29-11-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు సత్యాతి-సత్యమైన రాజఋషులు, మీ కర్తవ్యము తపస్య చేయడము, తపస్య ద్వారానే పూజకు యోగ్యులుగా అవుతారు’’

ప్రశ్న:-
ఏ పురుషార్థము సదా కాలము కొరకు పూజకు యోగ్యులుగా తయారుచేస్తుంది?

జవాబు:-
ఆత్మ జ్యోతిని వెలిగించే మరియు తమోప్రధానమైన ఆత్మను సతోప్రధానముగా తయారుచేసే పురుషార్థము చేసినట్లయితే సదా కాలము కొరకు పూజకు యోగ్యులుగా అవుతారు. ఎవరైతే ఇప్పుడు నిర్లక్ష్యము చేస్తారో, వారు చాలా ఏడుస్తారు. ఒకవేళ పురుషార్థము చేసి పాస్ అవ్వకపోతే, ధర్మరాజు శిక్షలను పొందితే, శిక్షలు పొందేవారు పూజింపబడరు. శిక్షలను అనుభవించేవారు తల ఎత్తుకోలేరు.

ఓంశాంతి
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. మొట్టమొదటైతే పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోండి. మొదట ఆత్మ, ఆ తర్వాత శరీరము. ప్రతిచోట, ప్రదర్శనీలలో మరియు మ్యూజియంలలో, క్లాసులో మొట్టమొదట సావధానపరచవలసింది ఏమిటంటే - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. పిల్లలు కూర్చున్నప్పుడు, అందరూ దేహీ-అభిమానులై కూర్చోరు. ఇక్కడ కూర్చున్నా కూడా ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. సత్సంగాలలో ఎవరైనా సాధువు మొదలైనవారు వచ్చేంతవరకు కూర్చొని ఏం చేస్తారు. ఏవో ఆలోచనల్లో కూర్చొని ఉంటారు. సాధువు వచ్చిన తర్వాత కథలు మొదలైనవి వినడము మొదలుపెడతారు. తండ్రి అర్థం చేయించారు - భక్తి మార్గములో ఇవన్నీ వినడము, వినిపించడము ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇవన్నీ కృత్రిమమైనవి. వీటిలో ఏమీ ఉండదు. దీపావళిని కూడా కృత్రిమముగా జరుపుకుంటారు. తండ్రి అర్థం చేయించారు - జ్ఞానము యొక్క మూడవ నేత్రము తెరుచుకోవాలి, అప్పుడు ఇంటింటిలోనూ ప్రకాశముంటుంది. ఇప్పుడైతే ఇంటింటిలోనూ అంధకారమే ఉంది. ఇదంతా బాహ్య ప్రకాశము. మీరు మీ జ్యోతిని వెలిగించుకునేందుకు పూర్తిగా శాంతిలో కూర్చుంటారు. స్వధర్మములో ఉండడము ద్వారా పాపాలు తొలగిపోతాయని పిల్లలకు తెలుసు. జన్మ-జన్మాంతరాల పాపాలు ఈ స్మృతియాత్ర ద్వారానే తొలగిపోతాయి. ఆత్మ జ్యోతి ఆరిపోయింది కదా. శక్తి యొక్క పెట్రోల్ పూర్తిగా సమాప్తమైపోయింది. అది మళ్ళీ నిండిపోతుంది ఎందుకంటే ఆత్మ పవిత్రముగా అయిపోతుంది. ఎంతగా రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు లక్ష్మికి ఎంతగా పూజలు జరుగుతాయి. లక్ష్మి గొప్పవారా లేక సరస్వతి మాత గొప్పవారా అని కొంతమంది పిల్లలు వ్రాస్తుంటారు. శ్రీనారాయణునికి చెందిన లక్ష్మి ఒక్కరే ఉంటారు. ఒకవేళ మహాలక్ష్మిని పూజించినట్లయితే, ఆమెకు నాలుగు భుజాలను చూపిస్తారు. వారిలోనే ఇద్దరూ వచ్చేస్తారు. వాస్తవానికి దానిని లక్ష్మీ-నారాయణుల పూజ అని అనాలి. చతుర్భుజ రూపము కదా - ఇద్దరూ కలిసి ఉన్నట్లు. కానీ మనుష్యులకు ఈ జ్ఞానము లేదు. అందరూ తెలివిహీనులుగా అయిపోయారని అనంతమైన తండ్రి అంటారు. లౌకిక తండ్రి ఎప్పుడైనా మొత్తం ప్రపంచములోని పిల్లలు తెలివిహీనులుగా అయిపోయారు అని అంటారా. ఇప్పుడు పిల్లలైన మీకు - విశ్వపిత ఎవరు అనేది తెలుసు. వారు స్వయంగా అంటున్నారు - నేను ఆత్మలందరికీ తండ్రిని, మీరందరూ నా పిల్లలు. ఆ సాధువులైతే అందరూ భగవంతులే అని అనేస్తారు. అనంతమైన తండ్రి ఆత్మలమైన మనకు అనంతమైన జ్ఞానాన్ని అర్థం చేయిస్తున్నారని మీకు తెలుసు. మనుష్యులకైతే నేను ఫలానా... అని దేహాభిమానము ఉంటుంది. శరీరాలకు ఏ పేర్లు అయితే ఉంటాయో, వాటి ఆధారముగా నడుచుకుంటూ వచ్చారు. ఇప్పుడు శివబాబా అయితే నిరాకారుడు, వారు సుప్రీమ్ సోల్ (పరమ ఆత్మ). వారి ఆత్మ పేరు శివ. ఒక్క శివబాబాకు మాత్రమే ఆత్మకు పేరు ఉంటుంది. కాకపోతే వారు పరమ ఆత్మ, పరమాత్మ, వారి పేరు శివ. ఇక మిగిలిన లెక్కలేనన్ని ఆత్మలందరి శరీరాలకు పేర్లు ఉన్నాయి. శివబాబా ఇక్కడ ఉండరు, వారు పరంధామము నుండి వస్తారు. శివ అవతరణ కూడా జరుగుతుంది. ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయించారు - ఆత్మలందరూ పాత్రను అభినయించడానికి ఇక్కడకు వస్తారు. తండ్రికి కూడా పాత్ర ఉంది. తండ్రి అయితే ఇక్కడ చాలా గొప్ప కార్యము చేస్తారు. వారు అవతరించారు అని భావించినట్లయితే మరి వారి పేరు మీద హాలీడే మరియు స్టాంప్ మొదలైనవి ఉండాలి. అన్ని దేశాలలోనూ హాలీడే ఉండాలి ఎందుకంటే తండ్రి అందరి సద్గతిదాత కదా. వారి జన్మదినము మరియు వెళ్ళిపోయే రోజు, తేదీ మొదలైనవి కూడా తెలియవు ఎందుకంటే వారు అతీతమైనవారు కదా, అందుకే కేవలం శివరాత్రి అని అంటారు. అర్ధకల్పము అనంతమైన పగలు, అర్ధకల్పము అనంతమైన రాత్రి అని కూడా పిల్లలైన మీకు తెలుసు. రాత్రి పూర్తయిన తర్వాత పగలు వస్తుంది. ఆ మధ్యలో తండ్రి వస్తారు. అది ఖచ్ఛితమైన సమయము. మనుష్యులు జన్మించినప్పుడు మునిసిపాలిటివారి వద్ద నోట్ చేస్తారు కదా, మళ్ళీ 6 రోజుల తర్వాత వారికి పేరు పెడతారు, దానిని నామకరణము అని అంటారు. కొందరు దానిని ఆరవ రోజు పండుగ అని అంటారు. భాషలైతే ఎన్నో ఉన్నాయి కదా. లక్ష్మిని పూజించినప్పుడు టపాకాయలు కాలుస్తారు. మీరు ఇలా అడగవచ్చు - మీరు ఏ లక్ష్మి పండుగనైతే జరుపుకుంటున్నారో, వారు సింహాసనముపై ఎప్పుడు కూర్చున్నారు? సింహాసనముపై కూర్చున్నప్పుడే పట్టాభిషేకము రోజును జరుపుతారు, వారికి పుట్టిన రోజును జరపరు. లక్ష్మి విగ్రహాన్ని పళ్ళెములో పెట్టి వారిని ధనము అడుగుతారు. అంతే, ఇంకేమీ అడగరు. మందిరాలకు వెళ్ళినప్పుడు ఏమైనా అడుగుతారు కానీ దీపావళి రోజున మాత్రము వారిని కేవలం ధనము అడుగుతారు. కానీ వారు ధనము ఇవ్వరు. ఇది వారి భావన... ఒకవేళ ఎవరైనా సత్యమైన భావనతో పూజించినట్లయితే, అల్పకాలము కొరకు ధనము లభించవచ్చు. ఇది అల్పకాలికమైన సుఖము. ఏదో ఒక చోట స్థిరమైన సుఖము కూడా ఉంటుంది కదా. వారికి స్వర్గము గురించి అసలు తెలియదు. ఇక్కడ దేనినీ స్వర్గముతో పోల్చలేము.

అర్ధకల్పము జ్ఞానము, అర్ధకల్పము భక్తి అని మీకు తెలుసు. ఆ తర్వాత వైరాగ్యము ఉంటుంది. ఇది పాత ఛీ-ఛీ ప్రపంచమని, అందుకే తప్పకుండా కొత్త ప్రపంచము కావాలని మీకు అర్థం చేయించడము జరుగుతుంది. కొత్త ప్రపంచమని వైకుంఠాన్ని అంటారు, దానిని స్వర్గము, ప్యారడైజ్ అని అంటారు. ఈ డ్రామాలోని పాత్రధారులు కూడా అవినాశీగా ఉన్నారు. ఆత్మలమైన మనము పాత్రను ఎలా అభినయిస్తాము అనేది పిల్లలైన మీకు తెలిసింది. బాబా అర్థం చేయించారు, ఎవరికైనా ప్రదర్శనీ మొదలైనవి చూపించాలంటే మొట్టమొదట ఈ లక్ష్యము-ఉద్దేశ్యము గురించి అర్థం చేయించాలి. క్షణములో జీవన్ముక్తి ఎలా లభిస్తుంది - జనన-మరణాలలోకి అయితే తప్పకుండా రావలసిందే. మీరు మెట్ల వరుస చిత్రముపై చాలా బాగా అర్థం చేయించవచ్చు. రావణ రాజ్యములోనే భక్తి ప్రారంభమవుతుంది. సత్యయుగములో భక్తి యొక్క నామ-రూపాలు ఉండవు. జ్ఞానము మరియు భక్తి, రెండూ వేర్వేరు కదా. ఇప్పుడు మీకు ఈ పాత ప్రపంచము పట్ల వైరాగ్యము ఉంది. ఈ పాత ప్రపంచము ఇప్పుడు సమాప్తమవ్వనున్నదని మీకు తెలుసు. తండ్రి సదా పిల్లలకు సుఖాన్ని ఇచ్చేవారిగానే ఉంటారు. పిల్లల కోసమే తండ్రి ఎంతగా కష్టపడతారు. కొడుకు కావాలని గురువుల వద్దకు వెళ్తారు, సాధువుల వద్దకు వెళ్తారు - ఎలాగైనా సరే కొడుకు పుట్టాలని అనుకుంటారు, ఎందుకంటే కొడుకు పుడితే వారికి ఆస్తిని ఇచ్చి వెళ్ళవచ్చని భావిస్తారు. కొడుకు ఉంటే నేను అతడిని వారసునిగా చేయవచ్చు అని భావిస్తారు. తండ్రి ఎప్పుడూ పిల్లలకు దుఃఖము ఇవ్వరు, అది అసాధ్యము. మీరు, తల్లి-తండ్రి అని అంటూ ఎంతగా ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. పిల్లల యొక్క ఆత్మిక తండ్రి అందరికీ సుఖము యొక్క మార్గాన్నే తెలియజేస్తారు. సుఖాన్ని ఇచ్చేవారు తండ్రి ఒక్కరే. దుఃఖహర్త, సుఖకర్త ఆత్మిక తండ్రి ఒక్కరే. ఈ వినాశనము కూడా సుఖము కోసమే ఉంది. లేకపోతే ముక్తి-జీవన్ముక్తులను ఎలా పొందుతారు? కానీ ఇది కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఇక్కడైతే నిరుపేదలు, అబలలు ఉన్నారు, వీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోగలరు. ఇకపోతే, ధనికులకు దేహము యొక్క అభిమానము ఎంతగా పక్కా అయిపోయిందంటే, ఇక అడగకండి. బాబా పదే-పదే అర్థం చేయిస్తున్నారు - మీరు రాజఋషులు. ఋషులు ఎప్పుడూ తపస్య చేస్తారు. వారు బ్రహ్మమును, తత్వమును స్మృతి చేస్తారు లేదా కొందరు కాళీ మొదలైనవారిని కూడా స్మృతి చేస్తూ ఉండవచ్చు. చాలామంది సన్యాసులు కూడా కాళీని పూజిస్తారు. కాళీమాత అని అంటూ పిలుస్తారు. తండ్రి అంటారు, ఈ సమయములో అందరూ వికారులుగా ఉన్నారు, కామ చితిపై కూర్చొని అందరూ నల్లగా అయిపోయారు. తల్లి, తండ్రి, పిల్లలు, అందరూ నల్లగా ఉన్నారు. ఇది అనంతమైన విషయము. సత్యయుగములో నల్లగా ఉండరు, అందరూ తెల్లగా ఉంటారు. ఆ తర్వాత ఎప్పుడో నల్లగా అవుతారు. ఇది పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు. కొద్ది-కొద్దిగా పతితముగా అవుతూ-అవుతూ అంతిమములో పూర్తిగా నల్లగా అయిపోతారు. తండ్రి అంటారు, రావణుడు కామ చితి పైకి ఎక్కించి పూర్తిగా నల్లగా చేసేశాడు, ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని జ్ఞాన చితిపైకి ఎక్కిస్తాను. ఆత్మనే పవిత్రముగా చేయవలసి ఉంటుంది. ఇప్పుడు పతిత-పావనుడైన తండ్రి వచ్చి పావనముగా అయ్యే యుక్తిని తెలియజేస్తారు. నీరు ఏం యుక్తిని తెలియజేస్తుంది. కానీ మీరెవరికి అర్థం చేయించినా సరే, కోట్లలో కొందరే అర్థం చేసుకొని ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు మీరు తండ్రి నుండి మీ వారసత్వాన్ని తీసుకోవడానికి వచ్చారు, 21 జన్మల కోసము. మీరు మున్ముందు చాలా సాక్షాత్కారాలను పొందుతారు. మీకు మీ చదువు గురించి అంతా తెలుస్తుంది. ఎవరైతే ఇప్పుడు నిర్లక్ష్యము చేస్తారో, వారు తర్వాత చాలా ఏడుస్తారు. శిక్షలు కూడా చాలా ఉంటాయి కదా. అంతేకాక పదవి కూడా భ్రష్టమైపోతుంది. తల ఎత్తుకోలేకపోతారు, అందుకే తండ్రి అంటారు - మధురాతి-మధురమైన పిల్లలూ, పురుషార్థము చేసి ఏ శిక్షలు అనుభవించవలసిన అవసరము లేకుండా పాస్ అవ్వండి, అప్పుడే పూజకు యోగ్యులుగా కూడా అవుతారు. శిక్షలు అనుభవిస్తే పూజింపబడరు. పిల్లలైన మీరు పురుషార్థము చాలా చేయాలి. తమ ఆత్మ జ్యోతిని వెలిగించుకోవాలి. ఇప్పుడు ఆత్మ తమోప్రధానముగా అయ్యింది, దానినే సతోప్రధానముగా చేసుకోవాలి. ఆత్మ అయితే బిందువు. అది ఒక నక్షత్రము. దానికి ఇంకే పేరు పెట్టలేము. దాని సాక్షాత్కారము జరిగిందని పిల్లలకు అర్థం చేయించారు. స్వామి వివేకానంద మరియు రామకృష్ణ పరమహంసల గురించి చెప్తుంటారు. వారి నుండి ఏదో ప్రకాశము బయటకు వచ్చినట్లుగా వివేకానంద చూసారు, అలా ఆత్మయే బయటకు వస్తుంది. అది నాలో లీనమైపోయిందని అతను భావించారు. ఇప్పుడు ఆత్మ అలా వచ్చి ఏమీ లీనమవ్వలేదు. అది వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. చివరిలో మీరు చాలా చూస్తారు. నామ-రూపాలకు అతీతమైన వస్తువేదీ ఉండదు. ఆకాశము అంటే ఖాళీ స్థలము, దానికి కూడా పేరు ఉంది. కల్ప-కల్పము ఏదైతే స్థాపన జరుగుతూ వచ్చిందో, అది జరగాల్సిందేనని ఇప్పుడు పిల్లలు భావిస్తారు. బ్రాహ్మణులమైన మనము నంబరువారుగా పురుషార్థము చేస్తూ ఉంటాము. ఏ క్షణము అయితే గడుస్తూ ఉంటుందో, దానిని డ్రామా అనే అంటారు. మొత్తం ప్రపంచము యొక్క చక్రము తిరుగుతూ ఉంటుంది. ఇది 5 వేల సంవత్సరాల చక్రము, ఇది పేను వలె తిరుగుతూ ఉంటుంది. టిక్-టిక్ అని గడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలైన మీరు కేవలం తండ్రినే స్మృతి చేయాలి. నడుస్తూ-తిరుగుతూ, పనులు చేస్తూ తండ్రిని స్మృతి చేయడములోనే కళ్యాణము ఉంది. మళ్ళీ మాయ చెంపదెబ్బ వేస్తుంది. మీరు బ్రాహ్మణులు, భ్రమరము వలె కీటకాలను తమ సమానముగా బ్రాహ్మణులుగా తయారుచేయాలి. ఆ భ్రమరముదైతే ఒక ఉదాహరణ. మీరు సత్యాతి-సత్యమైన బ్రాహ్మణులు. బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా అవ్వాలి, అందుకే ఇది మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు సంగమయుగము. ఇక్కడకు మీరు పురుషోత్తములుగా అవ్వడానికే వస్తారు. మొదట బ్రాహ్మణులుగా తప్పకుండా అవ్వవలసి ఉంటుంది. బ్రాహ్మణులకు పిలక ఉంటుంది కదా. మీరు బ్రాహ్మణులకు అర్థం చేయించవచ్చు. ఇలా చెప్పండి - బ్రాహ్మణులది కులము, బ్రాహ్మణులకు రాజధాని ఉండదు. మీ ఈ కులాన్ని ఎవరు స్థాపించారు? మీకు పెద్ద ఎవరు? ఇక తర్వాత మీరు అర్థం చేయించినప్పుడు చాలా సంతోషపడతారు. బ్రాహ్మణులకు గౌరవాన్ని ఇస్తారు ఎందుకంటే వారు శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తారు. ఇదివరకు రాఖీ కట్టేందుకు కూడా బ్రాహ్మణులు వెళ్ళేవారు. ఈ రోజుల్లోనైతే కుమార్తెలు వెళ్తారు. ఎవరైతే పవిత్రతా ప్రతిజ్ఞను చేస్తారో, మీరు వారికే రాఖీ కట్టాలి. ప్రతిజ్ఞను తప్పకుండా చేయవలసి ఉంటుంది. భారత్ ను మళ్ళీ పావనముగా చేయడానికి మనము ఈ ప్రతిజ్ఞ చేస్తాము. మీరు కూడా పావనముగా అవ్వండి, ఇతరులను కూడా పావనముగా తయారుచేయండి. ఈ విధముగా చెప్పే శక్తి ఇంకెవ్వరికీ లేదు. ఈ అంతిమ జన్మ పావనముగా అవ్వడముతో మనము పావన ప్రపంచానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు. ఇదే మీ వ్యాపారము. ఇటువంటి మనుష్యులెవ్వరూ ఉండనే ఉండరు. మీరు వెళ్ళి ఈ ప్రతిజ్ఞను చేయించాలి. తండ్రి అంటారు, కామము మహాశత్రువు, దీనిపై విజయము పొందాలి. దీనిపై విజయము పొందటముతోనే మీరు జగత్ జీతులుగా అవుతారు. ఈ లక్ష్మీ-నారాయణులు తప్పకుండా ముందు జన్మలో ఈ పురుషార్థము చేసారు, అందుకే ఆ విధముగా తయారయ్యారు కదా. ఏ కర్మల ద్వారా వీరికి ఈ పదవి లభించింది అనేది ఇప్పుడు మీరు చెప్పగలరు, ఇందులో తికమకపడే విషయమైతే ఏమీ లేదు. మీకు ఈ దీపావళి మొదలైనవాటి గురించి సంతోషమేమీ కలగదు. మీకు ఏ సంతోషము ఉందంటే - మనము తండ్రికి చెందినవారిగా అయ్యాము, వారి ద్వారా వారసత్వాన్ని పొందుతాము. భక్తి మార్గములో మనుష్యులు ఎంతగా ఖర్చు చేస్తారు. ఎంతో నష్టము కూడా కలుగుతుంది. నిప్పు అంటుకుంటుంది. అయినా అర్థం చేసుకోరు.

ఇప్పుడు మనము మళ్ళీ మన కొత్త ఇంటికి వెళ్ళబోతున్నామని మీకు తెలుసు. చక్రము మళ్ళీ యథావిధిగా రిపీట్ అవుతుంది కదా. ఇది అనంతమైన ఫిల్మ్, అనంతమైన స్లైడ్ (తెరపై చూపించే దృశ్యము). అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యారు కావున అపారమైన సంతోషము ఉండాలి. మనము తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటాము. తండ్రి అంటారు, పురుషార్థము ద్వారా ఏది కావాలనుకుంటే అది తీసుకోండి. పురుషార్థాన్ని మీరు తప్పకుండా చేయాలి. పురుషార్థము ద్వారానే మీరు ఉన్నతముగా అవ్వగలరు. ఈ బాబా (వృద్ధాప్యములో ఉన్నవారు) ఇంత ఉన్నతముగా అవ్వగలరంటే మీరు ఎందుకు అవ్వలేరు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏ విధముగా తండ్రి పిల్లలకు సదా సుఖాన్ని ఇస్తారో, అదే విధముగా సుఖాన్ని ఇచ్చేవారిగా అవ్వాలి. అందరికీ ముక్తి-జీవన్ముక్తుల మార్గాన్ని తెలియజేయాలి.

2. దేహీ-అభిమానులుగా అయ్యే తపస్య చేయాలి. ఈ పాత ఛీ-ఛీ ప్రపంచము పట్ల అనంతమైన వైరాగులుగా అవ్వాలి.

వరదానము:-
ప్రతి ఒక్కరి విశేషతను స్మృతిలో ఉంచుకుంటూ విశ్వాసపాత్రులుగా అయి ఐకమత్యతతో కూడిన సంగఠనను తయారుచేసే సర్వుల శుభచింతక భవ

డ్రామా అనుసారముగా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక విశేషత తప్పకుండా లభించింది, ఆ విశేషతను కార్యములో వినియోగించండి మరియు ఇతరుల విశేషతను చూడండి. ఒకరికొకరు విశ్వాసపాత్రులుగా ఉన్నట్లయితే వారి మాటల వెనుక ఉన్న భావము మారిపోతుంది. ఎప్పుడైతే ప్రతి ఒక్కరి విశేషతను చూస్తారో అప్పుడు అనేకులుగా ఉంటూ కూడా ఒక్కరుగా కనిపిస్తారు. ఐకమత్యతతో కూడిన సంగఠన ఏర్పడుతుంది. ఎవరైనా ఎవరి గురించైనా గ్లాని విషయాలను వినిపిస్తే మీరు వాటికి మద్దతు ఇచ్చేందుకు బదులుగా, వాటిని వినిపించేవారి రూపాన్ని పరివర్తన చేయండి, అప్పుడు శుభచింతకులు అని పిలవబడతారు.

స్లోగన్:-
శ్రేష్ఠ సంకల్పాల ఖజానాయే శ్రేష్ఠ ప్రారబ్ధము మరియు బ్రాహ్మణ జీవితానికి ఆధారము.

అవ్యక్త సూచనలు - అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి

ఒకవేళ క్షణములో విదేహీగా అయ్యే అభ్యాసము లేకపోతే చివరి క్షణము కూడా యుద్ధము చెయ్యటములోనే పోతుంది. అంతేకాక ఏ విషయములోనైతే బలహీనముగా ఉంటారో, స్వభావములోనైనా, సంబంధములోకి రావటములోనైనా, సంకల్పశక్తిలోనైనా, వృత్తిలోనైనా, వాయుమండల ప్రభావములోకి రావటములోనైనా, ఏ విషయములో బలహీనముగా ఉంటారో, మాయ కావాలని ఆ రూపములోనే చివరి పరీక్ష పెడుతుంది, అందుకే విదేహీగా అయ్యే అభ్యాసము చాలా అవసరము.