అందుకే కోట్లలో ఏ ఒక్కరో వెలువడుతారు. ఆ టీచర్లు ఇలా ఏమైనా అంటారా. వీరు అంటారు, నేనే తండ్రిని, టీచరును, గురువును. ఇది విని మనుష్యులు ఆశ్చర్యపోతారు. భారత్ ను మాతృభూమి అని అంటారు, ఎందుకంటే అంబ పేరు ఎంతో ప్రఖ్యాతమైనది. అంబకు మేళాలు కూడా ఎన్నో జరుగుతాయి. అంబ అన్నది మధురమైన పదము. చిన్నపిల్లలు కూడా తల్లిని ప్రేమిస్తారు కదా ఎందుకంటే తల్లి తినిపిస్తుంది, తాగిస్తుంది, సంభాళిస్తుంది. ఇప్పుడు అంబకు తండ్రి కూడా కావాలి కదా. ఈమె దత్తత తీసుకోబడిన పుత్రిక, ఈమెకు పతి అయితే లేరు. ఇది కొత్త విషయము కదా. ప్రజాపిత బ్రహ్మా తప్పకుండా దత్తత తీసుకుని ఉంటారు. ఈ విషయాలన్నింటినీ తండ్రే వచ్చి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. ఎంతగా మేళాలు జరుగుతాయి, పూజలు జరుగుతాయి, ఎందుకంటే పిల్లలైన మీరు సేవ చేస్తారు. మమ్మా ఎంతమందినైతే చదివించి ఉంటారో, అంతగా ఇంకెవ్వరూ చదివించలేరు. మమ్మా పేరు చాలా ప్రఖ్యాతమైనది, మేళాలు కూడా ఎన్నో జరుగుతాయి. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, తండ్రే వచ్చి రచన యొక్క ఆదిమధ్యాంతాల రహస్యమంతటినీ పిల్లలైన మీకు అర్థం చేయించారు. మీకు తండ్రి యొక్క ఇంటిని గురించి కూడా తెలుసు. తండ్రిపైనే ప్రేమ ఉంది, ఇంటిపై కూడా ప్రేమ ఉంది. ఈ జ్ఞానము మీకు ఇప్పుడు లభిస్తుంది. ఈ చదువు ద్వారా ఎంత సంపాదన జరుగుతుంది. కావున సంతోషము ఉండాలి కదా మరియు మీరు పూర్తిగా సాధారణముగా ఉన్నారు. ఇది ప్రపంచానికి తెలియదు. తండ్రి వచ్చి ఈ జ్ఞానాన్ని వినిపిస్తారు. తండ్రే వచ్చి అన్ని కొత్త-కొత్త విషయాలను పిల్లలకు వినిపిస్తారు. అనంతమైన చదువు ద్వారా కొత్త ప్రపంచము తయారవుతుంది. పాత ప్రపంచముపై వైరాగ్యము కలుగుతుంది. పిల్లలైన మీ లోపల జ్ఞానము యొక్క సంతోషము ఉంటుంది. తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేయాలి. ఇంటికైతే అందరూ వెళ్ళాల్సిందే. తండ్రి అయితే అందరికీ చెప్తారు కదా - పిల్లలూ, నేను నీకు ముక్తీ-జీవన్ముక్తుల వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చాను. మరి మీరు ఎందుకు మర్చిపోతారు! నేను మీ అనంతమైన తండ్రిని, రాజయోగాన్ని నేర్పించడానికి వచ్చాను. మరి మీరు శ్రీమతముపై నడవరా. అలా చేస్తే ఎంతో నష్టము జరుగుతుంది. ఇది అనంతమైన నష్టము. తండ్రి చేతిని వదిలారంటే సంపాదనలో నష్టము ఏర్పడుతుంది. అచ్ఛా - గుడ్ నైట్. ఓం శాంతి.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ ప్రపంచానికి సంబంధించినది ఏదైతే ఉందో దానిని మర్చిపోవాలి. తండ్రి సమానముగా విధేయులుగా అయి సేవ చేయాలి. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి.

2. ఈ పతిత ప్రపంచములో మిమ్మల్ని మీరు చెడు సాంగత్యము నుండి రక్షించుకోవాలి. బజారు యొక్క అశుద్ధమైన భోజనము తినకూడదు, సినిమాలు చూడకూడదు.

వరదానము:-
త్రికాలదర్శీ స్థితి ద్వారా వ్యర్థము యొక్క ఖాతాను సమాప్తము చేసే సదా సఫలతామూర్త భవ

త్రికాలదర్శీ స్థితిలో స్థితులవ్వడం అనగా ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ చేసే ముందు - ఇది వ్యర్థమా లేక సమర్థమా అని చెక్ చేసుకోవాలి! వ్యర్థము ఒక్క క్షణములో పదమాల నష్టము కలిగిస్తుంది, సమర్థము ఒక్క క్షణములో పదమాల సంపాదనను చేయిస్తుంది. క్షణము యొక్క వ్యర్థము కూడా సంపాదనలో ఎంతో నష్టము కలిగిస్తుంది, దీని వలన చేసుకున్న సంపాదన కూడా దాగిపోతుంది, అందుకే ఏకకాల దర్శిగా అయి కర్మ చేసేందుకు బదులుగా త్రికాలదర్శీ స్థితిలో స్థితులై చేసినట్లయితే వ్యర్థము సమాప్తమైపోతుంది మరియు సదా సఫలతామూర్తులుగా అవుతారు.

స్లోగన్:-
గౌరవము, ప్రతిష్ట మరియు సాధనాల త్యాగమే మహాన్ త్యాగము.

అవ్యక్త సూచనలు - ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి

ఏ విధంగా దేహము మరియు దేహీ, ఈ రెండూ వేరు-వేరు వస్తువులు, కానీ అజ్ఞానానికి వశమై ఈ రెండింటినీ కలిపేసారు. నాది అన్నదానిని నేనుగా భావించారు మరియు ఈ పొరపాటు కారణముగా ఇంతటి ఆందోళనను, దుఃఖాన్ని మరియు అశాంతిని పొందారు. అదే విధంగా ఈ అపవిత్రత మరియు విస్మృతి యొక్క సంస్కారాలు అనేవి బ్రాహ్మణత్వానికి చెందినవి కావు, ఇవి శూద్రత్వానికి చెందినవి, వీటిని కూడా నావిగా భావించడము ద్వారా మాయకు వశమైపోతారు మరియు ఆందోళనకు గురవుతారు.